-
యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు
టెస్టు క్రికెట్లో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఆస్ట్రేలియన్ దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. జూన్ 4, 1993న వార్న్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గాటింగ్ను ఔట్ చేసిన విధానం ఎవరు మరిచిపోలేరు. పూర్తిగా లెగ్స్టంప్ దిశగా వెళ్లిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్స్టంప్ వికెట్ను ఎగురగొట్టి.. క్రీజులో ఉన్న మైక్ గాటింగ్ సహా.. ఆసీస్ తోటి ఆటగాళ్లు, అభిమానులు సహా యావత్ క్రీడా ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. క్రికెట్ బతికున్నంతవరకు షేన్ వార్న్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. ఆ తర్వాత ఎంతో మంది బౌలర్లు వార్న్ లాగే ఆ ఫీట్ అందుకున్నప్పటికీ వార్న్ వేసిన బంతికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ స్టార్ యాసిర్ షా కూడా అచ్చం వార్న్ తరహాలోనే వేసిన బంతిని క్రికెట్ అభిమానులు సహా కామెంటేటర్స్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా అభివర్ణిస్తున్నారు. అయితే యాసిర్ వేసిన బంతిని దిగ్గజ బౌలర్తో పోల్చడం ఏంటని కొందరు అభిమానులు కొట్టిపారేసినప్పటికి.. అచ్చం వార్న్ బౌలింగ్ యాక్షన్ను పోలి ఉండే.. యాసిర్ షా వేసిన బంతి కూడా అదే తరహాలో చరిత్రలో నిలిచిపోనుంది. పాకిస్తాన్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్లో ఈ అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. యాసిర్ షా డెలివరీకి అప్పటికే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న కుషాల్ మెండిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. కుషాల్ 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ 56వ ఓవర్లో యాసిర్ షా బౌలింగ్కు వచ్చాడు. క్రీజులో ఉన్న కుషాల్కు పూర్తిగా లెగ్స్టంప్ అవతల వేసిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్ స్టంప్ను ఎగురగొట్టింది. తాను వేసిన బంతి అంతలా టర్న్ అవుతుందని యాషిర్ షా కూడా ఊహించి ఉండడు. అందుకే వికెట్ పడగానే గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో లంక పాక్ ముందు 342 పరుగుల టార్గెట్ ఉంచింది. ప్రస్తుతం పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 3, బాబర్ ఆజం 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 185 పరుగులు దూరంలో ఉండగా.. మరొక రోజు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో శ్రీలంక మిగిలిన 8 వికెట్లు తీయగలిగితే విజయం సాధిస్తుంది. Ball of the Century candidate❓ Yasir Shah stunned Kusal Mendis with a stunning delivery which reminded the viewers of Shane Warne’s ‘Ball of the Century’.#SLvPAK pic.twitter.com/uMPcua7M5E — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 18, 2022 The greatest Test delivery ever? pic.twitter.com/MQ8n9Vk3aI — cricket.com.au (@cricketcomau) March 4, 2022 చదవండి: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది.. ఐసీసీ ట్వీట్ Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్తో అదరగొట్టిన పాక్ బౌలర్ -
రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ సీనియర్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా రీఎంట్రీ మ్యాచ్లోనే అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో యాసిర్ షా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యాసిర్ షా ఐదో స్థానానికి చేరుకున్నాడు. లంక సీనియర్ బ్యాట్స్మన్ ఏంజెల్లో మాథ్యూస్ను ఔట్ చేయడం ద్వారా యాసిర్ టెస్టుల్లో 237వ వికెట్ను దక్కించుకున్నాడు. తద్వారా అబ్దుల్ ఖాదీర్(236 వికెట్లు)ను దాటిన యాసిర్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక యాసిర్ షా కంటే ముందు పాక్ దిగ్గజ బౌలర్లు వసీమ్ అక్రమ్(414 వికెట్లు), వకార్ యూనిస్(373 వికెట్లు), ఇమ్రాన్ ఖాన్(362 వికెట్లు), దానిష్ కనేరియా(261) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక యాసిర్ షా పాకిస్తాన్ క్రికెట్లో పెను సంచలనం. వైవిధ్యమైన బౌలింగ్తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ►2014లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యాసిర్ షా పాకిస్తాన్ తరపున 50 వికెట్లు అత్యంత వేగంగా తీసిన బౌలర్గా నిలిచాడు. ►టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని(17 టెస్టుల్లో 100 వికెట్లు) అందుకున్న ఆటగాడిగా మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ►200 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న తొలి ఆటగాడిగా యాసిర్ షా చరిత్ర. 33 టెస్టుల్లో యాసిర్ 200 వికెట్లు సాధించాడు. అంతకముందు ఆస్ట్రేలియా బౌలర్ క్లారీ గ్రిమెట్(36 టెస్టుల్లో 200 వికెట్లు) పేరిట ఈ రికార్డు ఉంది. ►ఇప్పటివరకు యాసిర్ షా పాకిస్తాన్ తరపున 47 టెస్టుల్లో 237 వికెట్లు, 25 వన్డేల్లో 24 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ఫీట్ను 16 సార్లు అందుకున్నాడు. ఇక దాదాపు ఏడాది విరామం తర్వాత మ్యాచ్ ఆడుతున్న యాసిర్ షా లంకతో టెస్టులో మంచి ప్రదర్శననే ఇచ్చాడు. 21 ఓవర్లు వేసిన యాసిర్ షా 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. అజర్ అలీ (3), బాబర్ ఆజం(1) క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 222 పరుగులకు ఆలౌట్ అయింది. చండీమల్ 76 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మహీస్ తీక్షణ 38 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. యాసిర్ షా, హసన్ అలీ చెరో రెండు వికెట్లు తీశారు. -
పాకిస్థాన్ స్పిన్నర్పై అత్యాచారం కేసు నమోదు..!
Yasir Shah Accused In Rape Case: అత్యాచారం కేసులో పాకిస్థాన్ వెటరన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. యాసిర్, అతని స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్కు చెందిన 14 ఏళ్ల బాలిక చేసిన ఆరోపణల నేపథ్యంలో యాసిర్పై కేసు బుక్కైంది. ఫర్హాన్ను పెళ్లి చేసుకోవాలని యాసిర్ ఫోన్ చేసి బెదిరించినట్లు ఆ అమ్మాయి పేర్కొంది. యాసిర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. త్వరలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కాగా, 35 ఏళ్ల యాసిర్ షా 46 టెస్టుల్లో 235 వికెట్లు సాధించి అత్యంత విజయవంతమైన పాక్ స్పిన్నర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. షా వన్డేల్లో సైతం రాణించాడు. 25 వన్డేల్లో 24 వికెట్లు సాధించాడు. చదవండి: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! -
'గెట్ అవుట్ మ్యాన్' అంటూ క్రికెటర్ అసహనం
మౌంట్ మాంగనుయ్ : కివీస్తో జరుగుతున్న మొదటి టెస్టులో పాకిస్తాన్ బౌలర్ యాసిర్ షా న్యూజిలాండ్ బ్యాట్స్మన్ హెన్రీ నికోల్స్పై నోరు పారేసుకున్నాడు. ఆటలో మొదటిరోజు కివీస్ జట్టు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్లు జిడ్డుగా బ్యాటింగ్ చేస్తూనే పరుగులు రాబట్టారు. 120 పరుగులు భాగస్వామ్యం అనంతరం 70 పరుగుల వద్ద రాస్ టేలర్ అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన హెన్రీ నికోలస్తో కలిసి మరో వికెట్ పడకుండా 89 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అలా కివీస్ 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. (చదవండి : సిరాజ్ కోసం ఉదయం 4 గంటలకే టీవీ ముందుకు..) అయితే 90 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన పాక్ బౌలర్లు వికెట్లు తీయడానికి నానా కష్టాలు పడ్డారు. షాహిన్ ఆఫ్రిది తప్ప ఏ ఒక్క బౌలర్ ఆకట్టుకోలేదు. అప్పటికే 16 ఓవర్లు వేసిన స్పిన్నర్ యాసిర్ షా 56 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తీవ్ర అసహనంతో ఉన్న యాసిర్ షా 77వ ఓవర్లో నికోల్స్పై మాట జారాడు. ఈ లెగ్ స్పిన్నర్ వేసిన డెలివరినీ నికోల్స్ కట్షాట్ ఆడదామని భావించాడు. అయితే బంతి మిస్ అయి కీపర్ చేతుల్లో పడింది. దీంతో చిర్రెత్తిపోయిన షా నికోల్స్ను ఉద్దేశించి 'ఔట్ ఓ జా బూత్నీకే'( గెట్ అవుట్ మ్యాన్) అంటూ గట్టిగా అరించాడు. అయితే షా అన్న మాట నికోల్స్కు అర్థం కాకపోవడంతో ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. అయితే ఈ వీడియోనూ ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారింది. యాసిర్ షా చర్యను తప్పుబడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. OUT hoja Bhootni kay 😂😂😂😂😂😂😂😂😂😂 Yasir larky pic.twitter.com/2JSUc8W9uw — ... (@7Strang_er18) December 26, 2020 ఇక 227/3 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ 155 ఓవర్లలో 431 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ విలియమ్సన్ 129 పరుగులు.. సెంచరీతో మెరవగా, నికోల్స్ 56, కీపర్ వాట్లింగ్ 73 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో ఆఫ్రిది 4, యాసిర్ షా 3, అబ్బాస్, నసీమ్ షా, ఫహీమ్ అశ్రఫ్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. అబీద్ అలీ 19, మహ్మద్ అబ్బాస్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : పైన్ అద్భుత క్యాచ్కు పుజారా బలి) -
‘అతనేమీ వార్న్ కాదు.. కుంబ్లే అనుకోండి’
సౌతాంప్టన్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా రాణించాలంటే ప్రస్తుతం పాకిస్తాన్తో జరుగుతున్న సిరీస్లో స్పిన్నర్ యాసిర్ షాను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని నేర్చుకోవాలని ఇంగ్లిష్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సూచించాడు. పాక్తో స్వదేశంలో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఆఖరి టెస్టులో యాసిర్ షా బౌలింగ్ ఆడటానికి భయపడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లను ఉద్దేశించి హుస్సేన్ మాట్లాడాడు. అసలు యాసిర్ షా బౌలింగ్ను ఎదుర్కోవడానికి ఎటువంటి భయాందోళనలు వద్దని, మానసికంగా దృఢంగా ఉంటే అతని బౌలింగ్ను ఆడటం కష్టం కాదన్నాడు. అదే సమయంలో లెగ్ బ్రేక్ బౌలర్ యాసిర్ షాను ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్లా ట్రీట్ చేయవద్దని చురకలంటించాడు. (చదవండి: ఇంగ్లండ్తో సిరీస్పై క్లారిటీ ఇచ్చిన దాదా) యాసిర్ షా ఒక సాధారణ స్పిన్నర్ మాత్రమేనని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే తరహా బౌలర్గా యాసిర్ షాను భావించాలన్నాడు. ఇక్కడ తానేమీ కుంబ్లేను తక్కువ చేయడం లేదన్నాడు. మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో సిబ్లే, ఓలీ పోప్లు యాసిర్ షాకు ఔట్ కావడంపై నాసిర్ హుస్సేన్ స్పందించాడు. సిబ్లే ఎల్బీగా పెవిలియన్ చేరగా, ఓలీ పోప్లు బౌల్డ్ అయ్యాడు. ఈ ఇద్దరూ బ్యాక్ఫుట్ ఆడుతూ వికెట్లు సమర్పించుకోవడంతో హుస్సేన్ కాస్త సెటైరిక్గా మాట్లాడాడు. దానిలో భాగంగానే వార్న్, కుంబ్లే ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘ యాసిర్ షాను మరో వార్న్ అనుకోకండి. అతనొక సాధారణ లెగ్ స్పిన్నర్. కుంబ్లే తరహా బౌలర్ అనుకోండి. నేను ఇక్కడ కుంబ్లేను కించపరచడం లేదు. కేవలం విషయం చెబుతున్నా. వార్న్ ఏ వికెట్పైనైనా తొలి రోజు నుంచే టెస్టుల్లో ఆధిపత్యం చెలాయిస్తాడు. కుంబ్లే అలా కాదు. క్రమంగా వికెట్పై పట్టు సాధిస్తాడు. దాంతోనే వార్న్-కుంబ్లేల పోలిక తెచ్చా’ అని హుస్సేన్ పేర్కొన్నాడు. ఈ మూడు టెస్టుల సిరీస్లో ఇప్పటివరకూ యాసిర్ షా 11 వికెట్లు సాధించాడు. ఈ సిరీస్లో తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జాక్ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీ... జోస్ బట్లర్ (152; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించారు. ఆపై బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్కు 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ కెప్టెన్ అజహర్ అలీ (141 నాటౌట్) సెంచరీ సాధించాడు. అలాగే టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని దాటి అరుదైన జాబితాలో చేరిపోయాడు.(చదవండి: ‘ఇదేనా ధోనికిచ్చే గౌరవం’)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement