-
World Snooker Championship 2022: నాకౌట్ దశకు పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. టర్కీలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ ‘కె’లో ఉన్న పంకజ్ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి గ్రూప్ టాపర్గా నిలిచాడు. తొలి మ్యాచ్లో పంకజ్ 3–0తో రెహమాన్ (టర్కీ)పై, రెండో మ్యాచ్లో 3–0తో సమీర్ (ఈజిప్ట్) పై, మూడో మ్యాచ్లో 3–0తో మార్కో రీజెర్స్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. 37 ఏళ్ల పంకజ్ ఇప్పటి వరకు వివిధ ఫార్మాట్లలో కలిపి 25సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. -
రెండో రౌండ్లో పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన నాకౌట్ తొలి రౌండ్లో పంకజ్ 4–0 (79–13, 54–2, 139–0, 74–1) ఫ్రేమ్ల తేడాతో అహ్మద్ సలూమీ (యెమెన్)పై విజయం సాధించాడు. లీగ్ దశలో గ్రూప్ ‘బి’లో పోటీపడిన పంకజ్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి టాపర్గా నిలిచాడు. నాకౌట్ మ్యాచ్ల్లో టాప్ సీడ్గా బరిలోకి దిగాడు. భారత్కే చెందిన అలోక్ కుమార్, లక్ష్మణ్ రావత్ కూడా నాకౌట్ తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేశారు. -
రన్నరప్ అమీ కమాని
ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్ మాస్టర్స్ విభాగంలో విజేత ధర్మేందర్ దోహా: ఫైనల్కు చేరిన తొలిసారే ప్రపంచ స్నూకర్ చాంపియన్గా అవతరించాలని ఆశించిన భారత క్రీడాకారిణి అమీ కమానికి నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో మహిళల విభాగంలో 24 ఏళ్ల అమీ కమాని రన్నరప్గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ వెండీ జాన్స (బెల్జియం) 5-0తో ఫ్రేమ్ల తేడాతో అమీ కమానిపై గెలిచి వరుసగా ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. మధ్యప్రదేశ్కు చెందిన అమీ కమాని ఫైనల్లో నిలకడగా పారుుంట్లు సాధించినా... తుదకు అనుభవజ్ఞురాలైన వెండీ జాన్సదే పైచేరుుగా నిలిచింది. మరోవైపు మాస్టర్స్ విభాగంలో భారత్కు చెందిన ధర్మేందర్ లిల్లీ 6-2 ఫ్రేమ్ల తేడాతో ఇవాన్స (వేల్స్)ను ఓడించి విజేతగా నిలిచాడు. పురుషుల విభాగంలో భారత స్టార్ పంకజ్ అద్వానీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్లో పంకజ్ అద్వానీ 2-7 ఫ్రేమ్ల తేడాతో ఆండ్రూ పాజెట్ (వేల్స్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో సోహైల్ వహీది (ఇరాన్) 8-1తో పాజెట్ను ఓడించి ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. -
ప్రపంచ స్నూకర్ ఫైనల్లో అమీ కమాని
దోహా: భారత క్రీడాకారిణి అమీ కమాని ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో అమీ కమాని 4-2 (60-50, 68-15, 50-30, 9-69, 20-57, 61-56) ఫ్రేమ్ల తేడాతో వరతనున్ సుక్రుతిహెన్స (థాయ్లాండ్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అమీ కమాని 4-1తో భారత్కే చెందిన చిత్రా మగిమైరాజన్పై గెలిచింది. మరోవైపు పురుషుల విభాగంలో భారత స్టార్ క్రీడాకారుడు పంకజ్ అద్వా నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 6-5 (65-35, 64-75, 5-113, 75-0, 120-15, 76-20, 61-64, 98-0, 49-74, 0-120, 56-45) ఫ్రేమ్ల తేడాతో థనావత్ తిరపోంగ్పైబూన్ (థాయ్లాండ్)పై గెలుపొందాడు. అంతకుముందు ప్రిక్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5-3 (13-63, 100-28, 133-7, 34- 72, 44-76, 83-20, 49-45, 70-43) ఫ్రేమ్ల తేడాతో కీన్ హూ మో (మలేసియా)పై నెగ్గగా... రెండో రౌండ్లో 5-3 (68-22, 51-72, 67-74, 95-19, 7-113, 83-1, 75-17, 84-19) ఫ్రేమ్ల తేడాతో బాబర్ మాసి (పాకిస్తాన్) ను ఓడించాడు. భారత్కే చెందిన మానన్ చంద్ర, లక్కీ వత్నాని ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. మానన్ చంద్ర 0-5తో మైకేల్ జడ్జ (ఐర్లాండ్) చేతిలో, లక్కీ వత్నాని 2-5తో ఆండ్రూ పాజెట్ (వేల్స్) చేతిలో ఓటమి చవిచూశారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ వారుుదా న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రజలు, వ్యాపారులకే కాదు... క్రీడలకూ తగిలింది. దీని వల్ల ప్రొ రెజ్లింగ్ లీగ్ వారుుదా పడింది. నిజానికి ముందే అనుకున్న షెడ్యూలు ప్రకారం వచ్చే నెల 15 నుంచి ఈ ఫ్రాంచైజీ లీగ్ రెండో సీజన్ ఆరంభం కావాలి. కానీ నగదు కొరత కారణంగా కొన్నాళ్లు వారుుదా వేయాలని ఫ్రాంచైజీ యజమానులు, స్టేక్ హోల్డర్లు కోరడంతో లీగ్ ప్రమోటర్, ప్రొ స్పోర్టిఫై డెరైక్టర్ విశాల్ గుర్నాని టోర్నీని వారుుదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త షెడ్యూలును బుధవారం (ఈనెల 30న) వెల్లడిస్తామని చెప్పారు. గతేడాదిలాగే ఫ్రాంచైజీ జట్లు ఆరే ఉంటాయని, జట్ల సంఖ్యను పెంచబోమని చెప్పారు. -
నాకౌట్ దశకు పంకజ్
ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్ బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకున్న భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ నాలుగో లీగ్ మ్యాచ్లో పంకజ్ 4-2 (44-74, 60-32, 12-60, 98-0, 80-3, 72-21) ఫ్రేమ్ల తేడాతో హైదరాబాద్కు చెందిన లక్కీ వత్నానిపై గెలిచాడు. ఇదే గ్రూప్లో పంకజ్ మరో రెండు లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. గ్రూప్ ‘ఎఫ్’లో భారత్కే చెందిన కమల్ చావ్లా వరుసగా నాలుగో విజయాన్ని సాధించి నాకౌట్ దశకు చేరుకున్నాడు. మహిళల విభాగం నుంచి చిత్రా మగిమైరాజన్, అమీ కమాని కూడా నాకౌట్ దశకు అర్హత పొందారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement