-
క్లాసీ, స్టయిలిష్ లుక్లో ‘జీటీ150 ఫేజర్ బైక్’: వివరాలు ఇలా..
సాక్షి,ముంబై: జపాన్కు చెందిన ద్విచక్ర వాహన తయారీదారు బ్రాండ్ యమహా కొత్త బైక్ను విడుదల చేసింది. యమహా ఆర్ ఎక్స్ 149 మోడల్ కు లేటెస్ట్ వెర్షన్గా ‘జీటీ 150 ఫేజర్’ పేరుతో చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. క్లాసిక్ లుక్లో స్టయిలిష్గా యూత్ను ఆకట్టుకునేలా లాంచ్ చేసింది. చైనాలో ఈ బైక్ ప్రారంభ ధరను 13,390 యువాన్లు అంటే ఇది భారతీయ రూపాయలలో దాదాపు రూ. 1.60 లక్షలు. త్వరలోనే ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్టు సమాచారం. యమహా జీటి 150 ఫేజర్ ఇంజీన్ ఇందులోని 150సీసీ ఇంజన్ 7,500 ఆర్ పీఎం వద్ద 12.3 హార్స్ పవర్, 12.4 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వైట్, గ్రే, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో లభిస్తుంది . ఇక ఫీచర్ల విషయానికి వస్తే అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్ ఇంజన్, సిగ్నేచర్ రెట్రో బిట్స్లో రౌండ్ హెడ్ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, ఫోర్క్ గైటర్లు, ఫెండర్లతో కూడిన ఫ్రంట్, రియర్ సస్పెన్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ పి150కి గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఎన్ని ఉన్నా ఈ బైక్ క్రేజ్ వేరబ్బా.. యమహా నుంచి ఆ మోడల్ మళ్లీ వస్తోంది!
యూత్లో బైక్లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో బోలెడన్ని బైకులు దర్శనమిస్తున్నాయి. అయితే ఎన్ని ఉన్నా మార్కెట్లో యమహా ఆర్ఎక్స్ 100కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 దశకంలో యువతని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఈ బైక్లను నిలిపేసి 25 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అవి రోడ్లపై దర్శనమిస్తున్నాయి. అయితే ఆ మోడల్ బైక్ కోసం కలలు కనే వారి కోసం తాజాగా యమహా కంపెనీ ఓ శుభవార్త తీసుకువచ్చింది. ఆర్ఎక్స్ 100 బైక్ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యువత కలల బైక్ రానుంది యమహా ఇండియా చైర్మన్ ఐషిన్ చిహానా మాట్లాడుతూ.. కొత్తగా రాబోతున్న యమహా RX100 ఆధునిక డిజైన్ , స్టైలిష్ లుక్తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ బైక్ పాత మోడల్కి మార్కెట్లో ఇప్పటికీ డిమాండ్ ఉంది, వాటిని దృష్టిలో పెట్టుకుని బైక్ లవర్స్ని ఆకట్టుకునేలా డిజైన్, తయారీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2026 తర్వాత మార్కెట్లోకి కొత్త వెర్షన్ ఆర్ఎక్స్100 బైక్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే వచ్చే మూడేళ్లలో యమహా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోందని చిహానా పేర్కొన్నారు. ప్రస్తుతానికి, రాబోయే యమహా ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం యమహాకు భారత్లో గ్రేటర్ నోయిడా, చెన్నైలో ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే వాటితో 30 దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. కాగా యమహా కంపెనీ 1985 నుంచి ఉత్పత్తి ప్రారంభించి ఆర్ఎక్స్100బైక్ను 1996 వరకు కొనసాగించారు. చదవండి: 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి -
వాహనాల ‘రెంటల్’ బిజినెస్లోకి యమహా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న యమహా మోటార్ కో ఆటోమొబైల్ అసెట్ మేనేజ్మెంట్, సర్వీసెస్లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా షేర్డ్, రెంటల్ మొబిలిటీ విభాగంలో ఉన్న కంపెనీలకు వాహనాలను సరఫరా చేస్తుంది. ఇందుకోసం కొత్త, పాత వాహనాలను కొనుగోలు చేయనుంది. సర్వీస్, విడిభాగాల కేంద్రాలు సైతం ఏర్పాటవుతాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఆసరాగా డెలివరీ సేవలు అందిస్తున్న కంపెనీలతో ప్రధానంగా చేతులు కలుపనున్నట్టు యమహా ప్రకటించింది. షేర్డ్, రెంటల్ మొబిలిటీ విభాగంలో వాడకం పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యమని వివరించింది. -
అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎంతో తెలుసా?
ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలలో ఒకటి అయిన యమహా తన ప్రత్యర్థులతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఆలస్యంగా అడుగుపెట్టింది. కంపెనీ కొంతకాలం క్రితం తీసుకొచ్చిన ఈ-వినో ఎలక్ట్రిక్ స్కూటర్ అంత పాపులర్ కాలేదు. అందుకు ముఖ్య కారణ ఆ స్కూటర్ ఛార్జ్, దీనిని ఒకసారి చార్జ్ చేస్తే కేవలం 29 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ అందిస్తుంది. ఆ తర్వాత గోగోరో భాగస్వామ్యం కింద తీసుకొచ్చిన ఈసీ-05 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం తైవాన్ లో అమ్మకానికి ఉంది. అయితే, ఈ జపనీస్ టూ వీలర్ బ్రాండ్ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తోంది. ఈ స్కూటర్ని ఈ01 అనే పేరుతో మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తోంది. ఈ01ని మొదటిసారి 2019 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది. ఈ స్కూటర్ని త్వరలో మార్కెట్లోకి తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యమహా ఈ01 ప్రోటోటైప్ 2019లో వెల్లడించిన కాన్సెప్ట్ మోడల్ డిజైన్ కు దగ్గరగా ఉంది. కాబట్టి, ఈ01లో మాక్సీ-స్కూటర్ స్టైలింగ్, విండ్ స్క్రీన్ ఫ్రంట్ ఏప్రాన్, ఫ్లోటింగ్ రియర్ సెక్షన్, వైడ్ హ్యాండిల్ బార్లు ఉంటాయి. అయితే, ప్రొడక్షన్ రెడీ మోడల్ లో రీడిజైన్ చేయబడ్డ స్టెప్ అప్ సీటు ఉంది. జపనీస్ బ్రాండ్ ఈ01కి చెందిన పూర్తి స్పెసిఫికేషన్ లను వెల్లడించలేదు. అయితే దీనిని సింగిల్ ఛార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్ల రేంజ్ అందించే 4 కెడబ్ల్యుహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ 125సీసీ స్కూటర్ కి సమానంగా దూసుకెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ గల ఎల్సిడి డిస్ప్లే కలిగి ఉంటుంది. (చదవండి: వినియోగదారులకు భారీ షాక్, వీటి ధరలు పెరగనున్నాయ్) -
సరికొత్త లుక్తో యమహా ఎమ్టీ 10, ఎమ్టీ 10 ఎస్పీ బైక్స్..!
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా మోటార్స్ మిలాన్లో జరుగుతున్న ఇక్మాషో (EICMA)లో యమహా ఎమ్టీ 10, ఎమ్టీ 10 ఎస్పీ బైక్లను ఆవిష్కరించింది. రివైజ్డ్ స్టైలింగ్తో ఈ బైక్స్ రానున్నాయి. ఈ బైక్ యూరో 5 స్పెసిఫికేషన్ మోటార్తో అధిక పవర్ను కలిగి ఉంటుంది. మెరుగైన ఎలక్ట్రానిక్స్ ప్యాకేజ్తో సిక్స్-యాక్సిస్ ఐఎంయూను కలిగి ఉంది. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ 650 లిమిటెడ్ ఎడిషన్ ..! ఈ బుల్లెట్ బండ్లను చూస్తే ఫిదా అవాల్సిందే..! ఎంటీ 10 ఎస్పీ కూడా లేటెస్ట్ ఫీచర్లతో రానుంది.మునుపటి మోడల్ కంటే అధికంగా 5బీహెచ్పీ శక్తిని అందించనుంది. ఈ బైక్ల పీక్ పవర్ 162బీహెచ్పీకు చేరనుంది. వీటిలో అదనంగా సిక్స్-యాక్సిస్ ఐఎమ్యూ పొందుతుంది. బ్రేకింగ్ వ్యవస్థలో సరికొత్త రేడియల్ బ్రెంబో మాస్టర్ సిలిండర్ను అమర్చారు. డ్యూయల్ 320ఎమ్ఎమ్ డిస్క్లతో జత చేయబడింది. ఎమ్టీ 10లో అప్గ్రేడ్గా యమహా ఎమ్టీ 10 ఎస్పీ రానుంది. దీనిలో సెమీ-యాక్టివ్ సస్పెన్షన్, త్రీ-పీస్ బెల్లీ పాన్ , స్టీల్డ్ బ్రేక్ లైన్లను అమర్చారు. యమహా ఎంటీ 10 బైక్ ధర సుమారు రూ. 14 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి: మార్కెట్లోకి షియోమీ ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేది అప్పుడే..?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement