-
మీ భూమి మీది కాదు అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారు
-
బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చే వాడే.. కానీ తీసుకునేవాడు కాదని స్పస్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. పేదల భూములు లాక్కుంటే తానే విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.తన మాటలను నమ్మాలని, కూటమి విష ప్రచారాన్ని నమ్మవద్దని హితవు పలికారు. చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోవద్దని కోరారు. మీ భూమి మీది కాదంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమని అన్నారు. రైతులకు వంశపారంపర్యంగా వచ్చే బూములు వారికి కాకుండాపోతాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చేయడానికి లేనిపోని పెంట రాసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సడెన్గా రామోజీ భార్య ఆయన భార్య కాకుండాపోతుందా అనిసెటైర్లు వేశారు.‘సీఎం జగన్ను తిట్టాలి అని చంద్రబాబు పిలుపు ఇవ్వగానే హైదరాబాద్ నుంి,ఇ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఒక పచ్చ మంద దిగుతుంది. ఒక్క రోజు కుిడా ఏపీలో లేనివారు ఇవాళ ఏపీ గురించి మాట్లాడతున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు మాట్లాడుతున్న పచ్చమంద ఎవరైనా వచ్చి సాయం చేశారా? అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కోవిడ్ కాలంలో బాబు హైదరాబాద్ మదీనాగూడలోని వందల ఎకరాల ఫాంమౌజ్లో ఉన్నాడు. కరోనా సమయంలో కనీసం పవన్ కల్యాణ్ వస్తాడేమో అని ఎదురు చూశారు. మరి కరోనా సమయంలో కాపులకు అయినా సహాయం చేశాడా పవన్?.కానీ సీఎం జగన్ ఒక్కడే రాష్ట్రంలో నిలబడి కరోనా లో ప్రజలకు నిజాయితీగా సేవలు అందించాడు. నేను చెప్పాను అని కాదు జగన్ను మీరు కోల్పోతే మీకు ఒక్క పథకం దక్కదు. చంద్రబాబు అన్ని పథకాలు తీసేస్తాడు. ఒక్క పైసా కూడా పేదలకు రానివ్వడు. ప్రజలంతా ఒక్కసారి ఓటు వేసే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. ప్రాణం ఉన్నంత వరకు పేదల ప్రాణాలకు అండగా నిలిచే జగన్కు మీరు మద్దతుగా ఉండండి’ అని పోసాని పేర్కొన్నారు. -
మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచారని, ఇంతకంటే అభివృద్ధి ఏముంటుందని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి చెప్పారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదని, మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్న విషయం అర్బన్ ఓటర్లు గుర్తించాలని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు సీఎం జగన్ నవరత్నాల సంక్షేమాన్ని పంచుతూ వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచి, విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రతతో కూడిన మంచి భవితను అందించారని తెలిపారు. హ్యూమన్ క్యాపిటల్ కంటే గొప్ప అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నించారు. అదే చంద్రబాబు దృష్టిలో పేదలంటే ఐదేళ్లకో సారి ఓట్లు అమ్ముకునే జీవచ్ఛవాల్లాంటి వారని చెప్పారు.సంపద సృష్టిస్తాం అనే చంద్రబాబు.. ఆయన సీఎం అయినప్పటి నుంచి దిగేవరకు ప్రతి బడ్జెట్లో రెవెన్యూ లోటు కనిపిస్తుందని, మరి సంపద ఎక్కడ సృష్టించాడని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మానవత్వానికి నిలువెత్తు రూపమైతే, మోసానికి మారుపేరు చంద్రబాబు అని అన్నారు. పోసాని బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పేదలకు ఇచ్చే స్కీములు పప్పుబెల్లాలు కావు. అవి హ్యూమన్ క్యాపిటల్. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఖజానా సొమ్మును పేదలకు పప్పుబెల్లాల్లా పంచడం ఎంతవరకు సబబు అని నన్ను కొందరు అడిగారు. సీఎం జగన్ ప్రభుత్వ ఖజానా ధనాన్ని పేద ప్రజలకు పంచకపోతే ఈ పాటికి చంద్రబాబులాంటి అవినీతిపరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనమైపోయుండేవారని నేను వారికి చెప్పాను.ఎందుకంటే.. చంద్రబాబుకు పేదవాళ్లను ఇంకా పేదవాళ్లుగా మిగల్చడమే తెలుసు. అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించేవారికి నా సమాధానం ఏమిటంటే.. ఎత్తైన సిమెంట్ స్తంభాలతో, పెద్ద పెద్ద బిల్డింగులతో అభివృద్ధి ఏమీరాదు. మానవాభివృద్ధి జరగాలి. మనిషనేవాడు జీవచ్ఛవం స్థాయి నుంచి తానొక మనిషిని అని రోడ్డు మీదకొచ్చి చెప్పుకోగలగాలి. ఈ పరిస్థితి చంద్రబాబుకు చేతగానిది. చంద్రబాబుకు తెలిసిందల్లా ఐదేళ్లకోసారి ఎన్నికలనగానే పేదలు, కూలీల దగ్గరకొచ్చి, వారి ఓటుకు విలువ కట్టి, ఓటుకు నోటు పంచడమే’ అని చెప్పారు. ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు పొడిచారు ‘ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పొలిటికల్ బిజినెస్మేన్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని అమ్మేసుకున్న బిజినెస్మేన్ కూడా ఆయనే. ఇప్పుడు తమ్ముడ్ని గెలిపించాలని ప్రజలనడిగే అర్హత చిరంజీవికి లేదు. ఆయనకు రాజకీయం, సినిమా ఒకటే. డబ్బు గానీ, అధికారం గానీ వస్తే చేద్దామని, లేకపోతే ఐదేళ్లు ఖాళీగా ఉండాల్సిన ఖర్మేంటని 18 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా అమ్మేసుకుని వెళ్లిపోయిన వ్యక్తి. తప్పు తెలుసుకోని రాజకీయ అనర్హుడు చిరంజీవి’ అని పోసాని దుయ్యబట్టారు.అర్బన్ ఓటర్లంతా బాబు మోసాల్ని గుర్తుంచుకోవాలి‘చంద్రబాబు చేసిన మోసాలను అర్బన్ ఓటర్లంతా గుర్తుంచుకోవాలి. సీఎం వైఎస్ జగన్ ఎవరినీ మోసం చేయరన్న విషయాన్ని గుర్తించాలి. ఆయన ఇప్పటివరకు ఎవరినీ దగా చేయలేదు. సీఎం జగన్ పేద, మధ్యతరగతి వర్గాలను అన్ని విధాలుగా పైకి తెచ్చారు. పెత్తందార్లకు సీఎం జగన్ నచ్చడేమో కానీ, పేదలపాలిట ఆయన దేవుడు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కూడా రైతులు, పేదల పట్ల దేవుడై నిలిచారు కదా? అధికారంలోకి రాగానే రైతుల్ని రుణ విముక్తులను చేశారు. అప్పుడు అందరూ ఆయన్ని అభినందించారు తప్ప పప్పుబెల్లాల్లా పంచిపెట్టారని అనలేదు. ఇప్పుడు సీఎం జగన్ చేసిందీ అదే. ప్రభుత్వం ఉన్నది పేదలను ఆదుకోవడానికే అని నిరూపించారు. ధనవంతులు కొందరు వారి కులాల్లో పేదలను ఆదుకుంటుంటారు. వారి కులాల్లోని పేద పిల్లల చదువులకు డబ్బులిచ్చి ప్రోత్సహిస్తుంటారు. అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేసి, వారి బతుకులు మారుస్తున్నారు. కులం, మతం , ప్రాంతం, రాజకీయం అనేది చూడకుండా ప్రభుత్వ సొమ్మును పేదవాడికి పంచి వారి జీవనప్రమాణాల్ని పెంచడం మంచి సంప్రదాయం. ఓట్ల కోసమే సీఎం జగన్ పేదవాళ్లకు డబ్బులు అకౌంట్లలో వేశారనడం ముమ్మాటికీ తప్పు. గతంలో రూపాయిలో పావలానే పేదవాడికి చేరేది. మిగతాదంతా అవినీతిపరుల జేబుల్లోకి పోయేది. ఇప్పుడు పైసా అవినీతి లేదు. నాలాంటి ఎంతోమంది ధనవంతులకు పేదవాడిని ఆదుకోవాలనే మనసు రావడానికి సీఎం జగనే స్ఫూర్తి’ అని చెప్పారు. -
చిరు పై పోసాని సంచలన కామెంట్స్
-
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
-
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
-
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారని పోసాని చెప్పుకొచ్చారు.కాగా, పోసాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన పథకాలు వారి జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి. డబ్బున్న వారు సైతం స్వచ్చందంగా పేదలకు సాయం చేయడం లేదా?. అలాగే ప్రభుత్వం చేస్తే తప్పేంటని మా కమ్మ వాళ్లని ప్రశ్నించాను. పేదలపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని చెప్పాను. పేదవాడు జీవచ్చవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలు పెట్టారు. ఇదంతా ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసం. మానవత్వం, చిత్తశుద్దితో సీఎం జగన్ పనిచేస్తున్నారు.చంద్రబాబు ఏనాడైనా సంపద సృష్టించారా?. ఆయన హయాంలో రెవెన్యూ లోటు బడ్జెటే ఉంది. జనాన్ని మోసం చేస్తూ ఇంతకాలం చంద్రబాబు కాలం వెల్లదీశారు. తాను గెలిస్తే తాకట్టులో ఉన్న బంగారం బయటకు తెస్తానని చంద్రబాబు చెప్పారు. నిజమని నమ్మిన మహిళలు, రైతులు నిలువునా మోసపోయారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలతో మానవ నిర్మాణం చేపట్టారు. పేదోడి చదువులు, ఆరోగ్యం కోసం జగన్ కష్టపడుతున్నారు.చిరంజీవి ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయి. కానీ ఏనాడైనా రాష్ట్ర ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించారా?. ఇప్పుడు పవన్ని గెలిపించమని ఎలా అడుగుతారు?. రెండు ఎంపీ సీట్ల నుండి బీజేపీ అధికారంలోకి ఎలా రాగలిగింది?. అప్పట్లో వాజ్పేయి, అద్వానీ కష్టపడి పనిచేసి ప్రజాదరణ పొందారు. చిరంజీవి మాత్రం తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. ఇక రాజకీయాల్లోకి రానని చెప్పి, ఇప్పుడు మళ్ళీ జనసేన తరపున ఎలా ప్రచారం చేస్తారు?. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు ఎంతోమంది కాపులు బలయ్యారు. చిరంజీవి ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని హితవు పలికారు. -
ఒకసారి ఆ క్లిప్ చూడండి.. చంద్రబాబు ఎంత నీచుడో..!
-
ఒకసారి ఆ క్లిప్ చూడండి.. చంద్రబాబు ఎంత నీచుడో..!
-
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
-
సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!
-
ఫేక్ వీడియోకున్న విలువ.. సీఎం జగన్ ప్రాణానికి లేదా?
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు పబ్లిక్గా ఏపీ సీఎం జగన్ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, YSRCP నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా?.. సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు. -
బాబు కావాలంటే నన్ను చంపు జగన్ ను మాత్రం...!
-
చంద్రబాబుని ఇమిటేట్ చేసిన పోసాని
-
హత్యలకు కుట్రలు ఆధారాలతో పోసాని
-
సీఎం జగన్ కు... పవన్ కళ్యాణ్ కి తేడా ఇదే
-
పంజాబ్ అమ్మాయిని లవ్ అని దారుణంగా వాడుకొని వదిలేసావ్: పోసాని
-
జగన్ ని అంతం చేస్తే.. మా చంద్రబాబు ప్లాన్ అదే
-
కమ్మ వాళ్ళు ఇక్కడ ఏడుస్తుంటే ఇంట్లో తలుపులు వేసుకున్నాడు దొంగ బాబు
-
చంద్రబాబు నెం.1 కిలాడీ..!
-
చంద్రబాబు నెంబర్వన్ కిలాడీ: పోసాని
సాక్షి, గుంటూరు: వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. క్యాన్సర్ గడ్డ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారంటూ ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వాలంటీర్లు నిస్వార్థ సేవ చేస్తున్నారని, లోకేశ్లా వాలంటీర్లు వ్యవహరించడం లేదన్నారు. ‘‘చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియా, చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదు. చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడమే వారి లక్ష్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను నమ్మొద్దు. సుజనా చౌదరిని తిట్టడానికి కొత్త భాష సృష్టించాలి. చంద్రబాబు నెంబర్వన్ కిలాడీ. తన రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబు వంగావీటి రంగాను హత్య చేయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనికిరారు. అన్ని సామాజిక వర్గాల వారికి సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారు’’ అని పోసాని చెప్పారు. వలంటీర్లపై చంద్రబాబుది మొసలి కన్నీరు. వాలంటీర్లు తలుపులు కొట్టేవారని అన్నాడు. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవాళ్లంటూ వలంటీర్లపై దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లు లోకేశ్లా తాగుబోతు, తిరుగుబోతు, లోఫర్లు కాదు. వలంటీర్లను ప్రజలు తమ్ముడు, అన్న, బిడ్డలా చూసుకుంటారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. జయప్రద జీవితాన్ని నాశనం చేసింది చంద్రబాబు. రామోజీరావుతో కలిసి లక్ష్మీ పార్వతి జీవితాన్ని నాశనం చేశాడు. మహిళలను చంద్రబాబు చాలా చులకనగా చూస్తాడు. బాలకృష్ణ ఆడవాళ్లు కనిపిస్తే కడుపు చేయాలంటూ మాట్లాడాడు’’ అని పోసాని గుర్తు చేశారు. ‘‘నేను కమ్మ కులస్తుడిని కాబట్టి చంద్రబాబుని తిట్టొద్దంటున్నారు. అవినీతి పరుడు, దొంగ కమ్మ వాడైతే..నేను మద్దతు ఇవ్వాలా?. మరి రాధాకృష్ణ గతంలో సుజనా చౌదరి అవినీతిపై రాయలేదా?. ఈనాడు రామోజీరావు కూడా సుజనా ఎన్ని వేల కోట్లు మోసం చేశాడో రాశారుగా.. అలాంటి వాళ్లు ఇప్పుడు కూటమి అభ్యర్థ. దున్నపోతులా సుజనా చౌదరి వేల కోట్లు తిన్నాడు. దొంగలు అందరూ కలిసి సీఎం జగన్ని దించాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అంటూ పోసాని కృష్ణ మురళీ దుయ్యబట్టారు. పురంధేశ్వరి రాజకీయ అవకాశ వాది. బీజేపీలో ఉండి చంద్రబాబు కోసం పని చేస్తున్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని లేఖ రాసింది పురందేశ్వరి. మరి సుజనా చౌదరి కేసులపై ఎందుకు లేఖ రాయలేదు?. మళ్లీ ఈ ప్రభుత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వలంటీర్లకు 10 వేలు ఇస్తామని చంద్రబాబు డ్రామా ఆడుతున్నాడు. గతంలో 600 హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చెయ్యలేదు. ఒక్క హామీ అమలు చేసినట్టు చూపించు’’ అని చంద్రబాబుకు పోసాని కృష్ణమురళీ సవాల్ విసిరారు. ఇదీ చదవండి: ఎల్లో బ్యాచ్ వారి వాషింగ్ మెషిన్ -
చంద్రబాబుపై పోసాని కృష్ణ మురళి ఫైర్
-
చంద్రబాబు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు : పోసాని కృష్ణ మురళి
-
రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగాను చంపేశారు
-
గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?!: పోసాని
సాక్షి, విజయవాడ: గతంలో చంద్రబాబు కాపులను రౌడీలని అనలేదా? అంటూ ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్కు దేవుడు. చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు’’ పోసాని ధ్వజమెత్తారు. వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్ను చంపేశారు. చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు. రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు. పవన్ కల్యాణ్ను చంద్రబాబు లొంగదీసుకున్నారు’’ అని పోసాని కృష్ణమురళీ నిప్పులు చెరిగారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
Anchor Sreemukhi: ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
తప్పక చదవండి
- సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement