-
కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమం
సుందరయ్య విజ్ఞానకేంద్రం: కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమాలు చేయాలని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ జాతీయ సమన్వయకర్త వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక, కుల ఆధిపత్యంతో దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు. తెలంగాణలో కులాంతర వివాహం చేసుకు న్న 13 మందిని హత్య చేశారని వాపోయారు. దళితులకు భూమి లేనిదే ఆర్థిక సమానత్వం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికను రాజకీ య పార్టీలు దళితుల మధ్య పోటీగా చిత్రీకరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.భాస్కర్, టి.స్కైలాబ్బాబు, నాయకులు జి.నాగయ్య, జాన్వెస్లీ, కురుమయ్య, కృపాసాగర్, మాణిక్యం, మనోహర్, కుమార్ పాల్గొన్నారు. -
రాజ్యాధికారం కోసం పోరాటం
కడప అగ్రికల్చర్: రాజ్యాధికారం కోసం పేదలు పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీపీఎం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సాయంత్రం కడపలో జిల్లా సదస్సు నిర్వహించారు. ముందుగా ఐటీఐ సర్కిల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి కానీ సీపీఎం మాత్రం ప్రజల పక్షాన నిలుస్తూ సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంటున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన సుజనా చౌదరి ఏనాడైనా రాష్ట్ర పరిస్థితులపై పెద్దల సభలో చర్చించాడా? అని ప్రశ్నించారు. డబ్బు, సంస్థలు, పెట్టుబడులు పెడితే ఏ పార్టీలోనైనా పెత్తనం చలాయించవచ్చనేది సుజనా చౌదరే ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఏమిటి? కేంద్రం నుంచి ఎలా రాబట్టుకోవాలి? అనే ఆలోచన ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కోశాన లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎంనాయకులు పేదల పక్షాన పోరాడుతుంటే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కనీస సౌకార్యలు కల్పించాలని అడిగితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పక్షాన మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చివరకు మోసం చేశారని సీఎం చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. హామీలిచ్చి తప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. భవిష్యత్ పోరాట పంథాపై విశాఖపట్టణంలో వచ్చే ఏడాది జాతీయ సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. ఆ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతామన్నారు. ఈ సదస్సులో సీనియర్ పార్టీ సభ్యుడు వెంకటాద్రిని సన్మానించారు. సదస్సులో ఎమ్మెల్సీ గేయానంద్, పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ, జిల్లా నాయకులు ఆంజనేయులు, చంద్రశేఖర్, నగర కార్యదర్శి రవిశంకర్రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. -
రాజ్యాధికారం కోసం పోరాటం
కడప అగ్రికల్చర్: రాజ్యాధికారం కోసం పేదలు పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీపీఎం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సాయంత్రం కడపలో జిల్లా సదస్సు నిర్వహించారు. ముందుగా ఐటీఐ సర్కిల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి కానీ సీపీఎం మాత్రం ప్రజల పక్షాన నిలుస్తూ సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంటున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన సుజనా చౌదరి ఏనాడైనా రాష్ట్ర పరిస్థితులపై పెద్దల సభలో చర్చించాడా? అని ప్రశ్నించారు. డబ్బు, సంస్థలు, పెట్టుబడులు పెడితే ఏ పార్టీలోనైనా పెత్తనం చలాయించవచ్చనేది సుజనా చౌదరే ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఏమిటి? కేంద్రం నుంచి ఎలా రాబట్టుకోవాలి? అనే ఆలోచన ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కోశాన లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎంనాయకులు పేదల పక్షాన పోరాడుతుంటే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కనీస సౌకార్యలు కల్పించాలని అడిగితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పక్షాన మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చివరకు మోసం చేశారని సీఎం చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. హామీలిచ్చి తప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. భవిష్యత్ పోరాట పంథాపై విశాఖపట్టణంలో వచ్చే ఏడాది జాతీయ సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. ఆ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతామన్నారు. ఈ సదస్సులో సీనియర్ పార్టీ సభ్యుడు వెంకటాద్రిని సన్మానించారు. సదస్సులో ఎమ్మెల్సీ గేయానంద్, పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ, జిల్లా నాయకులు ఆంజనేయులు, చంద్రశేఖర్, నగర కార్యదర్శి రవిశంకర్రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
ఉద్దానానికి ఊపిరి
పెత్తందారులకు మళ్లీ షాకే!
పర్యాటకం కళకళ
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
తప్పక చదవండి
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
- Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
- Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
- Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- పోలింగ్ సందర్భంగా హింసకు టీడీపీ కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
Advertisement