-
గోపీచంద్ 'విశ్వం' టీజర్ రిలీజ్.. కామెడీ కాదు ఈసారి యాక్షనే!
శ్రీనువైట్ల.. ఈ పేరు చెప్పగానే ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మీమ్స్ లో ఉండే సగం సినిమాలు ఈయన తీసినవే. కానీ తర్వాత తర్వత ట్రెండ్ కి తగ్గ మూవీస్ చేయలేక సైడ్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత సినిమా చేశాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. (ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!) అప్పుడెప్పుడో 'బాద్ షా'తో ఓ మాదిరి హిట్ కొట్టిన శ్రీనువైట్ల.. ఆగడు, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి చిత్రాలతో వరస ఫ్లాప్స్ దెబ్బకు సైడ్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు ఇక సినిమాలు చేయడేమో అని అందరూ అనుకున్నారు. కానీ గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకి 'విశ్వం' అని టైటిల్ ఫిక్స్ చేసి, టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే శ్రీనువైట్ల ఈసారి కామెడీని కాకుండాయాక్షన్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు శ్రీనువైట్లతో పాటు గోపీచంద్ కి కూడా చాలా అవసరం. మరి ఏం చేస్తారో చూడాలి? బహుశా ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
కొత్త పాయింట్తో...
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్తో కలిసి చిత్రాలయం స్టూడియోస్పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్బస్టర్స్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
మిలన్కు బై బై
మిలన్కు బై బై చెప్పారు గోపీచంద్. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటలీలో మొదలైన విషయం గుర్తుండే ఉంటుంది. అక్కడి మిలన్ నగరంలో ప్లాన్ చేసిన షెడ్యూల్ ముగిసింది. గోపీచంద్తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటతో ఈ విదేశీ షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్. -
'మా లక్ష్మీ చనిపోయింది'.. దూకుడు డైరెక్టర్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల ఇంట బాధాకర సంఘటన చోటు చేసుకుంది. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఆవు చనిపోయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'నేను మొదటిసారి ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది. చాలా బాధగా ఉంది. మేము దాన్ని మా ఇంటి సభ్యురాలిగా చూసుకున్నాం. 13 ఏళ్లుగా దానికి ప్రేమను పంచాము. నా కూతురైతే ఆ ఆవును ఎంతో ప్రేమగా లక్ష్మీ అని పిలిచేది. ఆ ఆవు చనిపోయింది' అంటూ ట్విటర్లో దాని ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. కాగా శ్రీనువైట్ల 'నీకోసం' సినిమాతో దర్శకరచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా వంటి బ్లాక్బస్టర్ హిట్స్ అందించాడు. అయితే పది సంవత్సరాల నుంచి అతడికి అస్సలు కలిసి రావడం లేదు. 2014 నుంచి అతడు నాలుగు సినిమాలే చేయగా అవేవీ బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోయాయి. 2018లో 'అమర్ అక్బర్ ఆంటోని' తీసిన అతడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలాకాలం గ్యాప్ తర్వాత ప్రస్తుతం మ్యాచో హీరో గోపీచంద్తో ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరికీ ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. ఈ సినిమా ఫలితం ఏమాత్రం తేడాగా ఉన్నా వీరిద్దరి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. Feeling very sad to lose the first cow in my farm.. We all loved her and treated like a family member for 13 years!! My daughters affectionately called her "Lakshmi". Bidding farewell with all rituals.. pic.twitter.com/736pzfJmSJ — Sreenu Vaitla (@SreenuVaitla) September 14, 2023 చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కట్టప్ప తనయుడి సినిమా, స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
కొత్త చిత్రం షురూ
గోపీచంద్ హీరోగా నటించనున్న తాజా చిత్రం శనివారం ఆరంభమైంది. సూపర్స్టార్ కృష్ణ ఆశీస్సులతో ప్రారంభమైన చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సన్నివేశానికి నిర్మాత నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ‘‘ప్రధాన భాగాన్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్గారిని విభిన్న పాత్రలో చూపిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
శ్రీను వైట్ల, గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభోత్సవం
-
భార్య లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను : దర్శకుడు శ్రీను వైట్ల
-
ఫ్లాప్ డైరెక్టర్ అని కామెంట్ చేశారు..!
-
దర్శకుడు శ్రీను వైట్ల తన హిట్ సినిమా గురించి..!
-
ఇంత కష్టపడినా సక్సెస్ రావడం లేదు..!
-
నా కూతుర్లు..నా ప్రాణం అంటున్న దర్శకుడు శ్రీను వైట్ల
-
క్రేజీ కాంబినేషన్స్... పదేళ్ల తర్వాత మళ్లీ ఇలా..
ఓ సినిమా సూపర్హిట్ అయితే ఆ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ కావాలని ఆడియన్స్ కోరుకుంటుంటారు. కానీ సరైన కథ కుదిరితేనే ఆ కాంబో రిపీట్ అవుతుంది. అలా మంచి కథ కుదరడంతో పదేళ్ల తర్వాత టాలీవుడ్లో రిపీట్ అవుతున్న కొన్ని కాంబినేషన్స్పై (హీరో–డైరెక్టర్) ఓ లుక్కేద్దాం. ♦ హీరో మహేశ్ బాబు ముచ్చటగా మూడోసారి దర్శకుడు త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నారు. 2005లో వచ్చిన ‘అతడు’ సినిమా కోసం మహేశ్, త్రివిక్రమ్ తొలిసారి చేతులు కలిపారు. ఆ మూవీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 2010లో ‘ఖలేజా’ చిత్రం వచ్చింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రూ΄పొందుతున్న సినిమా సెట్స్పైన ఉంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ వారంలోనే హైదరాబాద్లోప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో మహేశ్బాబుతో పాటు పూజాహెగ్డే, శ్రీలీల పాల్గొంటారని తెలిసింది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటోంది చిత్రయూనిట్. ♦ హీరో అల్లు అర్జున్తో ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) వంటి ప్రేమకథా చిత్రాలు తీశారు దర్శకుడు సుకుమార్. పది సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ రూ΄పొందుతోంది. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తోంది. ‘పుష్ప’ తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై అద్భుత విజయం సాధించింది. దీంతో మలిపార్టు ‘పుష్ప: ది రూల్’పై మరింత ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. ఆల్రెడీ ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ మార్చి మొదటివారంలోప్రారంభం కానున్నట్లు తెలిసింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2024లో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ♦ పదిహేను సంత్సరాల క్రితం వచ్చిన ‘ఢీ: కొట్టిచూడు’(2007) సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లోని మరో సినిమా ప్రకటన రావడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. ‘ఢీ: కొట్టిచూడు’ సినిమాకు సీక్వెల్గా ‘ఢీ2: డబుల్ డోస్’ సినిమా రూ΄పొందనున్నట్లు 2020 నవంబరులో ప్రకటించారు మంచు విష్ణు. అయితే ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. మరోవైపు గోపీచంద్తో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు దర్శకుడు శ్రీనువైట్ల. మరి.. ఆయన దర్శకత్వంలో ఏ హీరో సినిమా ముందుగా సెట్స్పైకి వెళుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి. ♦ ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రాల్లో 2009లో వచ్చిన హారర్ ఫిల్మ్ ‘ఈరమ్’ మంచి హిట్ సాధించింది. అరివళగన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో ‘వైశాలి’గా 2011లో విడుదలై సక్సెస్ సాధించింది. పద్నాలుగేళ్ల తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ‘శబ్ధం’ అనే చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. లక్ష్మీమీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా పదేళ్ల గ్యాప్ తర్వాత రిపీట్ అవుతున్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్ జాబితాలో మరికొన్ని తెలుగు చిత్రాలు ఉన్నాయి. -
బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్ అయ్యారేంటి?
ఓ సినిమా సెట్స్పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్ నెక్ట్స్?’ అనే చర్చ జరగడం కామన్ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ్ కుమార్ కొండా, సంతోష్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్బాబు, ఎన్టీఆర్, రామ్చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్ తేజ్తో తీసిన ‘మిస్టర్’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్గా ‘ఢీ అండ్ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్ యాడ్ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్బాబులతో మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. సేమ్ ఇలానే దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్బస్టర్ అందుకున్నారు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్ తరుణ్తో తీసిన ‘పవర్ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు. శ్రీకాంత్ అడ్డాల, విజయ్కుమార్లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు భాస్కర్. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు. అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమాపై భాస్కర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కెమెరామేన్ నుంచి దర్శకునిగా మారిన సంతోష్ శ్రీనివాస్ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్ కల్యాణ్తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్ రాజా రన్(2014)’ తో మంచి హిట్ అందుకున్నారు సుజిత్. ఆ సినిమా ఇచ్చిన హిట్తో స్టార్ హీరో ప్రభాస్ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్. అయితే పవన్ కల్యాణ్తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు. వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్ వంటి దర్శకుల తర్వాతి మూవీస్పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్ హీరో రామ్చరణ్తో ఓ సినిమా చేయనున్నారని టాక్. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. -
మీరు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను: శ్రీను వైట్ల
నీకోసం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఆనందం, సొంతం, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా చిత్రాలతో వరుస సక్సెస్లు అందుకున్నాడు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడీ డైరెక్టర్. అటు వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులకు లోనవుతున్నాడు. ఆయన భార్య రూప శ్రీనువైట్లతో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే! ఈ వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాప్తించింది. ఈ క్రమంలో శ్రీనువైట్ల రీసెంట్గా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. 'జీవితం చాలా అందమైంది. నచ్చిన వాళ్లతో ఉంటే అది మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఇంతకీ ఆ ముగ్గురు మరెవరో కాదు.. తన ముగ్గురు కూతుళ్లు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఏం బాధపడకండి సర్, తప్పకుండా మీరు కోల్పోయినవి తిరిగి మీకు దక్కుతాయి. ఒక్క హిట్ పడితే మిమ్మల్ని కాదని వెళ్లినవాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీను వైట్ల ప్రస్తుతం ఢీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. Life is beautiful but with your loved ones it’s more than beautiful. Can’t imagine life without my three musketeers!! pic.twitter.com/kqbNAu79CU — Sreenu Vaitla (@SreenuVaitla) July 21, 2022 చదవండి: నేను మారిపోయా, నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా.. నటుడు అర్జున్ ఇంట తీవ్ర విషాదం -
విడాకులు కావాలి!.. కోర్టు మెట్లెక్కిన డైరెక్టర్ భార్య
టాలీవుడ్లో ఈ మధ్యకాలంలో విడాకుల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకుల విషయం ఇప్పటికీ హాట్టాపిక్గానే ఉంది. ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ జంట తమ పెళ్లి బంధానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఢీ,దూకుడు, బాద్షా వంటి ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన శ్రీనువైట్ల భార్య రూపాతో విడిపోతున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ ఈ మేరకు ఆయన భార్య రూపా నాంపల్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం.చాలాకాలం క్రితమే వీరిద్దరు విడాకులు తీసుకోవాలని భావించినా రూపా పేరెంట్స్ నచ్చజెప్పడంతో కొన్నాళ్లు కలిసి ఉన్నారని, అయితే తాజాగా విడాకులు తీసుకునేందుకే సిద్దపడినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. కాగా 2003 ఆగస్టులో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు. శ్రీనువైట్ల తెరకెక్కించిన పలు చిత్రాలకు రూపా కాస్ట్యూమ్ డిజైనర్గానూ పనిచేసింది. దీంతో పాటు ఆమె స్వయంగా వేదిక్ అనే ఫ్యాషన్ బ్రాండ్ను కూడా నిర్వహిస్తుంటుంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు చూశారా? వీడియో వైరల్ -
టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట విషాదం
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు(83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్ని రోజులుగా వయోరిత్యా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. -
మ్యాజిక్ రిపీట్ చేస్తాడా !
-
శ్రీను వైట్ల మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
సాక్షి, హైదరాబాద్: దూకుడు, కింగ్, వెంకీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల తన సినిమాలో కామెడీకి ప్రాధాన్యతనిస్తూ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకడుగా ఎదిగాడు. ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడినా శ్రీను వైట్ల మళ్లీ తన దూకుడును పెంచేందుకు రడీ అవుతున్నాడు. జయాపజయాలు ఉన్నప్పటికీ కెరీర్ తృప్తిగా ఉందంటున్న శ్రీను వైట్ల త్వరలోనే మూడు సినిమాల కథలు తన వద్ద సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాడు. వినోదాత్మక కథలకే నా ప్రయారిటీ అంటున్నాడు శ్రీను వైట్ల. రానున్న మూడు సినిమాల్లో భాగంగా డీ అంటే డీ తోపాటు మరో మల్టీ స్టారర్ని తీసుకురానున్నాడట. అలాగే కొత్తవారిని పరిచయం చేస్తూ, మరో చిన్న బడ్జెట్ చిత్రం చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడట..ఈ రోజు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్బంగా స్పెషల్ స్టోరీ. -
Srinu Vaitla Birth Day: నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావుగారూ..!
శ్రీను వైట్ల... ట్వంటీటూ ఇయర్స్ ఇండస్ట్రీ. డైరెక్టర్గా పదిహేడు సినిమాలు. జయాపజయాలు ఉన్నప్పటికీ కెరీర్ తృప్తిగా ఉందంటున్నారు. ఒక్క ప్రశ్నకు మాత్రం ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ అనేశారు. మహేశ్బాబుతో శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘దూకుడు’కి నేటితో పదేళ్లు. శుక్రవారం శ్రీను వైట్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీను వైట్లతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ.. ► ‘దూకుడు’ సినిమాకి పదేళ్లయిన సందర్భంగా కొన్ని విశేషాలు? మహేశ్బాబుతో సినిమా అనుకున్నాక ఒక స్టోరీ లైన్ అనుకోవడం.. దాన్ని మహేశ్ ఒప్పుకోవడం జరిగాయి. ఆ తర్వాత ఆ లైన్ని ఎనభై శాతం డెవలప్ చేశాక నాకు అసంతృప్తిగా అనిపించింది. డ్రాప్ చేసేశాను. ఏ కథతో సినిమా చేస్తే బాగుంటుందా అని ఆలోచించుకుంటున్న సమయంలో ‘మహేశ్ని ఎమ్మెల్యే గెటప్లో చూపిస్తే ఎలా ఉంటుంది?’ అనిపించింది. అలా పుట్టినదే ‘దూకుడు’. మహేశ్కి చెబితే ఎగ్జయిట్ అయ్యారు. పగ, ప్రతీకారాల నేపథ్యంలో వినోద ప్రధానంగా గోపీమోహన్తో కలసి, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశా. బాగా వచ్చింది. సెన్సేషనల్ హిట్టయింది. ► 22 ఏళ్ల క్రితం సినిమా కష్టాల్లాంటి కష్టాలు ఫేస్ చేసే ఉంటారు. ఫైనల్లీ ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ మీరు కూల్గా ఉండేంత పొజిషన్లో ఉన్నారు... ఎగ్జాట్లీ.. ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడ్డాను. ఈ కరోనా టైమ్లో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చినా.. షూటింగ్లకి దూరమవుతున్నామనే బాధ తప్ప వేరే కష్టాలు లేవు. అయితే ఇంట్లో ఎవర్నీ కాలు బయటపెట్టనివ్వకుండా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాను. ఆ విషయంలో నా పిల్లలు (ముగ్గురు కుమార్తెలు) కొంచెం కోపం ప్రదర్శించినా.. ఎందుకింత ప్రొటెక్టివ్గా ఉన్నానో తర్వాత అర్థం చేసుకున్నారు. ► స్త్రీల విషయంలో సమాజంలో పరిస్థితులు అంత బాగాలేవు. మరి.. ముగ్గురు ఆడపిల్లల తండ్రిగా చాలా జాగ్రత్తగా ఉంటారా? ఉంటున్నాను.. ఒక్కోసారి పిల్లల విషయంలో ‘ఓవర్ ప్రొటెక్టివ్’గా ఉంటాను. వాళ్లు ఇబ్బందిపడుతున్నారని అర్థం అవుతుంది. కానీ, జరుగుతున్న ఘోరాలు విన్నప్పుడు పిల్లల విషయంలో ఎక్స్ట్రా కేర్గా ఉండటం తప్పులేదనిపిస్తుంది. పెద్దమ్మాయి ప్లస్ టు, రెండో పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, మూడో పాప సెవెన్త్ చదువుతోంది. మెచ్యూర్టీ వచ్చాక నేనెందుకు అంత ఓవర్ ప్రొటెక్టివ్గా ఉన్నానో వాళ్లకు అర్థమవుతుంది. ► ‘అమర్ అక్బర్ ఆంటోని’ 2018 చివర్లో రిలీజైంది. 2020లో లాక్డౌన్. ఆ ఏడాదిన్నర గ్యాప్లో ఏం చేశారు? 2019లో ఒక స్క్రి‹ప్ట్ రెడీ చేశాను. 2020లో అది స్టార్ట్ అవ్వాలి. ఈలోపు లాక్డౌన్ వచ్చింది. ఆ తర్వాత మరో కథ, ఆ తర్వాత ఇంకో ఆలోచన వస్తే.. నా రైటర్స్ టీమ్కి నచ్చడంతో అది కూడా తయారు చేశాం. మొత్తం మూడు కథలు రెడీగా ఉన్నాయి. అందులో ‘ఢీ అండ్ ఢీ’ ఒకటి. ► ‘ఢీ’లో కథ, దానితో పాటు సాగే కామెడీ అన్నీ చక్కగా కుదిరాయి. మరి.. ‘ఢీ అండ్ ఢీ’లోనూ ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ వంటి డైలాగ్స్.. అంత కామెడీ ఉంటుందా? రెట్టింపు ఉంటుంది. అందుకే ‘ఢీ అండ్ ఢీ’కి ‘డబుల్ డోస్’ అని క్యాప్షన్ పెట్టాం. డబుల్ డోస్ ఆఫ్ కామెడీ అని అర్థం. ఇది ‘ఢీ’కి సీక్వెల్ కాదు. వేరే కథ. రావుగారూ.. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దులా పాపులర్ అయ్యే ౖడైలాగ్ ఇందులోనూ ఉంది. మిగతా అన్ని డైలాగ్స్ కూడా బాగుంటాయి. ► ‘ఢీ’లో విష్ణు కాస్త బొద్దుగా కనిపించారు. ఇప్పుడు మేకోవర్తో స్లిమ్ అయ్యారు. ఇది ప్లస్సవుతుందా? కచ్చితంగా ప్లస్.. మేకోవర్ విషయంలో విష్ణు వండర్ఫుల్. ఎంతో కష్టపడి, ఫిట్గా తయారయ్యారు. ‘ఢీ’లో విష్ణు బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా మెచ్యూర్టీ వచ్చింది కాబట్టి మ్యాగ్జిమమ్ పర్ఫార్మెన్స్ రాబట్టగలుగుతాననే నమ్మకం ఉంది. ‘ఢీ’ కంటే కూడా ఈ సినిమాలో విష్ణు క్యారెక్టర్లో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ► గౌతమ్ మీనన్ వంటి దర్శకులు ఇటు సినిమాల్లో అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో నటులుగా కనిపిస్తున్నారు.. మీకా ఉద్దేశం లేదా? నాకు ఫొటోలు దిగడమంటేనే ఇబ్బంది. కెమెరా వెనకాల ఆర్టిస్టులకు ఎంతైనా చేసి చూపిస్తాను. కానీ, యాక్ట్ చేయాలనుకోలేదు. నాకా క్వాలిటీ లేదు. గౌతమ్ మీనన్ గురించి చెప్పాలంటే.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇష్టం. ► దర్శకుడిగా ఓటీటీ ప్రాజెక్ట్ ఏదైనా? ఇప్పుడు నా దగ్గరున్న మూడు కథలు థియేటర్ మీటర్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినవే. ఓటీటీ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. ► మీతో ఎన్నో సినిమాలు చేసిన ప్రకాశ్రాజ్, రెండో సినిమా చేయనున్న విష్ణు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు.. గెలుపు ఎవరిదని ఊహిస్తున్నారు? ‘ఢీ’లో డైలాగే చెబుతాను. ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావుగారూ... (నవ్వేస్తూ). ఇప్పుడు నా దృష్టంతా త్వరలో మొదలుపెట్టబోయే ‘ఢీ అండ్ ఢీ’ మీదే ఉంది. ఎంత బాగా తీయాలా అనే ప్లానింగ్లో ఉన్నాను. అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటి వారంలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నాం. ► కొన్ని హిట్స్తో పాటు ఫ్లాప్స్ చూశారు కదా.. ఫ్లాప్స్కి కారణం తెలుసుకున్నారా? నా నుంచి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నారని గ్రహించాను. దానికి దూరంగా వెళ్లినప్పుడు వేరేగా ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే కథలో ఎంటర్టైన్మెంట్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నాను. -
శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ కొత్త మూవీ..ఈ సారైనా హిట్ కొట్టేనా?
Akhil And Srinu Vaitla Movie: అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. తొలి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వినాయక్ తో చేశాడు. అయితే ఆ మూవీ అశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత విక్రమ్ కుమార్తో ‘హలో’ చేశాడు. అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘మిస్టర్ మజ్ను’గా వచ్చినా.. ప్రేక్షకుల మన్ననలు పొందలేకపోయాడు. దీంతో డైలమాలో పడిన అఖిల్.. తదుపరి సినిమాలను ఆచుతూచి ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’అనే సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలను అందించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ ఓ మూవీ చేయబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తుంది. శ్రీను వైట్ల చెప్పిన కథ మైత్రీవారికి నచ్చిందని , త్వరలోనే అఖిల్ కు కథను వినిపించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల మంచు విష్ణుతో ‘ఢీ-2’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విడుదల అనంతరం అఖిల్ మూవీని పట్టాలెక్కించనున్నాడు. -
ఆ సీక్వెల్కు చిట్టి ఓకే చెప్పిందా?
హీరో మంచు విష్ణు కెరీర్లో 'ఢీ' చిత్రానిది ప్రత్యేక స్థానం. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ బ్లాక్బస్టర్ సినిమాలో జెనీలియా కథానాయికగా ఆకట్టుకుంది. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 2007లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని శ్రీనువైట్ల ప్రకటించిన విషయం తెలిసిందే. ఢీలో ఉన్న కామెడీ, యాక్షన్ ఈ సీక్వెల్లో రెట్టింపు ఉంటాయనే ఉద్దేశంతో 'డబుల్ డోస్' అనే ట్యాగ్లైన్ పెట్టారు. ఈ సినిమాలో నటించబోయే ముద్దుగుమ్మ గురించి ఫిల్మీదునియాలో ఆసక్తికర వార్త గింగిరాలు తిరుగుతోంది. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాను 'ఢీ అండ్ ఢీ' కోసం సంప్రదించారట. చిట్టి కూడా ఈ సీక్వెల్లో నటించేందుకు ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఇక ఢీ సినిమా గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ.. 'ఢీ' కథ, ఈ సీక్వెల్ కథ రెండూ వేర్వేరని తెలిపాడు. కాకపోతే 'ఢీ'లో ఉండే కొన్ని క్యారెక్టర్లను మాత్రం సీక్వెల్లో వాడుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. గత సినిమాల్లోని తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడతానన్నాడు. 'ఢీ అండ్ ఢీ'ని 24 ఫ్యాక్టరీ ఫిలింస్ పతాకంపై హీరో మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. గోపీమోహన్, కిషోర్ గోపులు రచయితలుగా చేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అవ్రామ్ భక్త మంచు, సంగీతం: మహతి స్వరసాగర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్. చదవండి: సెట్టుకి వెళదాం.. షూటింగు చేద్దాం... ఛలో ఛలో -
డోస్ రెండింతలు
మంచు విష్ణు కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన చిత్రం ‘ఢీ’. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. సోమవారం విష్ణు పుట్టినరోజు సందర్భంగా ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్గా ‘డి–డి’ని ప్రకటించారు చిత్రనిర్మాత, హీరో మంచు విష్ణు, దర్శకుడు శ్రీను వైట్ల. 24 ఫ్యాక్టరీ ఫిలింస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. సంకెళ్ల మధ్య రెండు ‘డి’ అక్షరాలను డిజైన్ చేశారు. ‘ఢీ’లో ఉన్న కామెడీ, యాక్షన్ ఈ సీక్వెల్లో రెట్టింపు ఉంటాయనే ఉద్దేశంతో ‘డబుల్ డోస్’ అని ట్యాగ్లైన్ పెట్టారు. గోపీమోహన్, కిషోర్ గోపులు రచయితలుగా చేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అవ్రామ్ భక్త మంచు, సంగీతం: మహతి స్వరసాగర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్. -
డేరింగ్ అండ్ డ్యాషింగ్
మంచు విష్ణుని డేరింగ్ అండ్ డ్యాషింగ్గా చూపించడానికి రెడీ అవుతున్నారట శ్రీను వైట్ల. 13 ఏళ్ల క్రితం విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సూపర్హిట్ మూవీ ‘ఢీ’ గుర్తుండే ఉంటుంది. అందులో ఉన్న ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ‘ఢీ’కి సీక్వెల్ చేయడానికి విష్ణు–శ్రీను వైట్ల రెడీ అవుతున్నారని టాక్. కథ కూడా రెడీ అయిందట. ‘ఢీ2’ (డేరింగ్ అండ్ డ్యాషింగ్) టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్ కన్నా మరింత కామెడీతో పాటు ఫుల్ యాక్షన్ కూడా ఉంటుందని తెలిసింది. ఇందులో విష్ణు హీరోగా నటించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారట. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలుపెట్టాలను కుంటున్నారని తెలిసింది. -
శ్రీను వైట్లకు మరో చాన్స్!
కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లతో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల తరువాత వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డాడు. ఆగడు నుంచి మొదలైన శ్రీనువైట్ల ఫ్లాప్ల పరంపర అమర్ అక్బర్ ఆంటొని వరకు సాగింది. దీంతో శ్రీనువైట్లకు చాన్స్ ఇచ్చే హీరోలే కరువయ్యారు. ఇంకా ఈ దర్శకుడి కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో మరో చాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు మంచు విష్ణు. శ్రీనువైట్ల, మంచు విష్ణు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. తాజాగా విష్ణు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. 12 ఏళ్ల తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించబోతున్నట్టుగా వెల్లడించారు. అయితే ఈ సినిమా వీరి కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన ఢీ మూవీకి సీక్వల్ అన్న ప్రచారం జరుగుతున్నా విష్ణు మాత్రం సీక్వల్ అన్న విషయం ప్రకటించలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
శ్రీనువైట్లకు హీరో దొరికాడా!
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగిన శ్రీనువైట్ల ఇటీవల ఆ ఫాం కోల్పోయాడు. ఆగడు సినిమా నుంచి వరుస ఫ్లాప్లు ఎదురు కావటంతో శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు హీరోలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. తాజాగా అమర్ అక్బర్ ఆంటొనితో మరో ఫ్లాన్ ఎదురుకావటంతో శ్రీనువైట్లకు నెక్ట్స్ ఏ హీరో చాన్స్ ఇస్తాడన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యంగ్ హీరో శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడట. మంచు ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు కామెడీ సినిమాలతో సూపర్హిట్లు సాధించాడు. ఇటీవల కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో.. తనకు ఢీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీనువైట్లతో మరో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా ఢీకి సీక్వల్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ సినిమాతో అయిన శ్రీనువైట్ల హిట్ ట్రాక్లోకి వస్తాడేమో చూడాలి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement