-
దళిత నేత సందీప్ ను దూషించిన టీడీపీ నేత గడ్డం వెంకటేశ్వరరావు
-
కుదిరిన కామ్రేడ్ల దోస్తీ
సాక్షి, హైదరాబాద్: సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తు కొలిక్కి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేసే ఖమ్మం, నల్లగొండ, సీపీఐ పోటీ చేసే భువనగిరి, మహబూబాబాద్లలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. తాము పోటీ చేసే సీట్లలో కంటే కూడా మిగతా స్థానాల్లో ఏ పార్టీకి మద్దతునివ్వాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యా యి. దీంతో పొత్తులపై ప్రతిష్టంభన ఏర్పడటంతో ఆ రెండు పార్టీలు కేంద్ర నాయకత్వాలకు నివేదించాయి. ఇరుపార్టీలు పోటీచేసే స్థానాల్లో పరస్పరం సహకరించుకోవాలని, మిగతా సీట్లలో ఎవరికి మద్దతునివ్వాలనే దానిపై ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయం తీసుకోవాలని జాతీయ నాయకత్వాలు సూచిం చాయి. ఈ మేరకు శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జరిపిన ఫోన్ చర్చల్లో అంగీకారం కుదిరింది. ఆదివారం ఇరు పార్టీలు మరోసారి సమావేశమై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. కొన్ని లోక్సభ సీట్లలో అంగీకారమైన అభ్యర్థులకు మద్దతు నిచ్చే విషయంలో చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. ఏ అభ్యర్థికి మద్దతునివ్వాలనే అంశంపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ సొంత నిర్ణయం తీసు కోవచ్చనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వామపక్షాలు పోటీ చేస్తున్న స్థానాల్లో ఆయా పార్టీల ఓట్లు బదిలీ అయ్యేందుకు కృషి చేయాలని నిర్ణయించాయి. గతంలో బీఎల్ఎఫ్లో భాగంగా ఉన్న ఎంసీపీఐ(యూ), బీఎల్పీ, ఎంబీటీ చెరో స్థానంలో పోటీకి ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీలు పోటీ చేసే సీట్లతోపాటు బీఎస్పీ 4, జనసేన 2 సీట్లలో పోటీ చేయనున్నందున, వాటికి మద్దతునిచ్చే విషయంపై ఆదివారం సీపీఐతో సీపీఎం చర్చించనున్నట్టు సమాచారం. మానుకోట సీపీఐ అభ్యర్థి కల్లూరి! మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కల్లూరి వెంకటేశ్వరరావును అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర కమిటీ ప్రతిపాదించింది. ఆయన పేరును ఆ పార్టీ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పరిశీలనకు పంపింది. వెంకటేశ్వరరావు పేరు ను పరిగణనలోకి తీసుకుని అధికారికంగా ఆయన పేరును ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. భువనగిరి స్థానానికి గోదా శ్రీరాములు పేరును ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. -
టీడీపీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ!
సాక్షి, అమరావతి/నెట్వర్క్: విశాఖ మన్యంలో మావోయిస్టులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను పట్టపగలే కాల్చి చంపారు. మావోయిస్టుల వ్యూహాలను ముందుగానే పసిగట్టడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికార పార్టీ జేబు సంస్థగా మారిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎ.బి.వెంకటేశ్వరరావు అధికార తెలుగుదేశం పార్టీ తొత్తుగా పనిచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన విధులను పక్కనపెట్టి, అధికార పార్టీ సేవలో తరిస్తున్నారని, నిఘా విభాగం నిస్తేజంగా మారిపోవడం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు నానాటికీ దిగజారుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ఏజెంట్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేలా ఎప్పటికప్పుడు సర్వేలు చేసి నివేదికలు ఇవ్వడం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, అధికార పార్టీని ఎదిరించే వారిని బెదిరించి దారికి తెచ్చుకోవడం, ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బందిని టీడీపీ కార్యకర్తలుగా మార్చేయడం.. ఇవీ ఎ.బి.వెంకటేశ్వరరావు చేస్తున్న పనులు. అయన పూర్తిస్థాయిలో తెలుగుదేశం ఏజెంట్గా మారిపోయారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. తన సిబ్బందికి బూత్ స్థాయిలో బాధ్యతలు కేటాయించి, టీడీపీ గెలుపు కోసం తనవంతు తోడ్పాటు అందించారు. అధికార పార్టీ పట్ల స్వామిభక్తిని చాటుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో మకాం వేశారు. అక్కడి తాజా రాజకీయ పరిణామాలపై సర్వేలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుకు హైదరాబాద్లో ఏం పని అని తెలంగాణ మంత్రి కేటీఆర్ నిలదీసిన సంగతి తెలిసిందే. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగాన్ని వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఏజెన్సీగా మార్చేశారని రిటైర్డ్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అత్యున్నత అఖిల భారత స్థాయి సర్వీసుకు చెందిన అధికారి ఇలా అధికార ఆర్టీ ఏజెంట్గా పనిచేయడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాల్సింది పోయి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం సరైంది కాదని అన్నారు. టీడీపీలో చేర్పించేందుకు రాయబారాలు సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎ.బి.వెంకటేశ్వరరావు రానున్న కాలంలో కృష్ణా జిల్లాలోని ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీ కోసం తనవంతు సేవలందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో మాట్లాడి, అధికార పార్టీలో చేర్పించే బాధ్యతను కూడా ఎ.వి.వెంకటేశ్వరరావు తన భుజాలపై వేసుకున్నారు. వారిలోని అసంతృప్తి, అవసరాలను గుర్తించి టీడీపీలో చేర్పించేందుకు రాయబారాలు సాగిస్తుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం ఏపీలో ఏ మేరకు ఉంటుంది? టీడీపీకి లాభమా? నష్టమా? అనే దానిపై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో ప్రస్తుతం సర్వేలు చేయిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోనూ టీడీపీ బలోపేతానికి, ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి అమలు చేయాల్సిన వ్యూహాలపై సర్వేలు చేస్తున్నట్లు సమాచారం. పోలీసు మాన్యువల్లో పొందుపర్చిన విధులను నిర్వర్తించే దిశగా ఇంటెలిజెన్స్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం రాజకీయాల చుట్టే ప్రదక్షిణలు చేస్తోంది. కీలక స్థానాల్లో టీడీపీ అనుకూలురే... ప్రతి జిల్లా కేంద్రంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ పర్యవేక్షణలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ను కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని కేటాయించారు. ఇలా రాష్ట్రంలో 256 మంది ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ రోజువారీ సమాచారం ఇస్తుంటారు. ఆ సమాచారాన్ని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో 150 మంది క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తుంటారు. రాష్ట్ర నిఘా విభాగంలో కీలకమైన స్థానాల్లో అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవారినే నియమించారు. కాంగ్రెస్తో పొత్తు లాభమా? నష్టమా? ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలపై రాష్ట్ర నిఘా విభాగం పూర్థిస్థాయిలో దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ లాభమా? నష్టమా అనే దానిపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్పైనే తొలి సంతకం చేస్తామన్న కాంగ్రెస్ హామీని ప్రజలు విశ్వసిస్తున్నారా? వ్యవసాయ రుణాలు రూ.2 లక్షల మాఫీ హామీపై ప్రజల స్పందన ఏమిటి? కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఓట్ల బదలాయింపు జరుగుతుందా? అనేదానిపై అనే వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేనివారిని గుర్తించి, అదిలించి బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత కదలికలు, కార్యాచరణపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. టీడీపీ నేతలు ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు పని చేయడం లేదనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. ఏ పార్టీలో ఎవరు బలంగా ఉన్నారో తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో కులాల వారీగా ఓటర్ల వివరాలు, టీడీపీ బలం, బలహీనతలపై సర్వే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ ఆశావహుల ఆర్థిక స్థితిగతులపై ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి బలం తక్కువుగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. అక్కడ బలంగా ఉన్న ఇతర పార్టీల నేతల సమాచారాన్ని రాబట్టి, టీడీపీ ముఖ్యులకు చేరవేస్తున్నారు. అలాగే ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశం ఉన్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి బుజ్జగిస్తున్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల్లో నిఘా విభాగం అధికారులే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం వారిని సంప్రదించక తప్పడం లేదు. మహిళా అధికారిపై వేటు.. ఎ.బి.వెంకటేశ్వరరావుకి చోటు తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు ‘బ్రీఫ్డ్ మీ’ వాయిస్తో అడ్డంగా బుక్కయిన సంగతి తెల్సిందే. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ ఎత్తుగడలను గుర్తించడంలో విఫలమయ్యారంటూ అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏఆర్ అనూరాధను బాధ్యతల నుంచి తప్పించారు. చంద్రబాబుకు సన్నిహితుడు, అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్న ఎ.బి.వెంకటేశ్వరరావుకు ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో నిఘా వ్యవస్థ పూర్తిగా దారితప్పిందని, అయినా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎ.బి.వెంకటేశ్వరరావు పదవికి వచ్చిన ముప్పేమీ ఉండదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో తాను అడ్డంగా దొరికిపోతే అందుకు బాధ్యులను చేస్తూ అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనూరాధను విధుల నుంచి తప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విశాఖ మన్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దారుణహత్యకు కారణమైన ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావును ఎందుకు తప్పించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిఘా వైఫల్యాలు ఎన్నెన్నో.. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యాల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించాయి. ప్రధానంగా గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని, భద్రతాపరంగా సరైన చర్యలు తీసుకోకపోతే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని ముందే తెలిసినప్పటికీ నిఘా విభాగం పట్టించుకోలేదు. ఈ మేరకు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. దాంతో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తుని రైలు దహనం ఘటనలోనూ నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాపుల ఉద్యమంలో అసాంఘీక శక్తులు చొరబడే ప్రమాదం ఉన్నా ముందే గుర్తించలేదు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డికి ప్రత్యర్థుల నుంచి ప్రాణాపాయం పొంచి ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించలేకపోయింది. ఫలితంగా ఆయన ప్రత్యర్థుల దాడిలో మరణించారు. తాజాగా విశాఖ మన్యంలో నిఘా వైఫల్యం వల్ల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. -
‘పది’లో ఉత్తీర్ణత శాతం పెంచాలి
డీఈవో వెంకటేశ్వర్ రావు ధర్మారం : ఈ ఏడాది పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచుటకు ఉపాధ్యాయులు అదనంగా శ్రమించాలని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్రావు సూచించారు. ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర సలహాదారుడు రమేష్చారి ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు అందిస్తున్న స్నాక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఈవో వెంకటేశ్వర్రావు, మండల విద్యాధికారి పద్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్న రమేష్చారిని అభినందించారు. విద్యార్థులు అంకితభావంతో చదివి ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులు జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. కేసీఆర్ సేవా దళం రాష్ట్ర సలహాదారు రమేష్చారి మాట్లాడుతూ తమ సేవా సంస్థ ద్వారా ఇప్పటి వరకు అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.కటికెనపల్లి, ధర్మారం పాఠశాలల్లోని విద్యార్థులకు స్నాక్స్తో పాటుగా మంచినీటి వసతి కల్పించుటకు తమ వంతుగా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పద్మ, ఎంపీటీసీ సభ్యుడు బొల్లి స్వామి, తెలంగాణ ఉపాధ్యాయసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి రంగారావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలీస్ కార్ల ఫ్లాగ్పోల్స్ దొంగల అరెస్టు
పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలో ఉన్నతాధికారుల 8 కార్లకు చెందిన బ్రాస్ ఫ్లాగ్పోల్స్ తొలగించిన ఇద్దరు నిందితులను, వాటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాలప్రకారం ... పంజగుట్ట ఐఏఎస్, ఐపీఎస్ కాలనీలో ఈ నెల 2వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారుల కార్లు బయటపెట్టగా తెల్లారేసరికి వాటికి ఉన్న ప్లాగ్పోల్స్ (కారు ముందు భాగంలో జెండా అమర్చే పరికరం) కనిపించకుండా పోయాయి. ఓ ఐఏఎస్ అధికారి కారు డ్రైవర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే కాలనీలో ఓ ఉన్నతాధికారి ఇంట్లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉండే ఓ మహిళ కొడుకు రాజేష్ ఖన్నా అలియాస్ రాకేష్ (19) బ్యాండ్ కొడుతూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఇతని స్నేహితుడు డి. శ్రీనివాస్తో కలిసి ఫ్లాగ్పోల్స్ దొంగతనం చేసి ద్వారకాపూరి కాలనీలో స్క్రాప్ దుకాణం నిర్వహించే సుధాకర్కు అమ్మారు. దీనిని గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను, సుధాకర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
దేశం దురాక్రమణ
రేపల్లె/నిజాంపట్నం: అధికారం వచ్చింది..అందినంత దోచుకుందాం అనే రీతిలో రేపల్లె నియోజకవర్గ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం చేపట్టిన ఐదు నెలల్లో అధికారులను లొంగదీసుకుని 15.13 ఎకరాల అటవీ భూమికి పట్టాలు పొందారు. మరో పది ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి చెరువులుగా తవ్వి ఆక్వా సాగుకు సిద్ధం చేశారు. నిజాంపట్నం మండల ఆముదాలపల్లి పంచాయతీ చింతరేవులోని అటవీ భూ మి 583 సర్వే నంబరులో 15.13 ఎకరాలను అధికార పార్టీకి చెందిన ఆరుగురికి తహశీల్దారు పట్టాలు జారీ చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఓగిబోయిన వెంకట్యాదవ్ తల్లి సీతారావమ్మకు 2.5 ఎకరాలు, ఆముదాలపల్లి టీడీపీ నేత పందరబోయిన కృష్ణమూర్తికి 2.5 ఎకరాలు, ఆయన భార్య తిరుపతి కుమారికి 2.5 ఎకరాలు, కుమార్తె నర్రా సుజాతకు 2.5 ఎకరాలు, రేపల్లె మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన బొర్రా కుమారికి 2.5ఎకరాలు, నగరం గ్రామానికి చెందిన పిన్నిబోయిన వెంకటేశ్వరరావుకు 2.5ఎకరాలుకేటాయిస్తూ నవంబర్ 10నపట్టాలను అప్పటి తహశీల్దారు రవికుమార్ జారీ చేశారు. అటవీశాఖ భూములను టీడీపీ నేతలకు ధారాదత్తం చేసిన విషయంపై ప్రస్తుత తహశీల్దారు మోహనకృష్ణను వివరణ కోరేందుకు ‘సాక్షి’పలుమార్లు ప్రయత్నం చేయగా, తాను సమావేశంలో ఉన్నానంటూ తెలిపారు. పట్టాలు రద్దు చేయాలని సిఫార్సు చేశారు.. చింతరేవులో ఉన్న అటవీభూమి 583 సర్వే నంబరులోని 15.13 ఎకరాలను ఆరుగురు వ్యక్తులకు తహశీల్దారు రవికుమార్ పట్టాలు జారీ చేయటంపై జిల్లా ఫారెస్ట్ అధికారికి నివేదిక సమర్పించడం జరిగింది. జిల్లా ఫారెస్ట్ అధికారి దీనిపై స్పందించి ఆ పట్టాలు రద్దు చేయాలని కలెక్టర్, ఆర్డీవోలకు సిఫార్సు చేశారు. - రమణారెడ్డి, అటవీ శాఖ రేపల్లె రేంజ్ అధికారి -
రాయనపాడు దోపిడిపై స్పందించిన కమిషనర్!
విజయవాడ: కృష్ణా జిల్లా రాయనపాడు దోపిడీపై పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్పందించారు. నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇలాంటి తరహా ఘటనలే చోటుచేసుకుంటున్నాయనే విషయం తన దృష్టికి వచ్చిందని కమిషనర్ తెలిపారు. రైల్వే ట్రాక్ల పక్కన ఉన్న ఇళ్లనే దుండగులు టార్గెట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. రైల్వే ట్రాక్ల పక్కన నివాసం ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియన వ్యక్తుల, ఇతర వ్యక్తులపై అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఏపీ పోలీసుల కమిషనర్ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement