-
రెప్పపాటులో ప్రమాదం.. వివాహ వేడుకకు వెళ్తుండగా..
సాక్షి, చింతకొమ్మదిన్నె (కడప): కడప నగర శివార్లలోని రింగురోడ్డుపై ఉన్న పబ్బాపురం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప డీఎస్పీ బీవీ శివారెడ్డి తెలిపిన సమాచారం మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రాజెక్టు డైరెక్టర్ రామమోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య నళిని దేవి, మెప్మా సీఈఓ సుబ్బారెడ్డి, డ్రైవర్ వెంకట రమణారెడ్డి, ఏఓ పి.సురేష్ రెడ్డిలు కడప నగరంలోని యర్రముక్కపల్లి నుంచి పులివెందులకు ఎతియోస్ కారులో వివాహ వేడుకకు బయలుదేరారు. పబ్బాపురం సమీపంలోని వంతెనపై ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి లారీని కారుపైకి రానివ్వడంతో కారు వంతెనకు ఉన్న రక్షణ గోడల మధ్య ఇరుక్కుని ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఇరుక్కు పోవడంతో వారిని వెలికి తీసేందుకు పోలీసులతో పాటు, ఫైర్ సిబ్బంది, ఆ మార్గంలో వెళుతున్న ప్రయాణికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నళిని దేవి(42) మృతి చెందారు. ఆమె అన్నమయ్య జిల్లా పీలేరులోని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈమెకు భర్త రామమోహన్రెడ్డితో పాటు కుమారుడు ఉదయ్ కుమార్రెడ్డి, కుమార్తె మహిజలు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీకేదిన్నె ఎస్ఐ భూమా అరుణ్రెడ్డి తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని చింతకొమ్మదిన్నె, కడప తహసీల్దార్లు గంగయ్య, శివరామిరెడ్డిలు పరిశీలించారు. భార్య చనిపోయిన విషయం తెలియకుండానే.. కడప కార్పొరేషన్:రామమోహన్రెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో పాటు, కుడికన్ను దెబ్బతిని మూసుకుపోయింది. కాలు కూడా విరిగింది. ప్రమాదంలో గాయపడిన ఆయనకు రిమ్స్లో ఎంఆర్ఐ స్కాన్ చేసి నడుం దగ్గర గాయాలు ఉండటంతో వైద్యులు హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. భార్య నళిని మరణించిందనే విషయం తెలియకుండానే ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సిటీ న్యూరో కేర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో మిగిలిన ముగ్గురిలో కారు డ్రైవర్ కె. వెంకట రమణారెడ్డి రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇతనికి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతను కడప నగరం బాలాజీనగర్లో నివాసం ఉంటున్నాడు. సురేష్రెడ్డి, సుబ్బారెడ్డిలను తిరుపతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్రమించిన పోలీసులు, రెస్క్యూ టీం ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సీకేదిన్నె పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం లేకపోవడంతో, వెంటనే డీఎఫ్ఓ రాం ప్రకాష్కు సమాచారం అందించారు. ఆయన వెంటనే తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని హైడ్రాలిక్ యంత్రాలతో పాటు, జేసీబీని ఉపయోగించి కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. రిమ్స్లో మిన్నంటిన రోదనలు కడప అర్బన్: రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ రామ్మోహన్రెడ్డి సతీమణి నళినీదేవి మృతి చెందారన్న విషయం తెలుసుకుని వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, వేంపల్లి, చక్రాయపేట మండలాలకు చెందిన వారంతా తరలివచ్చారు. క్యాజువాలిటీ, మార్చురీ వద్ద వారి రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రులను పరామర్శించిన నగర పాలక కమిషనర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెప్మా పీడీ రామమోహన్రెడ్డి, మెప్మా సీఈఓ సుబ్బారెడ్డి, డ్రైవర్ వెంకట రమణారెడ్డితో పాటు ఏఓ పి.సురేష్ రెడ్డిలను కడప నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ పరామర్శించారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన నళిని దేవి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొండావాండ్లపల్లెలో విషాద ఛాయలు రామాపురం: కడప సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ రామ్మోహన్ రెడ్డి సతీమణి నళినిదేవి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కొండావాండ్లపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామం ఆమె పుట్టిన ఊరు కావడంతో పాటు లక్కిరెడ్డిపల్లె వెలుగు గురుకుల పాఠశాలలో సుదీర్ఘ కాలంపాటు ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఈ విధంగా ఆమె అందరికీ సుపరిచితురాలు కావడంతో ఆమె మరణ వార్త తెలియగానే విషాదంలో మునిగిపోయారు. -
వైరల్ వీడియో: భార్యను ఎత్తలేక ఎత్తేశాడు
మ్యూజికల్ చైర్ కాంపిటేషన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాఠశాల రోజుల్లో ఈ ఆట ఆడని వారెవ్వరూ అండరూ. అయితే ఈ ఆటని కొంచెం వినూత్నంగా మార్చి.. భార్య భర్తల మధ్య పోటీ పెడితే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఆలోచనకు ఓ పెళ్లి వేడుక వేదికైంది. గేమ్ ఎంటంటే.. కుర్చీలను ఒకదానిపై ఒకటి ఎత్తుగా పెట్టి.. భార్యను పైకి ఎత్తి వాటిపై కూర్చోపెట్టాలి. అలా ఒక్కో కూర్చీని పైకి పేరుస్తూ.. ఎత్తును పెంచుకుంటూ పోవాలి. అలా ఎవరు ఎక్కువ కుర్చీలపై (ఎత్తు) భార్యను కూర్చోపెడితే ఆ జంటను విజేతగా ప్రకటిస్తారు. ఓ పెళ్లి వేడుకలో బంధువులంతా ఈ టాస్క్ను నిర్వహించగా.. దీనిలో దాదాపు నాలుగైదు జంటలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన భార్యను 17 కుర్చీలు ఎత్తుగా వేసి వాటిపై కూర్చోపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అంత ఎత్తుకు భార్యను ఎత్తలేక ఒక్కసారిగా కింద పడేశాడు. దీంతో అంత ఎత్తునుంచి కిందపడిపోయింది. ఈ ఆటనంతా అక్కడున్నవారు వీడియోలో చిత్రీకరించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
మరొకటి నేలమట్టం
సాక్షి, ముంబై: ఠాణే సమీపంలోని కల్వా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భవనం కూలిపోయింది. అయితే పెళ్లి కారణంగా కొంతమంది మేలుకుని ఉండడంతో అందులో నివసిస్తున్న వారందరికీ పెనుగండం తప్పింది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం భుసార్అలీ ప్రాంతంలో అన్నపూర్ణ అనే నాలుగు అంతస్తుల భవనం ఉంది. అందులో నివసిస్తున్న తెలంగే అనే వ్యక్తి ఇంట్లో సోమవారం ఉదయం పెళ్లి కార్యక్రమం ఉంది. దీంతో కుటుంబ సభ్యులందరూ మెలకువగా ఉన్నారు. ఇంతలో వారందరికీ ఏదో అలికిడి వినిపించింది. దీంతో కీడు శంకించిన వీరంతా ఆ భవనంలో అప్పటికి నిద్రావస్థలో ఉన్నవారిని మేలుకొలిపి నిద్రలేపి బయటకు వెళ్లాలంటూ బిగ్గరగా కేకలేశారు. దీంతో వారంతా భవనం నుంచి బయటికి వచ్చి కొద్దిదూరంలో నిలబడ్డారు. దీంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే భవనం కూలిపోవడంతో అంతా కన్నీరుమున్నీరయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement