-
నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు
పవర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు బాబీ(కె.యస్.రవీంద్ర). దర్శకుడిగా మూడు సినిమాలు మాత్రమే చేసిన ఈ యంగ్ టెక్నీషియన్ త్వరలో నిర్మాతగా మారనున్నాడు. రెండో సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్ను డైరెక్టర్ చేసి ఛాన్స్ కొట్టేసిన ఈ యువ దర్శకుడు సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. సర్థార్ ఫెయిల్యూర్ తో గ్యాప్ తీసుకున్న బాబీ, తరువాత ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాను రూపొందించి మరోసారి సత్తా చాటాడు. ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమాను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్న బాబీ, నిర్మాతగా తెరకెక్కించే సినిమా పనులు కూడా చక్కబెట్టేస్తున్నాడు. నిర్మాతగా తొలి సినిమాకు అరుణ్ పవార్ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు బాబీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఓ యువ కథానాయకుడిని సంప్రదిస్తున్నారట. -
పావగడలో విద్యార్థి హత్య
► సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రదర్శనలో అపశ్రుతి ► షో నిలిపివేత పావగడ: థియేటర్లో కుర్చీ కోసం జరిగిన గొడవలో పవన్కల్యాణ్ అభిమాని హత్యకు గురయ్యాడు. స్థానిక అలంకార్ సినిమా థియేటర్లో ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తాలూకా లోని బాలమ్మనహళ్లి గ్రామానికి చెందిన ద్వితీయ సంవత్సరం డిగ్రీ విద్యార్థి, పవన్ కళ్యాణ్ వీరాభిమాని రాకేశ్(20) తన స్నేహితులతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను చూడటానికి శుక్రవారం స్థానిక అలంకార్ థియేటర్ కు వచ్చాడు. మధ్యాహ్నం 12 గంటల మొదటి ఆటకు థియేటర్ లోకి వెళ్లాడు. అంతలో రవి అనే మరో పవన్ అభిమాని రాకేశ్ తో కుర్చీ కోసం గొడవ పడ్డారు. తేల్చుకుందామని ఒకరికొకరు థియేటర్ వెలుపలికి వచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున గొడవ పడ్డారు. ఈ సందర్భంలో రవి నైల్ కట్టర్కు ఉండే చిన్న పాటి చాకుతో రాకేశ్ మెడపై పొడిచాడు. దీంతో ప్రధాన నరం తెగినట్లు చికిత్స అందించిన వైద్యులు భావించారు. చికిత్స పొందుతూ రాకేశ్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి బంధవులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. అప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మృతుడి తల్లి శాంతిబాయి కొడుకు హత్యతో గుండెలవిసేలా రోదించింది. కొన్ని రోజుల క్రితమే భర్త సేవానాయక్ మృతి చెందడాన్ని మరువక ముందే కొడుకు హత్యకు గురి కావడం ఆమెను తీవ్రంగా కలచి వేసింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే సోమ్లానాయక్, మున్సిపల్ చైర్మన్ మానం వెంకటస్వామి పోలీస్ స్టేషన్కు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా సీఐ ఆనంద్కు సూచించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వారణాసి.. రాజకీయ చరిత్ర ఇదే!
ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Love Marriage: లేటు వయసులో ఘాటు ప్రేమ
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూత
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement