-
విటమిన్ ‘డి’ లోపం: ఆదిలోనే గుర్తించకపోతే.. డేంజరే!
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న డీ విటమిన్ టోపం. నిజానికి చాలా సులువుగా అతి చౌకగా లభించే విటమిన్ ఇది. సూర్యకిరణాల ద్వారా మనకు విటమిన్ డీ ఎక్కువగా లభిస్తుంది. కానీ ఎండలు ఎక్కువగా మన దేశంలో 70-80 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అమెరికాలో దాదాపు 42శాతం మంది పెద్దలకు విటమిన్ డి లోపం ఉంది ఆఫ్రికన్ అమెరికన్ పెద్దలలో 82శాతం మంది ఈ డీ విటమిన్లోపంతో బాధపడుతుండటం డేంజర్బెల్స్ను మోగిస్తోంది. డీ విటమినల్ లోపం డీ విటమిన్ లోపిస్తే.. అలసట, తరచుగా అనారోగ్యం, ఆందోళన, ఎముకల నొప్పులు, గాయాలు తొందరగా మానకపోవడం, నిద్ర లేమి లాంటి సమస్యలొస్తాయి. ఇంకా హైపర్ టెన్షన్, డిప్రెషన్, టైప్-2 మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమసల్యకు దారి తీస్తుంది. అలాగే తీవ్రమైన జుట్టు రాలడానికి కూడా విటమిన్ డీ లోపం కారణమని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. భయపెడుతున్న అల్జీమర్స్ విటమిన్ డి లోపం భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు. ఫ్రాన్స్లో జరిపిన ఒక అధ్యయనంలో, 50 nmol/L కంటే తక్కువ విటమిన్ డీ అల్జీమర్స్ వచ్చే ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. యూకేలో అరవై శాతానికి పైగా ప్రజల్లో దీని కంటే తక్కువ స్థాయిని కలిగి ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధిగ్రస్తులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నట్లు అల్జీమర్స్ అసోసియేషన్ ప్రచురించిన ఓ జర్నల్ లో పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల మంది ఈ రోగం బారిన పడే అవకాశం ఉన్నట్లు అంచనా. మన శరీరంలో డీ విటమిన్ స్థాయి ఉంటే ఎనర్జీ లెవల్స్, మూడ్ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా డీ విటమిన్ లోపిస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోయి, అది క్రమంగా అల్జీమర్స్, డిమెన్షియాకు లేదా తీవ్రమైన మతిమరపునకు దారితీస్తుంది. తొలుత జ్ఞాపకశక్తి కోల్పోవడం, చలనశీలత సమస్యలు ముదిరి కాలక్రమేణా డిమెన్షియాకు దారితీస్తుంది. ఫలితంగా మనిషి ఆలోచనా శక్తి నాశనమై పోయి, ఒక్కోసారి తన దైనందిన పనులను కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. తమ సమీప బంధువులకు మర్చిపోతారు. చివరికి తమను తాము, తమ ఇంటిని కూడా గుర్తుపట్టలేరు. ఈ పరిస్థితి బాధితుడితోపాటు సంబంధిత కుటుంబానికి కూడా పెద్ద సమస్యగా మారుతుంది. నిపుణులు ప్రకారం విటమిన్ డీ పుష్కలంగా ఉంటే మెదడు చురుకుగా మారుతుంది. ఉదయం సమయంలో ఎండలో నిలబడితే శరీరానికి అవసరమైనంత మొత్తంలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే డీ విటమిన్ సప్లిమెంట్స్తోపాటు, విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారం పాలు, పెరుగు, గుడ్లు, సోయాబీన్, బీన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి విటమిన్ డీ చాలా అవసరం. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇది ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కేన్సర్ నివారణలో సాయపడుతుంది. -
విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: విటమిన్ ‘డీ’.. ఎముకల ఎదుగుదల, కండరాల పటుత్వానికి అత్యంత కీలకం. రోగనిరోధక శక్తి పెంపుదలకు ఇది దోహదపడుతుంది. ఈ కారణంగానే కరోనా పరిస్థితుల్లో డీ విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, సప్లిమెంట్లు తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. కానీ దేశంలో పదేళ్ల నుంచి పంతొమ్మిదేళ్ల మధ్య వయసున్న పిల్లలు అంటే ఎదిగే పిల్లలు చాలామందిలో ఈ విటమిన్ లోపం తీవ్రంగా ఉంది. మానసిక, శారీరక ఎదుగుదలకు కీలకమైన వయసులో డీ విటమిన్ లోపం పిల్లల్లో ఎన్నోరకాల దుష్ప్రభావాలను కలిగిస్తోంది. దేశంలో 19 ఏళ్లలోపు పిల్లల్లో విటమిన్ డీ స్థితిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యూనిసెఫ్ సహకారంతో పరిశీలన చేపట్టింది. పరిశీలనలో తేలిన అంశాలతో నివేదికను తాజాగా పార్లమెంటుకు సమర్పించింది. ఏ వయస్సు వారిలో ఎంత? జాతీయ స్థాయిలో 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో 23.9 శాతం మంది, అంటే దాదాపుగా ప్రతి నలుగురిలో ఒకరు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారు. ఇక నాలుగేళ్లలోపు చిన్నారులు 13.8% మందిలో ఈ విటమిన్ లోపం గుర్తించగా, 18.2% మంది 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో కూడా డీ లోపం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ డీ లోపం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..! 15 నిమిషాలు ఎండలో ఉండాలి శరీరానికి సరిపడా విటమిన్ డీ సూర్యరశ్మి నుంచే సహజంగా వస్తుంది. మనం తినే ఆహార పదార్థాల్లోని కాల్షియంను కండరాలు, ఎముకలకు అందించడంలో ‘డీ’పాత్ర అత్యంత కీలకం. రోజుకు కనీసం పదిహేను నిమిషాలైనా ఎండలో ఉంటే విటమిన్ ‘డీ’సమతుల్యత ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది లోపిస్తే చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది. ఇక పెద్దల్లో ఎముకల అరుగుదల వేగంగా ఉంటుంది. దీని ప్రభావంతో కీళ్ల నొప్పులు వస్తాయి. దీంతో పాటు నిద్రలేమి, అలసత్వం, డిప్రెషన్, ఒంటినొప్పులు వరుసగా వస్తుంటాయి. ఈ లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితే విటమిన్ల అసమతుల్యత, అధిక బరువు, రోగనిరోధక శక్తి క్షీణత లాంటివి ఉత్పన్నమవుతాయి. మారుతున్న జీవనశైలి కూడా విటమిన్ల అసమతుల్యతకు దారితీస్తోంది. చదవండి: Belly Fat: క్యారెట్, మెంతులు, జామ, బెర్రీస్.. కొవ్వు, బరువు రెండూ తగ్గుతాయి! తెలంగాణలో కాస్త మెరుగే తెలంగాణలో మాత్రం విటమిన్ డీ స్థాయి కాస్త సంతృప్తికరంగానే ఉంది. నాలుగేళ్లలోపు చిన్నారులు 9.6 శాతం మందిలో, 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 5.5 శాతం మందిలో, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 8.8 శాతం మందిలో మాత్రమే లోపం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ‘డీ’లోపం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్, మణిపూర్, హరియాణ, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాలున్నాయి. తమిళనాడులో ఈ లోపం అతితక్కువగా ఉంది. చదవండి: Weight Loss Tips: బాదం, చేపలు, చెర్రీలు తరచుగా తింటే! వైద్యుల సలహా మేరకే ‘రెడీమేడ్’ తీసుకోవాలి సూర్యరశ్మి ఎక్కువగా సోకకపోవడం డీ విటమిన్ లోపానికి కారణమని చెప్పొచ్చు. ఇక సరైన ఆహార పదార్థాలను సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల కూడా విటమిన్ల సమస్య తలెత్తుతుంది. సముద్రపు ఆహారంలో ‘డీ’పుష్కలంగా ఉంటుంది. ప్రస్తుతం కొన్ని రకాల పోషకాహారాలకు కూడా ‘డీ’ని అదనంగా జతచేసి అందిస్తున్నారు. ఇవి రెడీమేడ్గా లభిస్తున్నా తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. – డాక్టర్ కీర్తి మునగపాటి, కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్ -
విటమిన్-డి సప్లిమెంట్స్తో గుండెకు మేలు..!
