-
ఆడవాళ్ల జాగ్రత్తల గురించి ఆమెకు తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : చండీగఢ్లో గత నెల 22 ఏళ్ల యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనపై ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ స్పందిస్తూ ‘నీవు ఎక్కాల్సిన ఆటోలో అప్పటికే ముగ్గురు యువకులు కూర్చొని ఉన్నప్పుడు ఆ ఆటో నీవు ఎక్కాల్సింది కాదు’ అని బాధితురాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజా రవాణాకు కిరణ్ ఖేర్ చాలా కాలం నుంచి దూరంగా ఉన్నట్టున్నారు. అసలు ఆమెకు ఎన్నడూ ప్రజా రవాణాలో ప్రయాణించిన అనుభవమే ఉండక పోవచ్చు. చండీగఢ్ లాంటి నగరాన్ని తీసుకుంటే షేరింగ్ టాక్సీలోగానీ, షేరింగ్ ఆటోలోగానీ వెళ్లాలంటే క్యూలో నిలబడాల్సిందే. నీ వంతు రాగానే గుడ్డిగా ఎక్కాల్సిందే, మరో ఛాయిస్ ఉండదు. లేదంటే పక్కకు తోసేస్తారు. ఒక్కసారి క్యూ నుంచి పక్కకు వచ్చావంటే మళ్లీ అందరికన్నా వెనక నిలబడాల్సిందే. ఎక్కాల్సిన ఆటోలో ఎంత మంది ఉన్నారు? వారిలో పురుషులు ఎంత మంది ? మహిళలు ఎంత మంది? వారెలా ఉన్నారు? రౌడీల్లా ఉన్నారా? రేపిస్టుల్లా ఉన్నారా? సాధు జీవుల్లా ఉన్నారా? తెలుసుకునేందుకు వారి ముఖాలను పరికించి చూసే అవకాశంగానీ, ఆలోచించే క్షణంగానీ ఉండదు. ముందున్నది ట్యాక్సీ అయినా, ఆటో అయిన జనంతోపాటు ముందుకు నడవాల్సిందే. షేరింగ్ కాకుండా సొంతంగా టాక్సీ లేదా ఆటో తీసుకోవడం వేరు. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా చేరుకునేందుకు ఆరాటపడే మహిళల్లో ఎక్కువ మందికి అంతటి స్థోమత ఉండదు. అంతటి స్థోమత ఉన్నవాళ్లు కూడా వాటిల్లో వెళ్లేందుకు ఇష్టపడరు. ఎందుకంటే భద్రత. ఒంటరిగా వెళితే జరుగకూడదేదో జరుగుతుందన్న ఆందోళన. అందుకనే పట్టణాల్లో ఉద్యోగాలు చేసి బతికే దిగువ, మధ్య తరగతి మహిళల్లో 99 శాతం ప్రభుత్వ లేదా ప్రజా రవాణేనే ఆశ్రయిస్తారు. కారణం, పదిమందిలోనే భద్రత ఉంటుందన్న నమ్మకం. అందుబాటులో ఉంటే ఎక్కువ మంది ప్రభుత్వ బస్సుల్లో వెళ్లేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు దేశంలోని అనేక పట్టణాల్లో బస్సుల్లో, సెట్విన్లలో, షేరింగ్ ఆటో లేదా ట్యాక్సీల్లో వెళ్లాలంటే క్యూల్లో నిలబడాల్సిందే. భారతీయ మహిళలకు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కిరణ్ ఖేర్ లాంటి వారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లులు, అత్తలు, కజిన్స్, స్నేహితులు ఇలాంటి జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అవి కాకుండా స్వానుభవంతో మరికొన్ని జాగ్రత్తలు తెలుసుకుంటారు. మనం ఎక్కడికి వెళుతున్నాం ? ఏ ప్రాంతానికి వెళుతున్నాం ? అక్కడ ఎలాంటి రకం మనుషులు ఉంటారు? వారి దృష్టిలో పడకుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి దుస్తులు ధరించి వెళ్లాలి? ఇన్ని అంశాలను ఆలోచించి మహిళలు రోడ్డెక్కుతారన్న విషయం కిరణ్ ఖేర్కు ఎంత మేరకు తెలుసు? రైళ్లలో ఎక్కినప్పుడు కూడా ఆ కంపార్ట్మెంట్లో మహిళలు ఉన్నారా, లేరా? ఉంటే ఎంత మంది మహిళలు ఉన్నారు? వారు గుంపుగా ఒక దగ్గరున్నారు ? వేర్వేరుగా ఉన్నారా? వాది వద్దకు వెళితే తనకు మరింత భద్రత ఉంటుందా? మగవాళ్లు ఎక్కువుంటే వారు గ్రూపులుగా కూర్చొని ఉన్నారా? విడివిడిగా ఎక్కువగా ఉన్నారా? వారు కాకతాళీయంగా గుంపులుగా కూర్చున్నారా? లేదా వారి మధ్య పరిచయం ఉందా? అదే కంపార్ట్మెంట్లో ఉంటే తనకు మంచిదా, మరో కంపార్ట్మెంట్కు వెళ్లడం శ్రేయస్కరమా? ఇన్ని విధాలుగా మహిళలు ఆలోచిస్తారన్న విషయం కిరణ్ ఖేర్ లాంటి వారికి తెలుసా? దేశ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ ఉండాలని, దాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అందుకు పోరాడాల్సిన బాధ్యత తన లాంటి ఎంపీలదని ఆమె ఎప్పటికైనా గ్రహిస్తారా? అత్యుత్తమ రవాణా వ్యవస్థ లేకనే ఇలా అప్పుడప్పుడు మహిళలు మగాళ్లకు బలవుతున్నారన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తారా? ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థ అంటే ‘బుల్లెట్ ట్రెయిన్’ అనుకుంటే ఇక ఆ బుర్రలను ఏం చేయలేం! ఇక్కడ చండీగఢ్లో గ్యాంగ్ రేప్కు గురైన అమ్మాయి ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. పైగా రిస్కు తీసుకువడం అనేది ఆమె ఇష్టం. నగరంలో ఎక్కడికైనా, ఎప్పుడైనా, రాత్రయినా, పగలైనా వెళ్లే హక్కు, పౌరుల మధ్య తిరిగే హక్కు ఆమెకుంది ? ఆమె హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. (ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’ స్కూల్ ఆఫ్ మిడియా అండ్ కల్చరల్ స్టడీస్ ప్రొఫెసర్ శిల్పా పాడ్కే వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అక్షరరూపం) -
మూడేళ్లుగా యువతిపై దారుణం
థానె: మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఓ యువతిపై ముగ్గురు దుండగులు మూడేళ్లుగా సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. భయందర్ టౌన్షిప్కు చెందిన బాధితురాలితో నిందితులు స్నేహంగా ఉండేవారు. 2013 ఏప్రిల్లో ఓ సందర్భంలో నిందితులు మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్ను ఆమెతో తాగించారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక నిందితుల్లో ఒకడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితులు ఆమెను మరో ప్రాంతాన్ని తీసుకెళ్లి ఓ గదిలో బంధించి దారుణానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి గతేడాది డిసెంబర్ వరకు పలుమార్లు ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. కొన్ని రోజుల క్రితం ముంబైలోని పొవాయ్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని, థానె జిల్లాలోని వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. కాగా పోలీసులు నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement