-
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో లెర్న్ చెస్ అకాడెమీ వార్షిక చెస్ టోర్నమెంట్
సింగపూర్లో ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ అయిన “లెర్న్ చెస్ అకాడమీ”(Learn Chess Academy) మే 1వ తేదీన వార్షిక చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా యువ చెస్ ప్రతిభను పెంపొందించే ప్రయత్నం చేసారు. ఈ టోర్నమెంట్లో 6 నుండి 15 సంవత్సరాల వయస్కులైన సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 6, 8, 10, 12 ,13 ఏళ్ల పైబడినవారు ఇలా ఐదు విభాగాలలో పోటీపడ్డారుఅపార అనుభవం కలిగిన ప్రొఫెషనల్ చెస్ కోచ్ మురళి కృష్ణ చిత్రాద స్థాపించిన ఈ “లెర్న్ చెస్ అకాడమీ”, 15 సంవత్సరాల నుండి నిరంతరంగా చిన్న పిల్లలకు మరియు యువకులకు చదరంగం ఆటలో శిక్షణ ఇస్తోంది. ఈ టోర్నమెంట్ కేవలం పోటీకి మాత్రమే కాకుండా, విద్యార్థులు తమ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా కూడా నిలిచింది.ఈ కార్యక్రమం బహుమతి పంపిణీ కార్యక్రమంలో, టాటా ఇంటర్నేషనల్ సింగపూర్ ఛైర్మన్ , ఏసియన్ ఫార్మర్ రెసిడెంట్ డైరెక్టర్, ది సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (SINDA) టర్మ్ ట్రస్టీ, సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (SIFAS) అధ్యక్షుడు, అయిన కె.వి.రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా అనుజ్ ఖన్నా సోహమ్, AFFLE గ్రూప్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు.విద్యార్థుల విభిన్న ప్రతిభాపాటవాల ప్రదర్శనతో పాటు, వివిధ వినోదాత్మక కార్యక్రమాలతో, ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు చెస్ థీమ్ స్కిట్, రూబిక్స్ క్యూబ్ సొల్యూషన్ లాంటి, టాలెంట్ షో, ప్రత్యేకమైన క్యాలెండర్ గేమ్ , క్విజ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యాలను, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలో చెస్ ప్రాముఖ్యతను మురళి కృష్ణ చిత్రాడ వివరించారు. "సౌందర్య కనగాల" యాంకరింగ్ ఆకట్టుకుంది.శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగేష్ మరియు గోపి చిరుమామిళ్ల తదితర ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేసారు. -
విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన చెస్ చిచ్చరపిడుగులు
భారత చెస్ చిచ్చరపిడుగులు విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించారు. తెలంగాణకు చెందిన దివిత్ రెడ్డి అడుల్లా బాలుర అండర్-8 ర్యాపిడ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని (10/11), బ్లిట్జ్లో కాంస్యాన్ని (8.5/11)సాధించగా.. తమిళనాడుకు చెందిన శర్వానికా ఏ ఎస్ బాలికల అండర్-10 ర్యాపిడ్లో బంగారు పతకాన్ని (9/11), బ్లిట్జ్లో రతజ పతకాన్ని (9/11) సాధించింది. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో ఈ ఇద్దరు చిన్నారులపై ప్రశంసల వర్షం కురుస్తుంది. వీరిద్దరిని భావి భారత గ్రాండ్మాస్టర్లని చెస్ అభిమానులు కొనియాడుతున్నారు. దివిత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ అండర్-7, అండర్-9 ఓపెన్ ఛాంపియన్గా ఉన్నాడు. శర్వానికా ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల (2023-24) అండర్-10 బాలిక విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. Victory for Bharat 🇮🇳 at the World Rapid & Blitz Cadet Chess 2024! Sharvaanica A S shines with Gold in U-10 Rapid & Silver in Blitz, while Divith Reddy Adulla seizes Gold in U-8 Rapid & Bronze in Blitz. Their moves are making history! Cheers to their success and the bright… pic.twitter.com/lTYp1QvuSr— Nitin Narang (@narangnitin) April 30, 2024 ర్యాపిడ్ అండర్-8 ఓపెన్లో ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుంచి మొత్తం 59 మంది క్రీడాకారులు, అండర్-10 బాలికల విభాగంలో 19 దేశాల నుంచి 43 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-8 ఓపెన్ బ్లిట్జ్లో 22 దేశాల నుంచి 51 మంది క్రీడాకారులు, అండర్-10 బాలికల బ్లిట్జ్ విభాగంలో 18 దేశాల నుంచి 41 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.2024 ఏప్రిల్ 26 నుండి 28 వరకు అల్బేనియాలోని గ్రాండ్ బ్లూ FAFA రిసార్ట్లో (డ్యూరెస్) ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఫిడే, అల్బేనియా చెస్ ఫెడరేషన్ నిర్వహించాయి. -
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
ఇటీవలికాలంలో భారత దేశం చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారింది. ప్రతి ఏటా దేశం నుంచి పెద్ద సంఖ్యలో గ్రాండ్మాస్టర్లు పుట్టుకొస్తున్నాడు. 1987వ సంవత్సరంలో భారత్ నుంచి కేవలం విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే గ్రాండ్మాస్టర్గా ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 84కు చేరింది.కొద్ది రోజుల కిందట జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు పాల్గొనగా.. గుకేశ్ ఆ టోర్నీ టైటిల్ కైవసం చేసుకుని రికార్డుల్లోకెక్కాడు. 17 ఏళ్ల గుకేశ్ క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ నెగ్గిన రెండో భారత ప్లేయర్గా అరుదైన ఘనత సాధించాడు.24 ఏళ్లలో 81 మంది గ్రాండ్మాస్టర్లు..1999 వరకు భారత్ తరఫున ముగ్గురు గ్రాండ్మాస్టర్లు మాత్రమే ఉండేవారు. గడిచిన 24 ఏళ్లలో భారత్ నుంచి ఏకంగా 81 మంది గ్రాండ్మాస్టర్లు తయారయ్యారు. గ్రాండ్మాస్టర్ల సంఖ్య విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఫిడే ర్యాంకింగ్స్ టాప్-20లో ప్రస్తుతం నలుగురు భారత గ్రాండ్మాస్టర్లు ఉన్నారు.జూనియర్ల విభాగంలో టాప్-5 ర్యాంకింగ్స్ ఆటగాళ్లలో ఏకంగా ముగ్గురు (ప్రజ్ఞానంద, గుకేశ్, నిహల్ సరిన్) భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల విభాగంలో టాప్-20 ర్యాంకింగ్స్లో ముగ్గురు (ఆర్ వైశాలీ, ప్రజ్ఞానంద సోదరి) భారత ప్లేయర్లు ఉన్నారు.భారత గ్రాండ్మాస్టర్లు..విశ్వనాథన్ ఆనంద్ (తమిళనాడు)దిబ్యేందు బారువా (పశ్చిమ బెంగాల్)ప్రవీణ్ తిప్సే (మహారాష్ట)అభిజిత్ కుంటే (మహారాష్ట్ర)కృష్ణన్ శశికిరణ్ (తమిళనాడు)పెంటల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్) కోనేరు హంపీ (ఆంధ్రప్రదేశ్)సూర్య శేఖర్ గంగూలీ (పశ్చిమ బెంగాల్)సందీపన్ చందా (పశ్చిమ బెంగాల్) రామచంద్రన్ రమేష్ (తమిళనాడు) తేజస్ బక్రే (గుజరాత్ )మగేష్ చంద్రన్ పంచనాథన్ (తమిళనాడు)దీపన్ చక్రవర్తి (తమిళనాడు)నీలోత్పాల్ దాస్ (పశ్చిమ బెంగాల్)పరిమార్జన్ నేగి (ఢిల్లీ)గీతా నారాయణన్ గోపాల్ (కేరళ)అభిజీత్ గుప్తా (ఢిల్లీ)సుబ్రమణియన్ అరుణ్ ప్రసాద్ (తమిళనాడు)సుందరరాజన్ కిదాంబి (తమిళనాడు)ఆర్.ఆర్ లక్ష్మణ్ (తమిళనాడు)శ్రీరామ్ ఝా (ఢిల్లీ)దీప్ సేన్గుప్తా (పశ్చిమ బెంగాల్)బాస్కరన్ అధిబన్ (తమిళనాడు)ఎస్.పీ సేతురామన్ (తమిళనాడు)హారిక ద్రోణవల్లి (ఆంధ్రప్రదేశ్)లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్)వైభవ్ సూరి (ఢిల్లీ)ఎంఆర్. వెంకటేష్ (తమిళనాడు)సహజ్ గ్రోవర్ (ఢిల్లీ) విదిత్ గుజరాతీ (మహారాష్ట్ర)శ్యామ్ సుందర్ (తమిళనాడు)అక్షయ్రాజ్ కోర్ (మహారాష్ట్ర)విష్ణు ప్రసన్న (తమిళనాడు)దేబాషిస్ దాస్ (ఒడిషా 27)సప్తర్షి రాయ్ చౌదరి (పశ్చిమ బెంగాల్)అంకిత్ రాజ్పారా (గుజరాత్)చితంబరం అరవింద్ (తమిళనాడు)కార్తికేయ మురళి (తమిళనాడు)అశ్విన్ జయరామ్ (తమిళనాడు)స్వప్నిల్ ధోపడే (మహారాష్ట్ర)నారాయణన్ (కేరళ)శార్దూల్ గగారే (మహారాష్ట్ర)దీప్తయన్ ఘోష్ (పశ్చిమ బెంగాల్)ప్రియదర్శన్ కన్నప్పన్ (తమిళనాడు)ఆర్యన్ చోప్రా (ఢిల్లీ)శ్రీనాథ్ నారాయణన్ (తమిళనాడు)హిమాన్షు శర్మ (హర్యానా)అనురాగ్ మ్హమల్ (గోవా)అభిమన్యు పురాణిక్ (మహారాష్ట్ర)తేజ్కుమార్ (కర్ణాటక)సప్తర్షి రాయ్ (పశ్చిమ బెంగాల్)రమేష్బాబు ప్రజ్ఞానంద (తమిళనాడు)నిహాల్ సరిన్ (కేరళ)అర్జున్ ఎరిగైసి (తెలంగాణ)కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్)హర్ష భరతకోటి (తెలంగాణ)పి.కార్తికేయన్ (తమిళనాడు)స్టానీ (కర్ణాటక)విశాఖ (తమిళనాడు)డి గుకేష్ (తమిళనాడు)పి.ఇనియన్ (తమిళనాడు)స్వయంస్ మిశ్రా (ఒడిషా)గిరీష్ ఎ. కౌశిక్ (కర్ణాటక)పృథు గుప్తా (ఢిల్లీ)రౌనక్ సాధ్వని (మహారాష్ట్ర)జి. ఆకాష్ (తమిళనాడు)లియోన్ ల్యూక్ మెండోంకా (గోవా)అర్జున్ కళ్యాణ్ (తమిళనాడు)హర్షిత్ రాజా (మహారాష్ట్ర)రాజా రిథ్విక్ ఆర్ (తెలంగాణ)మిత్రభా గుహ (పశ్చిమ బెంగాల్)సంకల్ప్ గుప్తా (మహారాష్ట్ర)భరత్ సుబ్రమణ్యం (తమిళనాడు)రాహుల్ శ్రీవాత్సవ్ (తెలంగాణ)ప్రణవ్ (తమిళనాడు)ప్రణవ్ ఆనంద్ (కర్ణాటక)ఆదిత్య మిట్టల్ (మహారాష్ట్ర)కౌస్తవ్ ఛటర్జీ (పశ్చిమ బెంగాల్)ప్రాణేష్ (తమిళనాడు)విఘ్నేష్ (తమిళనాడు)సయంతన్ దాస్ (పశ్చిమ బెంగాల్)ప్రణీత్ వుప్పల (తెలంగాణ)ఆదిత్య సమంత్ (మహారాష్ట్ర)ఆర్ వైశాలి (తమిళనాడు)2022-2024 మధ్యలో వివిధ దేశాల్లో తయారైన గ్రాండ్మాస్టర్లు..2022🇮🇳 భారతదేశం: 8🇺🇸 USA: 5🇷🇺 రష్యా: 4🇩🇪 జర్మనీ: 3🇫🇷 ఫ్రాన్స్: 3🇺🇦 ఉక్రెయిన్: 3🇦🇿 అజర్బైజాన్: 2🇪🇸 స్పెయిన్: 2🇧🇾 బెలారస్: 2🇧🇬 బల్గేరియా: 2🇹🇲 తుర్క్మెనిస్తాన్: 1🇦🇹 ఆస్ట్రియా: 1🇨🇴 కొలంబియా: 1🇲🇪 మాంటెనెగ్రో: 1🇸🇰 స్లోవేకియా: 1 🁢 🁥🇳🇴 నార్వే: 1🇵🇱 పోలాండ్: 1🇱🇹 లిథువేనియా: 1🇻🇳 వియత్నాం: 1🇭🇷 క్రొయేషియా: 1🇮🇷 ఇరాన్: 1🇧🇷 బ్రెజిల్: 1🇲🇩 మోల్డోవా: 1🇦🇷 అర్జెంటీనా: 1🇸🇬 సింగపూర్: 1🇵🇾 పరాగ్వే: 1🇳🇱 నెదర్లాండ్స్: 1🇹🇷 టర్కీ: 12023🇮🇳 భారతదేశం: 7🇨🇳 చైనా: 3🇳🇱 నెదర్లాండ్స్: 2🇦🇲 అర్మేనియా: 2🇬🇷 గ్రీస్: 2🇭🇺 హంగేరి: 2🇺🇿 ఉజ్బెకిస్తాన్: 1🇯🇴 జోర్డాన్: 1🇦🇿 అజర్బైజాన్: 1🇹🇲 తుర్క్మెనిస్తాన్: 1🇨🇴 కొలంబియా: 1🇨🇺 క్యూబా: 1🇮🇷 ఇరాన్: 1🇷🇴 రొమేనియా: 1🇹🇷 టర్కీ: 1🇮🇱 ఇజ్రాయెల్: 1🇺🇸 USA: 1🇬🇪 జార్జియా: 1🇷🇺 రష్యా: 1🇫🇷 ఫ్రాన్స్: 1🇩🇪 జర్మనీ: 1🇩🇰 డెన్మార్క్: 1🇺🇦 ఉక్రెయిన్: 1🇹🇼 తైవాన్: 1🇮🇸 ఐస్లాండ్: 1🇸🇮 స్లోవేనియా: 1🇰🇿 కజకిస్తాన్: 1🇵🇱 పోలాండ్: 12024🇦🇹 ఆస్ట్రియా: 1🇵🇰 పాకిస్థాన్: 1🇪🇪 ఎస్టోనియా: 1 -
భారత నంబర్వన్గా అర్జున్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత నంబర్వన్ ప్లేయర్గా అర్జున్ అవతరించాడు. ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్లో 20 ఏళ్ల అర్జున్ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్ను అందుకున్నాడు. ఈ క్రమంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి భారత టాప్ ర్యాంకర్గా వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో ప్రపంచ 11వ ర్యాంక్లో ఉన్నాడు. గత ఏడాది సెపె్టంబర్ 1న తమిళనాడు గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలిసారి అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్ను దాటి భారత కొత్త నంబర్వన్గా నిలిచాడు. ఆ తర్వాత ఆనంద్ మళ్లీ టాప్ ర్యాంక్కు చేరుకోగా... ఏడు నెలల తర్వాత అర్జున్ ప్రదర్శనకు ఆనంద్ మరోసారి భారత నంబర్వన్ స్థానాన్ని చేజార్చుకున్నాడు. ఆనంద్, పెంటేల హరికృష్ణ, గుకేశ్ తర్వాత ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్లో చోటు సంపాదించిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్గా అర్జున్ గుర్తింపు పొందాడు. తాజా రేటింగ్స్లో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 2830 పాయింట్లు), ఫాబియానో కరువానా (అమెరికా; 2803 పాయింట్లు), నకముర (అమెరికా; 2789 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంక్ల్లో నిలిచారు. భారత్ నుంచి టాప్–100లో 10 మంది గ్రాండ్ మాస్టర్లు (అర్జున్–9, ఆనంద్–11, ప్రజ్ఞానంద –14, గుకేశ్–16, విదిత్–25, హరికృష్ణ–37, నిహాల్ సరీన్–39, నారాయణన్–41, అరవింద్ చిదంబరం–72, రౌనక్ సాధ్వాని–81) ఉన్నారు. -
ప్రజ్ఞానందకు రెండో విజయం
ప్రాగ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద రెండో విజయం నమోదు చేశాడు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఐదో రౌండ్ గేమ్లో ప్రజ్ఞానంద 52 ఎత్తుల్లో గెలిచాడు. డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్లో భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, గుకేశ్ 2.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో ర్యాంక్లో ఉన్నారు. -
ప్రజ్ఞానంద శుభారంభం... వైశాలి ఓటమి
భారత చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై తన జోరు కొనసాగిస్తున్నాడు. చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో అతను విజయంతో మొదలు పెట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో ప్రజ్ఞానంద 41 ఎత్తులో జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమర్ను ఓడించాడు. ఇటాలియన్ ఓపెనింగ్తో మొదలు పెట్టిన భారత జీఎం అటాకింగ్ గేమ్ మొదలు కీమర్ డిఫెన్స్ పని చేయలేదు. ఈ మ్యాచ్ గెలిచే క్రమంలో ప్రజ్ఞానంద ‘లైవ్ రేటింగ్’లో విశ్వనాథన్ ఆనంద్ను దాటి భారత్ తరఫున అత్యధిక రేటింగ్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లలో రిచర్డ్ ర్యాపో (రొమానియా)తో జరిగిన గేమ్ను డి. గుకేశ్...డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్ను విదిత్ గుజరాతీ ‘డ్రా’ చేసుకున్నారు. చాలెంజర్ విభాగంలో అన్టోన్ కొరొ»ొవ్ (ఉక్రెయిన్)తో జరిగిన పోరులో భారత గ్రాండ్మాస్టర్ వైశాలి ఓటమిపాలైంది. -
గ్రాండ్మాస్టర్ను ఓడించిన పిన్న వయస్కుడిగా...
క్లాసికల్ చెస్ ఫార్మాట్లో గ్రాండ్మాస్టర్ను ఓడించిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి సింగపూర్ కుర్రాడు అశ్వథ్ కౌశిక్ (8 ఏళ్ల 6 నెలల 11 రోజులు) రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్లో జరిగిన బర్గ్డార్ఫర్ స్టాడస్ ఓపెన్ టోర్నీ నాలుగో రౌండ్లో అశ్వథ్ 45 ఎత్తుల్లో పోలాండ్కు చెందిన 37 ఏళ్ల గ్రాండ్మాస్టర్ జేసెక్ స్టోపాపై గెలిచాడు. ఈ క్రమంలో లియోనిడ్ (సెర్బియా; 8 ఏళ్ల 11 నెలల 7 రోజులు) పేరిట ఉన్న రికార్డును అశ్వథ్ బద్దలు కొట్టాడు. -
13 ఏళ్లకే గ్రాండ్మాస్టర్గా.. ది మాగ్నస్ ఎఫెక్ట్
‘అబ్బబ్బా! ఇలా ఇన్నేళ్లుగా ప్రపంచ చాంపియన్గా ఉండటం బోర్ కొట్టేస్తోందమ్మా! నా వల్ల కాదు. అవే విజయాలు, అవే టైటిల్స్. ఎప్పుడూ నేనే అంటే ఎలా? ఎవరైనా కొత్తవాళ్లు విజేతగా వస్తే బాగుంటుంది. అయినా ఎవరూ నన్ను ఓడించడం లేదు. ఇలా అయితే నేనే ఆడకుండా తప్పుకుంటా’.. సరిగ్గా ఇలాగే కాకపోయినా ఇదే అర్థంలో దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ దాదాపు ఏడాదిన్నర క్రితం చేసిన ఈ వ్యాఖ్య చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి ప్రపంచ చాంపియన్గా కొనసాగుతూ 32 ఏళ్ల వయసులోనే ఇంతటి వైరాగ్యం వచ్చేసిందా అన్నట్లుగా అతని మాటలు వినిపించాయి. అయితే ఈ ఆల్టైమ్ చెస్ గ్రేట్ అనుకోకుండా చేసిన వ్యాఖ్య కాదు ఇది. ఎందుకంటే అసలు పోటీ అనేదే లేకుండా తిరుగులేకుండా సాగుతున్న చెస్ సామ్రాజ్యంలో అతను రారాజుగా ఉన్నాడు. పేరుకు నంబర్వన్ మాత్రమే కాదు, ఒకటి నుంచి పది వరకు అన్ని స్థానాలూ అతడివే! ఆ తర్వాతే మిగతావారి లెక్క మొదలవుతుంది. నిజంగానే అతని సమకాలికులు కావచ్చు, లేదా కొత్తగా వస్తున్న తరం కుర్రాళ్లు కావచ్చు కార్ల్సన్ను ఓడించలేక చేతులెత్తేస్తున్నారు. ప్రపంచ చాంపియన్షిప్ మాత్రమే కాకుండా ఇతర మెగా టోర్నీల్లో కూడా అగ్రస్థానానికి గురి పెట్టకుండా రెండోస్థానం లక్ష్యంగానే అంతా బరిలోకి దిగుతున్నారు. ఇలాంటి సమయంలో తాను రాజుగా కంటే సామాన్యుడిగా ఉండటమే సరైనదని అతను భావించాడు. అందుకే క్లాసికల్ చెస్ వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా తప్పుకుంటున్నానని ప్రకటించడం అతనికే చెల్లింది. చదరంగంలో లెక్కలేనన్ని రికార్డులు, ఘనతలు తన పేరిట నమోదు చేసుకున్న నార్వేజియన్ కార్ల్సన్ ప్రస్థానం అసాధారణం. 2013, చెన్నై. స్థానిక హీరో, దేశంలో చెస్కు మార్గదర్శి అయిన విశ్వనాథన్ ఆనంద్ తన వరల్డ్ చెస్ చాంపియన్షిప్ను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఎదురుగా చాలెంజర్ రూపంలో 23 ఏళ్ల మాగ్నస్ కార్ల్సన్ ఉన్నాడు. ఆనంద్తో పోలిస్తే అతని ఘనతలు చాలా తక్కువ. పైగా అనుభవం కూడా లేదు. కాబట్టి అనూహ్యం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుతాన్ని ఎవరూ ఆపలేకపోయారు. సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కార్ల్సన్ అలవోకగా ఆనంద్ను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచాడు. మొత్తం 12 రౌండ్ల పోరు కాగా 10వ రౌండ్కే చాంపియన్ ఖరారు కావడంతో తర్వాతి రెండు రౌండ్లు నిర్వహించాల్సిన అవసరం లేకపోయింది. ఇందులో 3 విజయాలు సాధించి 7 గేమ్లు డ్రా చేసుకున్న మాగ్నస్.. ప్రత్యర్థి ఆనంద్కు ఒక్క గేమ్లోనూ గెలిచే అవకాశం ఇవ్వలేదు. అలా మొదలైన విజయప్రస్థానం ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. ఆ తర్వాత ఈ టైటిల్ను అతను మరోసారి నాలుగు సార్లు నిలబెట్టుకున్నాడు. వాస్తవం ఏమిటంటే స్వచ్ఛందంగా తాను వరల్డ్ చాంపియన్షిప్ నుంచి తప్పుకున్నా, ఆటపై ఇష్టంతో ఇతర టోర్నీల్లో పాల్గొంటున్న మాగ్నస్ను ఓడించేందుకు అతని దరిదాపుల్లోకి కూడా కనీసం ఎవరూ రాలేకపోతున్నారు. చైల్డ్ ప్రాడజీగా మొదలై... చదరంగంలో శిఖరానికి చేరిన కార్ల్సన్లోని ప్రతిభ చిన్నతనంలోనే అందరికీ కనిపించింది. పుట్టుకతోనే వీడు మేధావిరా అనిపించేలా అతని చురుకుదనం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. రెండేళ్ల వయసులోనే 500 ముక్కల జిగ్సా పజిల్ను అతను సరిగ్గా పేర్చడం చూసి కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ఇక చాలామంది పిల్లలు ఇష్టపడే ‘లెగోస్’లోనైతే అతని సామర్థ్యం అసాధారణం అనిపించింది. 10–14 ఏళ్ల పిల్లల కోసం ఉద్దేశించిన పజిల్స్ను కూడా అతను నాలుగేళ్ల వయసులోనే సాల్వ్ చేసి పడేసేవాడు. అద్భుతమైన జ్ఞాపకశక్తి కూడా కార్ల్సన్ సొంతం. ఐదేళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, రాజధానులు, పటాలు, జనాభావంటి సమాచారాన్ని అలవోకగా గుర్తు పెట్టుకొని చెప్పేవాడు. దీనిని సరైన సమయంలో గుర్తించడం అతని తల్లిదండ్రుల తొలి విజయం. తమవాడికి చెస్ సరిగ్గా సరిపోతుందని భావించిన వారు ఆ దిశగా కార్ల్సన్ను ప్రోత్సహించడంతో చదరంగ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని చూడగలిగింది. ఆరంభంలో తన లోకంలో తాను ఉంటూ చెస్పై అంత ఆసక్తి ప్రదర్శించకపోయినా ఇంట్లో తన అక్కపై గెలిచేందుకు కనబరచిన పట్టుదల ఆపై చెస్పై అతడికి ప్రేమను పెంచింది. చెస్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత దానిపై ఆసక్తి మరింత పెరిగింది. ఆపై 8 ఏళ్ల వయసులోనే నార్వే జాతీయ చెస్ చాంపియన్షిప్లో పాల్గొని సత్తా చాటడంతో అందరికీ అతని గురించి తెలిసింది. ఆపై చదరంగమే అతనికి లోకంగా మారింది. ఆ తర్వాత యూరోప్లోని వేర్వేరు వయో విభాగాల టోర్నీల్లో చెలరేగి వరుస విజయాలతో మాగ్నస్ దూసుకుపోయాడు. గ్రాండ్మాస్టర్గా మారి... 13 ఏళ్ల వయసు వచ్చేసరికి కార్ల్సన్ దూకుడైన ఆట గురించి అందరికీ తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో అతను మరెన్నో సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా అంచనా వేశారు. అది ఎంత తొందరగా జరగనుందని వేచిచూడటమే మిగిలింది. నిజంగానే కేవలం ఏడు నెలల వ్యవధిలోనే మాగ్నస్ మూడు ఇంటర్నేషనల్ మాస్టర్స్ నార్మ్లు సాధించడంలో సఫలమయ్యాడు. అతని ప్రతిభ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ కార్ల్సన్కు స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ నార్వే కుర్రాడు ఎప్పుడూ వమ్ము చేయలేదు. 14 ఏళ్లు కూడా పూర్తికాకముందే గ్రాండ్మాస్టర్గా మారి కెరీర్లో మరో మెట్టు ఎక్కాడు. అదే ఏడాది వరల్డ్ చాంపియన్షిప్లోనూ పాల్గొని ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఫలితం సానుకూలంగా రాకపోయినా రాబోయే సంవత్సరాల్లో మాగ్నస్ సృష్టించబోయే సునామీకి ఇది సూచికగా కనిపించింది. శిఖరానికి చేరుతూ... సాధారణంగా చెస్లో గొప్ప ఆటగాళ్లందరూ భిన్నమైన ఓపెనింగ్స్ను ఇష్టపడతారు. ఓపెనింగ్ గేమ్తోనే చాలా వరకు ఆటపై పట్టు బిగించేస్తారు. కానీ మాగ్నస్ దీనిని పెద్దగా పట్టించుకోడు. మిడిల్ గేమ్లో మాత్రం అతనో అద్భుతం. దూకుడైన ఎత్తులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ కోలుకోలేకుండా చేయడంలో అతను నేర్పరి. ప్రాక్టీస్ కోసం కంçప్యూటర్లలో ఉండే ప్రోగ్రామింగ్ కంటే సొంత మెదడుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. అపరిమిత సంఖ్యలో తనతో తానే మ్యాచ్లు ఆడుతూ సుదీర్ఘ సాధనతో నేర్చుకోవడం అతనికి మాత్రమే సాధ్యమైన కళ. ఈ ప్రతిభ అతడిని వేగంగా పైకి ఎదిగేలా చేసింది. తనకెదురైన ప్రతి ఆటగాడినీ ఓడిస్తూ వచ్చిన మాగ్నస్ 19 ఏళ్ల వయసులో తొలిసారి వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకొని శిఖరానికి చేరాడు. అదే ఏడాది అతని కెరీర్లో మరో కీలక క్షణం మరో దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ను వ్యక్తిగత కోచ్గా నియమించుకోవడం. ప్రపంచ చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు మరో యువ సంచలనానికి శిక్షణ ఇస్తే ఎలా ఉంటుందనేదానికి ఈ బంధం బలమైన ఉదాహరణ. కాస్పరోవ్తో కలసి ఎత్తుకు పైఎత్తులతో దూసుకుపోయిన ఈ యువ ఆటగాడు నాలుగేళ్ళలో తిరుగులేని ప్రదర్శనతో శిఖరానికి చేరుకున్నాడు. తర్వాతి రోజుల్లో కాస్పరోవ్ పేరిట ఉన్న ఘనతలన్నీ అతను చెరిపేయగలగడం విశేషం. అన్నీ అద్భుతాలే... 2013లో తొలిసారి ప్రపంచ చాంపియన్గా నిలిచిన కార్ల్సన్ 2014లో దానిని నిలబెట్టుకున్నాడు. ఈసారి కూడా విశ్వనాథన్ ఆనంద్పైనే అతను అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఇక్కడ కూడా చివరి గేమ్ అవసరం లేకపోయింది. 2016 వరల్డ్ చాంపియన్షిప్లో మాత్రం సెర్జీ కర్యాకిన్ (రష్యా)తో అతనికి కాస్త పోటీ ఎదురైంది. 12 గేమ్ల తర్వాత ఇద్దరూ 6–6 పాయింట్లతో సమంగా నిలవగా, టైబ్రేక్లో విజయం అతని సొంతమైంది. నాలుగోసారి 2018లో ఫాబియానో కరువానా (అమెరికా)పై కూడా ఇదే తరహాలో 6–6తో స్కోరు సమం కాగా, టైబ్రేక్లో 3–0తో గెలిచి వరల్డ్ చాంపియన్గా కొనసాగాడు. 2021లోనైతే మాగ్నస్ ఆధిపత్యం మరింత స్పష్టంగా కనిపించింది. ఇయాన్ నెపొమాచి (రష్యా)తో జరిగిన సమరం పూర్తి ఏకపక్షంగా సాగింది. 14 రౌండ్ల పోరు కాగా 11 రౌండ్లు ముగిసేసరికి 7.5 పాయింట్లు సాధించి తన జగజ్జేత హోదాను మళ్లీ నిలబెట్టుకున్నాడు. బహుశా ఇదే ఫలితం తర్వాతి వరల్డ్ చాంపియన్షిప్కు దూరంగా ఉండేందుకు కారణమై ఉండవచ్చు. క్రికెట్లో మూడు ఫార్మాట్లలాగే చెస్లోనూ క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లు ఉన్నాయి. కార్ల్సన్ మూడింటిలో సాగించిన ఆధిపత్యం చూస్తే అతను ఏ స్థాయి ఆటగాడో అర్థమవుతుంది. క్లాసిక్లో 5 సార్లు విశ్వ విజేతగా నిలిచిన అతను 5 సార్లు ర్యాపిడ్లో, 7 సార్లు బ్లిట్జ్లో వరల్డ్ చాంపియన్గా (మొత్తం 17 టైటిల్స్) నిలవడం విశేషం. చెస్ చరిత్రలో గ్యారీ కాస్పరోవ్ (2851)ను అధిగమించి అతి ఎక్కువ యెల్లో రేటింగ్ (2882) సాధించిన ఆటగాడిగా కార్ల్సన్ను నిలిచాడు. వరుసగా పదేళ్ల పాటు విశ్వవిజేతగా నిలిచిన అతను వరుసగా 125 గేమ్లలో ఓటమి ఎరుగని ఆటగాడిగా తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. అతనిపై పెద్ద సంఖ్యలో వచ్చిన పుస్తకాలు, వీడియో డాక్యుమెంటరీలు కార్ల్సన్ ఆటలోని అద్భుతాన్ని మనకు చూపిస్తాయి. అధికారికంగా ప్రపంచ చాంపియన్ కాకపోయినా, అతను ఇంకా వరల్డ్ చెస్ను శాసిస్తూనే ఉన్నాడు. గత రెండేళ్లలో అతను సాధించిన విజయాలు, టైటిల్స్కు మరెవరూ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఇదే జోరు కొనసాగిస్తూ మున్ముందూ చెస్లో మాగ్నస్ లెక్కలేనన్ని ఘనతలు సాధించడం ఖాయం. -
తొమ్మిదేళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న చెస్ చిచ్చరపిడుగు
బెంగళూరుకు చెందిన చార్వి అనిల్ కుమార్ తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు చేస్తుంది. ఆడుతూపాడుతూ తిరగాల్సిన వయసులో ఈ అమ్మాయి మేధావుల ఆటలో సంచలనాలు సృష్టిస్తుంది. అసాధారణ నైపుణ్యాలు కలిగిన ఈ అమ్మాయి ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ (11 ఏళ్లలోపు) ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. 2022లో అండర్-8 ప్రపంచ ఛాంపియన్గా నిలవడం ద్వారా తొలిసారి వార్తల్లోకెక్కిన చార్వి.. ఆ పోటీల్లో అగ్రస్థానంలో నిలువడం ద్వారా 1900 ఎలో రేటింగ్ పాయింట్ల మార్కును అధిగమించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అనంతరం జరిగిన పలు అంతర్జాతీయ ఈవెంట్లలోనూ చార్వి తన విజయపరంపరను కొనసాగించింది. Meet 9-year-old Charvi Anilkumar, @Charvi_A2014 the highest-rated female #chess prodigy (under 11) in the world. The #Bengaluru girl made headlines in 2022 after she became the World Champion in the Under-8 category.https://t.co/Y0SvlIUH8X — South First (@TheSouthfirst) January 10, 2024 ఈ చెస్ చిచ్చరపిడుగు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో (అండర్ 8) ఏకంగా ఐదు బంగారు పతకాలు , ఓ రజత పతకం సాధించి, చెస్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేసింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా చార్వికి ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) బిరుదు దక్కింది. చార్వి.. 2022 అక్టోబర్లో తన మూడో మేజర్ టైటిల్ను సాధించి, చెస్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో చార్వి ఛాంపియన్గా నిలిచి హేమాహేమీల ప్రశంసలను అందుకుంది. తాజా ర్యాంకింగ్స్లో 1915 రేటింగ్ పాయింట్లు కలిగి, ఫిడే ర్యాంకింగ్స్లో (జూనియర్ బాలికల విభాగం) అగ్రస్థానంలో నిలిచిన చార్వి.. ఈ ఏడాది చివరికల్లా 2200 లేదా 2300 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపింది. చార్వి ప్రస్తుతం బెంగళూరులోని క్యాపిటల్ పబ్లిక్ స్కూల్లో నాలుగో గ్రేడ్ చదువుతుంది. చార్వి.. ఆర్బి రమేశ్ వద్ద చెస్ ఓనమాలు నేర్చుకుంది. చార్వి తండ్రి అనిల్ కుమార్ బెంగళూరులోనే ఓ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తుండగా.. తల్లి అఖిల ఉద్యోగం మానేసి చార్వికి ఫుల్టైమ్ సపోర్ట్గా ఉంది. -
నైనా ఖాతాలో ఐదో విజయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్షిప్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా గొర్లి వరుసగా ఐదో విజయం నమోదు చేసి అజేయంగా నిలిచింది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్లో వైజాగ్కు చెందిన నైనా 60 ఎత్తుల్లో మీరా సింగ్ (ఢిల్లీ)పై, ఐదో రౌండ్లో 80 ఎత్తుల్లో ఆముక్త (ఆంధ్రప్రదేశ్)పై గెలిచింది. ఐదో రౌండ్ తర్వాత నైనా ఐదు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణకు చెందిన సంహిత పుంగవనం, బి.కీర్తిక 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు చల్లా సహర్ష ఐదో రౌండ్ తర్వాత 4.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి రెండో ర్యాంక్లో ఉన్నాడు. -
‘గ్రాండ్మాస్టర్’ వైశాలి
చెన్నై: భారత చెస్ క్రీడాకారిణి వైశాలి రమేశ్బాబు తన కెరీర్లో కీలక మైలురాయిని అందుకుంది. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల వైశాలి శుక్రవారం ‘గ్రాండ్మాస్టర్’ హోదాను అందుకుంది. స్పెయిన్లో జరుగుతున్న ఎలోబ్రిగాట్ ఓపెన్ సందర్భంగా జీఎం గుర్తింపును దక్కించుకుంది. టోర్నీ తొలి రెండు రౌండ్లలో విజయం సాధించిన వైశాలి ఈ క్రమంలో 2500 ఎలో రేటింగ్ను దాటడంతో గ్రాండ్మాస్టర్ ఖాయమైంది. భారత్ తరఫున ఈ ఘనతను సాధించిన 84వ ప్లేయర్గా వైశాలి గుర్తింపు పొందగా...భారత్నుంచి జీఎంగా మారిన మూడో మహిళా ప్లేయర్ మాత్రమే కావడం విశేషం. ఇప్పటికే చెస్ ప్రపంచంలో సంచలన విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీఎం ప్రజ్ఞానందకు వైశాలి స్వయంగా అక్క కావడం విశేషం. వైశాలికంటే నాలుగేళ్లు చిన్నవాడైన ప్రజ్ఞానంద 2018లోనే గ్రాండ్మాస్టర్ హోదా అందుకోగా... ఐదేళ్ల తర్వాతి వైశాలి ఈ జాబితాలో చేరింది. తద్వారా ప్రపంచ చెస్లో గ్రాండ్మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వీరిద్దరు నిలవడం చెప్పుకోదగ్గ మరో విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో... చదరంగంపై ఆసక్తితోనే చిన్న వయసులోనే ఎత్తుకు పైఎత్తులు వేయడం ప్రారంభించిన వైశాలిని తల్లిదండ్రులు రమేశ్బాబు, నాగలక్ష్మి ప్రోత్సహించి ప్రొఫెషనల్ చెస్ వైపు మళ్లించారు. ఆ తర్వాత వరుస విజయాలతో ఆమె దూసుకుపోయింది. వరల్డ్ యూత్ చాంపియన్షిప్లో వైశాలి అండర్–12, అండర్–14 విభాగాల్లో విజేతగా నిలిచింది. 2020 చెస్ ఒలింపియాడ్లో తొలిసారి స్వర్ణపతకం గెలిచిన భారత జట్టులో వైశాలి సభ్యురాలిగా ఉంది. 2018లో ఆమె ఉమన్ గ్రాండ్మాస్టర్ హోదాను అందుకుంది. ఆ తర్వాత 2019 ఎక్స్ట్రాకాన్ ఓపెన్లో తొలి జీఎం నార్మ్, 2022లో ఫిషర్ మెమోరియల్ టోరీ్నలో రెండో జీఎం నార్మ్ సాధించిన వైశాలి ఈ ఏడాది ఖతర్ మాస్టర్స్లో మూడో జీఎం నార్మ్ను సొంతం చేసుకుంది. వరల్డ్ చాంపియన్షిప్ మ్యాచ్కు క్వాలిఫయింగ్గా పరిగణించే క్యాండిడేట్స్ టోర్నీకి వైశాలి అర్హత సాధించింది. పురుషుల విభాగంలో ఇదే టోర్నీకి ప్రజ్ఞానంద కూడా క్వాలిఫై అయ్యాడు. దాంతో ‘క్యాండిడేట్స్’ బరిలో నిలిచిన తొలి సోదర, సోదరి జోడీగా కూడా వీరు గుర్తింపు దక్కించుకున్నారు. భారత్నుంచి గ్రాండ్మాస్టర్ హోదా అందుకున్న తొలి మహిళగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కోనేరు హంపి (2002లో) గుర్తింపు పొందగా...2011లో ఆంధ్రప్రదేశ్కే చెందిన ద్రోణవల్లి హారిక కూడా ఈ హోదాను సాధించింది. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ సందర్భంగా వైశాలికి అభినందనలు తెలియజేశాడు. -
డబుల్ ధమాకా...
ఐల్ ఆఫ్ మ్యాన్ (యూకే): అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు ఆర్. వైశాలి, విదిత్ సంతోష్ గుజరాతి సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోరీ్నలో ఓపెన్ విభాగంలో విదిత్ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్గా అవతరించారు. ఈ టోరీ్నలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో... వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. విదిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్లో ఓడిపోయాడు. వైశాలి ఆరు గేముల్లో నెగ్గి, ఐదు గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చాంపియన్స్గా నిలిచిన విదిత్కు ట్రోఫీలతో పాటు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షల 57 వేలు), వైశాలికి ట్రోఫీలతో పాటు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 80 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. ఈ టైటిల్స్తో ఓపెన్ విభాగంలో విదిత్... మహిళల విభాగంలో వైశాలి క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. ఓపెన్, మహిళల విభాగాల్లో వేర్వేరుగా ఎనిమిది మంది ప్లేయర్ల మధ్య క్యాండిడేట్స్ టోర్నీ వచ్చే ఏడాది ఏప్రిల్లో 2 నుంచి 25 వరకు కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్ టోరీ్నలో విజేతగా నిలిచిన వారు ఓపెన్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగంలో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్ కోసం తలపడతారు. -
FIDE Grand Swiss: అర్జున్కు మూడో గెలుపు
గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో విజయం నమోదు చేశాడు. యూకేలోని ఐల్ ఆఫ్ మ్యాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 68 ఎత్తుల్లో రినాత్ జుమాబయేవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. ఐదో రౌండ్ తర్వాత అర్జున్ నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా టాప్ ర్యాంక్లో ఉన్నాడు. -
భారత చెస్ జట్ల గెలుపు.. హంపి, హారిక, వంతిక, వైశాలి అద్భుతంగా ఆడి..
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్ను ఓడించింది. మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్లో ఉన్నాయి. భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్ను భారత్ 1–1 గోల్తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్లో, కొరియా రెండో ర్యాంక్లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను హాంకాంగ్తో మంగళవారం ఆడుతుంది. -
కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విజేతల అద్భుత విజయాలను డాక్యుమెంటరీలలో చూసిన తరువాత తాను కూడా ఏదైనా సాధించాలనుకుంది మలేసియాకు చెందిన పది సంవత్సరాల పునీత మలర్ రాజశేఖర్. ఈ చిన్నారికి చెస్ అంటే ఇష్టం. తాజాగా... కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 45.72 సెకన్లలో చెస్బోర్డ్పై అత్యంత వేగంగా 32 పావులను సెట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. తండ్రి సహకారంతో నాలుగు నెలల పాటు కష్టపడి ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. -
చెస్లో త్రుటిలో చేజారిన పతకం
ఆసియా క్రీడల చెస్ ఈవెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత్ ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో, కోనేరు హంపి 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఎనిమిదో రౌండ్లో హంపితో జరిగిన గేమ్ను హారిక 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో హారిక 30 ఎత్తుల్లో జినెర్ జు (చైనా)పై గెలిచింది. ని ర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత జినెర్ జు ఏడు పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఉమిదా ఒమనోవా (ఉజ్బెకిస్తాన్), హు ఇఫాన్ (చైనా) 6.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఇరిగేశి అర్జున్ 5.5 పాయింట్లతో వరుసగా ఐదు, ఆరు స్థానాలతో సరిపెట్టుకున్నారు. వె యి (చైనా; 7.5 పాయింట్లు) స్వర్ణం, నొదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్; 7 పాయింట్లు) రజతం, సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 7 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. -
Asian Games 2023 chess: శుభారంభం చేసిన కోనేరు హంపి, హారిక
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత చెస్ గ్రాండ్మాస్టర్లు శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి తొలి రెండు రౌండ్లలో విజయం సాధించింది. మొదటి రౌండ్లో ఇరాన్కు చెందిన అలీనాసబలమాద్రి మొబినాను ఓడించిన హంపి.. సెకెండ్ రౌండ్లో వియత్నాం గ్రాండ్ మాస్టర్ ఫామ్ లే థావో న్గుయెన్ను చిత్తు చేసింది. దీంతో మూడో రౌండ్కు హంపి అర్హత సాధించింది. అదేవిధంగా మరో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి కూడా తొలి రౌండల్లో గెలుపొందింది. తొలి రౌండ్లో యూఏఈకు చెందిన అలాలీ రౌడాపై విజయం సాధించిన హారిక.. రెండో రౌండ్లో సింగపూర్ గ్రాండ్మాస్టర్ కియాన్యున్ గాంగ్ను ఓడించింది. అయితే పురుషల చెస్ విభాగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొదటి రౌండ్లో విజయం సాధించిన భారత గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్.. రెండో రౌండ్లో మాత్రం ఘోర ఓటమి చవిచూశాడు. రెండో రౌండ్లో కజికిస్తాన్కు చెందిన నోగర్బెక్ కాజీబెక్ ఎత్తులు ముందు విదిత్ చిత్తయ్యాడు. మరో గ్రాండ్ మాస్టర్ అర్జున్ కుమార్ ఎరిగైసి రెండో రౌండ్ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. తొలిరౌండ్లో ఫిలిప్పీన్స్కు చెందిన పాలో బెర్సమినాను ఓడించిన అర్జున్.. రెండవ రౌండ్ గేమ్ను వియత్నాంకు చెందిన లే తువాన్ మిన్తో డ్రా చేసుకున్నాడు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) మధ్యాహ్నం పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగానికి సంబంధించిన మూడు, నాలుగు రౌండ్ల చెస్ పోటోలు జరగనున్నాయి. భారత ఖాతాలో తొలి గోల్డ్మెడల్ ఇక ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటివరకు మొత్తం 7 పతకాలను ఏషియన్ గేమ్స్లో భారత్ కైవసం చేసుకుంది. చదవండి: Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్కు తొలి గోల్డ్ మెడల్.. -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ ఓపెన్ బ్లిట్జ్ టైటిల్ను అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) గెలుచుకున్నాడు. కోల్కతాలో శనివారం ముగిసిన ఈ టోర్నీలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండు సార్లు వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ అయిన గ్రిషుక్ ఈ టోర్నీ లోనూ సత్తా చాటాడు. మొత్తం టోర్నీ లో అతను ఒకే ఒక రౌండ్లో ఓడాడు. ఉజ్బెకిస్తాన్కు చెందిన అబ్దుస్సతరోవ్ రెండో స్థానం (11 పాయింట్లు) సాధించగా...భారత టీనేజ్ సంచలనం ఆర్.ప్రజ్ఞానంద (11)కు మూడో స్థానం దక్కింది. ఇతర భారత ఆటగాళ్లలో అర్జున్ ఇరిగేశి (4వ), పెంటేల హరికృష్ణ (6వ), విదిత్ గుజరాతీ (7వ), డి.గుకేశ్ (8వ) టాప్–10లో ముగించారు. నాలుగు రౌండ్లలో వరుసగా ఓటమి లేకుండా నిలిచినా...ఆ తర్వాత అబ్దుస్సతరోవ్, గ్రిషుక్, విదిత్ చేతుల్లో పరాజయం పాలు కావడంతో ప్రజ్ఞానంద వెనుకబడిపోయాడు. భారత నంబర్వన్ గుకేశ్ చివరి రోజు 9 రౌండ్లలో ఆరింటిలో ఓటమిపాలయ్యాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఇటీవల జరిగిన ప్రపంచ కప్ చెస్ టోర్నీ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు. -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ ర్యాపిడ్ ఓపెన్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా), విదిత్ సంతోష్ గుజరాతి (భారత్) ఐదు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు. ప్రజ్ఞానందకు మూడో ర్యాంక్, గ్రిషుక్కు నాలుగో ర్యాంక్, విదిత్కు ఐదో ర్యాంక్ లభించాయి. గురువారం జరిగిన చివరి మూడు రౌండ్లలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద సహచరులు విదిత్, ఇరిగేశి అర్జున్లపై గెలిచి భారత నంబర్వన్ దొమ్మరాజు గుకేశ్ చేతిలో ఓడిపోయాడు. 4.5 పాయింట్లతో గుకేశ్ ఆరో స్థానంలో నిలిచాడు. 3 పాయింట్లతో అర్జున్ తొమ్మిదో స్థానంలో, పెంటేల హరికృష్ణ 2.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో నిలిచారు. 7 పాయింట్లతో ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ మాక్సిమి వచీర్ లాగ్రెవ్ చాంపియన్గా అవతరించగా... 5.5 పాయింట్లతో తైమూర్ రజబోవ్ (అజర్బైజాన్) రన్నరప్గా నిలిచాడు. నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
టాటా స్టీల్ ఇండియా చెస్ చాంప్ దివ్య
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ మహిళల ర్యాపిడ్ టోర్నమెంట్లో ఫేవరెట్స్ను బోల్తా కొట్టిస్తూ భారత యువతార దివ్య దేశ్ముఖ్ చాంపియన్గా అవతరించింది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల దివ్య నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మూడు గేముల్లో దివ్యకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఏడో గేమ్ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన ఎనిమిదో గేమ్లో దివ్య 41 ఎత్తుల్లో ఓడిపోయింది. చివరిదైన తొమ్మిదో గేమ్లో దివ్య 51 ఎత్తుల్లో భారత స్టార్ కోనేరు హంపిపై సంచలన విజయం సాధించి టైటిల్ను ఖరారు చేసుకుంది. జు వెన్జున్ (చైనా; 6.5 పాయింట్లు) రన్నరప్గా, షువలోవా 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్కే చెందిన ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, వంతిక అగర్వాల్ ఐదో స్థానంలో, కోనేరు హంపి ఆరో స్థానంలో, సవితాశ్రీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇదే వేదికపై నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
ఆనంద్ మహీంద్ర గిప్ట్కు: ప్రజ్ఞానంద రియాక్షన్ ఇదీ!
RPraggnanandhaa Reacts Parents Long Term Dream పారిశ్రామికవేత్త, బిలియనీర్ తన తల్లి దండ్రులకు ప్రకటించిన బహుమతిపై భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ఫైడ్ చెస్ ప్రపంచ కప్ రన్నర్ అప్ ఆర్ ప్రజ్ఞానంద స్పందించారు. ఒక ఎలక్ట్రిక్ కారుకోసం కల గన్న తన అమ్మా నాన్నల చిరకాల వాంఛను ("లాంగ్ టర్మ్ డ్రీమ్") తీర్చినందుకు ధన్యవాదాలు సార్ అంటూ ప్రజ్ఞానంద ట్వీట్ చేశారు. తన కృతజ్ఞతను తెలియజేయడానికి పదాలు లేవు...చాలా ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజ్ఞానంద సాధించిన ఘనతకు గౌరవంగా అతని తల్లిదండ్రులకు ఆల్-ఎలక్ట్రిక్ SUVని బహుమతిగా ఇవ్వాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించిన సంగతి తెలిసిందే. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్) కాగా పిల్లవాడి ఆసక్తిని గమనించి, ప్రోత్సహించిన ప్రజ్ఞానంద పేరెంట్స్ నాగలక్ష్మి రమేష్బాబులను ఆనంద్ మహీంద్ర అభినందించారు. ఇందులో భాగంగానే వారికి ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు దేశంలో తల్లిదండ్రులు దీన్ని ప్రేరణగా తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మహీంద్ర ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ప్రత్యేక ఎడిషస్ను ఆ దంపతులకు ఇవ్వనున్నామని మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో బదులిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. No words to express my Gratitude 🙏 Thankyou very much @anandmahindra sir and @rajesh664 sir It is a long term dream of my parents to own an EV car thanks for making it a reality! https://t.co/YWCK1D99ik — Praggnanandhaa (@rpragchess) August 29, 2023 Sky is the limit! @rpragchess and @GM_JKDuda showed us that the mind of a genius knows no bounds! #chess #mind pic.twitter.com/TWzvPefBNV — WR_Chess_Masters (@wr_chess) August 29, 2023 -
Chess World Cup 2023: రాజూ బంటూ అమ్మే
చదరంగంలో పావులు కదపాలంటే బుద్ధికి బృహస్పతిలా ఉండాలి. కాని ఆ బృహస్పతిని కని, పెంచడానికి అమ్మ అమ్మలా ఉంటే చాలు. అమ్మకు ఎత్తుకు పై ఎత్తు తెలియదు ప్రేమ తప్ప. తన బిడ్డను రాజు చేయాలనే తపన తప్ప. అందుకు తాను బంటుగా మారేందుకు సిద్ధం కావడం తప్ప. చెస్ వరల్డ్ కప్ 2023లో సంచలనంగా నిలిచిన ఆర్. ప్రజ్ఞానందకు రాజుగా, బంటుగా ఉంటూ తీర్చిదిద్దిన తల్లి నాగలక్ష్మి కథ ఇది. అజర్బైజాన్లో జరిగిన ‘చెస్ వరల్డ్ కప్ 2023’ ఫైనల్స్లో ఒక అడుగు దూరంలో టైటిల్ కోల్పోయాడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద. అతడు ఓడినా గెలిచినట్టే. ప్రపంచ దేశాల నుంచి 206 మంది గ్రాండ్ మాస్టర్లు పాల్గొన్న ఈ భారీ వరల్డ్ కప్లో ఇంత చిన్న వయసులో రన్నరప్గా నిలవడం సామాన్యం కాదు. కాకలు తీరిన యోధులను ఓడించి మరీ ఈ స్థానాన్ని దక్కించుకోవడమే కాదు దాదాపు 66 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. భారతదేశం గర్వించేలా చెస్లో వెలుగులీనుతున్న ఈ కుర్రవాడి విజయం వెనుక అతని తల్లి నాగలక్ష్మి ఉంది. అందుకే చెస్ అభిమానులే కాదు దేశదేశాల గ్రాండ్ మాస్టర్లు కూడా ప్రజ్ఞానందకు వెన్నంటి వుంటూ తోడ్పాటునందిస్తున్న నాగలక్ష్మిని ప్రశంసిస్తున్నారు. ఆమెను చూసి ముచ్చట పడుతున్నారు. టీవీ అలవాటు మాన్పించడానికి చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం రమేశ్ బాబు, నాగలక్ష్మిలకు కుమార్తె వైశాలి పుట్టాక ప్రజ్ఞానంద పుట్టాడు. ప్రజ్ఞానందకు నాలుగున్నర ఏళ్లు ఉన్నప్పుడు వైశాలి ఎక్కువగా టీవీ చూస్తున్నదని కూతురి ధ్యాస మళ్లించడానికి చెస్ బోర్డు తెచ్చి పెట్టింది నాగలక్ష్మి. వైశాలి చెస్ ఆడుతుంటే చిన్నారి ప్రజ్ఞా కూడా ఆడటం మొదలెట్టాడు. అతడు చెస్ నేర్చుకున్న పద్ధతి, అంత చిన్న వయసులో గెలుస్తున్న తీరు చూస్తే అతడు బాల మేధావి అని తల్లికి అర్థమైంది. మరోవైపు వైశాలి కూడా చెస్లో రాణించసాగింది. ఇక నాగలక్ష్మి తన జీవితాన్ని తన ఇద్దరు పిల్లల ఆట కోసం అంకితం చేయాలని నిశ్చయించుకుంది. అనుక్షణం వెన్నంటే ప్రజ్ఞానంద ఏడేళ్ల వయసుకే అండర్ సెవెన్లో జాతీయ టైటిల్ గెలిచాడు. పదేళ్ల వయసుకు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడు. 12 ఏళ్లకు గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఉదయం నుంచి రాత్రి వరకూ చెన్నైలో వేరే దేశంలో అతని వెన్నంటే ఉంటుంది నాగలక్ష్మి. ‘ప్రజ్ఞా ఏ పోటీకి వచ్చినా తోడుండే నాగలక్ష్మి ఒక మూల కూచుని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూచోవడం మా అందరికీ అలవాటైన దృశ్యం’ అంటాడు త్యాగరాజన్ అనే కోచ్. ఇతను చెస్లో ప్రజ్ఞాకు మొదటి పాఠాలు నేర్పాడు. ‘ఉదయం పది నుంచి సాయంత్రం 7 వరకూ చెస్ పాఠాలు నడిచేవి. ఆ తర్వాత రెండు మూడు గంటల హోమ్వర్క్ ఇచ్చేవాణ్ణి. ప్రజ్ఞానంద ఇల్లు చేరాక ఆ హోమ్వర్క్ అయ్యేవరకు నాగలక్ష్మి తోడు ఉండేదట. రాత్రి పదికి ఇంటి పనులు మొదలెట్టుకుని మళ్లీ ఉదయం ఆరు గంటలకు కొడుకు కోసం నిద్ర లేచేదట’ అని తెలిపాడు అతడు. చెస్ తెలియని అమ్మ కొడుకు చెస్లో ప్రపంచ విజేత స్థాయి ఆటగాడైనా నాగలక్ష్మికి ఇప్పటి వరకూ చెస్ ఆడటం తెలియదు. ‘మా అబ్బాయిని చూసుకోవడమే నాకు సరిపోతుంది. ఆట ఎక్కడ నేర్చుకోను’ అంటుందామె నవ్వుతూ. ప్రజ్ఞానంద శాకాహారి. బయటి ఆహారం తినడు. అందుకని ఏ ఊరికి ఆట కోసం బయలుదేరినా, విదేశాలకు ప్రయాణం కట్టినా నాగలక్ష్మి చేసే మొదటిపని లగేజ్లో ఒక ఇండక్షన్ స్టవ్వు, కుక్కరు, బియ్యం, మసాలాలు పెట్టుకోవడం. ‘ఎక్కడకు వెళ్లినా వాడికి వేడివేడి అన్నం, రసం చేసి పెడతాను. మైండ్ హాయిగా ఉండి బాగా ఆడాలంటే నచ్చిన ఆహారం తీసుకోవాలి’ అంటుంది నాగలక్ష్మి. చెస్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్లో అమెరికా దిగ్గజ గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్స్కు చేరినప్పుడు నాగలక్ష్మి కళ్లల్లో కనిపించి మెరుపును ఎవరో ఫొటో తీస్తే ఆ ఫొటో వైరల్ అయ్యింది. ‘మావాడు ఆట ఆడేంతసేపు వాడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడను. ఎందుకంటే వాడి కళ్లు చూస్తే వాడి ఆట ఎలా సాగుతున్నదో నాకు తెలిసిపోతుంది. నాకు తెలిసిపోయినట్టుగా వాడికి తెలియడం నాకు ఇష్టం ఉండదు’ అంటుంది నాగలక్ష్మి. కార్ పార్కింగ్లో బంధువులు కూతురు, కొడుకు ఇంట్లో చెస్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా ఉంచుతుంది నాగలక్ష్మి. వాళ్లింట్లో టీవీ పెట్టే ఎంతో కాలమైపోతూ వుంది. ‘మా ఇంటికి బంధువులొచ్చినా, స్నేహితులొచ్చినా కింద కార్ పార్కింగ్ దగ్గరే పలకరించి పంపేస్తాను... పిల్లలు డిస్ట్రబ్ కాకూడదని’ అంటుందామె. అందుకే సెమీ ఫైనల్స్ గెలిచిన ప్రజ్ఞాను అభినందిస్తూ రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ ‘నీకు మీ అమ్మ ఇచ్చే మద్దతు ప్రత్యేకమైనది’ అని ట్వీట్ చేశాడు. నాగలక్ష్మి లాంటి తల్లి ప్రేమకు పిల్లలు ఎప్పుడూ బంట్లే. వారి మనసులో ఆ తల్లి ఎప్పుడూ రాజే. -
ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా మరో ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదరంగంలో (చెస్) అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్న 'ప్రజ్ఞానంద' (Praggnanandhaa) ఫైనల్ స్టేజిలో రన్నర్గా నిలిచాడు. ఈ గేమ్లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి విన్నర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఎవరీ 'మాయా టాటా'? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? దీనిపైన ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ నువ్వు 'రన్నరప్' కాదు @rpragchess. ఇది మీ గొప్పతనానికి 'రన్-అప్' మాత్రమే. మరో సారి పోరాడటానికి అనేక యుద్దాలు నేర్చుకోవడం అవసరం అంటూ.. నువ్వు నేర్చుకున్నావు, మళ్ళీ పోరాడతావు మనమందరం మళ్ళీ అక్కడ ఉంటామని ట్వీట్ చేసాడు. దీనికి ఇప్పటికీ వేల సంఖ్యలో లైకులు వచ్చాయి, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. You aren’t the ‘runner-up’ @rpragchess This is simply your ‘run-up’ to Gold and to greatness. Many battles require you to learn & live to fight another day. You’ve learned & you will fight again; and we will all be there again…cheering you on loudly. 🇮🇳👏🏽👏🏽👏🏽 #praggnanandha https://t.co/2L0U1cZD4E — anand mahindra (@anandmahindra) August 24, 2023 -
పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. జగజ్జేతగా కార్ల్సన్
బకూ (అజర్బైజాన్): ఫైవ్ టైమ్ వరల్డ్ చెస్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తన తొలి వరల్డ్కప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన ఫైనల్ టైబ్రేక్స్లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి జగజ్జేతగా అవతరించారు. 🏆 Magnus Carlsen is the winner of the 2023 FIDE World Cup! 🏆 Magnus prevails against Praggnanandhaa in a thrilling tiebreak and adds one more prestigious trophy to his collection! Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/sUjBdgAb7a — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోగా.. రెండో గేమ్ను ఇరువురు డ్రాకు అంగీకరించడంతో కార్ల్సన్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. టోర్నీ ఆధ్యాంతం దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద ఫైనల్లో కార్ల్సన్ ఎత్తుల ముందు చిత్తయ్యాడు. అంతకుముందు ఫైనల్లో భాగంగా జరిగిన రెండు గేమ్ల్లో కార్ల్సన్, ప్రజ్ఞానంద తలో గేమ్ గెలవడంతో టైబ్రేక్స్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! 🥈 Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! 👏 On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3 Fabiano Caruana! By winning the silver… pic.twitter.com/zJh9wQv5pS — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 Fabiano Caruana clinches third place in the 2023 FIDE World Cup and secures a ticket to the #FIDECandidates tournament next year, after prevailing against Nijat Abasov in the tiebreaks. Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/Z35mDJJMwz — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 -
36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్లో 'నయా' కింగ్ ఆవిర్భావం
భారత చెస్లో కొత్త ఆధిపత్యం మొదలైంది. ఇన్నాళ్లు చెస్ పేరు చెబితే ముక్తకంఠంగా వినిపించే పేరు విశ్వనాథన్ ఆనంద్. దాదాపు 36 ఏళ్ల పాటు ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనందే. కానీ అతని ఆధిపత్యానికి 17 ఏళ్ల గ్రాండ్మాస్టర్ డీ గుకేష్ చెక్ పెట్టాడు. తన గురువును మించిపోయిన గుకేష్ ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి భారత చెస్ చరిత్రలో 'నయా కింగ్'గా అవతరించాడు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో తొలిసారి ఒక ఇండియన్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ను మించి రేటింగ్ సాధించాడు.వరల్డ్ కప్ లో భాగంగా తన రెండో రౌండ్ మ్యాచ్ లో అజర్బైజాన్ కు చెందిన మిస్రట్దిన్ ఇస్కాందరోవ్ పై విజయం సాధించాడు. 44 ఎత్తుల్లో గుకేష్ గెలవడంతో అతనికి 2.5 రేటింగ్ పాయింట్లు వచ్చాయి. దీంతో గుకేష్ లైవ్ రేటింగ్ 2755.9కి చేరింది. మరోవైపు ఆనంద్ 2754.0 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. వరల్డ్ లైవ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం గుకేస్ 9వ స్థానంలో ఉండగా.. ఆనంద్ 10వ స్థానానికి పడిపోయాడు. అధికారిక ఫిడే రేటింగ్ లిస్టు ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నా.. గుకేష్ తన ఆధిపత్యం కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఫిడే ట్వీట్ చేసింది. "గుకేష్ ఇవాళ మళ్లీ గెలిచాడు. దీంతో లైవ్ రేటింగ్ లో విశ్వనాథన్ ఆనంద్ ను మించిపోయాడు. తర్వాతి ఫిడే రేటింగ్ లిస్ట్ అధికారికంగా ప్రకటించడానికి (సెప్టెంబర్ 1న) సుమారు నెల రోజుల సమయం ఉన్నా.. గుకేష్ టాప్ 10లో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలుస్తాడు" అని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ట్వీట్ చేసింది. Gukesh D won again today and has overcome Viswanathan Anand in live rating! There is still almost a month till next official FIDE rating list on September 1, but it's highly likely that 17-year-old will be making it to top 10 in the world as the highest-rated Indian player!… pic.twitter.com/n3I2JPLOJQ — International Chess Federation (@FIDE_chess) August 3, 2023 ఇక విశ్వనాథన్ ఆనంద్ 1991లో తొలిసారి టాప్ 10లోకి వచ్చినా.. 1987 నుంచి ఇండియాలో అత్యధిక రేటింగ్ ప్లేయర్గా ఉన్నాడు. ఆనంద్ కన్నా ముందు 1986 జులైలో ప్రవీణ్ తిప్సే అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా ఉన్నాడు. ఇప్పుడు గుకేష్ తన లీడ్ ఇలాగే సెప్టెంబర్ 1 వరకూ కొనసాగిస్తే ఆనంద్ను మించిన తొలి ప్లేయర్గా నిలుస్తాడు. చదవండి: 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్లో 'నయా' కింగ్ ఆవిర్భావం Yuzvendra Chahal: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement