-
బట్టలుతకలేదని రేషన్ కట్!
ఎక్కువవుతున్న గ్రామపెద్దల వేధింపులు నీరు, కరెంటు నిలుపుదల చేస్తామని హెచ్చరికలు పణుకువలస రజకుల ఆక్రందనలు బలిజిపేట రూరల్(విజయనగరం): వారంతా కాయకష్టం చేసి ఇన్నాళ్లూ బతికారు. పెత్తందార్ల ఇళ్లల్లో బట్టలుతికి... వారు చెప్పిన పనులు చేసి... వారిచ్చింది తీసుకుని కాలం గడిపారు. వయసుడిగిన వేళ పనులు మానుకున్నారు. అందివచ్చిన పిల్లలు మెరుగైన జీవనంకోసం వేరే పనులు చూసుకున్నారు. అది భరించలేని ఆ వూరి పెద్దలు వేధింపులు మొదలుపెట్టారు. ఆ కుటుంబాలకు రేషన్ కట్చేశారు. ఇంకా విద్యుత్, నీటిసరఫరా నిలిపేస్తామని హెచ్చరిస్తున్నారు. గిట్టుబాటు కాని కులవత్తి చేయనందుకు మండలంలోని పణుకువలసలోని రజకులను ఆ గ్రామ పెద్దలు వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఏడుకుటుంబాల రజకులు ఉండగా వారిలో 5 కుటుంబాల వారు గిట్టుబాటు కావట్లేదని గత కొద్ది కాలంగా కులవత్తికి దూరమయ్యారు. వీరిలో పెంట అప్పలస్వామి వయోభారంతో వత్తి పనికి దూరమవ్వగా... ఆయన కుమారులైన సింహాచలం, గౌరి వేర్వేరుగానే ఉంటున్నారు. వారిద్దరూ వత్తి మానేసి ఆటో నడుపుకుంటున్నారు. అప్పలస్వామి మరో కుమారుడు రాము వలస వెళ్లిపోయాడు. వీరుగాకుండా ఎన్.సీతయ్య, ఎం.తవిటిశెట్టి కుటుంబాలు స్థానికంగానే ఉంటున్నా... కులవత్తివల్ల గిట్టుబాటు లేక వేరే పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. దీనిని సహించలేని గ్రామ పెద్దలు ఎం.సూర్యనారాయణ, బి.సింహాచలం, వాసు, జి.అప్పలనాయుడు తమను రెండు నెలలుగా ఒత్తిడి చేస్తూ మానేసినందుకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వారంతా వాపోయారు. వృత్తి పని మానేయడం ఏమిటనీ.. అలా అయితే గ్రామంలో ఉండనీయమని, నివాస గహాలను ఖాళీచేయించి వేరేవారికి ఇచ్చి తమను గ్రామ బహిష్కరణ చేస్తామని వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్కార్డులు ఉన్నప్పటికీ సరకులు ఇవ్వనీయకుండా డీలర్ను కట్టడి చేశారనీ, ఇళ్ళకు నీటిని, విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. వేధింపుల్లో భాగంగా వికలాంగుడైన రాముకు వచ్చే పింఛన్ రూ. 1500లు నిలుపుదల చేయించారని వారు పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్ బి.వి.లక్ష్మి, ఎస్ఐ సింహాచలానికి ఫిర్యాదు చేసినట్టు వివరించారు. కడుపునిండకే – సింహాచలమమ్మ, పణుకువలస. వత్తిపనితో కడుపునిండడంలేదు. ఇన్నాళ్లు ఎలాగోలా బతికాం. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారు వేరే మార్గం చూసుకుంటున్నారు. మాకు రెక్క ఆడేవరకు పెద్దవారి పనులు చేశాం. శక్తిలేకే వదిలేశాం. ఎన్ని బాధలు పెట్టినా భరించాం– పి.అప్పలస్వామి, పణుకువలస. వత్తి పనికి కట్టుబడి, గ్రామాన్ని వదిలి వెళ్ళలేక వయస్సు మీరినా గ్రామ పెద్దలకు ఎన్నో సేవలు చేశాం. పెద్దలు కొట్టినా, తిట్టినా, మా కడుపుమండినా ఇంతవరకు పనులు చేశాం. పిల్లలకు రెక్కలు వచ్చాయి వారు ఎగిరిపోయారు. మేం పనులు మానేస్తే వేధిస్తారా? గ్రామ పెద్దలు ఇవ్వొవద్దన్నారు– శ్రీనివాసరావు, ఇన్చార్జ్ డీలర్ రజకులకు కార్డులు ఉన్నాయి. వారికి రేషన్ వచ్చింది. గ్రామంలో పెద్దలకు వారికి వివాదాలు ఉండడంతో వారు ఇవ్వొద్దని చెప్పడంతో రేషన్ ఇవ్వలేదు. సరుకులు ఇప్పిస్తా –బి.వి.లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట గ్రామంలో తగాదాలకు రేషన్ ఆపివేయడానికి ఎటువంటి సంబంధం లేదు. వారి సరుకులు వారికి ఇప్పిస్తాం. వెంటనే డీలరుకు చెప్తాం. -
బట్టలుతకలేని రేషన్ కట్!
ఎక్కువవుతున్న గ్రామపెద్దల వేధింపులు నీరు, కరెంటు నిలుపుదల చేస్తామని హెచ్చరికలు పణుకువలస రజకుల ఆక్రందనలు బలిజిపేట రూరల్: వారంతా కాయకష్టం చేసి ఇన్నాళ్లూ బతికారు. పెత్తందార్ల ఇళ్లల్లో బట్టలుతికి... వారు చెప్పిన పనులు చేసి... వారిచ్చింది తీసుకుని కాలం గడిపారు. వయసుడిగిన వేళ పనులు మానుకున్నారు. అందివచ్చిన పిల్లలు మెరుగైన జీవనంకోసం వేరే పనులు చూసుకున్నారు. అది భరించలేని ఆ వూరి పెద్దలు వేధింపులు మొదలుపెట్టారు. ఆ కుటుంబాలకు రేషన్ కట్చేశారు. ఇంకా విద్యుత్, నీటిసరఫరా నిలిపేస్తామని హెచ్చరిస్తున్నారు. గిట్టుబాటు కాని కులవత్తి చేయనందుకు మండలంలోని పణుకువలసలోని రజకులను ఆ గ్రామ పెద్దలు వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఏడుకుటుంబాల రజకులు ఉండగా వారిలో 5 కుటుంబాల వారు గిట్టుబాటు కావట్లేదని గత కొద్ది కాలంగా కులవత్తికి దూరమయ్యారు. వీరిలో పెంట అప్పలస్వామి వయోభారంతో వత్తి పనికి దూరమవ్వగా... ఆయన కుమారులైన సింహాచలం, గౌరి వేర్వేరుగానే ఉంటున్నారు. వారిద్దరూ వత్తి మానేసి ఆటో నడుపుకుంటున్నారు. అప్పలస్వామి మరో కుమారుడు రాము వలస వెళ్లిపోయాడు. వీరుగాకుండా ఎన్.సీతయ్య, ఎం.తవిటిశెట్టి కుటుంబాలు స్థానికంగానే ఉంటున్నా... కులవత్తివల్ల గిట్టుబాటు లేక వేరే పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. దీనిని సహించలేని గ్రామ పెద్దలు ఎం.సూర్యనారాయణ, బి.సింహాచలం, వాసు, జి.అప్పలనాయుడు తమను రెండు నెలలుగా ఒత్తిడి చేస్తూ మానేసినందుకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వారంతా వాపోయారు. వత్తి పని మానేయడం ఏమిటనీ.. అలా అయితే గ్రామంలో ఉండనీయమని, నివాస గహాలను ఖాళీచేయించి వేరేవారికి ఇచ్చి తమను గ్రామ బహిష్కరణ చేస్తామని వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్కార్డులు ఉన్నప్పటికీ సరకులు ఇవ్వనీయకుండా డీలర్ను కట్టడి చేశారనీ, ఇళ్ళకు నీటిని, విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. వేధింపుల్లో భాగంగా వికలాంగుడైన రాముకు వచ్చే పింఛన్ రూ. 1500లు నిలుపుదల చేయించారని వారు పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్ బి.వి.లక్ష్మి, ఎస్ఐ సింహాచలానికి ఫిర్యాదు చేసినట్టు వివరించారు. కడుపునిండకే – సింహాచలమమ్మ, పణుకువలస. వత్తిపనితో కడుపునిండడంలేదు. ఇన్నాళ్లు ఎలాగోలా బతికాం. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారు వేరే మార్గం చూసుకుంటున్నారు. మాకు రెక్క ఆడేవరకు పెద్దవారి పనులు చేశాం. శక్తిలేకే వదిలేశాం. ఎన్ని బాధలు పెట్టినా భరించాం– పి.అప్పలస్వామి, పణుకువలస. వత్తి పనికి కట్టుబడి, గ్రామాన్ని వదిలి వెళ్ళలేక వయస్సు మీరినా గ్రామ పెద్దలకు ఎన్నో సేవలు చేశాం. పెద్దలు కొట్టినా, తిట్టినా, మా కడుపుమండినా ఇంతవరకు పనులు చేశాం. పిల్లలకు రెక్కలు వచ్చాయి వారు ఎగిరిపోయారు. మేం పనులు మానేస్తే వేధిస్తారా? గ్రామ పెద్దలు ఇవ్వొవద్దన్నారు– శ్రీనివాసరావు, ఇన్చార్జ్ డీలర్ రజకులకు కార్డులు ఉన్నాయి. వారికి రేషన్ వచ్చింది. గ్రామంలో పెద్దలకు వారికి వివాదాలు ఉండడంతో వారు ఇవ్వొద్దని చెప్పడంతో రేషన్ ఇవ్వలేదు. సరుకులు ఇప్పిస్తా –బి.వి.లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట గ్రామంలో తగాదాలకు రేషన్ ఆపివేయడానికి ఎటువంటి సంబంధం లేదు. వారి సరుకులు వారికి ఇప్పిస్తాం. వెంటనే డీలరుకు చెప్తాం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement