-
వెంకయ్య @ 84 .. కేసీఆర్@ 52
సాక్షి ప్రతినిధి, వరంగల్: గిరిజన జాతర మేడారం జన సంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకునేందుకు బారులు తీరారు. సమ్మక్క తల్లి గురువారం రాత్రి గద్దెలకు చేరడంతో.. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు అంతా గద్దెలపై ఉండడంతో భక్తులు పోటె త్తారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఇక శుక్రవారం భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్ సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. తొలుత ఉప రాష్ట్రపతి.. తర్వాత సీఎం ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి వచ్చా రు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మహేందర్రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పూజారులు వాయిద్యాల మధ్య స్వాగతం పలకగా గద్దెల వద్దకు చేరుకుని వన దేవతలను దర్శించుకున్నారు. తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకుని.. జాతరను పరి శీలించి తిరుగుప్రయాణమయ్యారు. మధ్యాహ్నం మరో హెలికాప్టర్లో సీఎం కేసీఆర్, భార్య çశోభా రాణి, కుమార్తె, ఎంపీ కవిత, మనవడు హిమాన్షుతో కలసి మేడారానికి వచ్చారు. బంగారం (బెల్లం) మొక్కు చెల్లించి, కొబ్బరికాయ కొట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యారు. పోటెత్తిన భక్తులు సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరినప్పటి నుంచి విరామం లేకుండా దర్శనం కొనసాగుతోంది. భక్తులతో రెండు క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి రోడ్డు మీదకు చేరుకున్నాయి. దాంతో జాతరలో ఒకవైపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆర్టీసీ బస్స్టేషన్, జంపన్న వాగు, గద్దెల పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి సహా ప్రముఖులు రావడంతో.. పలుమార్లు దర్శనం క్యూలైన్లను నిలిపేశారు. దీనికితోడు క్యూలైన్లపై పందిళ్లు తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడం, తాగునీరు అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. కొందరు అస్వస్థతకు గురికావడం, స్పృహ తప్పి పడిపోవడంతో వైద్య శిబిరాలకు తరలించి చికిత్స అందించారు. పర్యవేక్షణ లోపంతో ఇబ్బంది జాతర విధులు నిర్వహిస్తున్న పోలీసులు, అధికారుల మధ్య సమన్వయలోపం, తగిన పర్యవేక్షణ లోపించడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలు కూడళ్ల వద్ద ఎదురెదురుగా వచ్చే భక్తులతో కిక్కిరిసి స్తంభించిపోయింది. అస్వస్థతకు లోనైనవారిని తరలించేందుకు వచ్చిన 108 వాహనాలకు పోలీసులు దారి చూపించలేకపోయారు. నేడు సమ్మక్క వన ప్రవేశం జాతర చివరి రోజైన శనివారం సమ్మక్క తల్లి వన ప్రవేశం చేయనుంది. సమ్మక్క పూజారులు, వడ్డెలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్కను చిలకలగుట్టకు తీసుకెళ్తారు. ఇదే సమయంలో సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు తీసుకువెళతారు. దీనితో నాలుగు రోజుల మేడారం మహా జాతర లాంఛనంగా ముగుస్తుంది. వెంకయ్య @ 84 .. కేసీఆర్@ 52 మేడారంలో వన దేవతలను దర్శించు కున్న అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్.. బంగారం (బెల్లం) తులాభారం మొక్కులు చెల్లించు కున్నారు. వెంకయ్యనాయుడు 84 కిలోల బరువు, కేసీఆర్ 52 కిలోల బరువు తూగగా.. వారి బరువు మేరకు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. - సమ్మక్కకు నమస్కరిస్తున్న ఎంపీ కల్వకుంట్ల కవిత -
ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం
విజయవాడ: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నేడు స్వరాష్ట్రానికి వచ్చారు. పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి వచ్చిన వెంకయ్యనాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. గవర్నర్ నరసిహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement