-
మహిళల టీ 20: పైనల్కు చేరిన ఆసీస్
ఢిల్లీ: టీ 20 మహిళల ప్రపంచకప్లో భాగంగా బుధవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఆసీస్ 5 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆసీస్ విసిరిన 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తడబడి ఓటమి పాలైంది. ఇంగ్లండ్ మహిళల్లో కెప్టెన్ ఎడ్వర్డ్స్(31), బీమాంట్(32), సారా టేలర్(21)లు మాత్రమే మోస్తరుగా రాణించడంతో ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. ఇంగ్లండ్ కు చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్ కు 31 పరుగులు అవసరమైన తరుణంలో ఆసీస్ మహిళలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయం సాధించారు. ఆసీస్ బౌలర్లలో ష్కట్ రెండు వికెట్లు సాధించగా, పెర్రీ, ఫెర్రెల్, బీమ్స్, ఆస్బార్నీలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు నమోదు చేసింది. ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్(55) రాణించగా, హీలీ(25), విల్లానీ(19) లు ఫర్వాలేదనిపించారు. -
దక్షిణాఫ్రికాపై శ్రీలంక మహిళల విజయం
బెంగళూరు: ట్వంటీ 20 మహిళల ప్రపంచకప్లో భాగంగా సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో శ్రీలంక 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక విసిరిన 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా పోరాడి ఓడింది. దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 104 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా మహిళల్లో వేన్ నికేర్క్(24), చెట్టీ(26)లు మాత్రమే మోస్తరుగా రాణించారు. అనంతరం మిగతా క్రీడాకారిణులు విఫలం కావడంతో దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు. శ్రీలంక బౌలర్లలో సుగాందికా కుమారి,ప్రబోదనిలు తలో రెండు వికెట్లు సాధించగా, జయాంగణి, కౌశల్యలు చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 20.0 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. శ్రీలంక కెప్టెన్ జయాంగణి(52) రాణించి జట్టు సముచిత చేయడంలో సహకరించింది. -
మిథాలీ సేన ఇంటికి..
మొహాలి: ట్వంటీ 20 మహిళల ప్రపంచకప్ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో మిథాలీ సేన 3 పరుగులతో తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి వైదొలిగింది. విండీస్ విసిరిన 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన భారత మహిళలు పరాజయం చవిచూశారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ చేపట్టడంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 114 పరుగులు నమోదు చేసింది. విండీస్ క్రీడాకారిణుల్లో స్టెఫనీ టేలర్(47), దియాంద్రా డోటిన్(45)లు రాణించడంతో ఆ జట్టు సముచిత స్కోరు సాధించింది. అనంతరం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత మహిళలు వైఫల్యం చెందారు. భారత కెప్టెన్ మిథాలీ రాజ్(0) ఆదిలోనే డకౌట్ పెవిలియన్ కు చేరి నిరాశపరిచింది. ఆపై మందనా(22), అంజనా పాటిల్(26), జులాన్ గోస్వామి(25)లు మాత్రమే మోస్తరుగా రాణించడంతో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 111 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. విండీస్ బౌలర్లలో డోటిన్ మూడు వికెట్లు సాధించగా, ఆఫై ఫ్లెచర్ కు రెండు, కోన్నెల్, క్వింటైన్ లు తలో ఒక వికెట్ తీశారు. -
భారత విజయలక్ష్యం 115
మొహాలి: ట్వంటీ 20 మహిళల ప్రపంచకప్లో భాగంగా గ్రూప్-బిలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ 115 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ చేపట్టడంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టులో స్టెఫనీ టేలర్(47), దియాంద్రా డోటిన్(45)లు మాత్రమే రాణించారు. కట్టుదిట్టమైన భారత బౌలింగ్ కు ఏడుగురు విండీస్ క్రీడాకారిణులు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 114 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో హర్మన్ కౌర్ నాలుగు వికెట్లు సాధించగా, అనుజా పాటిల్ కు మూడు వికెట్లు, ఏక్తా బిష్త్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు వెస్టిండీస్పై గెలిస్తే చెన్నైలో సాయంత్రం జరిగే ఇంగ్లండ్-పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్లో పాక్ కచ్చితంగా ఓడిపోతే అప్పుడే మనకు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అదే జరిగితే గ్రూప్ బి లో భారత్, వెస్టిండీస్, పాకిస్తాన్ రెండేసి విజయాలు, నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. మిగతా రెండు జట్లతో పోలిస్తే టీమిండియా రన్రేట్ చాలా బాగుంది కాబట్టి జట్టు ముందంజ వేస్తుంది. అదే పాక్ గెలిస్తే భారత్ నిష్ర్కమిస్తుంది. -
శ్రీలంకపై ఆసీస్ విజయం
ఢిల్లీ: టి20 మహిళల ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక విసిరిన 124 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 17.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా టోర్నీలో ఆస్ట్రేలియా రెండో విజయాన్ని సాధించింది. ఆసీస్ క్రీడాకారిణుల్లో అలిస్సా హీలే(12) ఆదిలోనే నిష్క్రమించినప్పటికీ, విల్లానీ(53 నాటౌట్;39 బంతుల్లో 9ఫోర్లు),మెగ్ లాన్నింగ్ (56 నాటౌట్; 53 బంతుల్లో 8 ఫోర్లు) రాణించి జట్టు ఘన విజయంలో సహకరించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. శ్రీలంక మహిళల్లో చమారి ఆటపట్టు జయాంగణి(38), సురాంగిక(38) మినహా ఎవరూ రాణించలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
Advertisement