-
ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా
-
ఈసారి తప్పించుకోలేవని బెదిరించాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తాను హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గుప్తా పీఏ ఆశీష్ కట్యల్ ఫోన్కు ఆగంతకుడు కాల్ కేసి ఈ మేరకు హెచ్చరించాడు. ఆశీష్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం గుర్తుతెలియనివ్యక్తి తనకు ఫోన్ చేసి గుప్తాను చంపుతానని బెదిరించాడని, గతంలో రెండుసార్లు తమదాడి నుంచి తప్పించుకున్నాడని, ఈ సారి సెక్యూరిటీ ఉన్నా తమ నుంచి తప్పించుకోలేడని హెచ్చరించాడని ఆశీష్ చెప్పారు. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా తనకు గత నెల 9వ తేదీన ఇదేవిధంగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు గుప్తా చెప్పారు. ఏడాదిన్నర క్రితం కూడా బెదిరింపులు వచ్చాయని, వీటి వెనుక ఆప్ లీడర్ల హస్తముందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని, వీటి వెనుక వందశాతం ఆప్ నేతల హస్తముందని భావిస్తున్నట్టు గుప్తా చెప్పారు. అయితే గుప్తా ఆరోపణలు ఆప్ నేతలు ఖండించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించి వాస్తవాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
వ్యాట్పై చర్చకు అనుమతించలేదు
♦ ఆప్ సర్కారుపై బీజేపీ విమర్శనాస్త్రాలు ♦ మీడియాను పక్కదారి పట్టించారు ♦ స్పీకర్ వివక్షతో వ్యవహరిస్తున్నారు న్యూఢిల్లీ : వ్యాట్ బిల్లుపై ఆప్ ప్రభుత్వంతోపాటు స్పీకర్ రాంనివాస్ గోయల్ శాసనసభలో చర్చకు అనుమతించలేదని బీజేపీ ఆరోపించింది. పైగా చర్చ జరిగిందని, అయితే విపక్ష సభ్యులు పాల్గొనలేదంటూ ఈ విషయంలో మీడియాను పక్కదారి పట్టించేందుకు యత్నించిందని ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకూడా ఈ అంశంపై చర్చను అడ్డుకున్నారని ఆరోపించారు. సవరణలతో చేపట్టిన అత్యంత కీలకమైన ఈ బిల్లును కొద్ది సెకండ్ల వ్యవధిలోనే సభలో ఆమోదింపజేసుకున్నారన్నారు. ఈ అంశంపై చర్చకు అనుమతించామని, అయితే ప్రతిపక్ష సభ్యులు ఇందులో పాల్గొనలేదంటూ సభ బయట అధికార పక్షం మీడియాకు చెప్పుకుందన్నారు. అనంతరం ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత విజేందర్గుప్తా మాట్లాడుతూ స్పీకర్ రాంనివాస్ గోయల్ బీజేపీ ఎమ్మెల్యేలపట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆయన వివక్షతో వ్యవహరించాడా? లేదా? అనే విషయాన్ని శాసనసభ వీడియో దృశ్యాలను పరిశీలిస్తే అర్థమవుతుందని, ఆవిధంగా కూడా నిర్ధారించుకోవచ్చని అన్నారు. ఇప్పటికి మొత్తం మూడు పర్యాయాలు శాసనసభ సమావేశాలు జరిగాయని, అయితే అత్యధిక మెజారిటీ ఉండడంతో విపక్షం ఉనికి లేకుండా చేసేందుకు ఆప్ సర్కారు శాయశక్తులా యత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మూలస్థంభమైన మీడి యా మాట ఆలకించేందుకు సిద్ధంగా లేదనే విషయం స్పష్టమైందన్నారు. -
'బీజేపీ ఎమ్మెల్యేలను ఎత్తుకొచ్చి బయటపడేశారు'
న్యూఢిల్లీ: రెండో రోజు ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. బీజేపీ నేతలు పలు అంశాలను లేవనెత్తుతూ గందరగోళం సృష్టించారు. సభలో ఉన్నది ముగ్గురు బీజేపీ నేతలే అయినా.. అధికార పార్టీకి మాత్రం చుక్కలు చూపించారు. దీంతో ఇక చేసేదేం లేక మార్షల్స్ రంగంలోకి దిగారు. ఎంత వారించినా వినకుండా.. అదేపనిగా అరుస్తూ సభలో గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ నేత విజేందర్ గుప్తాను, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను చివరకు మార్షల్స్ ఎత్తుకొచ్చి బయటేశారు. తొలుత మర్యాదగా రావాల్సిందిగా ఆయనను బ్రతిమిలాడినా వినకపోవడంతో మార్షల్స్ అంతా కలిసి ఆయనను గాల్లోకి లేపి ఎత్తుకొచ్చి బయట దించేశారు. అంతకుముందు 'ఆయన అరిచి అరిచి స్వరం బొంగురు పోతున్నట్లుంది ఓ విక్స్ ఇవ్వండి' అంటూ స్పీకర్ చలోక్తులు విసిరారు. ఈ సమయంలో సభలోని సభ్యులంతా పెద్దగా నవ్వుతూ తమ ఎదురుగా ఉన్న బల్లలు చరిచారు. మంగళవారంనాటి తొలి రోజు సమావేశాల్లో నకిలీ డిగ్రీని కలిగి ఉండి జైలు పాలైన జితేందర్ సింగ్ తోమర్ విషయంపై విజేందర్ ప్రశ్నించగా.. రెండు రోజు సమావేశాల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించే అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. మిగితా ఏ సభా వ్యవహారాలు జరగకుండా అడ్డుకున్నారు. తమ డిమాండ్పై చర్చ జరిగే వరకు ఏం అంశంపై సభలో చర్చ అక్కర్లేదంటూ గందరగోళం సృష్టించారు. దీంతో వారిని మార్షల్స్ ద్వారా బయటకు పంపించాల్సి వచ్చింది. -
శాసనసభాపక్ష నేతగా విజేందర్ గుప్తా
న్యూఢిల్లీ: విధానసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా రోహిణీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఎంపికయ్యారు. మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన గుప్తాను పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో సభ్యులు ... శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేశారు. కాగా 70 మంది సభ్యులు కలిగిన ఢిల్లీ విధానసభలో 67 మంది ఆప్కు చెందినవారే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున ముగ్గురే విజయం సాధించారు. సంఖ్యాబలం బాగా స్వల్పంగా ఉన్న కారణంగా రాజ్యాంగపరంగా బీజేపీకి ప్రతిపక్ష దక్కే అవకాశం లేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement