-
గవర్నర్, సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
30న గవర్నర్, సీఎం ‘గుట్ట’కు రానున్నారని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడి ఎస్పీతో కలిసి అధికారులతో సమీక్ష యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, చిన్నజీయర్ స్వామిజీలు ఈ నెల 30న రానున్నారని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ విక్రమ్జీత్ దుగ్గల్ తెలిపారు. గవర్నర్, సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించేందుకు గాను సోమవారం కలెక్టర్, ఎస్పీలు గుట్టకు వచ్చారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ 30న ఉదయం 9గంటలకు యాదాద్రిలో చేపట్టే వైటీడీఏ అభివృద్ధి పనులను గవర్నర్, సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా సీఎం కేసీఆర్ కోసం కొండ కింద హెలిప్యాడ్ కోసం సైదాపురం, మల్లాపురం, సురేంద్రపురి గ్రామాలకు దగ్గరగా ఉన్న కొద్దిపాటి స్థలాలను పరిశీలించారు. అలాగే కొండపైన గల 14 ఎకరాల్లో దేవస్థానం నిర్మాణం జరుగుతుందన్నారు. కొండ కింద నుంచి కొండ పైకి లెసైన్సులు లేని వారు ఆటోలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సెక్స్ వర్కర్ల ఉపాధిపై వారిని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఎవరూ జీవనోపాధి కోల్పోకుండా ఉండేందుకు నిర్వాసితులతో వేర్వేరుగా మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గుట్ట అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. గుట్టకు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, విష్ణు పుష్కరిణికి నీటిని విడుదల చేయాలని ఆలయ ఈఓ గీతారెడ్డి కోరగా వెంటనే కలెక్టర్ స్పందించి 10 లక్షల గ్యాలరీల కృష్ణా వాటర్ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ దుగ్గల్ మాట్లాడుతూ గుట్టకు భక్తుల రద్దీ పెరుగుతున్నందున తగిన భద్రత అవసరమన్నారు. రానున్న రోజుల్లో కొండపైన పోలీస్టేషన్, కొండకింద మరో పోలీస్టేషన్, ఒక మహిళా పీఎస్, ట్రాఫిక్ పోలీస్టేషన్, సీసీ కెమెరా గది, కమ్యూనికేషన్ రూం, రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వీటన్నటిని పరిశీలించేందుకు ఒక డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు విష్ణు పుష్కరిణి, సంగీత భవనం, తదితర పరిసరాలను పరిశీలించారు. ఇటీవల టెస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన ఎయిర్ కూలర్ సిస్టంను పరిశీలించి ఈఓ గీతారెడ్డిని అభినందించారు. అలాగే ప్రతిరోజు 40వేల మంది భక్తుల కోసం ప్రత్యేక వసతులైన మంచినీటి ఏర్పాటు , భోజన వసతి, లైటింగ్ సిస్టంను పరిశీలించి చాలా బాగుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బి.నరసింహామూర్తి, ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ మోహన్రెడ్డి, ఈఓ గీతారెడ్డి, తహసీల్దారు రామమూర్తి, ఏఈఓ దోర్భల భాస్కర శర్మ, ఆర్అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, దేవస్తానం అధికారులు దయాకర్రావు, డీఈఈ రామారావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ అంతకుముందు కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ విక్రమ్జీత్ దుగ్గల్లు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అర్చకులు పూలమాలతో స్వాగతం పలికి పూజల అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ నరసింహామూరి కలెక్టర్కు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతోపాటు ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీ నరసింహాచార్యులు, నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు ఉన్నారు. -
ఉనికి కోల్పోయారు
పాడేరు,న్యూస్లైన్: విశాఖ ఏజెన్సీ ప్రశాంతంగా ఉండాలన్నదే తమ ఆశయమని జిల్లా ఎస్పీ విక్రమ్జీత్ దుగ్గల్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులంతా అభివృద్ధిని కోరుకుంటున్నారన్న విషయం ఇటీవలి ఎన్నికలే రుజువు చేశాయన్నారు. మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చినప్పటికీ గిరిజనులు స్వేచ్ఛగా ఓటు వేశారని ఆయన తెలిపారు. ప్రగతి నిరోధకులైన మావోయిస్టులు ఇప్పుడు ఉనికి కోల్పోయారని అన్నారు. మావోయిస్టు మిలీషియా సభ్యులు వందలాది మంది లొంగిపోయారని పలువురు దళ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులను కూడా అరెస్ట్ చేశామన్నారు. కిల్లంకోట, బలపం, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, అన్నవరం, సప్పర్ల, దారకొండ వంటి మారుమూల ప్రాంతాల్లో వారికి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. ఏజెన్సీలోని అన్ని మారుమూల రోడ్లను అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మావోయిస్టుల హెచ్చరికలతో నిలిచిపోయిన రోడ్ల పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఏఎస్పీ కె.ఫకీరప్ప, ట్రైనీ డీఎస్పీ మహేంద్ర, సీఐ ఎన్.సాయి, ఎస్ఐలు ధనుంజయ్, ప్రసాద్ ఉన్నారు. మోదకొండమ్మకు ఎస్పీ పూజలు మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను తిలకించేందుకు విక్రమ్జీత్ దుగ్గల్ సోమవారం పాడేరు వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి రూరల్ ఎస్పీ కుటుంబం పేరిట ప్రత్యేక కుంకుమార్చన పూజలు కూడా జరిపారు. నర్సీపట్నం ఓఎస్డి ఏఆర్ దామోదర్, ఏఎస్పీ కె.ఫకీరప్ప తదితరులూ అమ్మవారిని దర్శించుకున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు జాతరతో అవాంఛనీయ ఘటనలు సంభవిస్తే అనుమానితులను గుర్తించేందుకని పోలీసు శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంలోని అధికారులు ఈ దృశ్యాలను పరశీలిస్తున్నారు. గత 29 ఏళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
Advertisement