పరి పరిశోధన గుండె పనితీరు సరిగా లేని ‘హార్ట్ ఫెయిల్యూర్’ రోగులకు విటమిన్-డి సప్లిమెంట్స్ ఇవ్వడం... వాళ్ల గుండె పనితీరును మెరుగుపరుస్తుందని ఒక బ్రిటిష్ అధ్యయనంలో తేలింది. ‘హార్ట్ ఫెయిల్యూర్’ సమస్య తలెత్తిన కొందరిని బ్రిటన్కు చెందిన నిపుణులు ఎంపిక చేసుకున్నారు. వీళ్లలో బీటాబ్లాకర్స్, ఏసీఈ ఇన్హిబిటార్స్ వంటి మందులు వాడతున్నవారు కొందరు ఉన్నారు. మరికొందరు తమ శరీరంలో పేస్మేకర్ వంటి పరికరాన్ని తమ అమర్చుకున్నవారు. వీళ్లలో సగం మందికి డాక్టర్లు విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చారు. మిగతా సగానికి కేవలం రోగి సంతృప్తి కోసం వాడేందుకు ఉపయోగించే మందులేని టాబ్లెట్లను ఇచ్చారు. ఇలా రోగి సంతృప్తి కోసం మాత్రమే ఇచ్చే మందు లేని టాబ్లెట్స్ను ‘ప్లాసెబో పిల్స్’ అంటారు. వాటిని రోజుకు ఒకసారి చొప్పున ఏడాది పాటు వాడారు. ఏడాది తర్వాత వాళ్లకు గుండెకు సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష నిర్వహించారు. విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చిన వారిలో గుండె పనితీరు 26 శాతం నుంచి 34 శాతం మెరుగయ్యిందని ఆ పరీక్షల్లో తేలింది. ‘‘గుండె పనితీరు మరింత దిగజారిపోయి ‘ఇంప్లాంటబుల్ కార్డియోవాస్క్యులార్ డీ-ఫిబ్రిలేటర్(ఐసీడీ)’ వంటి ఉపకరణాలను వాడాల్సిన పరిస్థితిని విటమిన్-డి3 సప్లిమెంట్స్ నివారించాయి’’ అని అధ్యయన ఫలితాలను వెల్లడించిన నిపుణులు వెల్లడించారు. ‘‘ఐసీడీ ఇంప్లాంట్స్ వాడటం ఖర్చుతో కూడిన పని. పైగా ఆపరేషన్ అవసరం. విటమిన్-డి సప్లిమెంట్స్ ఆ పరిస్థితిని నివారించాయంటే... ఆ మేరకు రోగులకు కలిసి వచ్చినట్టే కదా’’ అని అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలను ఇటీవల అమెరికాలోని షికాగోలో నిర్వహించిన 65వ వార్షిక సదస్సులో (ఏన్యువల్ సైంటిఫిక్ సెషన్లో) బ్రిటన్కు చెందిన అధ్యయనవేత్తలు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరింత ఆలస్యంగా..?
పాలమూరుకు ఎంత చేసినా తక్కువే..
బీఆర్ఎస్, బీజేపీ హామీలు నమ్మొద్దు
ఆషామాషీ ఎన్నికలు కావు..
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
ఎన్నికల నిర్వహణలో అధికారులదే కీలకపాత్ర
జీవితంలో విద్యార్థి దశ కీలకం
వీడియోలు, ప్రకటనలపై ప్రత్యేక దృష్టి
ఎంత చేసినా తక్కువే..
● నేడు ఉమ్మడి జిల్లాలోని ఏడు కేంద్రాల్లో పరీక్ష ● హాజరుకానున్న 4,434 మంది విద్యార్థులు ● 11నుంచి 1–30గంటల వరకే కేంద్రాల్లోకి అనుమతి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement