-
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.203, 204, 206 పోలింగ్ బూత్ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్ బూత్లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది. -
ఓటు వేసిన YSRCP నేతలు
-
వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడులు
-
పల్నాడులో బరితెగించిన టీడీపీ నేతలు..
-
బౌన్సర్లతో పోలింగ్ వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ హల్ చల్
-
‘వుయ్ యాప్’పై కఠిన చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: టీడీపీకి చెందిన ‘వుయ్ యాప్’పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. ఈ యాప్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. డేటా చౌర్యంతో ఓటర్ల భద్రతకు ముప్పు కలిగిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం ‘వుయ్ యాప్’పై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకే టీడీపీ ప్రత్యేకంగా ‘వుయ్ యాప్’ను రూపొందించిందన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అభ్యర్థులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇప్పటికే టీడీపీ వుయ్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడుతోందని ఎన్నికల సంఘం, డీజీపీలకు వైఎస్సార్సీపీ ఈ–మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే ఆ యాప్ పేరిట టీడీపీ అక్రమాలు కొనసాగుతుండటంతో ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీకి, బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్ బాపట్ల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.. ⇒ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టం, ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా టీడీపీ ‘వుయ్ యాప్’ను రూపొందించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోంది. ⇒ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, వయసు, చిరునామా, కులం, మతం, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలను నిబంధనలకు విరుద్ధంగా ఆ యాప్లో పొందుపరిచింది. తద్వారా ఓటర్ల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తోంది. ⇒ ఓటర్ల కదలికలను నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్ చేస్తూ వారి భద్రతకు ముప్పు తెస్తోంది. ⇒ ప్రత్యేకంగా బార్ కోడ్లను ముద్రించిన ఓటరు స్లిప్పులు, కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేస్తోంది. అనంతరం నేరుగా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెడుతోంది. ఫోన్ పే, గూగుల్ పే, ఇతర మార్గాల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతోంది. -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై పచ్చ గూండాల దాడులు
-
'కరోనా' సమయంలో.. కానరాని పచ్చ నేతలు! ఫోన్లు సైతం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా నాయకులు జనం కోసం పనిచేయాలి. నమ్ముకున్న వారి క్షేమం కోసం పాటు పడాలి. కానీ టీడీపీ నేతలు ఆపత్కాలంలో ఆప్తులను వదిలేశారు. కోవిడ్ మహమ్మారి ఊళ్లకు ఊళ్లను వణికిస్తుంటే.. తమ దారి తాము చూసుకున్నారు. విశాఖలో ఒకరు, ఢిల్లీలో ఇంకొకరు, జనాలకు దూరంగా చాలామంది దాక్కున్నారు. ఓ వైపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముమ్మరంగా సాయం చేస్తూ జనాలకు ధైర్యమిస్తూ ఉంటే.. టీడీపీ నాయకులు మాత్రం కనీసం తమ కార్యకర్తల కోసమైనా పనిచేయలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులు నిరంతరం జనాల్లోనే ఉంటూ వారి బాగోగులు చూసుకున్నారు. అధికారంలో ఉన్నంతకాలం ఇసుక, నీరుచెట్టు, ప్రాజెక్టులు, మద్యం, అభివృద్ధి పనుల ముసుగులో కోట్లు వెనకేసుకున్న టీడీపీ నాయకులు జనాలకు ఓ కష్టం వచ్చిన వేళ అండగా నిలవలేకపోయారు. కనీసం సొంత పార్టీ క్యాడర్ను కూడా కరోనా కాలంలో వారు పట్టించుకున్న పాపాన పోలేదు. కరోనా కష్టకాలంలో టీడీపీ నేతలు జాడే కానరాలేదు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.జిల్లాను కరోనా సెకెండ్ వేవ్ ఎంతగా కబళించిందో జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. యువత సైతం మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇంత కష్టకాలంలో టీడీపీ నాయకులు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీని పరిస్థితి ఉండేది. ఒక్కో నేత ఒక్కో చోట దాక్కుని ఉన్నారు. ఆపద వచ్చినప్పుడు తమ నాయకుడు ఆదుకుంటారని సాధారణంగా నియోజక వర్గ ప్రజలు, కేడర్ అనుకుంటారు. తమ నాయకుడు ఏదో ఒక ఆస్పత్రికి చెప్పి, బాగా చూడాలని, మెరుగైన వైద్యం అందించాలంటూ చెబుతారని ఆశిస్తారు. కానీ జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నం. టీడీపీ నేతలు ఎక్కడా ఆ రకంగా స్పందించిన దాఖలాల్లేవు. ఏ ఒక్క నేత కూడా కనీసం పట్టించుకోలేదు. దాక్కున్న టీడీపీ నేతలు..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు స్థానికంగా లేరు. కరోనా సమయంలో విశాఖలో తలదాచుకున్నారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ఎక్కడున్నారో నాయకులకు కూడా తెలియని పరిస్థితి. నాయకులు ఎవరు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం హడావుడి చేశారు. తానొక కంట్రోల్ రూమ్ ప్రారంభించినట్టు బిల్డప్ ఇచ్చారు.ఆయనేదో వ్యక్తిగతంగా సాయమందిస్తారేమో అనుకుని చాలా మంది ఫోన్లు చేశారు. కానీ ఆయన చేసిందేమీ లేదు. ఇద్దరు వ్యక్తులతో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు వచ్చిన విన్నపాలను అధికారులకు మళ్లించారు. అప్పటికే అధికారులు కంట్రోల్ రూమ్ నడుపుతున్నారు. వారికి నేరుగా వచ్చే ఫోన్లకు స్పందిస్తున్నారు. ఈయన వల్ల మరింత జాప్యం జరిగే పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ రోగులకు బెడ్లు ఎక్కడున్నాయని అడిగితే అధికారులను అడిగి చెబుతామంటూ దాట వేస్తూ చేతులు దులుపుకున్నారు.మాజీ మంత్రి కళా వెంకటరావు ఎక్కడున్నారో తెలియనట్టుగా ఇంటికి తాళాలు వేసుకుని లోపలే ఉన్నారు. కనీసం కేడర్ ఫోన్ ఎత్త లేదని ఆ పార్టీ కార్యకర్తలే వాపోయారు. జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పరిస్థితి దాదాపు ఇంతే. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, కావలి ప్రతిభా భారతి తదితరులు కరోనా కాలంలో జనాలకు కనిపించనే లేదు.అందుబాటులో వైఎస్సార్సీపీ నేతలు..కష్టకాలంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. కొందరు నేరుగా ప్రజల వద్దకు వెళ్లగా, మరికొందరు తన పీఏ నంబర్లను ప్రజల వద్ద ఉంచి, ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు సేవలు పొందారు. తమకు అవకాశం ఉన్న మేరకు స్పందించారు. ఆస్పత్రిలో బెడ్ కావాలన్నా, రోగులకు మెరుగైన వైద్యం కోసం, మందులు, ఇతరత్రా అవసరాల కోసం ఎప్పటికప్పుడు స్పందించారు.తమ్మినేని సీతారాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. ఫోన్లో కూడా అందుబాటులో ఉన్నారు.డిప్యూటీ సీఎం హోదాలో ధర్మాన కృష్ణదాస్ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడమే కాకుండా కోవిడ్ ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం ఉన్నా స్పందించారు.మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అదే రకంగా స్పందించారు. కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు, సేవలందించడంలో తనదైన పాత్ర పోషించారు.ఎమ్మెల్యే రెడ్డి శాంతి అయితే నిరంతరం నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉన్నారు. మహిళా ఎమ్మెల్యే అయినప్పటికీ ధైర్యంగా ప్రజలకు అందుబాటులోనే ఉండి సాయపడ్డారు.శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించి సాయం చేయడంలో తమదైన పాత్ర పోషించారు.ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ కరోనా బారిన పడినప్పటికీ తన అనుచరుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నారు.ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అయితే కరోనా కష్టకాలంలో రిస్క్ తీసుకుని పనిచేశారు. జిల్లా యంత్రాంగానికి రెండు ఆక్సిజన్ అంబులెన్స్లు అందించారు. రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం..కరోనా సమయంలో నిత్యావసర సరుకులకు బయటకు వెళ్లలేని పరిస్థితిలో వైఎస్సార్సీపీ నాయకులు వ్యక్తిగతంగా తమ సొంత సొమ్ముతో కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేశారు. ఎక్కడికక్కడ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా వలంటీర్లను పెట్టుకుని తోచినంత సాయం చేశారు.ఇక ప్రభుత్వం ప్రతీ ఇంటికి సాయం చేసింది. ఒకవైపు కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రోగులకు పౌష్టికాహారం అందజేసింది. హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు ఇంటింటికీ ఉచితంగా మందులు పంపిణీ చేసింది. ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఇంటికి మెడికల్ కిట్ అందజేసింది. అంతటితో ఆగకుండా ప్రతి ఇంటికి ఆర్థిక సాయం చేసింది.జిల్లాలో 6,70,438 మందికి రూ.707.61కోట్లు మేర సచివాలయంలోనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. అంతేకాకుండా విదేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లోనూ చిక్కుకున్న వారిని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు, విమానాలు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు క్షేమంగా తీసుకొచ్చింది. ముఖ్యంగా జిల్లాలోని వలస కూలీలు, వలస మత్స్యకారులను ప్రత్యేక జాగ్రత్తలతో తీసుకొచ్చి, ప్రత్యేక క్వారంటైన్ ఏర్పాటు చేసి, ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా చర్యలు తీసుకుంది.ఇవి చదవండి: ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు -
కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ
-
బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..
-
మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..
-
పిల్లల వెంట తండ్రులు.. యూపీలో ఆసక్తికర రాజకీయాలు!
2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఆసక్తికర రాజకీయాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు తాము ఎన్నికల బరిలోకి దిగకుండా, తమ పిల్లలకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్, సుభా ఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్భర్, నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్, కాంగ్రెస్ నాయకుడు పిఎల్ పునియా, ఇంద్రజిత్ సరోజ్, బ్రజ్భూషణ్ శరణ్ సింగ్ తదితరులు ఉన్నారు.ఫిరోజాబాద్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ నేత ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఎన్నికల బరిలో దిగారు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం ఆయన తన కుమారుని విజయం కోసం శ్రమిస్తున్నారు. శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ బదౌన్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. బదౌన్లో మూడో దశలో ఎన్నికలు జరిగాయి. శివపాల్ తన కుమారుని విజయం కోసం ప్రచార కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు.సంత్ కబీర్ నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ నిషాద్ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయం కోసం ఆయన తండ్రి, యోగి ప్రభుత్వ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మే 25న ఓటింగ్ జరగనుంది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఇటీవ పలు ఆరోపణల్లో చిక్కుకున్నారు. కైసర్గంజ్ లోక్సభ స్థానం నుంచి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ఓం ప్రకాష్ రాజ్భర్కు రాజ్భర్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన కుమారుడు అరవింద్ రాజ్భర్ ఘోసీ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగారు. ఓం ప్రకాష్ రాజ్భర్ తన కుమారుని విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. బారాబంకి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత పీఎల్ పునియా కుమారుడు తనూజ్ పునియా ఎన్నికల బరిలోకి దిగారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కింద తనూజ్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
-
ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..
-
బాబు, పవన్ కు కర్నూల్ యూత్ షాక్
-
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
-
టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
-
ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన
-
గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
-
చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా
-
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రలోభాలు
-
ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న టీడీపీ నేతలు
-
సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి
-
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..
-
కాంగ్రెస్కు మరో దెబ్బ! పార్టీకి పరిశీలకుల గుడ్బై!
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండు లోక్సభ స్థానాలకు పార్టీ పరిశీలకులుగా ఉన్న నీరజ్ బసోయా, నసీబ్ సింగ్లు కాంగ్రెస్ పార్టీని వీడతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇద్దరు నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వేర్వేరుగా రాజీనామా లేఖలు పంపించారు.ఇరువురూ నేతలూ ప్రధానంగా కాంగ్రెస్ ఆప్ పొత్తును తమ రాజీనామాలకు కారణాలుగా తమ లేఖలలో పేర్కన్నారు. “ఢిల్లీలో ఆప్తో పొత్తు పెట్టుకున్నందుకు ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు రోజురోజుకూ పెద్ద చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. ఆత్మగౌరవం ఉన్న నాయకుడిగా నేను ఇకపై పార్టీలో కొనసాగలేను" అంటూ మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానానికి పార్టీ పరిశీలకుడు నీరజ్ బసోయా పేర్కొన్నారు.రాజీనామా చేసిన మరో మాజీ ఎమ్మెల్యే, వాయువ్య ఢిల్లీ పార్టీ పరిశీలకుడు నసీబ్ సింగ్.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్గా దేవిందర్ యాదవ్ నియామకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "అరవింద్ కేజ్రీవాల్ తప్పుడు ఎజెండాపై పంజాబ్లో ఇప్పటివరకూ విమర్శల దాడి చేసిన దేవిందర్ యాదవ్ ఇప్పుడు ఢిల్లీలో ఆప్ను, ఆ పార్టీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ప్రశంసించడం తప్పనిసరి" అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అరవింద్ సింగ్ లవ్లీ ఢిల్లీ యూనిట్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత మరో ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement