-
శతమానం భారతి: పోషకాహారం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో తొలిసారి చేపట్టిన తరువాత స్త్రీ పురుష నిష్పత్తిలోని మహిళల జనాభా 2021 నాటికి కాస్తయినా పెరిగింది. లింగ నిష్పత్తి ఇప్పుడు వెయ్యిమంది పురుషులకు గాను 929కి చేరింది. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. చాలానే ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య. కాబట్టి దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. భారతదేశం ఈ 75 ఏళ్లలో అనేక ఆరోగ్య సూచీల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించినప్పటికీ మహిళలు, పిల్లల పౌష్టికాహారం విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశం ఇప్పుడు మరింత ఎక్కువ రక్తహీనతను ఎదుర్కొంటోంది. ఆరేళ్ల పసిపిల్లల నుంచి కౌమార వయస్కులైన బాలబాలికలు, గర్భిణులు, 15–49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లోనూ రక్తహీనత అధికం అవుతోంది. ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనుకుంటున్న మన ఆశయానికి ఇది అవరోధం అయినా కావచ్చు. అందుకే దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. అంబులెన్స్ సర్వీసులు, సంస్థాగత కాన్పులు, కౌమార వయస్కుల్లో రక్తహీనత లోపాలను అధిగమిం చేందుకు 1997లో రీప్రొడక్టివ్ అండ్ ఛైల్డ్ హెల్త్ కార్యక్రమంలో ఎలాగైతే లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నం జరిగిందో అలాగే ఇప్పుడూ పౌష్టికాహార సూచీలను మెరుగుపరిచే ప్రయత్నం జరగబోతోంది. (చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 నెహ్రూ వారసత్వం) -
అకస్మాత్తుగా కారు దగ్ధం: మహిళలతోపాటు చిన్నారి సురక్షితం
కారు దగ్ధం ఐదుగురు మహిళలు, చిన్నారి సురక్షితం ఎండే కారణమంటున్న నిపుణులు చెన్నై: శుక్రవారం మధ్యాహ్నం 3.35 గంటలు, నిప్పులు చెరుగుతున్న ఎండ. గిండీ కత్తిపారా బ్రిడ్జీపై వేగంగా వెళుతున్న కారు ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. అకస్మాత్తుగా కారులో మంటలు, నిమిషాల్లో కారు బూడిద. అదృష్టవశాత్తు ప్రయాణికులంతా మృత్యుంజయుల్లా బైటపడ్డారు. వివరాల్లోకి వెళితే... చెన్నై నగరం కేకే నగర్ మీదుగా విమానాశ్రయం వైపు ఒక లగ్జరీకారు వేగంగా వెళుతోంది. గిండి కత్తిపారా బ్రిడ్జిపై వెళుతున్న సమయంలో కారు బాయ్నెట్లో నుంచి పొగలు వచ్చాయి. డ్రైవరు గమనించి తేరుకునేలోగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవరు కారును రోడ్డుకు ఒకవైపు నిలిపి తలుపులు తెరిచి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు, చిన్నారిని బైటకు లాగేశాడు. వారంతా దూరంగా పరుగులు తీస్తున్న క్షణంలో భారీఎత్తున ఎగిసిపడిన మంటలు కారును పూర్తిగా కమ్మేశాయి. ఇంతలో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అగ్నిపాపక సిబ్బంది పది మంది సుమారు అరగంటకు పైగా పోరాడి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా కత్తిపారా జంక్షన్ బ్రిడ్జిపై గంటసేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళలు, చిన్నారి సురక్షితంగా బైటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రయాణికులు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. నిప్పులు చెరుగుతున్న ఎండల వల్ల కారు ఇంజన్ వేడెక్కడం వల్లనే మంటలు రేగాయని నిపుణులు చెప్పారు. వేసవి కాలంలో ప్రతి గంటకు ఒకసారి కారు ఇంజన్కు విరామం ఇవ్వకుంటే ఇటువంటి ప్రమాదాలకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement