-
World Humanitarian Day: మానవత్వం కావాలి
‘మనుషులు అడ్డం పడి ఉంటే ఆమె బతికేదేమో’ అని పోలీసు అధికారులు అన్నారు. విజయవాడలో రమ్యపై కత్తిపోట్లు పడుతున్నప్పుడు మానవత్వం నిజంగా తెల్లముఖం వేసింది. ‘మనకెందులే’ అనేది నేటి మానవత్వమా? ‘ఎన్నని పట్టించుకుంటాం’ అనేది మానవత్వమా? ‘మనం బాగుంటే చాలు’ అనేది మానవత్వమా? ‘పొరుగువాడికి సాయపడవోయ్’ అన్నారు పెద్దలు. స్పందనాగుణం ఉన్న మనిషినే మానవుడంటారు. మనిషి స్థాయిలో ఉండిపోదామా... మానవులవుదామా... మనిషి బండబారితే ఆ సంఘం రాతిమయం అవదా? ఇది అందరికీ తెలిసిన పాత కథే. ఒక యోగ్యుడు నదిలో స్నానం చేస్తున్నాడు. ఉధృతి ఎక్కువగా ఉంది. నదిలో ఒక తేలు కొట్టుకొని వస్తూ ఉంది. యోగ్యుడు ఆ తేలును చూశాడు. దానిని అలాగే వదిలేస్తే అది చచ్చిపోతుంది. వొడ్డున పడేయాలని దోసిట్లోకి తీసుకున్నాడు. తేలు కుట్టింది. వదిలేశాడు. నీళ్లల్లో పడింది. మళ్లీ దోసిట్లోకి తీసుకున్నాడు. మళ్లీ కుట్టింది. నొప్పికి పడేశాడు. మళ్లీ తీసుకున్నాడు. మళ్లీ కుట్టింది. ఒడ్డున ఉన్న స్నేహితుడు ‘ఎందుకయ్యా... అది కుడుతూ ఉన్నా కాపాడాలని పాకులాడుతున్నావ్’ అంటాడు. దానికా యోగ్యుని జవాబు ‘అది తేలు. కుట్టడం దాని ధర్మం. నేను మనిషిని. కాపాడటం నా ధర్మం’ ఈ కథను నేటి మనిషికి మళ్లీ గుర్తు చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఒకరికొకరు చెప్పుకోవాల్సి వస్తోంది. స్పందనా గుణం పాదుకొనాల్సింది ఇంట్లోనే కదా. ఆపై బడిలో అదొక మహోన్నత విలువగా నూరిపోయాలి. బాధలో ఉన్న పౌరుణ్ణి చూసి రాజ్యమే వదిలేశాడు బుద్ధుడు మనిషి గురించి ఆలోచన చేయాలని. బాధలో ఉన్న తోటి మనిషి కోసం వీరుడయ్యాడు స్పార్టకస్. బాధలో ఉన్న మనిషి కోసం జీవితాన్నే అర్పించింది మదర్ థెరిసా. కష్టం పంచుకోకపోతే మనిషి ఏం పంచుకుంటాడు. స్పందించకపోతే మనిషి మనిషిగా ఎలా ఉంటాడు. పురాణాల్లోనూ చరిత్రలోనూ మానవ స్పందన ‘సాయం’గానో లేదంటే ‘దానం’గానో ప్రస్తావనకు వచ్చింది. కర్ణుడు దగ్గరకు వచ్చినవాళ్లు ఒట్టి చేతులతో పోరు. కష్టంలో ఉన్న రాముడికి సాయం చేయబట్టే కదా వానర సేన ప్రతినిధి ఆంజనేయుడు నేడు పూజలందుకుంటున్నాడు. మనిషి కూడా దేవుణ్ణి కొలిచేది ఆపదలో ఉంటే ఆదుకొంటాడు. ఆపద్బాంధవుడే దేవుడు. ఆ పని వద్దా? కాని మనిషి తాను అందుకోలేని విలువను మనుగడలో ఉంచడానికి ఇష్టపడదు. నలుగురికి సాయం చేయాలనుకోవడం, నలుగురి కోసం పని చేయాలనుకోవడం, నలుగురి కోసం సొంత సొమ్మును ధారాదత్తం చేయాలనుకోవడం ‘బతకడం చేత కాని పని’గా, ‘అనుసరించడానికి వీల్లేని జీవితం’ గా ప్రచారం చేశాడు. ఉన్నతమైన సంఘసేవ అనే మాటను తిట్టు కింద మార్చాలనే వరకూ వెళ్లాడు. కాని సాటి మనిషికి సేవ, సాయం చేసే పనికి ఎన్నడూ మురికి అంటదు. ఆ పని గొప్పది. అందుకే అది మురికిని దాటి ఎప్పటికప్పుడు గొప్ప మనుషుల ద్వారా వెలుగుతూనే ఉంటుంది. మారాల్సిన యువతరం ‘బాగా చదువుకో. పెళ్లి చేసుకో. డబ్బు సంపాదించి సుఖపడు’ ఇదే ఇవాళ ఎక్కువగా యువతరానికి తల్లిదండ్రులు, సమాజం బోధిస్తున్నది. అట్టి వానికే విలువ. కాని రోడ్డున పడి తిరుగుతున్న పిచ్చివాళ్లను చేర దీయడమో, దీనులకు వైద్య సాయం అందేలా చూడటమో, నిరుపేదలకు వారికి అందాల్సిన పథకాలు అందేలా చూడటమో, బాధితులకు వారి హక్కులు దక్కేలా చేయడమో, విష వలయాలలో చిక్కుకున్న స్త్రీల కోసం పని చేయడమో... ఇవన్నీ ఇంకెవరో చేయాలి... మన పిల్లలు మాత్రం కాదు అనే వైఖరి ఇప్పటి సమాజానిది. బాగా చదువుకుని, స్థిరపడటం ఎవరూ వద్దనరు. కాని స్థిరపడ్డాక ఒక మానవ కర్తవ్యం ఉంటుంది. దానిని పాటించాలని ఎందుకు చెప్పరు? ఇవాళ లక్ష రూపాయలకు మించి జీతం తెచ్చుకుంటున్న ఉద్యోగులు ఎందరో ఉంటారు. వారిలో ఎందరు ఒక పేద విద్యార్థి చదువుకు సాయం చేస్తున్నారు? ఒక పేద రోగికి సాయం చేస్తున్నారు? గమనించుకోవాలి. ధార్మిక సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు మానవ సాయం చేయడానికి రావడం లేదు. కాని ధర్మం కూడా మానవసేవే మాధవ సేవ అని కదా చెప్పింది. మనకెందుకు అందామా? రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. మనకెందుకు... అని వెళ్లిపోవాలి. ఎవరో ఎవరినో పొడుస్తుంటారు. మనకెందుకు అని చోద్యం చూడాలి. పక్కింట్లో ఒక భర్త భార్యను దారుణంగా కొడుతుంటాడు. మనం మన డోర్ మూసుకోవాలి. ఎదురింట్లో చిన్న వయసు ఉన్న పనమ్మాయిని హింసిస్తుంటారు. మనం గట్టిగా కళ్లు మూసుకోవాలి. ఇదా మనం నేర్చుకోవాల్సింది. పిల్లలకు నేర్పాల్సింది. పూర్వం సత్రాలు కట్టిన మహానుభావులు, స్కూళ్లు కట్టిన దాతలు, ఆస్పత్రులకు ఆస్తులు ఇచ్చిన సహృదయలు... వీరందరి వల్ల కదా సమాజాలు ముందుకు పోయింది. సాయం, స్పందన ఉంటేనే సమాజం. లేకుంటే రాళ్ల కుప్ప. రోడ్డు దాటించడం కూడా... సినిమాల్లో హీరో అంధుల్ని రోడ్డు దాటించడమే పెద్ద గొప్పగా, వీధి బాలలకు ఐస్ కొనివ్వడమే మానవత్వంగా చూపించే స్థాయికి మానవత్వం పడిపోయింది. యుద్ధస్థలాలకు, భూకంపం ఏర్పడిన చోటుకు, వరదల సమయంలో, కరువు కాటకాలకు పరిగెత్తుకుపోవడం కదా అసలైన గొప్ప. ఆ సమయంలో స్పందించినవాడే అసలైన మనిషి. కాని అలాగని అలాంటి వారు లేరని కాదు. కరోనా కాలంలో బాధితులకు వందల, వేల మంది సాయం అందించడానికి ముందుకు వచ్చారు. వలస జీవులు రోడ్డున నడుస్తుంటే వారి కోసం ఆహార పొట్లాలు, నీళ్లు అందుకుని పరిగెత్తిన వారు ఉన్నారు. కొన్ని ప్రమాదాల్లో అద్భుతంగా స్పందించిన మనుషులు ఎందరో. కాని ఈ శాతం సరిపోదు. ప్రపంచ దేశాల ప్రజలంతా కలిసి ఒక్క మానవజాతి కాగలగాలి. సరిహద్దులకు, జాతులకు, దేశాలకు సంబంధం లేకుండా ఒకరి కష్టానికి ఒకరు బదులు పలకడమే లక్ష్యంగా ఎదగగలగాలి. ఇవాళ అఫ్ఘానిస్తాన్ మాకెవరూ లేరు అని రోదించే స్థితిలో ఈ ప్రపంచం ఉందంటే మానవత్వ సూచిలో అందరూ ఏ స్థానంలో ఉన్నట్టు..? సాయం అందుతుంది... సాయానికి సాటి మనిషి ఉన్నాడు అన్న భరోసా కన్నా గొప్పది లేదు. సాయం చేయాలనే తలంపు నాకు ఉంది... చేస్తాను అనుకోవడానికి మించిన ఆత్మ సంస్కారమూ మరొకటి లేదు. ఆ సంస్కారం కోసం నిబద్ధులు కావడమే నేటి ‘ప్రపంచ మానవత్వ దినోత్సవం’ సందర్భంగా అందరూ చేయవలసిన పని. -
ఘనంగా ‘సుధీక్షణ్’ అవార్డుల ప్రదానం
విజయవాడ : ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఐదు రంగాలలో విశేష కృషి చేసిన నిష్ణాతులకు చిగురుపాటి సుధీక్షణ్ ఫౌండేషన్ వారు ఎక్స్లెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు డాక్టర్ త్రిపురనేని హనుమాన్చౌదరి, అగ్రికల్చరల్ సైన్స్ విభాగంలో మండవ జానకీరామయ్య, కల్చరల్ అండ్ లిటరేచర్ విభాగంలో ఆనంద్ కూచిభొట్ల(యూఎస్ఏ), విద్యారంగంలో జ్యోత్స్న రాఘవాచారి, సామాజిక సేవా విభాగంలో జి.రస్మి సమరానికి అవార్డులు అందజేశారు. సిద్ధార్థ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన కృష్ణా జిల్లాను అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. సుధీక్షణ్ ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆమె కొనియాడారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అవార్డు గ్రహీత త్రిపురనేని హనుమాన్చౌదరి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు చవుదుకోవాలని, విద్యతో అసమానతలు తొలగిపోతాయని చెప్పారు. అనంతరం 15 మంది వికలాంగ బాలలకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధీక్షణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సీహెచ్ విమల, ఐఈఐ చైర్మన్ పి.రవీంద్రబాబు, కేసీపీ సీఈవో జి.వెంకటేశ్వరరావు, కృష్ణా ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి జి.వి.రామారావు, విశ్రాంత వైద్యుడు అశోక్ సూర్య, మాధవి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
అరసవల్లిలో భక్తుల రద్దీ
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement