సుందరయ్య విజ్ఞానకేంద్రం: కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమాలు చేయాలని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ జాతీయ సమన్వయకర్త వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక, కుల ఆధిపత్యంతో దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు.
తెలంగాణలో కులాంతర వివాహం చేసుకు న్న 13 మందిని హత్య చేశారని వాపోయారు. దళితులకు భూమి లేనిదే ఆర్థిక సమానత్వం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికను రాజకీ య పార్టీలు దళితుల మధ్య పోటీగా చిత్రీకరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.భాస్కర్, టి.స్కైలాబ్బాబు, నాయకులు జి.నాగయ్య, జాన్వెస్లీ, కురుమయ్య, కృపాసాగర్, మాణిక్యం, మనోహర్, కుమార్ పాల్గొన్నారు.
కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమం
Published Thu, Jul 6 2017 10:33 AM
Related news
-
రాజ్యాంగస్ఫూర్తే విరుగుడు!
ఇటీవల దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరువు హత్యల పేరుతో వందలాది మంది యువతీ, యువకులను హత మారుస్తున్నారు. వర్ణం, కులం రెండూ కల్పించబడినవే. మానవుల నుండి మానవులే ఆవిర్భవిస్తారని మానవ పరిణామ శాస్త్రం చెబుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఈ విషయం మీద అనంత పరిశోధన చేశారు. మానవ పుట్టుక మీదా, మానవ పరివర్తన మీదా ఆయన అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. మనుస్మృతి నిర్మించిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థ కల్పితమైనదని రుజువు చేశారు. 1927 డిసెంబర్ 25వ తేదీ ‘మహద్ చెరువు’ పోరాటంలో భాగంగా మనుస్మృతిని దహనం చేశారు కూడా! ప్రత్యామ్నాయంగా, భారత రాజ్యాంగంలో కులం, మతం, ప్రాంతం, జాతి, భాషలకు సంబంధించి భేద భావం లేకుండా ఎవరు ఎవరినైనా వివాహం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, రిజర్వేషన్లు వంటివాటిని అనుభవిస్తున్నవారే తమ పిల్లలు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే సహించలేక వారిని చంపివేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి కారణం మతవాదులు, కుల వాదులు రాజ్యాంగ సంస్కృతికి భిన్నంగా చేసే ప్రబోధమే కారణం. మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని పారశీకుడైన ఫిరోజ్ను ప్రేమించి పెళ్లాడింది. కరమ్ చంద్ గాంధీ వారి వివాహాన్ని నిర్వహించారు. అయితే నెహ్రూ, ఇందిరాగాంధీ పాలనల్లో గానీ, ఆ తర్వాత వచ్చిన పాలకుల కాలంలో కానీ కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించలేదు. భారత దేశాన్ని పాలించిన రాజ వంశీకులు మౌర్యులు, మొగలాయీలు, గుప్తులు – అందరూ వర్ణాంతర వివాహితులే. అలాగే హిందూ మతానికి పునాదులు వేసిన వైదిక రుషులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు వంటి వారందరూ వర్ణాంతర వివాహితులే. అయితే వారు సమాజంలో కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించకపోవడం గమనార్హం. ప్రస్తుత కాలంలో సినిమా, పారిశ్రామిక, కళా, క్రీడా రంగాలలో ఉన్నవారు వర్ణాంతరులైనా, కులాంతరులైనా అభినందనీయులే అవుతున్నారు. భారతీయ సినిమా మార్కెట్ విస్తరణ కోసం బ్రాహ్మణ నాయకి, ఒక ముస్లిం హీరోల కెమిస్ట్రీని పెద్ద పెద్ద పోస్టర్లు ఆవిష్కరించి హిందూ, ముస్లిం వర్గాలను థియేటర్కు తేగలుగుతున్నారు. అదే వాస్తవ జీవితంలో హిందూ, ముస్లిం వివాహ సందర్భం వస్తే దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ముస్లిం, దళిత కులాల వాళ్ళు ప్రేమ వివాహం చేసుకుంటే దళిత యువకుడిని హత్య జేశారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యార్జనావకాశం వల్ల ఈ 70 ఏళ్లలో చదువుకుని అన్ని రంగాల్లో పైకి వస్తున్న దళితులు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే స్థాయికి వస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరగడానికి... దళిత, బహుజన, మైనారిటీ వర్గాల్లో పెరుగుతున్న రాజ్యాంగ స్ఫూర్తి; వర్ణ, కులాధిపత్య భావజాలంలో కొట్టు మిట్టాడుతున్న వారి మూఢత్వాల మధ్య తలెత్తుతున్న ఘర్షణే కారణం. ఇప్పటికీ రాజ్యమేలుతున్న మనుస్మృతికి వ్యతిరేకంగా భారతదేశం సెక్యులర్గా ఎదగాలంటే బౌద్ధ జీవన వ్యవస్థను, భారత రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి. కరుణ, ప్రేమ, ప్రజ్ఞ అనే సూత్రాలను ప్రజల మెదళ్లలోకి వెళ్ళేటట్లు చూడాలి. రాజకీయమంటే ఆధిపత్యం కాదు. ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద భావజాల ఆచరణ అని ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సి ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులో కులాంతర వివాహితులకు పది లక్షల నగదు కానుక, ఉద్యోగావకాశం, భూవసతి, నివాస వసతి కల్పిస్తున్నారు. దీని కొరకు చట్టం తెచ్చారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కులాంతర వివాహితులకు రక్షణ గృహాలు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో కులాంతర, మతాంతర వివాహాలు విస్తరిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగ స్పూర్తితో కులాంతర, మతాంతర వివాహాల వేదికలను ప్రభుత్వమే నిర్వహించవలసిన బాధ్యత ఉంది. అంతే కాకుండా దీని కొరకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. పరువు హత్యలకు పాల్పడిన వారిని ప్రత్యేక కోర్టులో విచారించి మరణ శిక్షను విధించడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ స్ఫూర్తితో కుల నిర్మూలనా భావజాల ఆచరణ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేపట్టాలి. (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) - డా. కత్తి పద్మారావు -
రాజ్యాధికారం కోసం పోరాటం
కడప అగ్రికల్చర్: రాజ్యాధికారం కోసం పేదలు పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీపీఎం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సాయంత్రం కడపలో జిల్లా సదస్సు నిర్వహించారు. ముందుగా ఐటీఐ సర్కిల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి కానీ సీపీఎం మాత్రం ప్రజల పక్షాన నిలుస్తూ సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంటున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన సుజనా చౌదరి ఏనాడైనా రాష్ట్ర పరిస్థితులపై పెద్దల సభలో చర్చించాడా? అని ప్రశ్నించారు. డబ్బు, సంస్థలు, పెట్టుబడులు పెడితే ఏ పార్టీలోనైనా పెత్తనం చలాయించవచ్చనేది సుజనా చౌదరే ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఏమిటి? కేంద్రం నుంచి ఎలా రాబట్టుకోవాలి? అనే ఆలోచన ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కోశాన లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎంనాయకులు పేదల పక్షాన పోరాడుతుంటే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కనీస సౌకార్యలు కల్పించాలని అడిగితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పక్షాన మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చివరకు మోసం చేశారని సీఎం చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. హామీలిచ్చి తప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. భవిష్యత్ పోరాట పంథాపై విశాఖపట్టణంలో వచ్చే ఏడాది జాతీయ సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. ఆ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతామన్నారు. ఈ సదస్సులో సీనియర్ పార్టీ సభ్యుడు వెంకటాద్రిని సన్మానించారు. సదస్సులో ఎమ్మెల్సీ గేయానంద్, పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ, జిల్లా నాయకులు ఆంజనేయులు, చంద్రశేఖర్, నగర కార్యదర్శి రవిశంకర్రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. -
రాజ్యాధికారం కోసం పోరాటం
కడప అగ్రికల్చర్: రాజ్యాధికారం కోసం పేదలు పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీపీఎం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సాయంత్రం కడపలో జిల్లా సదస్సు నిర్వహించారు. ముందుగా ఐటీఐ సర్కిల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి కానీ సీపీఎం మాత్రం ప్రజల పక్షాన నిలుస్తూ సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంటున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన సుజనా చౌదరి ఏనాడైనా రాష్ట్ర పరిస్థితులపై పెద్దల సభలో చర్చించాడా? అని ప్రశ్నించారు. డబ్బు, సంస్థలు, పెట్టుబడులు పెడితే ఏ పార్టీలోనైనా పెత్తనం చలాయించవచ్చనేది సుజనా చౌదరే ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఏమిటి? కేంద్రం నుంచి ఎలా రాబట్టుకోవాలి? అనే ఆలోచన ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కోశాన లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎంనాయకులు పేదల పక్షాన పోరాడుతుంటే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కనీస సౌకార్యలు కల్పించాలని అడిగితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పక్షాన మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చివరకు మోసం చేశారని సీఎం చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. హామీలిచ్చి తప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. భవిష్యత్ పోరాట పంథాపై విశాఖపట్టణంలో వచ్చే ఏడాది జాతీయ సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. ఆ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతామన్నారు. ఈ సదస్సులో సీనియర్ పార్టీ సభ్యుడు వెంకటాద్రిని సన్మానించారు. సదస్సులో ఎమ్మెల్సీ గేయానంద్, పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ, జిల్లా నాయకులు ఆంజనేయులు, చంద్రశేఖర్, నగర కార్యదర్శి రవిశంకర్రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.
Related News by category
-
ఎన్నికలకుసై
నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ ● ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్ల దాఖలుకు అభ్యర్థుల ఏర్పాట్లు సాక్షి, రంగారెడ్డిజిల్లా: సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లలో తలమునకలైంది. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై గట్టి నిఘా తదితర చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం మంచి ముహూర్తాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే పంతుళ్లను ఆశ్రయించి, ఏ రోజు నామినేషన్ వేయాలనే అంశంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. శుభ ముహూర్తాలు ● 18వ తేదీ గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 24న బుధవారం చైత్ర బహుళ పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే.. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలుకు మంచి రోజు. ● 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం.. పై ముహూర్తాల కంటే ఇది యోగ్యమైనది. కానీ ఆరోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు సైతం బయటికి వెళ్లేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు ఇలా ● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. ● అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో పెట్టాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైతే విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ వీఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్–3లో సి కాలం ఎదుట ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపరచాలి. ● పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు అనుమతి. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ల స్వీకరణ కోసం రాజేంద్రనగర్ తహహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, భద్రత కోసం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీని ఎంపిక చేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు 13,443 పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయనున్న తేదీ బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 19 బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25షెడ్యూల్ ఇలా.. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 6తో ఎన్నికల ప్రక్రియ ముగింపు -
నేనే చంపేశా..
చేవెళ్ల: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా తనకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో మేన బావను హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఊరేళ్ల సమీపంలోని ఓ ఫాంహౌస్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. చేవెళ్లకు చెందిన కడమంచి నారాయణదాస్(46) జాతీయ అంబేడ్కర్ అవార్డు గ్రహీత, రియల్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి ఊరేళ్ల సమీపంలో ఓ ఫాంహౌస్ ఉంది. కొద్ది రోజులుగా ఇందులో మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన మేన బావమర్ది తూర్పాటి భాస్కర్తో కలిసి ఫాంహౌస్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పాడు. చీకటి పడినా రాకపోవడంతో మృతుడి భార్య పలుమార్లు ఫోన్ చేసింది. ప్రతీసారి లిఫ్ట్ చేసిన భాస్కర్.. బావ దూరంగా ఉన్నాడని చెప్పాడు. అర్ధరాత్రి తర్వాత చేవెళ్ల పీఎస్కు వెళ్లిన భాస్కర్.. నారాయణదాస్ను గొడ్డలితో నరికి చంపానని చెప్పి లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూసే వరకు నారాయణదాస్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిజేశారు. మృతుడికి భార్య మాణెమ్మ, ఇద్దరు కుమారులున్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతోనే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నారాయణదాస్ చాన్నాళ్లుగా భాస్కర్ను తన వెంట తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో షాబాద్ మండలం నాగరకుంటలోని ఓ భూమికి సంబంధించిన డీల్లో రూ.25లక్షలు ఇస్తానని భాస్కర్కు చెప్పాడు. ఇది పూర్తయి చాలా రోజులైనా డబ్బు ఇవ్వకుండా దాటవేస్తున్నాడు. దీంతో కొద్ది రోజులుగా భాస్కర్ అతనికి దూరంగా ఉంటున్నాడు. మంగళవారం డబ్బు అడగ్గా ఇస్తాలే నేనెక్కడికి వెళ్లట్లేదుగా అని చెప్పిన నారాయణదాస్.. భాస్కర్ను తీసుకుని ఊరెళ్లలోని ఫాంహౌస్కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి అక్కడే మద్యం తాగారు. ఈ క్రమంలో డబ్బుల విషయం మరోసారి చర్చకు రావడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సమయంలో కింద పడిపోయిన నారాయణదాస్ లేస్తే తనను చంపేస్తాడని భావించిన భాస్కర్ అక్కడే ఉన్న గొడ్డలితో మెడపై దాడి చేశాడు. అతడు చనిపోయాడని నిర్ణయించుకుని ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు. హత్యపై అనుమానాలు నారాయణదాస్ హత్య ఒక్కడివల్ల జరగలేదని, దీనిపై నిజానిజాలు తేల్చాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. డబ్బుల విషయంలో గొడవ గొడ్డలితో దాడి చేసి మేన బావను హతమార్చిన నిందితుడు -
శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి
● సతీసమేతంగా హాజరైన కిషన్రెడ్డి ● స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, నాయకులు అమరేందర్రెడ్డి, నిరంజన్, భిక్షపతి, పాండు, రమేష్గౌడ్ తదితరులు ఉన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా విజయ్కుమార్ ఇబ్రహీంపట్నం రూరల్: భారతీయ జనతాపార్టీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా మైలారం విజయకుమార్ నియమితులయ్యారు. బీజేవైఎం రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు యాదీష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రానికి చెందిన విజయ్కుమార్ బీజేపీలో చురుకై నపాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం కార్యదర్శిగా నియమించింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కాలుష్యకారకాలపై చర్యలు రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు మెంబర్ సత్యనారాయణరెడ్డి చేవెళ్ల: ప్రజలకు ఇబ్బంది కలిగించే కాలుష్యకారకాలపై తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బోర్డు సెక్రటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన నగరంలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారని.. చేవెళ్ల ప్రాంతంలోని పలు సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాండూరులోని ఏసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని.. చందనవెల్లిలోని కుందన్ టైక్స్టైల్స్, శంషాబాద్ శ్రీకృష్ణ డ్రగ్స్తోనూ పర్యావరణం కాలుష్యమవుతోందని చెప్పానన్నారు. మోకిలలో నిర్మిస్తున్న విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణ వ్యర్థాలు గండిపేట చెరువులోకి వదులుతున్నారని ప్రస్తావించానన్నారు. మోకిలలోని నిర్మాణాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించిందని చెప్పారు. మొదటిసారి సమావేశానికి హాజరైన నూతన మెంబర్లను బోర్డు ఆధ్వర్యంలో సన్మానించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీబీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డూప్లికేట్ ఔట్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ప్రకటించారు. మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం గత సంవత్సరం ఆరంభం నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. -
డోర్ నంబర్లూ డొల్లే !
ఒకే కుటుంబం.. కేంద్రాలు అనేకం!సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్ నంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్ నంబర్తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్నంబర్తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నంబర్లు వేయడమో చేసి ఆ ఇంటి నంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు పేర్కొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. నగర ఓటరు జాబితాలో వింతలెన్నో రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో వింత పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం -
నాటి చరిత్రకు నేటి సాక్ష్యాలు..
● భూగర్భంలో ఆదిమానవుని అవశేషాలు లభ్యం ● సిద్దిపేట జిల్లా నర్మేట, పాలమాకుల, మగ్దూంపూర్, పుల్లూర్లో బహిర్గతం ● నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవంనంగునూరు(సిద్దిపేట): కాల గర్భంలో కలిసిపోయిన చరిత్ర, కళ్ల ముందున్న కట్టడాలు, భూగర్భంలో నిక్షిప్తమైన చారిత్రాత్మక ఆధారాలు, వారసత్వ ప్రదేశాల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్డేను జరుపుకుంటున్నారు. దేశ చరిత్రను భావితరాలకు అందించేందుకు పురావస్తుశాఖ తోపాటు తెలంగాణ కొత్త చరిత్ర బృందం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా పుల్లూర్, నంగునూరు మండలం నర్మేట, పాలమాకుల, మగ్ధుంపూర్లో 2017 ఏప్రిల్ పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టింది. అక్కడ ఆదిమానవుని అవశేషాలు, రాతి యుగపు పాత్రలు, మృణ్మన పాత్రలు, మెన్మీర్లు, ఆహార అలవాట్లను గుర్తించి హైదరాబాద్లోని పురావస్తుశాఖ కార్యాలయంలో భద్ర పరిచారు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో బహిర్గతమైన అవశేషాలపై ప్రత్యేక కథనం.. ఎంత పెద్ద బండరాయో.. నర్మేటలో పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో సుమారుగా 3 వేల సంవత్సరాల కిందటిదిగా భావిస్తున్న సమాధి బహిర్గతమైంది. బండరాయి (క్యాప్ స్టోన్) 6.70 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 65 సెంటీమీటర్ల మందంతో 43 టన్నుల బరువు ఉండగా క్రేన్ సహాయంతో 2 గంటలపాటు కష్టపడి బండను పక్కకు తొలగించారు. మానవుని సమాధి పాలమాకులలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అందంగా పేర్చినట్లు కనబడుతున్న బండ రాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. సుమారుగా 3 వేల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో ఆది మానవులు జీవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని సమాధి చేసి నాలుగు వైపుల బండలను (సిస్ట్) స్వస్తిక్ ఆకారంలో చుట్టూ రెండు వరుసలుగా వృత్తాకారంలో బండరాళ్లను పేర్చారు. కఫ్మాక్స్ నక్షత్ర సమూహాలు గుర్తించేందుకు ప్రాచీన మానవుడు బండరాళ్లపై కఫ్మాక్స్లను చెక్కేవారు. ప్రస్తుతం నడుస్తున్న కాలం, తర్వాత వచ్చే సీజన్, ఋతువులను తెలుసుకునేందుకు ఇలాంటి గుర్తులను వారు నివసిస్తున్న ప్రాంతంలో రాతి బండలపై చెక్కేవారు. ఎముక ఆభరణాలు మేన్హీర్ వద్ద జరిపిన తవ్వకాల్లో ఆదిమానవులు ఎముకలతో తయారు చేసిన అభరణాలు వాడినట్లు తెలుస్తోంది. సుమారుగా 20 వరకు డైమండ్ ఆకారంలో ఉన్న ఎముకతో తయారు చేసిన పూసలు బయపడ్డాయి. ఇలాంటి ఆకృతి మొదటిసారిగా ఈప్రాంతంలోనే బయట పడ్డట్లు అధికారులు తెలిపారు. చెక్కు చెదరని దంతాలు, ఎముక మేన్హీర్ వద్ద ఉన్న పెద్ద సమాధిలో తెగ పెద్దగా భావిస్తున్న మహిళ 60 సెంటీమీటర్ల కాలు ఎముక లభించింది. అలాగే 20 సెంటీమీటర్ల దంతంతో కూడిన దవడ భాగం బయటపడింది. దంతా లు ఇప్పటికి చెక్కు చెదరకపోవడం విశేషం. శంఖాలు (కౌంచ్) చూడగానే రెండు సుద్దరాళ్లుగా కనిపిస్తున్న ఈ వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డ శంఖాలు. ప్రాచీన మానవుడు పూజ చేసేందుకు, వ్యక్తి చనిపోయిన తర్వాత అంత్యక్రియల సమయంలో గౌరవ సూచకంగా ఊదేందుకు దీన్ని వాడేవారు. నాటి నుంచి నేటి వరకు కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆనాటి కాలంలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. భావితరాల వారికి అందించాలి పురాతన కాలం నాటి చరిత్ర, సాంస్కృతిని భావి తరాలవారికి అందించాలి. గ్రామాల్లో తిరిగి ఎన్నో అధ్యయనాలు జరిపి చారిత్రక ఆధారాలను సేకరిస్తున్నాం. ప్రభుత్వం చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చాలి. – కొలిపాక శ్రీనివాస్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, నంగునూరు
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
‘‘కేజ్రీవాల్ను చంపుతారా..?’’
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement