-
భర్త వేధింపులు తాళలేక.. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
పోచారం: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా, మాదారం గ్రామానికి చెందిన భారతి (30) నగరానికి వలసవచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. చింతా లక్ష్మణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకుంది. లక్ష్మణ్ కొర్రెముల గ్రామం వద్ద చికెన్ షాపు నిర్వహించేవాడు. గత కొన్నాళ్లు మద్యానికి బానిసైన లక్ష్మణ్ షాప్ తెరవడం లేదు. ఈ నెల 8న ఉదయం భారతి భర్తను పద్ధతి మార్చుకోవాలని చెప్పడంతో అతను ఆమెపై దాడి చేశాడు. కాగా అదే రోజు సాయంత్రం లక్ష్మణ్ భారతి సోదరుడు మహేష్ కు వీడియో కాల్చేసి భారతి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుందని చెప్పాడు. ఆమెను కాపాడాలని వేడుకున్నా పట్టించుకోకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మహేష్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. భర్త వేధింపుల కారణంగా తన సోదరి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి మృతిని తట్టుకోలేక.. ఉరేసుకొని ప్రియురాలు ఆత్మహత్య
హైదరాబాద్: ఇద్దరు ఒకే బేకరీలో పని చేసేవారు.. వీరి మధ్య ఏర్పపడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి పెళ్లికి ప్రియుడి కుటుంబం నిరాకరించడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన ప్రేమికురాలు ఉరి వేసుకొని తనువు చాలించిన విషాద ఘటన గచి్చ»ౌలి పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జేమ్స్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్కు చెందిన నేహ (19) ఎనిమిది నెలల క్రితం నగరానికి వచ్చి గౌలిదొడ్డిలోని జర్నలిస్ట్ కాలనీలో వైష్ణవి పీజీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. నానక్రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్లోని ఓ బేకరీలో సేల్స్ గర్ల్గా చేరింది. బాలాపూర్ పీఎస్ పరిధిలో వెంకటాపురంలో నివసించే సల్మాన్ ఆరు నెలల క్రితం సదరు బేకరీలో చేరాడు. వీరిరువురు మధ్య స్నేహం ప్రేమగా మారింది. విషయం తెలియడంతో సల్మాన్ను బేకరీ నుంచి తొలగించారు. సల్మాన్ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సల్మాన్ ఈ నెల 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడు చనిపోయిన విషయం తెలియడంతో నేహ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు రూమ్ మేట్స్ డ్యూటికీ వెళ్లగానే తలుపు గడియ పెట్టుకుంది. ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ నిర్వాహకులు వెంటనే గచి్చ»ౌలి పోలీసులకు సమాచారం అందించారు. ప్రియుడు సల్మాన్ ఆత్మహత్యను జీరి్ణంచుకోలేక తనువు చాలించిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
ఎందుకమ్మా ఇలా చేశావ్!
సాక్షి, వికారాబాద్ అర్బన్: నవమాసాలు మోసి ఇద్దరు బంగారు తల్లులను కన్న ఓ తల్లి.. చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కొనఊపిరితో మృత్యుఒడి నుంచి బయటపడిన ఆమె తన కంటి పాపలను మాత్రం కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. ధారూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మిని నాలుగేళ్ల క్రితం బంట్వారం గ్రామానికి చెందిన ఆమె మేనబావ గోపాల్కు ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. ఏడాది పాటు బంట్వారంలో ఉన్న దంపతులు ఆ తర్వాత వికారాబాద్ వచ్చి ఎన్నెపల్లిలో కాపురం పెట్టారు. వీరికి కృప(2), శ్రేష్ట( 9 నెలల) పాపలు ఉన్నారు. భాగ్యలక్ష్మి రెండేళ్లుగా పట్టణంలోని మహవీర్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త గోపాల్ మాత్రం మద్యానికి బానిసై ఏపనీ లేకుండా తిరుగుతున్నాడు. అంతేకాకుండా భాగ్యలక్ష్మిని వేధిస్తూ.. ఇంట్లో ఉన్న డబ్బులు దొంగిలించడం, బలవంతంగా లాక్కోవడం వంటివి చేస్తున్నాడు. ఇవ్వకపోతే దాడికి పాల్పడుతున్నాడు. నిత్యం ఈ నకరాన్ని భరించలేకపోయిన భాగ్యలక్ష్మి.. జీవితంపై విరక్తి చెందింది. ఈ క్రమంలో శుక్రవారం తన ఇద్దరు పిల్లలను తీసుకుని పట్టణ సమీపంలోని శివారెడ్డిపేట్ చెరువు వద్దకు వెళ్లి అందులో దూకింది. అంతకు ముందు తన ఇద్దరు పిల్లలతో శివారెడ్డిపేట్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన వాట్సప్లో స్టేటస్ పెట్టుకుంది. ఇది గమనించి కొందరు సన్నిహితులు అక్కడకు వెళ్లేసరికి అప్పటికే తల్లీకూతుళ్లు చెరువు పడిపోయారు. స్థానికులు వీరిని రక్షించే ప్రయత్నం చేయగా భాగ్యలక్ష్మి కొన ఊరిపితో బయటపడింది. ఇద్దరు చిన్నారుల ప్రాణాలు మాత్రం చెరువులో కలిసిపోయాయి. పోలీసులు, స్థానికులు చెరువులో దిగి గాలించగా ముందు పెద్ద పాప కృప శవమై కనిపించింది. అనంతరం గంట తర్వాత చిన్న పాప శ్రేష్ట మృతదేహం లభించింది. ప్రాణాలతో బయటపడ్డ తల్లికి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సంఘటన స్థలానికి వెళ్లిన డీఎస్పీ సంజీవరావు.. భాగ్యలక్ష్మి భర్త గోపాల్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యలక్ష్మి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ, సీఐ రాజశేఖర్ తెలిపారు. భర్త గోపాల్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కలెక్టరేట్లో దళిత ఉద్యోగిని ఆత్మహత్య
-
బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ..
♦ యువతి ఆత్మహత్యాయత్నం ♦ తన చావుకు ఏసీపీ కూడా కారణమంటూ లేఖ ♦ ప్రేమ వివాహం.. బలవంతపు పెళ్లంటూ ఫిర్యాదు ♦ ఫొటోలు ఫేస్బుక్లో పెట్టడంపై మనస్తాపం మందమర్రి (చెన్నూర్): తనను బలవంతంగా పెళ్లి చేసుకొని ఫొటోలు వాట్సాప్, ఫేస్బుక్ల్లో పెట్టి పరువుకు భంగం కలిగించాడని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో క్యాతం శ్రీవాణి కుటుంబం నివసిస్తోంది. ఇటీవలే ఆమె సారంగపెల్లికి చెందిన అయిల్ల సాగర్ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22న సాగర్, శ్రీవాణి కాళేశ్వరంలో వివాహం చేసుకుని వస్తుండగా.. ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి సాగర్పై దాడిచేసి సోదరిని ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. సాగర్ భయపెట్టి.. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ బెల్లంపల్లి ఏసీపీకి శ్రీవాణి, సోదరుడు కలసి ఫిర్యాదు చేశారు. తాను బలవంతంగా పెళ్లి చేసుకోలేదని, పెళ్లి ఫొటోలే నిదర్శమంటూ శ్రీవాణితో దిగిన ఫొటోల్ని సాగర్ సోషల్మీడియాలో పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీవాణి గురువారం నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించారు. కమిషనర్కు ఫిర్యాదు...: తమ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్ట డం లేదని,సాగర్తోనే కాపురం చేయాలని ఏసీ పీ బెదిరిస్తున్నాడని శ్రీవాణి ఇటీవల మీడియా తో మాట్లాడింది. పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ దృష్టికి తీసుకెళ్లింది. తనకు న్యాయం చేయకుండా, తన అన్నయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటూ ఏసీపీ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. శ్రీవాణి రాసిన సూసైడ్ నోట్: ‘అమ్మ..అన్నయ్య..అక్కలందరూ నన్ను క్షమిం చండి. నేను చేసిన తప్పునకు క్షమించండి. ఇక ఈ భూమి మీద బతికే ఆశ నాకు లేదు. సాగర్, భీరెల్లి రాములు, పానుగంటి సతీశ్ నా వీడియోలు, ఫొటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేసి మన పరువు తీస్తున్నారు. ఇక్కడి ఏసీపీ సతీష్ కూడా అసభ్యంగా మాట్లాడుతూ నేను ఇచ్చిన కేసును దర్యాప్తు చేయకుండా అన్నయ్యను, నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా చావు కు ఏసీపీ సతీష్, సాగర్, రాములు, పాను గం టి సతీష్లే కారణం. నా చావుకు కారణమైన వీరిని అసలే వదలకండి. అన్నయ్యా.. నన్ను క్షమించు సారీ.. సారీ’ ఇట్లు నీ చెల్లెలు శ్రీవాణి అని రాసుంది. కాగా, నిందితులపై చర్య తీసుకోవాలని శ్రీవాణి బంధువులు మంచిర్యాల ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. డీసీపీ జాన్వెస్లీ బాధితులతో మాట్లాడి.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించుకున్నారు.
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- బెదిరింపుల పర్వం!
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
Advertisement