-
గణాంకాలు, ఫలితాల ప్రభావం
ద్రవ్యోల్బణ గణాంకాలు ♦ చివరి బ్యాచ్ క్యూ3 ఫలితాలు ♦ యూపీ ఎన్నికల సరళి ♦ ఈ వారం మార్కెట్ ప్రభావిత అంశాలు ఇవే.. న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ సరళి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు ఈ వారం వెలువడే కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు, డాలర్తో రూపాయి మారకం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ. తదితర అంశాలు స్టాక్ సూచీల కదలికలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, చివరి బ్యాచ్ క్యూ3 ఫలితాలు సెంటిమెంట్పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. నేడు(సోమవారం) మార్కెట్ ముగిసిన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతాయి. ఇక ఈ వారంలో హిందాల్కో, ఎన్ఎండీసీ, సన్ఫార్మా, టాటా మోటార్స్, హెచ్పీసీఎల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదానీ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, వేదాంత, నాల్కో, పవర్ ఫైనాన్స్ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వెలువడతాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి మార్కెట్ చలిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అబ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వారంలో మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. సోమవారం నాటి ట్రేడింగ్ ప్రారంభంలో గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం ఉంటుంది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడి 28,334 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 8,794 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. విదేశీ కొనుగోళ్ల జోరు.. నాలుగు నెలలుగా సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు ఫిబ్రవరిలో అడ్డుకట్ట పడింది. విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుల విషయమై స్పష్టత రావడంతో ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.5,827 కోట్లు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.2,088 కోట్లు, డెట్ సెగ్మెంట్లో రూ.3,739 కోట్లు చొప్పున పెట్టుబడలు పెట్టారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.80,310 కోట్లు విలువైన పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
తొలుత -170, ఆపై +170
- చివరికి 116 పాయింట్లు ప్లస్ - 27,207 వద్ద ముగిసిన సెన్సెక్స్ - 2 వారాల గరిష్టానికి మార్కెట్లు మార్కెట్ అప్డేట్ ప్రపంచ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రధాన సూచీలు 340 పాయింట్లస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఆసియా మార్కెట్ల నష్టాల కారణంగా సెన్సెక్స్ తొలుత నష్టాలతో మొదలైంది. 26,919 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ఆపై మిడ్ సెషన్ నుంచీ సెంటిమెంట్ బలపడటంతో నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. గరిష్టంగా 27,255కు చేరింది. చివరికి 116 పాయింట్ల లాభంతో 27,207 వద్ద స్థిరపడింది. ఇది రెండు వారాల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా తొలుత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ 25 పాయింట్లు బలపడి 8,146 వద్ద ముగిసింది. ప్రధానంగా టాటా మోటార్స్(4%), ఓఎన్జీసీ(3.5%), ఐటీసీ(3%), హీరో మోటో(1.5%), ఎస్బీఐ(1.5%) వంటి దిగ్గజాలు ప్రధాన సూచీలకు అండగా నిలిచాయి. వినియోగ వస్తు సూచీ 3% అప్ బీఎస్ఈలో వినియోగ వస్తువుల సూచీ అత్యధికంగా 3% పుంజుకోగా, ఎఫ్ఎంసీజీ 2%, ఆటో 1% చొప్పున లాభపడ్డాయి. మెటల్స్ 1%పైగా నష్టపోయింది. వినియోగ షేర్లలో పీసీ జ్యువెలర్స్ 20% జంప్చేయగా, సింఫనీ, వీఐపీ, రాజేష్ ఎక్స్పోర్ట్స్, వర్ల్పూల్, టైటన్, బ్లూస్టార్ 9-2% మధ్య పెరిగాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా, భెల్, టాటా స్టీల్, హిందాల్కో, ఇన్ఫీ 2.5-1.5% మధ్య క్షీణించాయి. న్యూలాండ్ ల్యాబొరేటరీస్: రైట్స్ ఇష్యూ సెప్టెంబరు 29న ప్రారంభమై అక్టోబరు 16న ముగుస్తుంది. ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ.25 కోట్లు సమీకరించనుంది. రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకు రూ.194 ప్రీమియం నిర్ణయించారు. ప్రతి 25 షేర్లకుగాను నాలుగు షేర్లు కేటాయిస్తారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement