-
అడవులనే వన దేవతలుగా.......
సాక్షి, న్యూఢిల్లీ : ముక్కోటి దేవతలకు ముందు మన పూర్వికులు ప్రకృతిని దైవంగా ఆరాధించేవారు. సూర్యుడు, గాలి, వర్షం, నీరు, వృక్షాలు, అడవులు, జంతువులను దైవ చిహ్నాలుగా గుర్తంచి ప్రార్థించేవారు. అందుకే భారత్లోనైనా, యూరప్లోనైనా జానపథ కథలు, గంధర్వ కథలు అడవులతో పెనవేసుకొనే ఉంటాయి. భూమిపైన మానవ జాతి నాగరికథ పరిఢవిల్లడంలో అడవులు అద్భుత పాత్రను పోషించాయి. గ్రీకు నాగరికత విలసిల్లడంలో ఆలీవ్ వృక్షం కీలక పాత్ర పోషించిందట. అందుకే ఎవరితోనైనా ‘శాంతి ప్రతిపాదన’కోసం ‘టు ఆఫర్ యాన్ ఆలివ్ బ్రాంచ్’ అని ఆంగ్లంలో వ్యవహరిస్తారు. గ్రీక్, రోమన్ దేవతలతోపాటు అక్కడి చక్రవర్తులు కిరీటాల్లో పుష్పాలను ధరించేవారు. దేవతలను అలంకరించాలన్నా, విజయోత్సవాల సందర్భంగా చక్రవర్తులను సన్మానించాలన్నా గడ్డితో చేసిన కిరీటాలకు గోరింట, సిందూర, బిర్యానీ ఆకులను అలంకించేవారు. పుష్పాలను, చెట్లను రోమన్లు ఆడ దేవతులుగా ఆరాధించేవారు. జపాన్లోని ‘షింటో’ ఆరాధకులు ‘క్రిప్టోమేరియా’ చెట్లకు ఆలయాలు నిర్మించారు. దక్షిణ చైనాలోని సనీ ప్రజలు అడవులను ‘మిజీ’ దేవతగా ఆరాధిస్తారు. ఆఫ్రికాలోని అనేక అడవులను ఇప్పటికీ పవిత్రమైనవిగా భావిస్తారు. భారత దేశంలో కూడా భారత దేశంలో కూడా 15000 పవిత్రమైన అడవులు ఉండేవి. వాటిని తపోవన్, మహావన్గా, శ్రీవన్లుగా మన పూర్వికులు విభజించారు. భారత్లోని ఆలయాలకు, అడువులకు కూడా విడిదీయరాని అనుబంధం ఉంది. అడవుల్లో వెలసిన ఈ ఆలయాల్లో ఒక్కొదాట్లో ఒక్కో జాతికి చెందిన ప్రత్యేక వృక్షం ఉండేది. వాటిని ‘స్థల వృక్షా’ అని పిలిచేవారు. ఆ ఆలయాల్లోని దేవతలందరికి మొక్కలు, వృక్షాలు, పుష్పాలు, పండ్లతో ప్రత్యేక అనుబంధం ఉండేది. వేప చెట్టును శక్తి, చింత చెట్టును దుర్గ, చెరకును (ఇక్షువన) వినాయకుడు, దేవదారు వృక్షాలను శివుడు, తులసి పొదల(బృందావనం)ను కృష్ణుడిని ప్రతీకలుగా భావించి పూజించే వారు. కన్నడలో వన దుర్గ, బెంగాలీలో బోంబీబీ పేరతో అడవులను దేవతలుగా ఆరాధించేవారు. బీహార్లో అర్రాహ్లో ‘అరణ్య దేవి టెంపుల్’ ఇప్పటికీ ఉంది. అడవులను వన దేవతలుగా భావించి రక్షించుకోక పోవడం వల్లనే నేడు ‘ఎకాలోజికల్ ఎమర్జెన్సీ’ పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్లోని ‘వన దేవతల’ గురించి, వాటి చుట్టూ ఉన్న కథల గురించి ఇంతకన్నా సంపూర్ణంగా తెలుసుకోవడానికి సుధా జీ తిలక్ రాసిన ‘టెంపుల్స్ టేల్స్’ చదవాల్సి ఉంటుంది. (వారం క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకం ‘అమెజాన్’లో 239 రూపాయలకు లభిస్తుంది) -
నేడు వనంలోకి వనదేవతలు
సాక్షి, మేడారం: మూడు రోజులుగా తీరొక్క మొక్కులు అందుకున్న వన దేవతలు శనివారం వనప్రవేశం చేయనున్నారు. జాతరలో చివరి అంకమైన ఈ ఘట్టం శని వారం సాయంత్రం జరగనుండగా, గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజారులు జరిపిస్తారు. నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేస్తారు. అనంతరం సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకువెళతారు. ఈ సమయంలో గద్దెల వద్ద ఉన్న భక్తులకే వనప్రవేశాన్ని చూసే వీలుంటుంది. ఆలయం దాటిన తర్వాత బయట వారినెవరినీ రానివ్వరు. అందుకే ఈలోగానే అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని భక్తులు భారీగా వస్తున్నారు. 19న తిరుగువారం: సమ్మక్క-సారలమ్మ తిరుగువారం పండగను ఫిబ్రవరి 19న గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా దేవతలను దుమ్ముకాళ్లతో తీసుకువచ్చినందుకు, పూజల్లో తప్పిదాలు జరిగితే మన్నించాలని వేడుకుంటూ ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. తిరుగువారం రోజున సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గుళ్లను, గద్దెలను శుభ్రం చేస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో మేడారం మహా వన జాతర ముగుస్తుంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement