-
'చంద్రబాబు హయాంలోనే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది'
సాక్షి, అనంతపురం: చంద్రబాబు హయాంలోనే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది పడిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఆయన పాలనలోనే సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురుయ్యాయని ధ్వజమెత్తారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు చంద్రబాబు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని దుయ్యబట్టారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచినా చంద్రబాబు నోరు మెదపలేదని గుర్తు చేశారు. '2017లో రెండో విడత అప్పర్భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయి. అప్పటిముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. ఈ ప్రాజెక్టుపై సీఎం జగన్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూనే ఉంది. న్యాయపోరాటం చేస్తోంది.' అని తోపుదుర్తి వ్యాఖ్యానించారు. చదవండి: మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్ -
అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారే: మేధావుల ఫోరం
తిరుపతి: రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతిలో సమావేశమయ్యింది. తుంగభద్ర నదిపై అప్పర్ భద్ర ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని సమావేశంలో తీర్మానించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారి అవుతుందని మేధావుల ఫోరం పేర్కొంది. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు తాగునీటి కష్టాలు తప్పవని చెప్పారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను స్వాగతిస్తున్నామని రాయలసీమ మేధావుల ఫోరం తెలిపింది. -
అప్పర్ భద్రపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా 29.9 టీఎంసీల తుంగభద్ర జలాలను వాడుకునేందుకు కర్ణాటక సర్కార్ చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుపై న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టు పనులను తక్షణమే నిలుపుదల చేసేలా కర్ణాటకను ఆదేశించి, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులకు పరిరక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయనుంది. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్, కేసీ కెనాల్, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం), శ్రీశైలం, నాగార్జునసాగర్తో పాటు కృష్ణా డెల్టాలో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయని నివేదించనుంది. తమ అభ్యంతరాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అప్పర్ భద్రకు కల్పించిన జాతీయ హోదాను, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇచ్చిన సాంకేతిక అనుమతులను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించనుంది. హక్కులు తాకట్టు పెట్టిన చంద్రబాబు తుంగభద్ర డ్యామ్కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) స్పష్టం చేయగా.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తేల్చింది. ► విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీలు మిగిలాయని, 65 శాతం లభ్యత ఆధారంగా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ (తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు) కేటాయించిన పది టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలకుగాను దక్కిన 21 టీఎంసీల్లో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 బేసిన్లలో మిగిలిన 6 టీఎంసీలు.. వెరసి 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోగా) తరలించేలా అప్పర్ భద్రను 2015లో కర్ణాటక చేపట్టింది. ► అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి చిక్మంగుళూరు, చిత్రదుర్గ, తుమకూరు, దావణగెరె జిల్లాల్లో 2,25,515 హెక్టార్లకు (5,57,259 ఎకరాలు) నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని కర్ణాటక పేర్కొంది. ► నీటి కేటాయింపులు లేని అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ నోరు మెదపకుండా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కల్పించింది. ఫలితంగా 2019 మార్చి నాటికే రూ.4,830 కోట్లను వ్యయం చేసి, అప్పర్ తుంగ నుంచి భద్ర ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేలా ఎత్తిపోతలు, ప్రధాన కాలువలతోపాటు భద్ర నుంచి వాణివిలాస రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రధాన కాలువ పనులను కర్ణాటక పూర్తి చేసింది. అప్పర్ భద్ర ద్వారా 2019–20లో 3.44, 2020–21లో 6.61, 2021–22లో 6.82 టీఎంసీలను వాణివిలాస రిజర్వాయర్కు తరలించింది. నీటి కేటాయింపులే లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా! ► అప్పర్ భద్రకు జాతీయ హోదా సాధించడం ద్వారా కేంద్ర నిధులను రాబట్టేందుకు సిద్ధమైన కర్ణాటక సర్కార్ సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి, కేంద్ర జల్ శక్తి శాఖ నుంచి పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ► బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండానే 2020 డిసెంబర్ 24న అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది. ► విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల ఎలాంటి నీటి మిగులు లేదని, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సైతం అమల్లోకి రాలేదని, ఈ నేపథ్యంలో సాంకేతిక అనుమతి ఇవ్వడమంటే న్యాయ ఉల్లంఘనకు పాల్పడటమేనని స్పష్టం చేస్తూ సీడబ్ల్యూసీకి 2020 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయగా అభ్యంతరాలను తోసిపుచ్చింది. ► ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా అప్పర్ భద్రకు 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021 మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చింది. ► దుర్భిక్ష ప్రాంతాల్లో 5.57 లక్షల ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీళ్లందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. ► ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలంటే బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు అంగీకరించాలని కేంద్రమే మార్గదర్శకాలు రూపొందించింది. అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రతిపాదనపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ 2021 నవంబర్ 6న సమావేశం నిర్వహించింది. ► నీటి కేటాయింపులే లేకుండా జాతీయ హోదా ఇవ్వడం సరికాదన్న తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలను బుట్టదాఖలు చేస్తూ 2022 ఫిబ్రవరి 15న అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా కల్పించింది. ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.12,500 కోట్లను అందించడానికి కేంద్రం సమ్మతించింది. ఈ క్రమంలో 2023–24 బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లను కేంద్రం కేటాయించింది. తెలుగు రాష్ట్రాలకు తిప్పలే.. కర్ణాటక సర్కార్ ఇప్పటికే కేటాయించిన నీటి కంటే అధికంగా తుంగభద్ర జలాలను వాడుకుంటోంది. ఇక అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంలో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. ఇది తుంగభద్ర డ్యామ్పై ఆధారపడిన ఏపీలోని ఆయకట్టు, కేసీ కెనాల్, ఏపీ–తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టాపై కూడా ప్రభావం పడుతుంది. కృష్ణా బేసిన్లో తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టుకు వివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 36 టీఎంసీలు కేటాయించాలన్న కర్ణాటక ప్రతిపాదనను బచావత్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం లభ్యత ఆధారంగా 9 టీఎంసీలను అప్పర్ భద్రకు కేటాయించింది. కానీ బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదని, నాలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సెల్పీ దాఖలు చేసింది. దీంతో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల నీటి మిగులు లేదు. కే–8, కే–9 బేసిన్లలో కర్ణాటక అధికంగా నీటిని వాడుకుంటున్న నేపథ్యంలో నీటి మిగులు లేదు. నీటి కేటాయింపులు లేకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జల వనరుల శాఖ తక్షణమే నిలిపివేయాలి.. అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించేందుకు తాను జారీ చేసిన మార్గదర్శకాలను జల్ శక్తి శాఖే ఉల్లంఘించింది. నీటి కేటాయింపులు లేకుండా, బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది. అక్రమంగా చేపట్టిన అప్పర్ భద్రను తక్షణమే నిలుపుదల చేయడంతోపాటు సాంకేతిక అనుమతి, జాతీయ హోదాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేస్తాం. – శశిభూషణ్కుమార్, ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ -
‘అప్పర్ భద్ర’తో అనంత ఎడారి!
బీజేపీ ఏలుబడిలో ఉన్న కర్ణాటకకు చెందిన ‘అప్పర్ భద్ర’కు నీటి కేటాయింపులు లేకపోయినా, ఆగమేఘాల మీద సాంకేతిక అనుమతులు మంజూరు చేసి, జాతీయ హోదా కల్పించి, నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందువల్ల అనంతపురం జిల్లా కనీసం తాగునీరు కూడా అందకుండా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఎగువ భద్ర ప్రాజెక్టు పూర్తయితే, తుంగభద్ర, శ్రీశైలం డ్యామ్లు పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి ఉండదు. ఇందువల్ల కృష్ణా బేసిన్ ఆయకట్టు పరిస్థితి అటుంచితే... అనంతపురం జిల్లాకు ఏకైక నీటి ఆధారమైన హై లెవెల్ కెనాల్ (హెచ్ఎల్సీ) ఎండిపోయే పరిస్థితి దాపురిస్తుంది. తుంగభద్ర డ్యామ్ పైన 295 టీఎంసీలకు మించి కర్ణాటక నీటిని వాడుకోవడానికి వీలులేదని బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడో చెప్పింది. అయినా 325 టీఎంసీల వరకు వాడుకుంటున్నట్లు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. అంతేకాకుండా కృష్ణా బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను బేఖాతరు చేసి, తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ... ‘మేం తుంగ, భద్ర, ప్రాజెక్టుల ఆధునికీకరణల వల్ల మిగిలిన నీటిని, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కృష్ణా బేసిన్కు వచ్చే 20 టీఎంసీల నీటిని కలుపుకొని వాడుకోవడానికి అప్పర్ భద్రను నిర్మిస్తున్నామ’ని కాకమ్మ–గువ్వమ్మ కథలు చెబుతోంది కర్ణాటక. తెలుగు రాష్ట్రాల కళ్ళు కప్పి అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే 40 ఏళ్ల అనుభవజ్ఞుడు, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గుడ్డెద్దుకు గడ్డి వేస్తూ ఏమీ పట్టనట్లు కాలం గడిపేశారు. ఆ పాపం వల్లనే నేడు తుంగభద్ర డ్యామ్కు కనీసం నీరు కూడా చేరే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలు రాజకీయాలకతీతంగా అప్పర్ భద్ర నిర్మాణాన్ని అడ్డుకోవడంలో భాగంగా ‘ఛలో అప్పర్ భద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలి. – కె.వి.రమణ; బెస్త కార్పొరేషన్ డైరెక్టర్, అనంతపురం.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement