-
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రభాకర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు, సీనియర్ నేత పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం దక్కింది. కొద్ది రోజులుగా ప్రభాకర్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. ఎట్టకేలకు ఆయన నియామకాన్ని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లట్ బుధవారం ప్రకటించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ కమిటీతోపాటు తొమ్మిది అనుబంధ కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ సందర్భంగా కోర్ కమిటీ, కో ఆర్డినేషన్ కమిటీ, క్యాంపేయిన్ కమిటీ, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ, ఎల్డీఎంఆర్సీ కమిటీ, ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పేరుతో అనుబంధ కమిటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురికి స్థానం కల్పించారు. కాగా.. మాజీ మంత్రులు జీవన్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులకు మూడు, నాలుగు కమిటీల్లో స్థానం కల్పించగా, మరికొందరిని విస్మరించారు. కోర్కమిటీలో దక్కని చాన్స్.. మిగతా కమిటీల్లో పెద్దపీట..ఏఐసీసీ, టీపీపీసీలు కీలకంగా భావించిన తొమ్మిది కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు సీనియర్లకు అవకాశం కల్పించి పెద్దపీట వేశారు. అయితే.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు ఎన్ఎస్ బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్ తదితర 15 మందితో కూడిన కోర్కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇతర జిల్లాలకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కి గౌడ్, ఎ.సంపత్కుమార్, వంశీచంద్రెడ్డి జాబితాలో మనవాళ్ల పేర్లు లేవు. 53 మందితో కూడిన కో ఆర్డినేషన్ కమిటీలో పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు తాటిపర్తి జీవన్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబుకు అవకాశం దక్కింది. 17 మందితో కూడిన ప్రచార కమిటీ (క్యాంపెయిన్ కమిటీ) చైర్మన్గా మల్లు భట్టి విక్రమార్క కాగా, ఇందులో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, హర్కర వేణుగోపాల్, బల్మూరి వెంకట్కు, 41 మందితో కూడిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో పొన్నం ప్రభాకర్, డి.శ్రీధర్బాబు, కటకం మృత్యుంజయంకు అవకాశం కల్పించారు. వివిధ అనుబంధ సంఘాల నుంచి 11 మందిని శాశ్వత ఆహ్వానితులుగా పేర్కొనగా, ఇందులో ఆరెపల్లి మోహన్, నేరెళ్ల శారద తదితరులకు జిల్లా నుంచి అవకాశం దక్కింది. మెనిఫెస్టో, ప్లానింగ్ కమిటీల్లో మనోళ్లు.. ఎల్డీఎంఆర్సీ చైర్మన్గా ఆరెపల్లి మోహన్.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, కో చైర్పర్సన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కన్వీనర్గా బొమ్మ మహేశ్కుమార్గౌడ్ను నియమించగా, ఈ కమిటీలో ఉమ్మడి కరీంనగర్కు చెందిన నలుగురికి అవకా శం కల్పించారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి, డాక్టర్ గీట్ల సవితా రెడ్డి, హర్కర వేణుగోపాల్, సయ్యద్ అస్మతుల్లా హుస్సేన్ను నియమించారు. స్ట్రాటజీ, ప్లానింగ్ కమిటీలో మాజీ మం త్రులు జీవన్రెడ్డి, శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ టి.సంతోష్కుమార్తోపాటు రేవంత్రెడ్డి, కాంగ్రెస్లో చేరిన సీహెచ్ విజయరమణా రావుకు అవకాశం కల్పించారు. ఎల్డీఎంఆర్సీ కమిటీకి మాజీ విప్ ఆరెపల్లి మోహన్ను చైర్మన్గా, హర్క ర వేణుగోపాల్ను కన్వీనర్గా నియమించారు. తొమ్మిది మందితో కూడిన ఎలక్షన్ క మిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా మర్రి శశిధర్రెడ్డి కాగా మాజీ ఎమ్మెల్సీ, జిల్లాకు చెందిన బి.కమలాకర్రావును కో చైర్పర్సన్గా నియమించారు. ఏడుగురు సభ్యుల డిసిప్లీనరీ కమిటీలో కూడా బి.కమలాకర్రావును కన్వీనర్గా నియమించారు. పలువురు సీనియర్ల విస్మరణ.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ, టీపీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెంది న పలువురికి అవకాశం కల్పించినా.. ఇంకొందరు సీనియర్ల ఊసే మరిచారు. పక్క జిల్లాలో పార్టీ మారిన నేతల పేర్లను రెండు, మూడు కమి టీల్లో వేసిన అధిష్టానం.. జిల్లాకు చెందిన పలు వురు సీనియర్లను విస్మరించిందన్న వాదన ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. అధికార ప్రతి నిధిగా ఉన్న ప్యాట రమేష్, మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, బొమ్మ వెంకటేశ్వర్, సీనియర్ నాయకులు సుద్దాల దేవయ్య, కేకే మహేందర్రెడ్డి, కొమిరెడ్డి రామ్లు, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కొలగాని మహేశ్తోపాటు పలువురి పేరుŠల్ కమిటీల్లో కనిపించ లేదు. కీలకమైన ఈ కమిటీల్లో పలువురిని విస్మరించడంపై పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. గతంలో నిర్వహించిన పదవులు : 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యుల ఫోరమ్ కన్వీనర్ (ఉమ్మడి రాష్ట్రంలో), ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ (2005–2009), పీసీసీ మీడియా కో ఆర్డినేటర్ (2002–2004), యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(2002–2003), ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు (1999–2002), ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు (1992–1998), ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి (1989–1991), ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి (1987–1989), ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి విభాగం అధ్యక్షుడు(1987–88). -
బలోపేతానికి కృషి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే ఐదారు నెలల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా సమీక్షసమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా, మండలకేంద్రాల్లోపార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా నాయకులకు సూచించారు. అందుకోసం జిల్లాలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీలోని ఇతర నాయకులతో పార్టీ జిల్లా కన్వీనర్ మాట్లాడి నెలరోజుల్లో జిల్లాస్థాయిలో ఒక సదస్సును నిర్వహించాలని చెప్పారు. గతంలో పార్టీలో ఉండి ఇప్పుడు స్తబ్దుగా ఉన్న నాయకుల జాబితాను నియోజకవర్గాల వారీగా తయారు చేసి తనకు అందజేయాలని జిల్లా నాయకులను ఆయన కోరారు. ముందుగా వారితో తాను మాట్లాడి, ఆ తర్వాత పార్టీ పెద్దలతో కూడా మాట్లాడిస్తానని చెప్పారు. గతంలో పార్టీలో ఉన్న నాయకులు మళ్లీ చురుకైన పాత్రను నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్నేని బాబు, సీనియర్ నాయకులు గాదె నిరంజన్రెడ్డి, ఎం.రవీందర్రెడ్డి(నాగార్జునసాగర్), జి.జైపాల్రెడ్డి(భువనగిరి), వి.వెంకటేశ్ (ఆలేరు), సునీల్కుమార్ (నల్గొండ అర్బన్), జిట్టా రామిరెడ్డి (సూర్యాపేట), ఎం.గవాస్కర్రెడ్డి(మునుగోడు), రాష్ర్ట పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement