-
'పోలీసులూ.. ఆ ఫొటో బాలేదు, ఈ సెల్ఫీ పెట్టండి'
వాషింగ్టన్: ఓ నిందితుడు సోషల్ మీడియాలో పోలీసుల వాంటెడ్ జాబితాలో తన ఫోటోను చూసి అవాక్కయ్యాడు. ఆ ఫోటో భయంకరంగా ఉందని, దాని బదులు మరో ఫొటో ఉంచండి.. అంటూ సెల్ఫీ తీసి పోలీసులకు పంపాడు. పోలీసులు నిందితుడి పాత ఫొటోతో పాటు అతను పంపిన సెల్ఫీని కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అమెరికాలోని లిమా పోలీస్ డిపార్ట్మెంట్కు డొనాల్డ్ ఏ చిప్ పుగ్ (45) అనే నిందితుడు సెల్ఫీ పంపగా, పోలీసులు అతనికి ధన్యవాదాలు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న డొనాల్డ్ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, అతని అచూకీ తెలిస్తే తెలిపాలని లిమా పోలీసులు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఫేస్బుక్లో ఉన్న డొనాల్డ్ కొత్త ఫొటోను అతనే సెల్పీ తీసి పంపాడిని వెల్లడించారు. తమకు సాయపడినందుకు డొనాల్డ్కు ధన్యవాదాలు తెలుపుతూ, అతను తమ దగ్గరకు వచ్చి, నేరాల గురించి చెబితే అభినందిస్తామని కామెంట్ పోస్ట్ చేశారు. -
మూడేళ్ల నాటి హత్య కేసులో నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ: మూడేళ్ల నాటి హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో మహిళతో పెళ్లికి అడ్డంగా ఉందనే కారణంతో ప్రియురాలిని హత్య చేసి మూడేళ్లుగా నిందితుడు రామ్కుమార్ పరారీలో ఉన్నాడు. తీవ్రంగా గాలించిన పోలీసులు, అతని ఆచూకీ దొరకకపోవడంతో రూ. 50,000 నగదు బహుమతి ప్రకటించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పుష్ప్ విహార్ ప్రాంతానికి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు కాపుకాసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాలు.. ఉత్తరప్రదేశలోని ఘాజీపుర్కి చెందిన రామ్కుమార్ బతుకుదెరువు కోసం ఢిల్లీకి వచ్చి, మెడికల్ రిప్రజెంటేటివ్గా చేరాడు. అదే సమయంలో రోహిణీ, సెక్టార్ 3లోని ఓ క్లినిక్లో ఉద్యోగిగా చేస్తున్న మహిళ(26)తో పరిచయం పెంచున్నాడు. గడిచే కొద్దీ ప్రేమగా మారడంతో కొంత కాలం ఆ మహిళతో చాలా చనువుగా తిరగడం మొదలుపెట్టాడు. కానీ, వేరే అమ్మాయితో పెళ్లి నిర్ణయం కావడంతో ఆమెకు దూరంగా ఉండసాగాడు. దీంతో ఆ మహిళ అతనితో తరుచుగా పెళ్లి విషయమై తరచూ గొడవ పడింది. ఈ నేపథ్యంలో 2011, డిసెంబరు నాలుగో తేదీన ఆమెను హత్య చేసి పారిపోయాడు. అప్పటి నుంచి హౌరా, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ గడిపాడు. స్నేహితుణ్ని కలిసేందుకు పుష్ప్విహార్ ప్రాంతానికి వచ్చిన నిందితుడు అనూహ్యంగా పోలీసుల చేతికి చిక్కాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement