-
ఇక కష్టమే!
వెల్లింగ్టన్ టెస్టులో భారత్ ప్రదర్శన వెలవెలబోతోంది. చూస్తుంటే ‘వన్డే’ పరిస్థితే ప్రతి రోజూ కనిపిస్తోంది. ఏ రోజుకు ఆ రోజు టీమిండియా తడబడుతూనే ఉంది. గత మూడు రోజుల్లో రెండు సార్లు బ్యాటింగ్కు దిగిన భారత్ ఇంకా ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరునే చేరలేకపోయింది. కానీ రెండో ఇన్నింగ్స్లో అప్పుడే నాలుగు టాపార్డర్ వికెట్లను కోల్పోయి కష్టాల మీద కష్టాలు తెచ్చిపెట్టుకుంది. ఇప్పుడైతే ఈ మ్యాచ్ను గెలుచుకోవడం పక్కనబెట్టి ‘డ్రా’తో కాపాడుకోలేని స్థితికి దిగజారింది. వెల్లింగ్టన్: మన ‘టాప్’ మళ్లీ కూలింది. కివీస్ పేసర్ బౌల్ట్ నిప్పులకు భారత బ్యాటింగ్ చెదిరింది. దీంతో రెండో ఇన్నింగ్స్లోనూ యేటికి ఎదురీదలేని పరిస్థితిల్లోకి దిగజారింది. వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ అదే జోరుతో టెస్టు సిరీస్లోనూ చెలరేగుతోంది. ఇప్పటిదాకా జరిగిన మూడు రోజుల ఆటనూ ఆతిథ్య జట్టే శాసించింది. తొలి టెస్టును గెలిచేందుకు పట్టుబిగిస్తోంది. భారత్ మాత్రం అటు బ్యాటింగ్లో... ఇటు బౌలింగ్లో ఎప్పటికప్పుడు నీరుగారిపోతోంది. ఇక కష్టం! గెలుపు కాదు... ‘డ్రా’ కూడా కష్టమే! టూకీగా చెప్పాలంటే... మూడో రోజు కూడా భారత్కు క్లిష్టంగానే గడిచింది. ఓవర్నైట్ స్కోరు 216/5తో ఆదివారం ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 100.2 ఓవర్లలో 348 పరుగులు చేసి ఆలౌటైంది. మిగిలిన ఐదు వికెట్లతోనే భారత్ తొలి ఇన్నింగ్స్ (165 పరుగులు)లో చేసిన స్కోరు కంటే ఎక్కువే (183 పరుగులు) చేసింది. తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంకా 39 పరుగులు వెనుకబడే ఉన్న భారత్ ప్రధాన వికెట్లను కోల్పోయింది. కోహ్లి (19), పుజారా (11), పృథ్వీ షా (14)లను బౌల్ట్ అవుట్ చేశాడు. మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీతో రాణించాడు. టెయిలెండర్ల పోరాటం... ఆట మొదలైన బంతికే న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. వాట్లింగ్ (14)ను బుమ్రా అవుట్ చేశాడు. మరో 9 పరుగుల తర్వాత సౌతీ (6) వికెట్ను ఇషాంత్ శర్మ పడేశాడు. కివీస్ స్కోరు 225/7. ఇక భారత్ పేస్ అలజడి మొదలైందని అనుకున్నారంతా! టెయిలెండర్లను అవుట్ చేయడం ఎంతసేపు... 250, 260 స్కోరుతో కివీస్ కథ ముగుస్తుందనిపించింది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. మరో వికెట్ తీసేందుకు సుదీర్ఘ పోరాటం తప్పలేదు. గ్రాండ్హోమ్ (74 బంతుల్లో 43; 5 ఫోర్లు)తో జతకలిసిన తొమ్మిదో వరుస బ్యాట్స్మన్ జేమీసన్ (45 బంతుల్లో 44; 1 ఫోర్, 4 సిక్స్లు) చకచకా పరుగులు బాదేశాడు. వన్డేను తలపించేలా జేమీసన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. షమీ బౌలింగ్లో 2, అశ్విన్ ఒకే ఓవర్లో మరో రెండు సిక్సర్లు దంచేశాడు. చూస్తుండగానే స్కోరు దూసుకెళ్లింది. ఎట్టకేలకు 300 స్కోరుకు ముందు జేమీసన్ను, 300 అయ్యాక గ్రాండ్హోమ్ను అశ్వినే పెవిలియన్ చేర్చాడు. 9 వికెట్లు పడ్డా కూడా ఆలౌట్ అయ్యేందుకు మరో 38 పరుగులు ఆగాల్సి వచ్చింది. 11వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన బౌల్ట్ (24 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీలతో హోరెత్తించాడు. చివరకు ఇషాంత్ అతన్ని అవుట్ చేయడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ 348 పరుగుల వద్ద ముగిసింది. ఇషాంత్కు 5, అశ్విన్కు 3 వికెట్లు దక్కాయి. మయాంక్ ఒక్కడే... లంచ్ తర్వాత 183 పరుగుల లోటుతో భారత్ రెండో ఇన్నింగ్స్ కష్టాలతో మొదలైంది. 8వ ఓవర్లో పృథ్వీ షా (14)ను బౌల్ట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో మయాంక్ అగర్వాల్కు పుజారా జతయ్యాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ వికెట్లు కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. కొంతవరకు ఇది ఫలించినా... రెండో వికెట్కు 51 పరుగులు జోడించాక జిడ్డుగా ఆడుతున్న పుజారాను బౌల్టే క్లీన్ బౌల్డ్ చేశాడు. 78 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోగా... ఓపెనర్కు కెప్టెన్ కోహ్లి అండగా నిలిచాడు. చక్కగా ఆడుతున్న మయాంక్ 75 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ జట్టు స్కోరు వంద పరుగులకు ముందే అతని వికెట్ కూడా పడిపోవడం భారత్ కష్టాల్ని ఒక్కసారిగా పెంచింది. ఆఖరి సెషన్ మొదలైన కాసేపటికి సౌతీ బౌలింగ్లో మయాంక్ వెనుదిరిగాడు. 96 పరుగులకే భారత్ మూ డు కీలక వికెట్లను కోల్పోయింది. ఇది చాలదన్నట్లు బౌల్ట్... కోహ్లి (19; 3 ఫోర్లు) వికెట్ పడగొట్టి భారత్ను చావుదెబ్బ తీశాడు. దీంతో ఈ సెషన్లో మరో వికెట్ పడకుండా రహానే (67 బంతుల్లో 25 బ్యాటింగ్; 4 ఫోర్లు), హనుమ విహారి (70 బంతుల్లో 15 బ్యాటింగ్; 2 ఫోర్లు) జాగ్రత్తగా ఆడారు. అబేధ్యమైన ఐదో వికెట్కు వీరిద్దరు 31 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 165; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) పంత్ (బి) ఇషాంత్ 11; బ్లన్డేల్ (బి) ఇషాంత్ 30; విలియమ్సన్ (సి) సబ్–జడేజా (బి) షమీ 89; రాస్ టేలర్ (సి) పుజారా (బి) ఇషాంత్ 44; నికోల్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 17; వాట్లింగ్ (సి) పంత్ (బి) బుమ్రా 14; గ్రాండ్హోమ్ (సి) పంత్ (బి) అశ్విన్ 43; సౌతీ (సి) షమీ (బి) ఇషాంత్ 6; జేమీసన్ (సి) విహారి (బి) అశ్విన్ 44; ఎజాజ్ పటేల్ (నాటౌట్) 4; బౌల్ట్ (సి) పంత్ (బి) ఇషాంత్ 38; ఎక్స్ట్రాలు 8; మొత్తం (100.2 ఓవర్లలో ఆలౌట్) 348. వికెట్ల పతనం: 1–26, 2–73, 3–166, 4–185, 5–207, 6–216, 7–225, 8–296, 9–310, 10–348. బౌలింగ్: బుమ్రా 26–5–88–1, ఇషాంత్ శర్మ 22.2–6–68–5, షమీ 23–2–91–1, అశ్విన్ 29–1–99–3. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లాథమ్ (బి) బౌల్ట్ 14; మయాంక్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 58; పుజారా (బి) బౌల్ట్ 11; కోహ్లి (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 19; రహానే (బ్యాటింగ్) 25; విహారి (బ్యాటింగ్) 15; ఎక్స్ట్రాలు 2; మొత్తం (65 ఓవర్లలో 4 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–27, 2–78, 3–96, 4–113. బౌలింగ్: సౌతీ 15–5–41–1, బౌల్ట్ 16–6–27–3, గ్రాండ్హోమ్ 14–5–25–0, జేమీసన్ 17–7–33–0, ఎజాజ్ పటేల్ 3–0–18–0. బౌల్ట్ -
‘టెస్టు’ సమయం
ఉపఖండం బయట ఇతర దేశాల్లో పోలిస్తే న్యూజిలాండ్లోనే భారత జట్టు తక్కువ సంఖ్యలో టెస్టు క్రికెట్ ఆడింది. 1967 నుంచి 2014 వరకు 9 టెస్టు సిరీస్లలో పాల్గొంటే ఆడిన మ్యాచ్లు 23 మాత్రమే! గత ఏడాది కివీస్ పర్యటనలో కూడా టెస్టులు ఆడాల్సి ఉండగా... తెల్లవారుజామున భారత అభిమానులు టెస్టులు చూడరంటూ ప్రసారకర్తలు తెచ్చిన ఒత్తిడితో షెడ్యూల్ నుంచి టెస్టులను తొలగించి వన్డేలు, టి20లకే పరిమితం చేశారు. ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగం కావడంతో తప్పనిసరిగా ఆడాల్సిన స్థితిలో భారత జట్టు ఐదు రోజుల ఫార్మాట్కు సన్నద్ధమైంది. స్వింగ్కు బాగా అనుకూలించే కివీస్ పిచ్లపై టీమిండియాకు ఎర్రబంతితో అతి పెద్ద సవాల్ ఎదురవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్కు రేపటితో తెర లేవనుంది. వెల్లింగ్టన్: టి20, వన్డే సిరీస్లను సమంగా పంచుకున్న తర్వాత భారత్, న్యూజిలాండ్ ఇప్పుడు సాంప్రదాయ ఫార్మాట్కు సై అంటున్నాయి. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రేపటి నుంచి (శుక్రవారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాల తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టు బరిలోకి దిగుతుండగా... ఇటీవలే ఆస్ట్రేలియా చేతిలో క్లీన్స్వీప్నకు గురైన కివీస్ స్వదేశంలో తమ రాత మార్చుకోవాలని పట్టుదలగా ఉంది. కోహ్లి నాయకత్వంలో న్యూజిలాండ్ గడ్డపై భారత్ టెస్టులు ఆడుతుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. విహారికి చోటు! టీమిండియా తమ ఆఖరి టెస్టును కోల్కతాలో బంగ్లాదేశ్పై ఆడింది. అక్కడితో పోలిస్తే వాతావరణం, పిచ్ పరిస్థితులు న్యూజిలాండ్లో పూర్తిగా భిన్నం కాబట్టి స్వల్ప మార్పులు ఖాయం. రోహిత్ శర్మ గాయంతో దూరం కావడంతో మయాంక్కు తోడుగా పృథ్వీ షా ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది. బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ ఇదే సంకేతాన్నిచ్చింది. కాబట్టి శుబ్మన్ గిల్ టెస్టు అరంగేట్రం కోసం కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. అయితే ప్రతికూల వాతావరణంలో కివీస్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొని ఓపెనర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. జట్టుకు శుభారంభం దక్కకపోతే ఆ తర్వాత అది మ్యాచ్పై ప్రభావం చూపించవచ్చు. సొంతగడ్డపై టీమ్ మేనేజ్మెంట్ ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్నే ఆడించేది. కానీ కివీస్లాంటి చోట లోతైన బ్యాటింగ్ అవసరం కాబట్టి ఆరో స్థానంలో కూడా రెగ్యులర్ బ్యాట్స్మన్ను ఆడించక తప్పని పరిస్థితి. అందుకోసం ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి సిద్ధంగా ఉన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో కఠిన పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి అతను సాధించిన సెంచరీ కూడా విహారికి అనుకూలంగా మారింది. బౌలింగ్లో ముగ్గురు పేసర్లకే మొగ్గు చూపవచ్చు. గత రెండున్నరేళ్లలో ఇదే వ్యూహంతో విదేశాల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేశామంటూ కోహ్లి వ్యాఖ్యానించడం అతని ఆలోచనను స్పష్టం చేసింది. గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్స్లో బౌలింగ్ చేశాడు. కాబట్టి అతనితో పాటు షమీ, బుమ్రాలు పేస్ భారం మోస్తారు. స్పిన్నర్గా మాత్రం ఒకరికే చోటు ఉంది. అశ్విన్ లేదా జడేజాలలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిరం. 2013 నుంచి విదేశాల్లో ఇద్దరి రికార్డు దాదాపు ఒకేలా ఉంది. కీపర్గా సందేహం లేకుండా వృద్ధిమాన్ సాహానే ఉంటాడు కాబట్టి రిషభ్ పంత్కు నిరాశ తప్పదు. 2014లో ఇక్కడ టెస్టులు ఆడిన అనుభవం ప్రస్తుత జట్టులో కోహ్లి, పుజారా, రహానే, జడేజా, ఇషాంత్, షమీలకు ఉంది. కాబట్టి పరిస్థితులు పూర్తిగా కొత్త కాదు. ఆస్ట్రేలియాలో గెలిచినట్లుగా న్యూజిలాండ్లోనూ సిరీస్ విజయం సాధిస్తే నాయకుడిగా కోహ్లి ఘనతల్లో మరొకటి చేరుతుంది. ► న్యూజిలాండ్ గడ్డపై 9 టెస్టు సిరీస్లు ఆడిన భారత్ 2 గెలిచి, 5 ఓడింది. మరో 2 డ్రాగా ముగిశాయి. 2014 సిరీస్లో న్యూజిలాండ్ 1–0తో గెలిచింది. ► భారత్ గెలిచిన టెస్టుల సంఖ్య. మొత్తం 23 ఆడగా... కివీస్ 8 మ్యాచ్లలో విజయం సాధించింది. మిగిలిన 10 ‘డ్రా’గా ముగిశాయి. ► 30 భారత్లో 2016లో జరిగిన సిరీస్లో చివరిసారి ఈ రెండు జట్లు తలపడగా... భారత్ 3–0తో క్లీన్స్వీప్ చేసింది వాగ్నర్ అవుట్! తొలి టెస్టుకు ముందే కివీస్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేస్ బౌలర్ నీల్ వాగ్నర్ వ్యక్తిగత కారణాలతో మ్యాచ్కు దూరమయ్యాడు. భార్య ప్రసవం కారణంగా వాగ్నర్ వెల్లింగ్టన్కు రావడం లేదని కివీస్ బోర్డు ప్రకటించింది. గత కొన్నేళ్లలో బౌల్ట్, సౌతీలతో పోలిస్తే వాగ్నర్ అత్యంత ప్రమాదకర కివీస్ బౌలర్గా మారాడు. కీలకమైన మ్యాచ్కు ముందు అతను దూరం కావడం జట్టుపై ప్రభావం చూపడం ఖాయం. ఇది సీనియర్లు బౌల్ట్, సౌతీలకు అదనపు భారం కానుంది. వాగ్నర్ స్థానంలో హెన్రీని తీసుకున్నారు. అయితే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అయిన హెన్రీ టెస్టు రికార్డు మరీ పేలవంగా ఉంది. సొంతగడ్డపైనే 6 టెస్టులో 12 వికెట్లు తీయగా సగటు 50కు పైగా ఉంది! అయితే మ్యాచ్ ముందు రోజు పిచ్ను బట్టి చూస్తే కివీస్ నలుగురు పేసర్లతో దిగాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. కైలీ జేమీసన్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేయవచ్చు. ఏకైక స్పిన్నర్ ఎజాజ్ పటేల్కు తుది జట్టులో స్థానం కష్టమే. ఆస్ట్రేలియాతో సిరీస్లో ఇటీవల న్యూజిలాండ్ బ్యాటింగ్ విఫలమైంది. ఇప్పుడు దానిని చక్కబెట్టుకునేందుకు ఆ జట్టుకు అవకాశం వచ్చింది. లాథమ్, బ్లన్డెల్ ఓపెనర్లుగా శుభారంభం ఇవ్వగల సమర్థులు. మూడు, నాలుగు స్థానాల్లో విలియమ్సన్, రాస్ టేలర్ల అనుభవమే జట్టుకు కీలకం. వీరిద్దరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్కు ఇబ్బందులు తప్పవు. వికెట్ కీపర్ వాట్లింగ్ బ్యాట్స్మన్గా కూడా తన సత్తా ఏమిటో ఇటీవలే ఇంగ్లండ్పై అద్భుత డబుల్ సెంచరీతో చూపించాడు. చివరి వన్డేలో భారత్ ఓటమికి కారణమైన గ్రాండ్హోమ్ ఆల్రౌండర్గా సత్తా చాటగలడు. మొత్తంగా కివీస్ బ్యాటింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. భారత పేస్ త్రయాన్ని వీరు సమర్థంగా ఎదుర్కోగలిగితే ఆపై జట్టును ఆపడం కోహ్లి బృందానికి కష్టం కావచ్చు. తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, విహారి, అశ్విన్/రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), లాథమ్, బ్లన్డెల్, రాస్ టేలర్, నికోల్స్, వాట్లింగ్, గ్రాండ్హోమ్, సౌతీ, జేమీసన్, బౌల్ట్, హెన్రీ. పిచ్, వాతావరణం బేసిన్ రిజర్వ్ మైదానం పిచ్పై బుధవారం 15–18 మిల్లీ మీటర్ల మందం పచ్చిక కనిపించింది. మ్యాచ్ రోజు కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కాబట్టి పేసర్లకు బాగా అనుకూలం. పైగా ఇది ఓపెన్ గ్రౌండ్ కావడం వల్ల 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు స్వింగ్ను శాసిస్తాయి. బ్యాట్స్మెన్ ఆరంభ పరీక్షను అధిగమించాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ను ఎంచుకోవచ్చు. వర్షం సమస్య లేదు. మరో మూడేళ్లు ఇంతే జోరుగా... గత ఎనిమిదేళ్లుగా నేను మ్యాచ్లతో పాటు ప్రయాణాలు, ప్రాక్టీస్లు కలుపుకుంటే సంవత్సరంలో దాదాపు 300 రోజులు క్రికెట్ ఆడుతున్నాను. అయినా ఎక్కడా దూకుడు, తీవ్రత తగ్గదు. ఇక కెప్టెన్గా అదనపు ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ఖాయం. ఇదే జోరులో నేను అన్ని ఫార్మాట్లలో కనీసం వచ్చే మూడేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడగలను. మరిన్ని కఠిన సవాళ్లకు సిద్ధంగా ఉన్నా. శరీరం అలసిపోవడం సహజమే కానీ అప్పుడప్పుడు తీసుకునే విరామాల వల్ల నేను మళ్లీ కోలుకోగలుగుతున్నా. గతంలో చెప్పినట్లు నా దృష్టిలో టెస్టు ఫార్మాటే అన్నింటికంటే అత్యుత్తమం. ఐసీసీ టోర్నీలపరంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్న టెస్టు చాంపియన్షిప్కే నేను అగ్రస్థానం ఇస్తా. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ వెల్లింగ్టన్లో ఇండియన్ హై కమిషన్ ఇచ్చిన విందులో... -
మెకల్లమ్ ద్విశతకం; కివీస్కు భారీ ఆధిక్యం
వెల్లింగ్టన్: భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టుబిగిచింది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ డబుల్ సెంచరీ, వాట్లింగ్ సెంచరీలతో చెలరేగడంతో కివీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 252/5 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన కివీస్ మ్యాచ్ ముగిసే సమయానికి 571/6 స్కోరు చేసింది. దీంతో న్యూజిలాండ్కు 325 పరుగుల ఆధిక్యం లభించింది. మెకల్లమ్, వాట్లింగ్ ఆరో వికెట్కు 355 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో కివీస్ కోలుకుంది. వాట్లింగ్(124)ను మహ్మద్ షమీ అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత మరో వికెట్ పడకుండా కివీస్ జాగ్రత్త పడింది. మెకల్లమ్ ట్రిఫుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. అయితే ట్రిఫుల్ సెంచరీ చేసే వరకు ఆగుతాడా లేక మ్యాచ్ ను ముందే డిక్లేర్ చేస్తాడా అనేది మంగళవారం తేలుతుంది. మెకల్లమ్ 281, నిషామ్ 67 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. చివరి రోజు ఏదైనా సంచలనం జరిగితే తప్పా మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేదు. తొలి ఇన్నింగ్స్లో కివీస్ 192, భారత్ 438 పరుగులు చేశాయి.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!?
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
Advertisement