-
పండుగ సీజన్పైనే ఆశలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ పరిణామాలతో దెబ్బతిన్న వాహనాల మార్కెట్ పండుగ సీజన్ నాటికి పుంజుకోగలదని కియా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ విభాగం హెడ్ మనోహర్ భట్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటికి మూడో కారు సోనెట్ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. లాక్డౌన్ సమయంలోనూ 3,500 పైచిలుకు బుకింగ్స్ వచ్చాయని తెలిపారాయన. అనంతపురంలోని తయారీ ప్లాంటును మరింతగా విస్తరించేందుకు ఇటీవలే 54 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. వాహన విక్రయాలపై కరోనాపరమైన ప్రభావాలు ఎలా ఉన్నాయి? పరిశ్రమపై కరోనాపరమైన ప్రతికూల ప్రభావ తీవ్రతను గణాంకాలపరంగా ఇంతని ప్రస్తుతం చెప్పలేము. ఏప్రిల్లో అమ్మకాలు సున్నాకి పడిపోవడమనేది ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో పరిశ్రమ చిక్కుకున్నది తెలియజేస్తోంది. అయితే, మరికొద్ది నెలల్లోనే మార్కెట్ తిరిగి పుంజుకోగలదని ఆశావహంగా ఉన్నాం. సరఫరాలు, మార్కెట్ స్థిరపడటానికి కాస్త సమయం పడుతుంది. మా ఉత్పత్తులన్నీ మేడ్–ఇన్–ఇండియానే కావడం, స్థానికంగానే మెజారిటీ విడిభాగాలను కొనుగోలు చేస్తుండటం వల్ల మాపై ప్రతికూల ప్రభావం కాస్త తక్కువే. మేం మరింత వేగంగా పుంజుకోగలమని ధీమా ఉంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలెంత స్థాయిలో ఉంటాయనేది ఇప్పుడే ముందస్తుగా ఏమీ చెప్పలేము. ఇకపై అమ్మకాల ధోరణి ఎలా ఉండవచ్చు? అంతర్జాతీయంగా ధోరణులు చూస్తుంటే ప్రయాణాల కోసం ఇకపై ప్రజా రవాణా సాధనాల కంటే వ్యక్తిగత వాహనాలకే ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కచ్చితంగా కార్ల అమ్మకాలను పెంచుతుంది. కరోనా నియంత్రణలోకి వచ్చాక మార్కెట్ వేగం పుంజుకోవచ్చు. అయితే, దేశీయంగా ఇంకా పరిస్థితులు స్థిరపడాల్సి ఉంది. కాబట్టి విక్రయాలు ఎగిసేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. పండుగ సీజన్ .. అంటే ఈ ఏడాది మూడో క్వార్టర్లో అమ్మకాలు పుంజుకోవచ్చని ఆశిస్తున్నాం. ప్రస్తుతం కంపెనీ ఆర్డరు బుక్ ఎలా ఉంది? లాక్డౌన్లో కూడా 3,500 పైచిలుకు బుకింగ్స్ వచ్చాయి. బుకింగ్స్ రద్దయిన సంఖ్య చాలా తక్కువే. ప్రస్తుతం సెల్టోస్, కార్నివాల్కు సంబంధించి బుక్ అయిన 25,000 పైగా వాహనాలు డెలివరీ కావాల్సి ఉంది. దశలవారీగా మా టచ్ పాయింట్స్లో 94 శాతం పాయింట్స్ను ప్రారంభించాం. మే నెలలో 1,600 యూనిట్లు విక్రయించాం. ఆన్లైన్ బుకింగ్ ధోరణుల విషయానికొస్తే.. వాహనాల కొనుగోళ్లను కస్టమర్లు ఆన్లైన్లోనే జరిపేలా చూడటం ఆటోమొబైల్ సంస్థలకు కాస్త సవాలుతో కూడుకున్నదే. ఎందుకంటే.. మిగతా ఉత్పత్తులతో పోలిస్తే కారు కొనుగోలు చాలా భిన్నమైనది. డిజిటల్గా కాకుండా కారును భౌతికంగా చూసి, నడిపి, సంతృప్తి చెందిన తర్వాతే నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్లు ఇష్టపడతారు. అయితే, డిజిటల్ షోరూమ్లు భవిష్యత్లో అమ్మకాలు పెంచుకోవడానికి కచ్చితంగా ఉపయోగపడగలవు. ఈ నేపథ్యంలో ఇటు డిజిటల్, అటు ఫిజికల్ షోరూమ్ల మేళవింపుతో కంపెనీలు ముందుకెళ్లాల్సి ఉంటుంది. మా విషయానికొస్తే.. మేం ముందునుంచే అమ్మకాల ప్రక్రియను డిజిటైజ్ చేసేందుకు గణనీయంగా ఇన్వెస్ట్ చేశాం. ప్రస్తుతం కొనుగోలు నుంచి హోమ్ డెలివరీ దాకా సేవలు అందిస్తున్నాం. మా మొత్తం వాహన విక్రయాల్లో 7–8 శాతం ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. మరిన్ని కొత్త మోడల్స్ ప్రవేశపెట్టబోతున్నారా? మా మూడో ఉత్పత్తయిన కియా సోనెట్ (కంపాక్ట్ ఎస్యూవీ)ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. పండుగ సీజన్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2020 ఆటో ఎక్స్పోలో అంతర్జాతీయంగా సోనెట్ను ప్రదర్శించినప్పుడు మంచి స్పందన వచ్చింది. కరోనా పరిణామాలతో వ్యయ నియంత్రణ చర్యలేమైనా తీసుకున్నారా? ముందునుంచే మా భాగస్వాములు, ఉద్యోగులు, డీలర్లు, సరఫరాదారులు అంతా కలిసికట్టుగానే ఉన్నాం. ఈ కష్టకాలంలో కూడా అదే ధోరణి కొనసాగింది. కాబట్టి పెద్దగా వ్యయ నియంత్రణ చర్యలేమీ తీసుకోలేదు. కొత్త నియామకాల ప్రణాళికలేమైనా ఉన్నాయా? మా వెండార్ పార్ట్నర్లతో కలిపి కియా మోటార్స్ ఇండియా సిబ్బంది సంఖ్య మొత్తం 13,000 పైచిలుకు ఉంటుంది. మా సిబ్బందిలో చాలా మంది సమీప ప్రాంతాలు, రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. ప్రస్తుతానికి తగినంత స్థాయిలో సిబ్బంది ఉన్నారు. అనంతపురంలోని ప్లాంటును మరింత విస్తరించేందుకు, ఉత్పత్తి పెంచేందుకు ఇటీవలే 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. ఈ ప్రాంతంలో ఉపాధి కల్పనకు కూడా దీనితో ఊతం లభించగలదు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? దేశంలోనే తొలిసారిగా కార్లకు ఉచితంగా శానిటైజేషన్ కార్యక్రమాన్ని ఇటీవలే కియా కేర్ ప్రచార కార్యక్రమం కింద ప్రకటించాం. ముందుగా సంప్రతించినవారికి ఈ సర్వీసులు అందిస్తున్నాం. ఇక కియా కేర్ కింద వాహనాలకే కాకుండా, సర్వీస్ సెంటర్లు, డీలర్షిప్లలో కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి తగు భద్రతా చర్యలు అమలు చేస్తున్నాం. ఇక కస్టమర్లకు కియా లింక్ యాప్ ద్వారా వాహనాల పికప్, డ్రాప్, మొబైల్ వర్క్షాప్ల వంటి సేవలు అందిస్తున్నాం. -
రికవరీ బాటలో వాహన మార్కెట్
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్లో జోరుగా ఉన్నాయి. వాహన మార్కెట్ రికవరీ బాట పట్టిందని నిపుణులంటున్నారు. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోట, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల దేశీయ విక్రయాలు పెరిగాయి. టాటా మోటార్స్, జనరల్ మోటార్స్, ఫోర్డ్ ఇండియా కంపెనీల అమ్మకాలు మాత్రం తగ్గాయి. దేశీయ అమ్మకాలు, ఎగుమతులతో కూడిన మొత్తం అమ్మకాలు కొన్ని కంపెనీలవి మినహా పుంజుకున్నాయి. కొత్త మోడళ్లు, పండుగల సీజన్ ప్రారంభం కావడం, తదితర అంశాలు దీనికి కారణాలని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పూర్తి రికవరీకి ఇంకా సమయం ఉందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సెంటిమెంట్ పాజిటివ్గా ఉందని, పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు రానున్న నెలల్లో మరింతగా పుంజుకోగలవని నిపుణులంటున్నారు. తొలిసారిగా కార్లను కొనుగోలు చేసేవాళ్లు, ఎక్స్ఛేంజ్ విధానంలో కార్లను కొనుగోలు చేసేవాళ్లు పెరుగుతున్నారని హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. మారుతీ సుజుకి దేశీయ అమ్మకాలు 10 శాతం పెరగ్గా, ఎగుమతులు 28 శాతం చొప్పున తగ్గాయి. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 15 శాతం పెరగ్గా, ఎగుమతులు 21 శాతం తగ్గాయి. జనరల్ మోటార్స్ అమ్మకాలు 37 శాతం తగ్గాయి. దేశీయ మార్కెట్లో టయోట అమ్మకాలు 4 శాతం పెరిగాయి. నిస్సాన్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ తమ అమ్మకాలు 107 శాతం పెరిగాయని పేర్కొంది. ఫోర్డ్ ఇండియా ఎగుమతులు రెట్టింపయ్యాయి. టాటా మెటార్స్ ఎగుమతులు 18 శాతం పెరిగాయి. హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా బైక్ల అమ్మకాలు 19 శాతం, స్కూటర్ల అమ్మకాలు 50 శాతం చొప్పున పెరిగాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ టూ-వీలర్ల అమ్మకాలు 29 శాతం, స్కూటర్ల అమ్మకాలు 63 శాతం, త్రీ-వీలర్ల అమ్మకాలు 18 శాతం, ఎగుమతులు 15 శాతం చొప్పున పెరిగాయి. బజాజ్ ఆటో ఎగుమతులు 19 శాతం పెరిగాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
ఏపీ పరిశ్రమలపై ఈనాడు విషం.. అసలు విషయం ఇదే!
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement