-
చంద్రబాబు కుట్రలు ఫలించవు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరో మూడు సభలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో ఇంకో సభ ఉంటుందన్నారు సీఎం జగన్ కార్యకర్తలను స్వయంగా కలిసి ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది సీఎం జగన్కి రెండు కళ్లు లాంటివి. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు విజన్ కేవలం తన వారిని అభివృద్ధి చేసుకోవటమే’’ అంటూ వైవీ దుయ్యబట్టారు. ‘‘అమరావతి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. కచ్చితంగా మూడు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకుంటాం. చంద్రబాబు చేసే కుట్రలు ఫలించవు. మా ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నారు’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్ -
టీడీపీలో ఏం జరుగుతోంది.. రగిలిపోతున్న నేతలు!
తెలుగుదేశం పార్టీలో దళిత నేతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎమ్మెల్యే సీటు అడిగితే అవమానాలు ఎదురవుతున్నాయి. ఎంత పెద్ద సీనియర్ లీడర్ అయినా చంద్రబాబు కాళ్లు పట్టుకోవాల్సిందే అంటున్నారు. కమ్మనేతల కనుసన్నల్లో మెలిగితేనే సీటు ఇస్తామంటున్నారట. చంద్రబాబు, లోకేష్ అసలు సీనియర్ నేతలకు కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా మండిపడుతున్నారు. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది?.. తెలుగుదేశం పార్టీలో సీనియర్ దళిత నేతలు పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు సీట్లు అడిగితే సీటివ్వకపోగా, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా.. అవమానాలకు గురిచేస్తున్నారని మదనపడుతున్నారు. మాజీ దళిత మంత్రులతో కాళ్లు మొక్కించుకుని చంద్రబాబు దళితులను హీనాతి హీనంగా చూస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహార్ ఎన్నికల్లో తన సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకుని వేడుకోవాల్సి వచ్చింది. చంద్రబాబుతో మాట్లాడటానికి ఎన్ని సార్లు అపాయింట్మెంట్ కోరినా జవహర్కి దక్కలేదు. చివరికి ఇటీవల విజయవాడ వచ్చిన చంద్రబాబుకి ఎయిర్పోర్ట్లో ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కారు జవహార్. జవహర్ పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు సీటు ఆశిస్తున్నారు. గతంలో అక్కడి నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. జవహార్కి కొవ్వూరు సీటు రాకుండా అక్కడి కమ్మ నేతలు అడ్డుకుంటున్నారు. కమ్మ నాయకులకు అణిగిమణిగి ఉన్నవారికే ఇక్కడ సీటు ఇప్పిస్తామని టీడీపీ నేతలు ఓపెన్గానే చెబుతున్నారు. మాజీ మంత్రి అయినా సరే, దళితుడిని కాబట్టి కాళ్లు పట్టుకుని అడిగినా కూడా సీటు ఇవ్వకుండా అవమానిస్తున్నారని జవహర్ తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఓ వైపు జవహర్ కాళ్లు పట్టుకుని మొక్కిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మరో దళిత మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఇటీవల ఇదే అంశాన్ని బయటపెట్టారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గం నాయకులు దళితుల మీద పెత్తనం చేస్తారని, చంద్రబాబు కేవలం తన సామాజికవర్గ నేతలకే మద్దతిస్తారని మండిపడ్డారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత పరిస్థితి కూడా అంతే. పీతల సుజాత చింతలపూడి సీటు ఆశిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమెకు ఇప్పుడు చింతలపూడి సీటు రాకుండా మళ్లీ కమ్మ నేతలే అడ్డుపడుతున్నారని ఆమె వర్గీయులు రగిలిపోతున్నారు. దళితులకు ఎందుకు రాజకీయాలని ఓపెన్గానే చెప్పిన చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తన చెప్పు చేతుల్లో ఉండేవాళ్లే కావాలని పట్టుబడుతున్నారు. పీతల సుజాత తన మాట విననందుకే టిక్కెట్ రాకుండా చింతమనేని అడ్డుకున్నాడు. అలానే ఈ జిల్లాలోని మరో కమ్మనేత మాగంటి బాబు కూడా ఈ నియోజకవర్గంలో దళిత అభ్యర్థి ఎవరైనా తాము చెప్పిన చోట సంతకాలు పెట్టేవాళ్లై ఉండాలని ఓపెన్గానే కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు కమ్మ నేతలు చింతలపూడిలో దళిత అభ్యర్థి తమ చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తే కావాలని పట్టుబడుతున్నారు. ఇందుకోసం ప్రకాశం జిల్లా నుండి సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ సోదరుడు అనిల్ను తెరపైకి తీసుకొచ్చారు. అనిల్ కుమార్ అయితే కమ్మ సామాజికవర్గం చెప్పుచేతల్లో ఉంటారని ఆయన పేరును చంద్రబాబుకి సూచిస్తున్నారు. అసలు చింతలపూడితో ఎలాంటి సంబంధం లేని చింతమనేని ప్రభాకర్ ఇక్కడి దళిత అభ్యర్థిపై పెత్తనం సాగించాలని చూడటం ఏంటని టీడీపీ దళిత నేతలు రగిలిపోతున్నారు. మాజీ మంత్రి పీతల సుజాతకి టిక్కెట్ విషయంలో చంద్రబాబు, లోకేష్ స్పష్టత ఇవ్వడం లేదు. డబ్బున్న వాళ్లు, కమ్మ సామాజికవర్గం చెప్పు చేతల్లో ఉన్న వాళ్లయితేనే చంద్రబాబు, లోకేష్ సీట్లు ఇస్తామంటున్నారని దళిత నేతలు ఆగ్రహిస్తున్నారు. గోపాలపురంలో కూడా అభ్యర్థి విషయంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. గోపాలపురంలో టీడీపీ ఇన్ఛార్జ్గా మద్దిపాటి వెంకటరాజుని గతంలో చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ ఆఫీస్లో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్గా గతంలో పనిచేసిన మద్దిపాటి వెంకటరాజు చంద్రబాబు, లోకేష్ దగ్గర పైరవీ చేసి ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకున్నారు. తానైతే కమ్మనేతల చెప్పుచేతల్లో ఉంటానని సీటు తనకే ఇవ్వాలని అడుగుతున్నారట. అయితే, ఈ నియోజకవర్గంలో మద్దిపాటి వెంకటరాజు ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుండి టీడీపీ నాయకులంతా తిరుగుబాటు ప్రకటించారు. ఇటీవలే పెద్ద ఎత్తున మంగళగిరికి ర్యాలీ చేసి వెంకటరాజుకి సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఇక్కడున్న ముప్పిడి వెంకటేశ్వరరావు సీటు తనకే ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు మరో కమ్మ నేత, మాజీ జడ్పీ ఛైర్మన్ బాపిరాజు.. గోపాలపురం సీటు తాను చెప్పిన వారికి ఇవ్వాలని, వెంకటరాజుకి ఇవ్వడానికి వీల్లేదని పట్టుబడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఫుల్ జోష్ మీదుంది. కానీ, టీడీపీ దళిత నేతలకు మాత్రం కాళ్లు పట్టుకుంటున్నా కనికరించకుండా అవమానిస్తున్నారని దళిత నేతలు రగిలిపోతున్నారు. -
ఆ సీటు టీడీపీకా.. జనసేనకా?
ఏపీలో కలిసి పోటీచేస్తామని ప్రకటించుకున్న టీడీపీ, జనసేన మధ్య అప్పుడే వివాదాలు, తగాదాలు మొదలయ్యాయి. రెండు పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేస్తాయనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాని ఇరు పార్టీల నాయకుల మధ్య రచ్చ అయితే స్టార్ట్ అయింది. అనేక జిల్లాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు అభ్యర్ధులే కనిపించడంలేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎవరికి వారే పోటీలో ఉన్నామంటూ ప్రకటనలు చేసుకుంటున్నారు. టిక్కెట్ తమదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సైకిల్, గ్లాస్ పార్టీల టిక్కెట్ల లొల్లి ఏ రేంజ్లో ఉందో చూద్దాం. రానున్న ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య టిక్కెట్లు ప్రకటించకముందే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పలు జిల్లాలలో తెలుగుదేశం, జనసేన నేతలు టిక్కెట్లు తమకే ఇస్తున్నారంటూ చేసుకుంటున్న ప్రచారం ఆయా రెండు పార్టీల మధ్య కుంపట్లు రగులుతున్నాయి. విశాఖ నుంచి కృష్ణా వరకు ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఈ రచ్చ మరీ ఎక్కువైంది. విశాఖ తూర్పు నుంచి మళ్లీ పోటీ చేస్తున్నట్లు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు ప్రకటించుకోగా...ఇదే స్ధానంపై ఆశలు పెట్టుకుని వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్కి ఇపుడు టిక్కెట్ వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్ధితి ఏర్పడింది. విశాఖ తూర్పులో కాకపోయినా భీమిలి నుంచైనా వస్తుందనుకుంటే..అక్కడ టీడీపీ తరపున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగుతున్నట్లు తన అనుచరులకి చెప్పారంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ జిల్లాలోని చోడవరం లేదా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలని ముందుగా భావించారట. కానీ అక్కడ పరిస్ధితులు అనుకూలంగా లేకపోవడంతో భీమిలి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్సీ వంశీ పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అలాగే పెందుర్తి సీటు విషయంలోనూ రెండు పార్టీల మధ్య వివాదాలు తారాస్ధాయికి చేరాయి. పెందుర్తి సీటు తనదేనని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చెప్పుకుంటుండగా... పెందుర్తి హామీపైనే జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు సైతం టిక్కెట్ తనదే అని ప్రకటించుకుంటున్నారు. ఇద్దరి మధ్య టిక్కెట్ వార్ రోజురోజుకి పెరుగుతోంది. ఇక గాజువాకలోనూ ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీను గాజువాక సీటు తనదేనని ప్రచారం చేసుకుంటుండగా...జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు కోన తాతారావు సైతం తాను పోటీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పాయకరావుపేటలో అయితే రెండు పార్టీల మధ్య యుద్దమే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పాయకరావుపేట టీడీపీ సీటు తనదేనని చెప్పుకుంటుండగా...అనితకి సీటు ఇస్తే తామెవ్వరమూ మద్దతివ్వబోమని జనసేన నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. జనసేనకే పాయకరావుపేట సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడికి అనకాపల్లి టిక్కెట్ ఆశిస్తూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ ల పరిస్ధితి కూడా ఇలాగే ఉంది. అనకాపల్లి టిక్కెట్ కన్ ఫర్మ్ అని చెప్పుకుంటున్న తరుణంలో ఆయన రాజకీయ శత్రువు కొణతాల రామకృష్ణ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. కొణతాలకి అనకాపల్లి టిక్కెట్ ఇస్తామని చెప్పిన తర్వాతే ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారంటున్నారు. ఈ సీటు జనసేనకి కేటాయిస్తే టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఏం చేస్తారనే చర్చ ఇపుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దీంతో ఇపుడు ఈ అనకాపల్లి సీటు టీడీపీకా.. జనసేనకా అన్న మీమాంసలో అధినేతలు ఉన్నారట. కాకినాడ సీటుపై జనసేన నేత ముత్తా శశిధర్ గట్టిగానే పట్టుబడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తనకి హామీ ఇచ్చారని...కాకినాడ సీటు తనదేనని ముత్తా శశిధర్ చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కూడా కాకినాడ సీటు తనదేనని చెప్పుకుంటున్నారు. ఇక పిఠాపురం సీటు తనదేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించుకుంటుండగా...ఆ సీటు కోసం జనసేన తరపున టీ టైం అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్ సీటు కోసం కూడా టీడీపీ-జనసేన మధ్య బహిరంగంగానే మాటల యుద్దం నడుస్తోంది. ఇక్కడ నుంచి మరోసారి పోటీకోసం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిద్దపడుతుండగా ..జనసేన నుంచి పోటీకి కందుల దుర్గేష్ ప్రయత్నిస్తున్నారు. కందుల దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పట్టుబడుతున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నుంచి టీడీపీ తరపున మరోసారి పోటీకి మాజీ డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప చూస్తుండగా...ఇదే సీటు కోసం జనసేన నేత తుమ్ముల రామస్వామి అలియాస్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు సీటు కోసం టీడీపీ, జనసేనల మధ్య వార్ కొనసాగుతోంది... ఇక్కడ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నట్లుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చెప్తుండగా... జనసేన తరపున ఇదే టిక్కెట్ ను బొంతు రాజేశ్వరరావు ఆశిస్తున్నారు. ఇక ముమ్మిడివరంలో దాట్ల బుచ్చిబాబు టీడీపీ టిక్కెట్ రేసులో ఉంటే జనసేన తరపున పితాని బాలకృష్ణ ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో అయితే సీటు కోసం అన్నదమ్ములే సవాళ్లు విసురుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టిక్కెట్ రేసులో ఉంటే ఆయన సొంత తమ్ముడు బండారు శ్రీనివాస్ జనసేన టిక్కెట్ రేసులో ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఇద్దరూ ఆయా పార్టీల తరపున పోటీ చేశారు. సోదరులిద్దరి మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరుకోవడంతో ఇపుడు టిక్కెట్ ఏ పార్టీకి ఇచ్చినా అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఇరు పార్టీల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులు ఎవరంటూ వెతుక్కుంటున్న టీడీపీ, జనసేన పార్టీలకు...కొన్ని స్థానాల్లో మాత్రం సీట్ల కోసం రెండు పార్టీల మధ్య రచ్చ ఆసక్తికరంగా సాగుతోంది. -
రేపు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు సోమవారం హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. రేపు(సోమవారం) ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకానున్నారు. అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ముందుకు వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరై, వివరణ ఇవ్వనున్నారు. ఇక.. వైఎస్సార్సీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు చేసిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై విచారణకు 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. చదవండి: గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్! -
పొత్తులపై స్పందించిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య లేఖ రాశారు. మండపేట, అరకుకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం సరికాదన్నారు. రాజోలు, రాజానగరం సీట్లను పవన్ కల్యాణ్ ప్రకటించినప్పటికీ జనసేన కార్యకర్తలు సంతృప్తిగా లేరన్నారు. ‘‘జనసేనకు 50 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు కేటాయించాలి. 20-30 సీట్లు ఇస్తే పవన్ ఆశయాలకు భంగం కలుగుతుంది. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోంది. 2019లో ఓడిపోయిన జనసేన నేతలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తే నిరాశపరిచినట్టేనని మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. కాగా, యాచించే స్థితిని పవన్ నుంచి జన సైనికులు కోరుకోవట్లేదని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ గతంలో కూడా లేఖ ద్వారా చురకలంటించారాయన.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement