-
ధోని సర్జరీ, అసలు విషయం చెప్పిన CSK సీఈఓ..!
-
నాడు అద్దె గదిలో జూనియర్ లాయర్గా ప్రారంభమై..నేడు సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి..
సుప్రీంకోర్టు జడ్జిగా సీనియర్ న్యాయవాది కల్పాతి వెంకటరామన్ విశ్వనాథన్ శుక్రవారమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు విశ్వనాథన్ ఆగస్టు 11 2030న జేబీ పార్దివాలా పదవీ విరమణ చేసిన తదనంతరం భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆయన ఈ పదవిలో మే 25, 2031 వరకు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఒక చిన్న లాయర్గా కెరీర్ మొదలు పెట్టిన జస్టిస్ విశ్వనాథన్ సుప్రీం కోర్టు జడ్జి హోదాకి అంచెలంచెలుగా సాగిన సుదీర్ఘ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. జస్టిస్ కేవీ విశ్వనాథన్ 1988లో తమిళనాడు నుంచి ఢిల్లీకి వచ్చి ఆర్కేపురంలో ఓగదిలో ఉంటూ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన తమిళనాడులోని పొల్లాచి పట్టణానికి చెందినవారు. తండ్రి కేవీ వెంకటరామన్ కోయంబత్తూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేయడంతో ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. కోయంబత్తూరు న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు పూర్తి అయిన వెంటనే సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనే కోరికతో 1988లో ఢిల్లీకి వచ్చేశారు. అక్కడ నుంచే విశ్వనాథన్ న్యాయవాది వృత్తి జర్నీ ప్రారంభమైంది. అక్కడే ఆర్కేపురంలో స్నేహితుడితో ఓ అద్దె గదిలో ఉంటూ లాయర్గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆ తదనంతరం ఢిల్లీలోని సీనియర్ లాయర్ దగ్గర జూనియర్గా పనిచేశారు. ఆ తర్వాత సీఎస్ వైద్యనాథన్తో కలిసి పనిచేశారు. అతనితో విశ్వనాథన్ 1988 నుంచి 1990 వరకు హైకోర్టు, సుప్రీంకోర్టు, దిగువ కోర్టులలో పనిచేశారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ వద్ద 1990 నుంచి 1995 వరకు పనిచేశారు. అంతేగాదు అయోధ్య కేసులో లార్డ్ రామ్లాల తరుఫును కేసు వాదించారు. ఇదిలా ఉండగా, 1991 నాటి ఆసక్తికరమైన సంఘటనలో, కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య కేసు జస్టిస్ ఎమ్సి జైన్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్నప్పుడూ జస్టిస్ విశ్వనాథన్ తన ప్రత్యర్థి వర్గానికి ట్రాన్స్లేటర్గా కూడా పని చేశారు. ఆ కేసులో రాజకీయ నేతలంతా ఇంగ్లీషలో మాట్లాడుతుండగా.. డీఎంకే అధినేత ఎం కరుణానిధి మాత్రం తమిళంలో మాట్లాడటంతో జస్టీస్ జైన్కు ఏం చేయాలో తోచలేదు. దీంతో కరుణానిధి మాటలను నా కోసం అనువదించగలరా అని విశ్వానథ్ని అడిగారు. తాను ఏఐఏడీఎంకేకు వాదిస్తున్నానని జస్టిస్ విశ్వనాథన్ చెప్పడంతో ఆయన అనువాదించడంలో ఎవరికైనా అభ్యంతరం ఉందా అని జస్టిస్ జైన్ అడిగారు. ఐతే ఎవ్వరూ ఏ సమస్య లేవనెత్తకపోయేసరికి విశ్వానాథనే తన ప్రత్యర్థి వర్గానికి ట్రాన్స్లేటర్గా చేశారు. 2009లో కేంద్ర ప్రభుత్వానికి అదనపు న్యాయవాదిగా కూడా పనిచేశారు. అంతేగాదు సుప్రీంకోర్టులో అనేక ముఖ్యమైన కేసులలో ప్రాతినిధ్యం వహించడమే గాక చాలా సున్నితమైన కేసులలో అమికస్ క్యూరీగా నియమితులయ్యారు. కాగా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తమిళనాడు నుంచి నియమితులైన మూడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంతకుముందు తమిళనాడు నుంచి జస్టిస్ పతంజలి శాస్త్రి 1951 నుంచి 1954 వరకు సీజేఐగా పనిచేశారు. 2013లో జస్టిస్ పీ సదాశివం తొమ్మిది నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు. (చదవండి: ‘అది పనిష్మెంట్ కాదు.. మోదీ విజన్’) -
పోలీస్ కమిషనర్ మానవీయత
సాక్షి, తమిళనాడు: చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ మానవీయత వెలుగులోకి వచ్చింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఓ పోలీసును కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. చివరి ప్రయత్నంగా హైదరాబాద్ నుంచి ఓ టీకాను తెప్పించారు. ఈ టీకా రూపంలో క్రమంగా ఆ పోలీసు కోలుకుంటుండడం విశేషం. చెన్నైలో కమిషనరేట్ పరిధిలోని ఐపీఎస్ల నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు వందల మంది వరకు వైరస్కు చికిత్స పొందుతున్నారు. రెండు వందల మంది మేరకు డిశ్చార్జ్ అయ్యారు. విధులకు హాజరయ్యారు. కరోనా బారిన పడ్డ పోలీసులకు మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ అధికారులో కమిషనర్ విశ్వనాథన్ సంప్రదింపులు జరుపుతున్నారు. చదవండి: కోవిడ్తో డీఎంకే ఎమ్మెల్యే మృతి అదే సమయంలో సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడమే కాదు, వారిలో నెలకొన్న మానసిక వేదనను తొలగించేందుకు తగ్గట్టుగా ఈసీఆర్లో ప్రత్యేకంగా యోగా తరగతుల్ని నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ సిబ్బంది ప్రాణంమీదకు పరిస్థితి రావడంతో ఆయన హృదయం తల్లడిళ్లింది. ఆ సిబ్బందిని రక్షించేందుకు సొంత ఖర్చులతో హైదరాబాద్ నుంచి టీకాను తెప్పించి ఉండడం వెలుగు చూసింది. వెస్ట్ మాంబళం స్టేషన్లో పనిచేస్తున్న ఓ పోలీసు కరోనా బారిన పడడంతో ఆయన పరిస్థితి విషమించింది. చివరి ప్రయత్నంగా హైదరాబాద్ నుంచి టీకాను తెప్పించేందుకు ప్రైవేటు వైద్యులు సిఫారసు చేశారు. ఇదే టీకాను చివరి క్షణంలో ఉన్న ఎమ్మెల్యే అన్భళగన్ను రక్షించేందుకు సైతం ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆ టీకాను తెప్పించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఆ పోలీసుల కుటుంబానికి అడ్డు వచ్చింది. ఆ టీకా ఖరీదు రూ. 75 వేలు. మూడు రోజుల పాటుఆ టీకా వేయాల్సి ఉంటుంది. అది ఫలితాన్ని ఇస్తే సరి లేని పక్షంలో రూ 2.25 లక్షలు బూడిదలోపోసినట్టే. ఈ సమాచారం అందుకున్న సీపీ విశ్వనాథన్ తన మానవీయతను చాటుకున్నారు. తన సొంత ఖర్చుల నుంచి ఆ టీకాల్ని తెప్పించి ఇచ్చినట్టు సమాచారం. ఈ టీకా వాడకంతో ఆ పోలీసులు శరీరంలో క్రమంగా మార్పులు వస్తున్నట్టు, ఆరోగ్యం మెరుగు పడుతున్నట్టు వైద్యులు తేల్చడంతో సీపీ మానవీయత వెలుగులోకి వచ్చింది. చదవండి: తినేవస్తువు అనుకుని.. నాటుబాంబుని కొరికి -
లోను కావాలా గురూ..!
న్యూఢిల్లీ: కార్పొరేట్లకు భారీగా రుణాలిచ్చి అవి వసూలు కాక సమస్యలను ఎదుర్కొంటున్న బ్యాంకులు ఇప్పుడు సామాన్యుల వెంట పడ్డాయి. బ్యాంకుల కొత్త వ్యాపారంలో సింహభాగం రిటైల్ రుణాలే ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 16 నాటికి చూస్తే పెరిగిన బ్యాంకుల వ్యాపారంలో 96 శాతం వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్స్) కావడం గమనార్హం. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల రుణాల వ్యాపారంలో 41.5 శాతం వ్యక్తిగత రుణాలేనని ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కార్పొరేట్ రుణాలు ఇప్పుడు ఎన్పీఏలుగా మారినట్టే... భవిష్యత్తులో రిటైల్ రుణాల నుంచి ఇదే మాదిరి రిస్క్ ఉండొచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్ తాజాగా హెచ్చరించడం ఇందుకేనేమో. పారిశ్రామిక డిమాండ్ తగ్గినందున కార్పొరేట్ రంగం నుంచి తాజా పెట్టుబడులు లేని పరిస్థితికి ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గణాంకాలు ఇవి... 2017 ఏప్రిల్ నుంచి 2018 ఫిబ్రవరి 16 వరకు పదిన్నర నెలల కాలంలో బ్యాంకుల నాన్ ఫుడ్ రుణాలు (ఆహారోత్పత్తి కోసం కాకుండా ఇచ్చేవి) రూ.2.44 లక్షల కోట్లుగా ఉంటే ఇందులో రూ.2.34 లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలే. ఈ ప్రకారం చూస్తే 2017–18 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాల వ్యాపారంలో వృద్ధి 17.6 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాలంలో పరిశ్రమలకు ఇచ్చే రుణాలు రూ.5.28 లక్షల కోట్ల మేర తగ్గగా, వ్యవసాయం, అనుబంధ రంగాల రుణాల్లో రూ.2.44 లక్షల కోట్ల మేర వృద్ధి నెలకొంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో నాన్ ఫుడ్ రుణాలు రూ.5.48 లక్షల కోట్లు కాగా, అందులో రూ.2.61 లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలే ఉండడం గమనార్హం. ‘పర్సనల్ లోన్స్’ అంటే వినియోగ ఉత్పత్తుల కొనుగోలుకు ఇచ్చేవి, వాహన రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డు, ఎఫ్డీలు, షేర్లపై ఇచ్చే రుణాలు అన్నీ. విశ్లేషకులు ఏమంటున్నారు? ‘‘ఇదేమీ ఆశ్చర్యపరిచే విషయం కాదు. కార్పొరేట్లు రుణాలు తీసుకోవడం దాదాపుగా ఆపేశాయి. దీంతో బ్యాంకులకు ఇప్పుడు వృద్ధికి అవకాశం ఉన్న ఏకైక విభాగం రిటైల్ రుణాలే. ఇదే పరిస్థితి మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగుతుంది. ఎందుకంటే పారిశ్రామిక రుణాలకు తగిన డిమాండ్ లేదిప్పుడు. సేవల రంగం వృద్ధి కారణంగా వ్యక్తులు రుణాలు తీసుకుంటూనే ఉన్నారు’’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ ధనుంజయ్ సిన్హా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి గణాంకాలు బయటకు వస్తే రిటైల్ రుణాల వాటా తగ్గొచ్చని ఈక్వినామిక్స్ ఎండీ జి.చొక్కలింగం పేర్కొన్నారు. చారిత్రకంగా చూస్తే ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో (జనవరి–మార్చి) పారిశ్రామిక, ఇనిస్టిట్యూషనల్ రుణాల్లో పెరుగుదల ఉన్నట్టు తెలుస్తోందన్నారు. కొంత కాలానికి తయారీరంగంలో సామర్థ్యం వినియోగం పుంజుకుంటే తాజా పెట్టుబడులకు మళ్లీ పరిస్థితులు అనుకూలిస్తాయని ఇండియా రేటింగ్స్ పబ్లిక్ ఫైనాన్స్ హెడ్ దేవేంద్ర పంత్ అభిప్రాయపడ్డారు. మరికొందరు నిపుణులు మాత్రం గృహస్తుల రుణాలు పెరిగిపోతున్నాయని, వారి వ్యక్తిగత ఆదాయంలో వృద్ధి 5–6 శాతం కంటే తీసుకునే వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 18–20 శాతం ఉంటోందని చెబుతున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగితే బ్యాంకులకు ఈ రుణాలు సమస్యగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి మృతి
వేలూరు : గుండెపోటుతో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్.విశ్వనాథన్ శనివారం రాత్రి మృతి చెందాడు. వేలూరు జిల్లా కావేరిపాక్కంకు చెందిన విశ్వనాథన్(67) అన్నాడీఎంకే పార్టీలో తూర్పు డివిజన్ కార్యదర్శి, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఆయన అనారోగ్యం కారణంగా చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స కోసం ఈ నెల 1వ తేదీన చేరారు. అక్కడ చికిత్సలు ఫలించక ఆయన శనివారం రాత్రి మృతి చెందాడు. విశ్వనాథన్ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం మద్దతుదారునిగా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement