-
పతంజలి యోగపీఠ్, భారత ఆర్మీ ఎంవోయూ
న్యూఢిల్లీ: పతంజలి ఇన్స్టిట్యూషన్స్, భారత ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు. అలాగే, భారత ఆర్మీలో విభిన్నమైన ఐటీ అప్లికేషన్లు, ఆటోమేషన్పై పని చేయడం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. సైనికుల ఆరోగ్యం కోసం యోగ, ఆయుర్వేద ఔషధాలపై పతంజలి పరిశోధన నిర్వహించనుంది. మరోవైపు, విశ్రాంత సైనిక ఉద్యోగులను నియమించుకునేందుకు పతంజలి, దాని అనుబంధ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. -
ప్రజల చెంతకే వైద్య సేవలు అందుతున్నాయి: ఎమ్మెల్యే శ్రీనివాసరావు
-
కొనుగోళ్లపై జైడస్ దూకుడు
న్యూఢిల్లీ: విస్తరణకు మద్దతుగా.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఇతర కంపెనీలను సొంతం చేసుకోవాలని కన్జూమర్ గూడ్స్ కంపెనీ జైడస్ వెల్నెస్ ప్రణాళికలు వేసింది. పోర్ట్ఫోలియోను విభిన్న విభాగాలకు విస్తరించే యోచనలో ఉన్న కంపెనీ కొత్త ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. మరిన్ని ప్రాంతాలకు అమ్మకాలు విస్తరించడం ద్వారా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నట్లు తాజా వార్షిక నివేదికలో తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ఇతర కంపెనీల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. కంపెనీ కొనుగోళ్ల ద్వారానే గ్లూకోన్–డి, కాంప్లాన్, నైసిల్ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను సొంతం చేసుకోవడం గమనార్హం! కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, వృద్ధి అవకాశాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను చేజిక్కించుకునేందుకు చూస్తున్నట్లు జైడస్ వెల్నెస్ వెల్లడించింది. కంపెనీ రూ. 4,595 కోట్లను వెచ్చించి హీంజ్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీ దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా ప్రాంతాలలో విస్తరించే యోచనలో ఉంది. -
ఉద్యోగులకు బంపరాఫర్,ఫుల్ శాలరీ ఇస్తాం..365 రోజులు సెలవులు తీసుకోండి!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ స్టార్టప్ 'మీ షో' ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కోసం కొత్త లీవ్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉద్యోగులు 365 రోజుల సెలవులు తీసుకోవచ్చు. అంతేకాదు తీసుకున్న సెలవులకు ఫుల్ శాలరీ ఇస్తామని ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ పట్ల ఉద్యోగులు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆయా స్టార్టప్లు నష్టాల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. కానీ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మీషో మాత్రం ఉద్యోగుల సంరక్షణే ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. 'మీ కేర్' పేరుతో కొత్త లీవ్ పాలసీని అమలు చేసింది. ఈ ఫుల్ లీవ్ పాలసీలో అర్హులైన ఉద్యోగులకు తీసుకున్న సెలవులకు ఫుల్ శాలరీ ఇస్తున్నట్లు తెలిపింది. ఫుల్ శాలరీ మీ షోలో పనిచేస్తున్న ఉద్యోగి అనారోగ్యానికి గురై దీర్ఘ కాలిక సెలవు తీసుకోవచ్చు.సెలవు తీసుకుంటే ఫుల్ శాలరీ ఇవ్వడంతో పాటు అదనంగా ఆర్ధిక సాయం, ఇన్స్యూరెన్స్, ఇతర మెడికల్ అలెవన్స్లను అందిస్తుంది. అదే ఉద్యోగి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే..సదరు ఉద్యోగికి మూడు నెలల పాటు జీతంలో 25శాతం చెల్లిస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కాకుండా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల సెలవు పెడితే మాత్రం శాలరీ పే చేయమని స్పష్టం చేసింది. మా లక్ష్యం అదే మీషోలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కొత్త లీవ్ పాలసీని అందుబాటులోకి తెచ్చాం. ఉద్యోగి, లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే వారి సంరక్షణ కోసం సెలవులు తీసుకునేందుకు వెనకాడకూడదు'అని మీషో చీఫ్ రిసోర్స్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే తాము తెచ్చిన ఈ పాలసీ ఎక్కువ మంది ఉద్యోగులు ఉపయోగించుకోకపోవచ్చు. కానీ ఈ పాలసీ ప్రభావం సంస్థపై చూపుతుందని అన్నారు. చదవండి👉 అతిపెద్ద సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్ ‘మీ షో యాప్’ తెర వెనుక కథ!! -
అభివృద్ధికి ఆస్కారం
► ఫలించిన ప్రజాప్రతినిధుల డిమాండ్ ► ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నిధులు రూ.1.5కోట్ల నుంచి రూ.3కోట్లకు పెంపు ► గ్రామ సమస్యల పరిష్కారానికి మరింత వెసులుబాటు ► ఈ ఆర్థిక సంవత్సరంనుంచే అమలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నియోజకవర్గాల అభివృద్ధి నిధులు పెంచాలని కొంతకాలంగా పార్టీలరహితంగా ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్ ఫలించడంతో మరికొన్ని సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటాలో అభివృద్ధి నిధులను రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో జిల్లాలో ఉన్న 14మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీ కోటా నిధులు రెట్టింపు కానున్నాయి. ఇదివరకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు గ్రామాల కనీస అవసరాలు తీర్చడానికి సరిపోయే పరిస్థితి లేదు. గ్రామాల్లో ప్రజలు చెప్పే ప్రధాన సమస్యను పరిష్కరించాలనుకున్నా.. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక నిధులు పెద్ద మొత్తంలో లేకపోవడంతో సమస్యలను ప్రభుత్వానికి నివేదించి నిధులు కేటాయింపు కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది. సీఎం ప్రకటనతో అభివృద్ధి నిధులపై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. నిధులున్నా.. ఖర్చుచేయని ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధులను కొందరు ఖర్చు చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తిచేసేలా పర్యవేక్షించాల్సిన ఎమ్మెల్యేల్లో కొందరు ఏడాది గడిచినా పూర్తిగా తమ నిధులను ఖర్చుచేయకపోవడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తాగునీటికే ఎక్కువ కేటాయింపులు ఇప్పటికే పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తమ అభివృద్ధి నిధులను అత్యధికంగా జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికే వెచ్చిస్తున్నారు. కొత్తగా విడుదల కానున్న నిధులను సైతం అత్యధికంగా తాగునీటి ఎద్దడి తీర్చేందుకు ఖర్చు చేయనున్నారు. అలాగే రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులపై కూడా దృష్టి సారించారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు లేకపోవడం, జిల్లా పరిషత్ నుంచి సైతం వివిధ పథకాల ద్వారా నిధులొచ్చే అవకాశం పూర్తిగా తగ్గిపోవడంతో గ్రామాల్లో ఏ అభివృద్ధి పనిచేయాలన్నా ప్రభుత్వంనుంచి నిధుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల అభివృద్ధి నిధులు వస్తే గ్రామస్థాయిలో తాగునీటి, శానిటేషన్ వంటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభించింది. మూడు, నాలుగు విడతలుగా విడుదల ఏడాదికి జిల్లాలో 14మంది ఎమ్మెల్యేలకు రూ.3కోట్ల చొప్పున రూ.42కోట్లు, నలుగురు ఎమ్మెల్సీలకు కలిపి రూ.12కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్సీలు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆ సభ్యులు ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైనా తమ అభివృద్ధి నిధులను వినియోగించుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కూచకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తమ అభివృద్ధి నిధులను జిల్లాలో ఎక్కడ అవసరం ఉన్నా వినియోగించుకొనే అవకాశం ఉంది. ఈ అభివృద్ధి నిధులను ప్రభుత్వం ఏడాదిలో మూడు లేదా నాలుగు విడతలుగా విడుదల చేయనుంది. ప్రజాప్రతినిధులు తమ అభివృద్ధి నిధుల ద్వారా తాము గుర్తించిన పనులను పూర్తిచేయాలని జిల్లా ప్రణాళిక అధికారి, కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. వాటికి అయ్యే ఖర్చును సంబంధిత అధికారులు నిర్ధారించి ఆయా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధుల నుంచి వినియోగించి, పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement