-
విశాఖ ప్రజలకు పెద్దదిక్కుగా మారిన విమ్స్
-
బాలిక కడుపులో వెంట్రుకల ముద్ద
ఆరిలోవ(విశాఖ తూర్పు): తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్న బాలికకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి స్వస్థత చేకూర్చారు వైద్యులు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో ఆధునిక పద్ధతిలో ఈ సర్జరీ చేశారు. విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాలివి.. రాజమండ్రికి చెందిన 13 ఏళ్ల బాలిక కొద్ది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడేది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకువెళ్లినా తగ్గకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 19న విశాఖలో విమ్స్కు తీసుకు వచ్చారు. ఇక్కడి వైద్యులు ఆ బాలికకు ఎండోస్కోపీ చేసి కడుపు లోపల వెంట్రుకలతో కూడిన పదార్థం ముద్దగా ఉన్నట్లు గుర్తించారు. దీనిని ట్రైకోబెజార్ వ్యాధిగా నిర్థారించారు. దీంతో ఈ నెల 23న లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి బాలిక కడుపులో ఉన్న వెంట్రుకలతో ఉన్న 300 గ్రాముల పదార్థాన్ని తొలగించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించారు. అరుదైన శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న బాలికను శనివారం డిశ్చార్జి చేశారు. 50 ఏళ్లలో 68 మందికి మాత్రమే.. ఇలాంటి వ్యాధి అరుదుగా వస్తుందని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. 50 ఏళ్లలో దేశంలో 68 మందికి మాత్రమే ఈ తరహా శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. విమ్స్లో చిన్నారికి జరిగిన సర్జరీ 68వది అని తెలిపారు. సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులను అభినందించారు. బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేసి తమ కుమార్తె ప్రాణాలను కాపాడారని విమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ స్రవంతి బృందం, విమ్స్ ఆర్ఎంవో డాక్టర్ విజయకుమార్ పాల్గొన్నారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
విమ్స్లో ముక్కు ద్వారా వేసే కరోనా టీకా ట్రయల్స్
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ డ్రాప్స్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్లో ప్రారంభించినట్టు డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. ఎథిక్స్ కమిటీ అనుమతుల మేరకు విమ్స్లో మొదలు పెట్టామన్నారు. ఇప్పటివరకు కేవలం ఇంట్రా మస్క్యులర్ ఇంజక్షన్ రూపంలో మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని చెప్పారు. అలా కాకుండా పోలియో డ్రాప్స్ తరహాలో ముక్కు ద్వారా వేసే టీకాను భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిందన్నారు. ఇంజక్షన్ టీకా కంటే డ్రాప్స్ టీకా వల్ల వచ్చే యాంటీబాడీస్ సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు మొదటి, రెండు ట్రయల్ రన్స్లో తేలిందని చెప్పారు. ట్రయల్ రన్లో భాగంగా 18 ఏళ్లు దాటిన 3,160 మందికి టీకా వేయనున్నట్టు తెలిపారు. ఇంజక్షన్ టీకా తరహాలోనే మొదటి డోసు వేసుకున్న 28 రోజుల అనంతరం రెండో డోసు వేస్తామన్నారు. ఇంజక్షన్గా వేసే టీకా ద్వారా ఒక రకమైన రక్షణ ఉంటే.. ముక్కులో వేసే డ్రాప్స్ టీకా ద్వారా రెండురకాల రక్షణ ఉంటుందని చెప్పారు. చదవండి: (డీజిల్ బస్సులకు టాటా.. ఇ–బస్సులకు స్వాగతం) ఇంజక్షన్ టీకాతో సిస్టమిక్ ఇమ్యూనిటీ మాత్రమే ఉంటుందని, డ్రాప్స్ టీకా వల్ల సిస్టమిక్తో పాటు, మ్యూకోజల్ ఇమ్యూనిటీ లభిస్తుందని ఆయన తెలిపారు. మూడోదశ ట్రయల్స్ ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్ రాంబాబు, సహాయ పరిశోధకుడిగా డాక్టర్ పి.విజయకుమార్, సహాయకులుగా డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ షాఫినా వ్యవహరిస్తున్నారు. -
ఇకపై కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని స్టేట్ కోవిడ్ ఆస్పత్రి విమ్స్ను మంత్రి అవంతి శ్రీనివాసరావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విమ్స్లో లోపాలపై బాధిత కుటుంబ సభ్యులు మంత్రికి ఫిర్యాదు చేయగా ఆయన స్పందించారు. తన భర్త చనిపోయినా సమాచారం ఇవ్వలేదంటూ ఓ మహిళ ఆరోపించగా విమ్స్లో వైద్య సిబ్బంది కొరత ఉందని అన్నారు. దాంతోనే సమాచారం లోపం తలెత్తిందని చెప్పారు. దీనిపై విచారణ కమిటీ వేశామని తెలిపారు. ఇప్పటివరకు కోవిడ్ బాధితుల ఫోన్ నెంబర్లు మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారని, బాధితుడు మృతి చెందిన సందర్భాల్లో వారి కుటుంబాలకు సమాచారం అందడంలేదని తెలిపారు. ఇకపై కోవిడ్తో ఆస్పత్రిలో చేరిన వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యుల పోన్ నెంబర్లు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. విమ్స్లో సమాచారం లోపం తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. (చదవండి: వినయ విధేయ తహసీల్దార్) ఇప్పుటివరకు విమ్స్లో 180 మంది కరోనాతో చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం 595 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 300 పైగా డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 80 మంది మాత్రమే ఉన్నారని, వారు కుడా ఓ వారం పనిచేసి మరో వారం హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారని తెలిపారు. కొంతమంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారని మంత్రి గుర్తు చేశారు. వైద్య సిబ్బంది పని చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. కోవిడ్ సమయంలో పని చేయడానికి వైద్యులు, నర్సులు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. విమ్స్ ఆస్పత్రి, వైద్యులపై తప్పుడు ప్రచారం తగదని హితవు పలికారు. మీడియా కూడా తప్పుడు వార్తలకి ప్రాధాన్యం ఇవ్వకూడదని కోరారు. దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కరోనా పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. (తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : విమ్స్ డైరెక్టర్) -
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : విమ్స్ డైరెక్టర్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(విమ్స్) ఆస్పత్రిలో కరెంటు సరఫరాలో ఎక్కడా ఆటంకం లేదని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. పవర్ సప్లై ఆగినట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాలలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. విమ్స్లో కరెంటు నిరంతరంగా ఉందని చెప్పారు. కోవిడ్ పేషెంట్లు తప్పుడు ప్రచారాలని నమ్మి ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement