-
కటోవీస్ మొక్కుబడి!
పారిస్ వాతావరణ ఒప్పందం అమలుకు అవసరమైన నిబంధనల్ని రూపొందించేందుకు పోలాండ్లోని కటోవీస్లో సమావేశమైన ప్రతినిధులు ఎట్టకేలకు ఆ పని పూర్తిచేశారు. పక్షం రోజులు అను కున్న సదస్సు మరో రోజు పొడిగించాల్సివచ్చింది. అయితే రూపొందిన నిబంధనలు సంతృప్తిక రంగా లేవు. నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు అవి ఏమేరకు దోహదపడతాయో సందేహమే. 200 దేశాల నుంచి వచ్చిన 23,000మంది ప్రతినిధులు 2020 నుంచి అమలు కావాల్సిన ఈ నిబంధన లపై చర్చించారు. కటోవీస్ సదస్సు సంక్లిష్ట పరిస్థితుల మధ్య జరిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్ వాతావరణ ఒప్పందంలో మార్పులు చేయకపోతే దాన్నుంచి వైదొలగుతా మని నిరుడు హెచ్చరించడమేకాక, అమెరికా చాన్నాళ్ల క్రితమే మూతబడిన బొగ్గు ఆధారిత కర్మాగా రాలను తిరిగి పని చేయించడం ప్రారంభించారు. ప్రపంచంలో కర్బన ఉద్గారాలను అధికంగా వదిలే దేశాల్లో చైనా తర్వాత అమెరికా రెండో స్థానంలో ఉంది. మరోపక్క వచ్చే ఏడాది తమ దేశంలో జరగాల్సిన కాప్–25 సదస్సుకు లోగడ ఇచ్చిన అంగీకారాన్ని ఉపసంహరించుకుంటున్నా మని బ్రెజిల్ ప్రకటించింది. అంతేకాక పర్యావరణానికి ప్రమాదం ముంచుకొస్తున్నదన్న ప్రచార మంతా పెట్టుబడిదారీ దేశాలను దెబ్బతీయడానికి ‘మార్క్సిస్టులు’ పన్నిన కుట్రగా అభివర్ణించింది. అక్కడ మితవాద పక్ష నాయకుడైన జైర్ బోల్సొనారో దేశాధ్యక్షుడిగా గెలిచాక బ్రెజిల్ వైఖరి మారింది. చివరకు ఆ సదస్సును చిలీలో జరపాలని నిర్ణయించారు. కర్బన ఉద్గారాలను అధికంగా వదిలే దేశాల జాబితాలో బ్రెజిల్ది 11వ స్థానం. దీనికితోడు అక్టోబర్లో విడుదలైన ఐక్యరాజ్యస మితి వాతావరణ నివేదికను తప్పుబడుతూ చమురు ఉత్పత్తి చేసే దేశాలు అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, కువైట్లు కటోవీస్ సదస్సుకు ముందు చేసిన ప్రకటన అందరిలోనూ సందేహాలు రేకె త్తించింది. సదస్సు కర్తవ్యాలను అడ్డుకోవడానికి, వీలైతే నీరుకార్చడానికి ఈ దేశాలన్నీ ప్రయత్ని స్తున్నాయన్న ఆందోళన తలెత్తింది. వీటన్నిటినీ దాటుకుని నిబంధనలు ఖరారయ్యాయి. అయితే ఇవి ఉండాల్సినంత పటిష్టంగా లేవు. నిర్దిష్టమైన అంశాల విషయంలో తప్పించుకునే ధోరణే వ్యక్త మైంది. తాజా నిబంధనలను అనుసరించి ప్రతి దేశమూ తన కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వాటిని తగ్గించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలేమిటో వివరిస్తూ ప్రతి రెండేళ్లకూ నివే దిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమం 2024 నుంచి అమలవుతుంది. కర్బన ఉద్గారాల వల్ల ముంచుకొచ్చే ప్రమాదం గురించి ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో అవగాహన ఉంది. కానీ వాటిని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను అమలు చేయడం వాటికి పెద్ద ఇబ్బందిగా ఉంది. ఈ సాంకేతికత అమలుకు కావల్సిన వ్యయం గురించి వర్ధమాన దేశాల్లో ఆందోళన ఉంది. ఆ విషయంలో అందించాల్సిన ఆర్థిక సాయంపై అంగీకారం కుదిరింది. 2020లోగా ఏడాదికి 10,000 కోట్ల డాలర్లను సమీకరించాలని లోగడ పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించా లని నిర్ణయించారు. 2025 నుంచి అమలయ్యే కొత్త లక్ష్యాలను రూపొందించాలన్న అవగాహన కుది రింది. అయితే ఈ నిధుల్ని అన్ని దేశాలూ కాలుష్య నివారణ చర్యలకు వినియోగించేందుకు అవసర మైన ప్రణాళికలు ఖరారు చేసుకోవాలి. ఇప్పుడు కాప్–24 సదస్సు జరిగిన పోలాండ్ విద్యుదుత్పా దన ప్రాజెక్టుల్లో 80 శాతం బొగ్గు ఆధారితమైనవే. 2030 కల్లా ఉద్గారాల తీవ్రతను దాదాపు 35 శాతం తగ్గించుకుంటామని పారిస్ వాతావరణ సదస్సులో దేశాలన్నీ ప్రకటించాయి. అలాగైతేనే పారిశ్రామికీకరణకు ముందునాటి స్థాయికంటే రెండు డిగ్రీల సెల్సియస్కి మించి ఉష్ణోగ్రత పెరగ కుండా చూడగలమని ఆ సదస్సు తెలిపింది. అయితే పర్యావరణవేత్తలు మాత్రం ఈ లక్ష్యాలు ఏమాత్రం సరిపోవని చెబుతున్నారు. నిజానికి 2030నాటికి ఒకటిన్నర డిగ్రీలకు మించి పెరగ కుండా చూస్తేనే జరగబోయే ఉపద్రవాన్ని నివారించగలమని వారు చెబుతున్న మాట. ఆ కోణంలో చూస్తే కటోవీస్ సదస్సు మిశ్రమ ఫలితాలు సాధించిందని చెప్పాలి. నిబంధనలు పారదర్శకంగా ఉండాలని సదస్సుకు ముందునుంచీ అందరూ కోరారు. దానికి ఆమోదం లభించింది. అయితే కర్బన ఉద్గారాలకు పరిమితులు విధించేందుకు అవసరమైన యంత్రాంగాల రూపకల్పనకు సంబం ధించిన నిబంధనలపై ఈ సదస్సులో ఏకాభిప్రాయం కుదరలేదు. అది వచ్చే ఏడాది జరిగే చిలీ సద స్సులో పరిశీలించాలని నిర్ణయించారు. సముద్ర మట్టాలు పెరిగితే ప్రమాదంలో చిక్కుకునే ద్వీప కల్ప దేశాల ప్రతినిధులు మాత్రం కర్బన ఉద్గారాల అదుపునకు కఠినమైన నిబంధనలు ఉండాల్సిం దేనని వాదించారు. లక్ష్యాల సాధనలో విఫలమయ్యే దేశాలపై కఠిన చర్యలుండాలని సూచించారు. నిజానికి పారిస్ వాతావరణ సదస్సులో నిర్ణయించిన లక్ష్యాలన్నీ ఆయా దేశాలు స్వచ్ఛందంగా ప్రక టించినవే. అటువంటప్పుడు వాటిని సాధించనిపక్షంలో పెనాల్టీలు విధించడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ పెనాల్టీల బదులు ఆ దేశాలపై ఒత్తిళ్లు తీసుకురావడంతో సరి పెట్టాలని కటోవీస్లో నిర్ణయించారు. అసలు దేశాలన్నీ తమ తమ కర్బన ఉద్గారాల స్థాయిపై పార దర్శకంగా వివరాలందిస్తాయా, అలా ఇవ్వకపోతే విధించే పెనాల్టీలేమిటన్న సందేహాలున్నాయి. కానీ సదస్సు ఈ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అమెరికా అడ్డం తిరగడాన్ని సాకుగా తీసుకుని కొన్ని దేశాలు సదస్సులో స్వరం మార్చాయి. పర్యావరణానికి కలిగే ముప్పు వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొనవలసి వస్తుందో మన దేశంతోసహా అందరికీ ఇప్పుడు అనుభవపూర్వకంగా అర్ధమైంది. కటోవీస్ సదస్సుకు ముందు కొన్ని ఆందోళనకర పరిణామాలు ఏర్పడిన మాట వాస్తవమే అయినా మూడేళ్లనాటి పారిస్ వాతావ రణ ఒప్పందాన్ని అమలు చేయడం విషయంలో మెజారిటీ దేశాలు గట్టి సంకల్పంతో ఉన్నాయి. అయినప్పటికీ నిబంధనల రూపకల్పనలో ఇది ప్రతిబింబించకపోవడం నిరాశ కలిగిస్తుంది. ముప్పు ముంచుకొస్తున్నదని తెలిసినా ఉదాసీనత ప్రదర్శించడం క్షంతవ్యం కాదు. -
గొప్ప ముందడుగు
పారిస్ ఒప్పందంపై వివిధ దేశాధినేతలు పారిస్: భూతాపోన్నతిని రెండు డిగ్రీల లోపునకు పరిమితం చేసేందుకు కుదుర్చుకున్న వాతావరణ ఒప్పందం గొప్ప ముందడుగు అని ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా వివిధ దేశాధినేతలు పేర్కొన్నారు. ఈ ఒప్పందం దిశగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. అయితే పర్యావరణవేత్తల నుంచి మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పారిస్లో జరిగిన వాతావరణ సదస్సులో అంతర్జాతీయంగా చట్టబద్ధమైన ఒప్పందం కుదరడం తెలిసిందే. ‘దేశాలన్నీ కలసి ముందుకెళితే ఏం సాధించగలమో ఈ ఒప్పందం రుజువు చేస్తోంది. భూమిని రక్షించుకునేందుకు ఉన్న మంచి అవకాశం ఇది. ప్రపంచానికి ఇదో గొప్ప మలుపు.’ అని వైట్హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒబామా పేర్కొన్నారు. ఒప్పందం పేదరికం నిర్మూలన, అందరూ అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్కీమూన్ పేర్కొన్నారు. భూమి చరిత్రలో ఇదొక మంచి రోజు అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చెప్పారు. ఒప్పందం అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులకు మద్దతుగా నిలుస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కాగా, ఒప్పందం పూర్తి బలహీనంగా ఉందని, బాధ్యత వహించాల్సిన అభివృద్ధి చెందిన దేశాలను ఆ బాధ్యతల నుంచి తప్పించిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డెరైక్టర్ జనరల్ సునీతా నారాయణ్ విమర్శించారు. ‘పర్యావరణమే విజేత’ న్యూఢిల్లీ: పారిస్ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఇది హరిత భవిత దిశగా కుదిరిన ఒప్పందం. ఇందులో విజేతలు, పరాజితులు లేరు. పర్యావరణ న్యాయమే విజేత’ అని అభివర్ణించారు. వాతావరణ మార్పు సవాలును ప్రతీ దేశం స్వీకరించిన విధానాన్ని కొనియాడారు. ప్రపంచ దేశాల నేతల సమీకృత దార్శనికతను పారిస్ చర్చలు ప్రతిఫలించాయని ట్విటర్లో ప్రశంసించారు. ఒప్పంద తుది ముసాయిదా సిద్ధం కాగానే, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్.. మోదీకి ఫోన్ చేసి ముఖ్యాంశాలను చెప్పారని ప్రధాని కార్యాలయం తెలిపింది. హోలాండ్ వ్యవహరించిన తీరును ప్రధాని కొనియాడారంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ అరుదైన పురస్కారం
మండుటెండను లెక్కచేయని అభిమానం...!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement