-
రివర్స్గేర్లోనే కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు మళ్లీ భారీ తగ్గుదలను నమోదుచేశాయి. ఆగస్టులో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, హోండా కార్స్ అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. మారుతీ విక్రయాలు 33 శాతం తగ్గాయి. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వడ్డీ వ్యయం పెరగడం, బీఎస్–6 ఉద్గార నిబంధనల అమలు, రిజిస్ట్రేషన్ వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్సిఐఎల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ (సేల్స్) రాజేష్ గోయెల్ అన్నారు. ఆగస్టులోనూ ఇవే ప్రతికూలతలు కొనసాగినందున ఈ స్థాయి క్షీణత నమోదైందని టీకేఎం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ రంగంలో మందగమనం కొనసాగుతున్నప్పటికీ తమ కంపెనీ రిటైల్ అమ్మకాలపై దృష్టిసారిస్తుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. -
‘ఆటో’కు కలిసిరాని అక్టోబర్
న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు, ఇంధన రేట్ల పెరుగుదల తదితర అంశాల కారణంగా పండుగ సీజన్ అయినప్పటికీ వాహన తయారీ సంస్థలకు అక్టోబర్ అంతగా కలిసి రాలేదు. అమ్మకాలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా, హోండా కార్స్ వంటి దిగ్గజ సంస్థల వాహన అమ్మకాల వృద్ధి కూడా 1– 2 శాతంగా సింగిల్ డిజిట్కే పరిమితమైంది. టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా మాత్రమే కాస్త చెప్పుకోతగ్గ స్థాయిలో విక్రయాలు నమోదు చేశాయి. మారుతీ సుజుకీ దేశీ అమ్మకాలు 1,38,100 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది 1.5 శాతం అధికం. ఆల్టో, స్విఫ్ట్, బాలెనో వంటి మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు మెరుగ్గానే ఉన్నా... యుటిలిటీ వాహనాల విక్రయాలు మాత్రం తగ్గాయి. మరోవైపు, పోటీ సంస్థ హ్యుందాయ్ 4.9 శాతం వృద్ధితో 52,001 వాహనాలు విక్రయించింది. నెలవారీ అమ్మకాల్లో కంపెనీకి ఇవే అత్యుత్తమ గణాంకాలు. కొత్త శాంత్రోతో పాటు క్రెటా, ఎలీట్ ఐ20, గ్రాండ్ ఐ10 తదితర వాహనాలకు డిమాండ్ ఇందుకు తోడ్పడింది.మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ప్యాసింజర్ వాహన విక్రయాలు 3 శాతం వృద్ధితో 24,066 యూనిట్లకు పెరిగాయి. బలహీన సెంటిమెంటు.. కొనుగోలుదారుల సెంటిమెంటు బలహీనపడటంతో గత కొద్ది నెలలుగా ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్ రిటైల్ అమ్మకాలు మందగించినట్లు ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వధేరా చెప్పారు. ఈ నేపథ్యంలో పండుగ సీజన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంధన రేట్లు, అధిక వడ్డీ రేట్లు, బీమా ప్రీమియం పెంపు వంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ తమ వాహనాలకు డిమాండ్ మెరుగ్గానే కనిపించిందని టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) డిçప్యూటీ ఎండీ ఎన్ రాజా చెప్పారు. టీకేఎం 2 శాతం వృద్ధితో 12,606 యూనిట్లు విక్రయించింది.అటు హోండాకార్స్ ఇండియా విక్రయాలు 14,234 యూనిట్ల నుంచి 14,233 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి పండుగ సీజన్ అయినప్పటికీ కొనుగోలుదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ చెప్పారు. అయితే, అమేజ్, కొత్తగా ప్రవేశపెట్టిన సీఆర్–వీ వాహనాలకు డిమాండ్ మెరుగ్గా కనిపించినట్లు వివరించారు. రెండంకెల్లో టాటా, ఫోర్డ్.. అక్టోబర్లో టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. పరిశ్రమ వృద్ధి 2 శాతానికే పరిమితం కాగా.. ప్రతికూలతలు ఉన్నప్పటికీ తాము 11 శాతం నమోదు చేసినట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్ చెప్పారు. గత నెలలో టాటా మోటార్స్ విక్రయాలు 11 శాతం వృద్ధితో 18,290 యూనిట్లకు పెరిగాయి. అటు ఫోర్డ్ ఇండియా అమ్మకాలు కూడా 4,218 యూనిట్ల నుంచి 9,044 యూనిట్లకు చేరాయి. బ్రాండ్ను పటిష్టపర్చుకోవడం, సరైన ఉత్పత్తిని పోటీ సంస్థలకు దీటైన రేటులో అందించడం, అమ్మకాల ప్రక్రియ మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతుండటం తమకు కలిసి వచ్చినట్లు ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ అనురాగ్ మెహరోత్రా చెప్పారు. టూవీలర్స్లో హీరో .. ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ 16.4 శాతం వృద్ధి నమోదు చేసింది. గత అక్టోబర్లో 6,31,105 యూనిట్లు విక్రయించగా.. ఈసారి 7,34,668 వాహనాలను విక్రయించింది.అటు హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు 12 శాతం వృద్ధితో 4,66,552 యూనిట్ల నుంచి 5,21,159 యూనిట్లకు పెరిగాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 26 శాతం వృద్ధి సాధించింది.3,98,427 వాహనాలను విక్రయించింది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 1 శాతం పెరిగి 70,451కి చేరాయి. అటు సుజుకీ మోటార్సైకిల్ ఇండియా 31 శాతం వృద్ధితో 65,689 వాహనాలను విక్రయించింది. -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ మార్కెట్లు మంగళవారం నాటి ట్రేడింగ్లో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 29.26పాయింట్ల స్వల్ప లాభంతో 28,181 వద్ద నిఫ్టీ 2.35 పాయింట్ల లాభంతో 8,674 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్, రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాట్లాండ్ భారీ ప్రాజెక్టును కోల్పోవడంతో కంపెనీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ముందటి క్లోజింగ్కు 2 శాతం డౌనవుతూ.. ఇన్ఫోసిస్ షేర్ ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ మార్కెట్లు సైతం పడిపోతున్నాయి. ఐటీసీ, పవర్గ్రిడ్లు లాభాల్లో నడుస్తున్నాయి. శుక్రవారం ముగింపుకు కొంత బలపడి రూపాయి ఓపెన్ అయింది. ప్రస్తుతం డాలర్ మారకం విలువతో పోలిస్తే రూపాయి 0.04 పైసలు బలపడి 66.81గా ఉంది. నిఫ్టీ50 ఒత్తిడిలో ఉన్నప్పటికీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్ మద్దతుతో తన కీలకమైన మార్కు 8650కు పైననే ట్రేడ్ అవుతోంది. వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ, పారిశ్రామికోత్పత్తి డేటా నేడు మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తున్నాయని, అదేవిధంగా గ్లోబల్ డెవలప్మెంట్లు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. కాగ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా స్టాక్ మార్కెట్లు సెలవును పాటించాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement