-
పాకిస్తాన్ అల్రౌండర్ అరుదైన ఘనత.. ప్రపంచంలో తొలి క్రికెటర్గా
పాకిస్తాన్ మహిళల జట్టు స్టార్ నిధా ధార్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిధాదార్ రికార్డులకెక్కింది. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఓ వికెట్ పడగొట్టిన నిధా.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు 130 మ్యాచ్లు ఆడిన ఆమె 126 వికెట్లు పడగొట్టింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆల్రౌండర్ అనీషా మహ్మద్(125) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో మహ్మద్ రికార్డును నిధా ధార్ బ్రేక్ చేసింది. ఇక టీ20 ప్రపంచకప్ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 114 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజాయం పాలైంది. చదవండి: T20 WC 2023: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలో తొలి జట్టుగా! -
అమ్మాయిలు అదరగొట్టేశారు
డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై శుభారంభం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత మహిళలు గ్రూప్ ‘ఎ’లో టాప్ గేర్లో దూసుకెళ్తున్నారు. బంగ్లాదేశ్తో జరిగిన పోరులో బ్యాటింగ్లో షఫాలీ మెరిపించగా... బౌలింగ్లో పూనమ్ యాదవ్ మళ్లీ ప్రత్యర్థిని తిప్పేసింది. దీంతో భారత అమ్మాయిల జట్టు వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి సెమీఫైనల్ దిశగా అడుగు ముందుకేసింది. పెర్త్: ఆల్రౌండ్ ప్రతాపంతో భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సోమవారం హర్మన్ప్రీత్ కౌర్ సేన 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (17 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగింది. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమైంది. నిగర్ సుల్తానా (26 బంతుల్లో 35; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/18) మళ్లీ ఆకట్టుకుంది. షఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దాంతో షఫాలీ టి20 ప్రపంచకప్ చరిత్రలో పిన్న వయస్సులో (16 ఏళ్ల 27 రోజులు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. భారత్ తమ తదుపరి మ్యాచ్లో ఈనెల 27న మెల్బోర్న్లో న్యూజిలాండ్ జట్టుతో ఆడుతుంది. షఫాలీ సిక్సర్లు... భారత టీనేజ్ ఓపెనర్ షఫాలీ వర్మ సిక్సర్లతో దంచేసింది. దీంతో స్కోరు శరవేగంగా కదిలింది. జ్వరం కారణంగా రెగ్యులర్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్కు దూరమైంది. తానియా భాటియా ఓపెనర్గా వచ్చినా 2 పరుగులే చేసి అవుటైంది. అయితే షఫాలీ, జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మెరుపులు మెరిపించింది. భారత్ 5.1 ఓవర్లోనే 50 పరుగులను చేరుకుంది. ఆమె అవుటయ్యాక స్కోరు మందగించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (8), దీప్తి శర్మ (11)లు పెద్దగా స్కోర్లేమీ చేయలేదు. కానీ చివర్లో వేద కృష్ణమూర్తి (11 బంతుల్లో 20 నాటౌట్; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. దీంతో ప్రత్యర్థి ముందు సవాల్తో కూడిన లక్ష్యాన్ని ఉంచగలిగింది. క్రమం తప్పని పతనం... తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆరంభం నుంచే వికెట్లను పారేసుకుంది. దీంతో ఏ దశలోనూ లక్ష్యంవైపు కన్నెత్తి చూడలేదు. ఓపెనర్ ముర్షిదా ఖాతున్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు), మిడిలార్డర్లో నిగర్ సుల్తానా (26 బంతుల్లో 35; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడగలిగారు. మిగతా వాళ్లను భారత బౌలర్లు సులభంగానే బోల్తా కొట్టించడంతో క్రమం తప్పకుండా బంగ్లాదేశ్ వికెట్లు పతనమయ్యాయి. శిఖా పాండే, హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి తలా 2 వికెట్లు తీశారు. రాజేశ్వరి గైక్వాడ్కు ఒక వికెట్ దక్కింది. సోమవారమే జరిగిన మరో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: తానియా (స్టంప్డ్) నిగర్ (బి) సల్మా 2; షఫాలీ వర్మ (సి) షమీమా (బి) పన్నా ఘోష్ 39; రోడ్రిగ్స్ (రనౌట్) 34; హర్మన్ప్రీత్ (సి) రుమానా (బి) పన్నా ఘోష్ 8; దీప్తి శర్మ (రనౌట్) 11; రిచా (సి) నహీదా అక్తర్ (బి) సల్మా 14; వేద (నాటౌట్) 20; శిఖా పాండే (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–16, 2–53, 3–78, 4–92, 5–111, 6–113. బౌలింగ్: జహనారా 4–0–33–0, సల్మా 4–0–25–2, నహీదా అక్తర్ 4–0–34–0, పన్నా ఘోష్ 4–0–25–2, రుమానా 2–0–8–0, ఫాహిమా 2–0–16–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: షమీమా సుల్తానా (సి) దీప్తి (బి) శిఖా 3; ముర్షిదా (సి) రిచా (బి) అరుంధతి రెడ్డి 30; సంజిదా ఇస్లామ్ (సి) తానియా (బి) పూనమ్ యాదవ్ 10; నిగర్ సుల్తానా (సి) అరుంధతి (బి) రాజేశ్వరి 35; ఫర్జానా హక్ (సి) తానియా (బి) అరుంధతి రెడ్డి 0; ఫాహిమా (సి) షఫాలీ (బి) పూనమ్ యాదవ్ 17; జహనార (స్టంప్డ్) తానియా (బి) పూనమ్ యాదవ్ 10; రుమానా (బి) శిఖా 13; సల్మా (నాటౌట్) 2; నహీదా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–5, 2–44, 3–61, 4–66, 5–94, 6–106, 7–108, 8–121. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–32–0, శిఖా పాండే 4–0–14–2, రాజేశ్వరి 4–0–25–1, అరుంధతి 4–0–33–2, పూనమ్ 4–0–18–3. -
సఫారీ అమ్మాయిల చరిత్ర
పెర్త్: టి20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా మహిళలు చరిత్రకెక్కే విజయాన్ని సాధించారు. తొలిసారి ఇంగ్లండ్లాంటి మేటి జట్టుపై గెలుపొందారు. మహిళల టి20 మెగా ఈవెంట్లో సఫారీ జట్టు తమ తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టింది. ఆదివారం ఉత్కంఠ రేపిన ఈ పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై గెలుపొందింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. సీవర్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించింది. ఓపెనర్ జోన్స్ (20 బంతుల్లో 23; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. సఫారీ బౌలర్లు అయబొంగ (3/25), వాన్ నికెర్క్ (2/20), మరిజనె (2/19) సమష్టిగా దెబ్బతీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్, కెప్టెన్ వాన్ నికెర్క్ (51 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్లు), మరిజనె (33 బంతుల్లో 38; 6 ఫోర్లు) రాణించారు. ఇంగ్లిష్ బౌలర్ ఎకిల్స్టోన్ 2 వికెట్లు తీసింది. ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... బ్రంట్ వేసిన ఆ ఓవర్లోని 3, 4 బంతుల్ని డు ప్రీజ్ వరుసగా 6, 4 బాదడంతో 2 బంతులు మిగిలుండగానే దక్షిణాఫ్రికా విజయం సాధించింది. -
సంవత్సరం ముందుగా...
దుబాయ్: మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సరిగ్గా ఏడాది ముందుగా మొదలు పెట్టడం విశేషం. నేటి నుంచి ఆన్లైన్లో ఫైనల్ సహా 23 మ్యాచ్ల టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఐసీసీ అధికారిక వెబ్సైట్ ్ట20ఠీౌట ఛీఛిup.ఛిౌఝ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు. మ్యాచ్ టికెట్ల కనీస ధరను 20 డాలర్లు (సుమారు రూ.1500)గా నిర్ణయించారు. పది జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలోని ఆరు నగరాల్లో జరుగుతుంది. ప్రధాన టోర్నీకి ముందు ఫిబ్రవరి 16నుంచి 20 వరకు వామప్ మ్యాచ్లు ఉంటాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మెల్బోర్న్లోని ఎంసీజీలో జరిగే ఫైనల్కు 92 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని ఐసీసీ అంచనా వేస్తోంది. -
మంధనాధన్.. స్మృతి సుడిగాలి ఇన్నింగ్స్!
జట్టు సెమీఫైనల్ చేరినా...కెప్టెన్ హర్మన్ప్రీత్ ఫామ్ చాటుకున్నా... స్పిన్నర్లు మాయాజాలంతో కట్టిపడేస్తున్నా... టీమిండియాకు ఒక్క లోటు కనిపించింది! అదే మెరుపు తీగ స్మృతి మంధాన బ్యాట్ నుంచి తుఫాన్ ఇన్నింగ్స్ లేకపోవడం! ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్లోఈ ముచ్చటా తీరింది...!స్మృతి అసలు సిసలు ధాటైన ఆట బయటకు వచ్చింది. అంతే... మిగతాదంతా ఎప్పటిలాగే సాగిపోయింది. భారత్ జోరుకు కంగారూలు తోకముడిచారు. ప్రావిడెన్స్: మహిళల టి20 ప్రపంచకప్లో టీమిండియాకు మరో ఘన విజయం. ఎడమ చేతివాటం ఓపెనర్ స్మృతి మంధాన (55 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్కు స్పిన్నర్ల మాయాజాలం తోడైన వేళ కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మన జట్టు 48 పరుగుల తేడాతో ఓడించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతికి తోడుగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఛేదనలో భారత స్పిన్ చతుష్టయం అనూజ పాటిల్ (3/15), రాధా యాదవ్ (2/13), పూనమ్ యాదవ్ (2/28), దీప్తిశర్మ (2/24) ఉచ్చులో చిక్కిన ఆసీస్ 19.4 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. ఎలీస్ పెర్రీ (39 నాటౌట్) టాప్ స్కోరర్. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి టాపర్గా నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో సెమీస్ చేరిన వెస్టిండీస్, ఇంగ్లండ్లలో ఒకదానితో తలపడనుంది. అహో స్మృతి... హర్మన్ హల్చల్ భారత ఇన్నింగ్స్లో ఇద్దరే రెండంకెల పరుగులు చేశారు. అయినా, జట్టు అంత స్కోరుకు వెళ్లిందంటే కారణం స్మృతి, హర్మన్ప్రీత్. ఓపెనర్గా వచ్చిన తాన్యా భాటియా (2) సహా విధ్వంసక జెమీమా రోడ్రిగ్స్ (6), వేదా కృష్ణమూర్తి (3) నిరాశపర్చినా, వీరిద్దరి వీర విహారంతో ఆ ప్రభావం కనిపించలేదు. ముందునుంచే జోరు చూపిన స్మృతికి... హర్మన్ రాకతో మరింత బలం వచ్చినట్లైంది. ఇద్దరిలో కెప్టెనే ధాటిగా ఆడింది. మంచి టైమింగ్తో బౌండరీలు, భారీ సిక్స్లు కొట్టింది. ఈ జోడీ మూడో వికెట్కు 42 బంతుల్లోనే 68 పరుగులు రాబట్టడంతో 13.2 ఓవర్లలో జట్టు స్కోరు 117/2కు చేరింది. పరిస్థితి చూస్తే టీమిండియా 180 పైనే లక్ష్యం విధించేలా కనిపించింది. అయితే, కిమ్మిన్స్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన హర్మన్... మరో షాట్కు యత్నించి అవుటైంది. ఓవైపు వికెట్లు పడుతున్నా మంధాన దూకుడు కొనసాగించింది. ఈ క్రమంలో శతకం అందుకుంటుదేమో అనిపించింది. కానీ, షుట్ ఓవర్లో లాంగాన్ వైపు ఆమె కొట్టిన షాట్ను ఎలీస్ పెర్రీ క్యాచ్ పట్టి ఆ అవకాశం లేకుండా చేసింది. లోయరార్డర్ నుంచి ప్రతిఘటన లేకపోవడంతో చివరి ఐదు ఓవర్లలో భారత్ 39 పరుగులే చేయగలిగింది. స్పిన్నర్ల జోరు... భీకర ఫామ్లో ఉన్న ఓపెనర్ అలీసా హీలీ... భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడి బ్యాటింగ్కు రాకపోవడంతో ఆసీస్ ముందే డీలాపడింది. ఓపెనర్లు ఎలీసా విలానీ (6), బెతానీ మూనీ (19)లను వరుస బంతుల్లో ఔట్ చేసి దీప్తిశర్మ మ్యాచ్ను భారత్ చేతుల్లోకి తెచ్చింది. ఆష్లే గార్డ్నర్ (20), రాచెల్ హేన్స్ (8)లను పూనమ్ యాదవ్ పెవిలియన్ చేర్చింది. కెప్టెన్ మెఘాన్ లానింగ్ (10)ను రాధా యాదవ్ వెనక్కు పంపింది. పెర్రీ బ్యాట్ ఝళిపించినా అప్పటికే పరిస్థితి ఆసీస్ చేజారిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా వెటరన్ మిథాలీ రాజ్కు విశ్రాంతినిచ్చింది. పేసర్ మాన్సి జోషి స్థానంలో తెలుగమ్మాయి అరుంధతీరెడ్డిని ఆడించింది. మరో పేసర్ పూజా వస్త్రకర్ గాయంతో ప్రపంచ కప్నకు దూరమైంది. ►7 భారత్కు టి20ల్లో ఇది వరుసగా ఏడో విజయం. గతంలో రెండు సార్లు వరుసగా ఆరేసి మ్యాచ్లు నెగ్గింది. ►4 అంతర్జాతీయ టి20 మ్యాచ్లో 4 క్యాచ్లు అందుకున్న రెండో ఫీల్డర్ వేద కృష్ణమూర్తి ►1 మిథాలీ రాజ్ లేకుండా భారత జట్టు టి20 ప్రపంచకప్లో ఆడిన మొదటి మ్యాచ్ ఇదే. దీనికిముందు భారత్ ఆడిన 24 మ్యాచ్ల్లోనూ మిథాలీ భాగంగా ఉంది. ►31 టి20 ప్రపంచ కప్లో స్మృతి మంధాన వేగవంతమైన అర్ధశతకం (31 బంతుల్లో) నమోదు చేసింది. హర్మన్ప్రీత్ ఇదే టోర్నీలో న్యూజిలాండ్పై 33 బంతుల్లో సాధించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్గా అమూల్...
పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
తప్పక చదవండి
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
Advertisement