-
అదిరిపోయే గాడ్జెట్..కాలుష్యాలు ఖతం!
అరచేతిలో తేలికగా ఇమిడిపోయే ఈ పరికరం ఆహార కాలుష్యాలను ఇట్టే ఖతం చేసేస్తుంది. అమెరికాలో స్థిరపడిన చైనీస్ పరిశోధకుడు కాయ్ జియా ఈ పోర్టబుల్ ఫుడ్ క్లీనర్ను రూపొందించారు. కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే పురుగుమందులు, రసాయనాల అవశేషాలను క్షణాల్లో నిర్మూలిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లు నింపి, శుభ్రం చేయదలచుకున్న కూరగాయలు, పండ్లు వేసుకున్నాక, ఈ పరికరాన్ని స్విచాన్ చేసి, గిన్నెలో కొద్ది క్షణాలు ఉంచాలి. దీని నుంచి వెలువడే హైడ్రాక్సిల్ అయాన్లు కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే రసాయన కాలుష్యాలను, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను క్షణాల్లోనే నశించేలా చేస్తాయి. హైడ్రాక్సిల్ అయాన్ల ప్రభావంతో ఈ కాలుష్యాల అణువులు సమూలంగా నాశనమవుతాయి. -
‘బ్రేవ్’ కాదు.. ‘బేర్’మనాల్సిందే
అమలాపురం :రగిలే ఎండలు జీవనాన్ని దుర్భరం చేస్తుండగా మండే నిత్యావసర వస్తువుల ధరలు జిహ్వకు రుచుల ను దూరం చేస్తున్నాయి. కూరగాయ లు, మాంసం, చేపలు, బియ్యం.. ఇ లా.. సాపాటుకు సంబంధించిన ప్రతి దినుసు ధరా సామాన్యుడికి అందనంతగా పెరిగిపోవడంతో పూట గడవడం భారమవుతోంది. జిహ్వ తృప్తి చెందే లా తిని, ‘బ్రేవ్’మని తేన్చాలంటే శక్తికి మించిన పనవుతోంది. కూరగాయ ధ రలు మార్కెట్లో తారాజువ్వల్లా దూ సుకుపోతున్నాయి. రెండు నెలల క్రి తం కేజీ రూ.పది ఉన్న ఉల్లి ధర మడికి హోల్సేల్ మార్కెట్లో ప్రస్తుతం రూ.25 వరకు ఉండగా, మార్కెట్లో రూ.33 నుంచి రూ.35 వరకు పెరిగిం ది. పచ్చిమిర్చి ధర మడికిలో రూ.40 ఉంటే, మార్కెట్లో రూ.60 వరకు ఉంది. అల్లం ధర మడికిలో రూ.120 ఉండగా, మార్కెట్లో రూ.150 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో బీరకాయ ధర కేజీ రూ.40 వరకు ఉంది. వీటితోపాటు టమాటా కేజీ రూ.32 పలుకుతోంది. ‘ముక్క’ ప్రియులకు ఇక్కట్లే.. మేక, కోడి మాంసం, చేపలు, రొయ్య ల ధరలు పెరిగిపోవడంతో ముక్కలేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రి యుల జిహ్వకు గడ్డుకాలం దాపురిం చింది. మేక మాంసం ధర కేజీ రూ. 400 వరకు పెరిగిపోవడంతో సామాన్యులు వంద గ్రాముల లెక్కన కొనుగో లు చేస్తున్నారు. కోడి బ్రాయిలర్ లైవ్ కేజీ రూ.100 ఉండగా, మాంసం కేజీ రూ.200 వరకు చేరింది. గ్రామీణులు ఎక్కువగా తినే లేయర్ కోడి లైవ్ధర కేజీ రూ.74 ఉండగా, మాంసం ధర రూ.150కు పెరిగింది. కోడిగుడ్డు చిల ్లర ధర రూ.4.50. చేపలు, రొయ్యల ధరలూ భారీగానే ఉన్నాయి. గత నెల లో ఉభయ గోదావరి జిల్లాల్లో చెరువుల్లో పెద్ద ఎత్తున చేపలు చనిపోతే కేజీ రూ.ఐదుకు తెగనమ్మారు. ఇప్పుడది రూ.90కి చేరింది. బహిరంగ మార్కెట్లో మాత్రం శీలావతి, బొచ్చు, గడ్డిమోసుల కేజీ ధర రూ.140 నుంచి రూ.150 వరకు ఉంది. చందువా, కొర్రమీను కేజీ రూ.300 వరకు పలుకుతున్నాయి. వెనామీ రొయ్యలే కాదు.. సేక (తెల్ల) రొయ్యల ధర సైతం కేజీ రూ.200 నుంచి రూ.220 వరకు ఉంది. బియ్యం ధర వింటే భయం.. బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగాయి. సన్నరకాల ధరలు గత రెండు నెలల్లో కేజీకి బ్రాండ్ను బట్టి కేజీకి రూ.ఐదు నుంచి రూ.ఏడు వరకు పెరిగాయి. నెల రోజుల క్రితం రూ.45 వరకు ఉన్న గిద్దమసూరి (రారైస్) కేజీ రూ.50 నుంచి రూ.52 వరకు పెరిగింది. గిద్దమసూరు స్టీమ్ రకాలను చాలా కంపెనీలు భారీగా పెంచివేశాయి. రూ.33 ఉన్న స్టీమ్ రకం ధరలు రూ.41 నుంచి రూ.46 వరకు పెరిగాయి. గిద్దమసూరిలోని పండారు రకాలు రూ.34 వరకు ఉంది. సామాన్యులు ఎక్కువ గా కొనుగోలు చేసే స్వర్ణ బియ్యం ధర సైతం పెరిగింది. ధాన్యానికి డిమాండ్ ఏర్పడిందనే వంకతో కేజీ రూ.24 ఉన్న ధరను రూ.26 వరకు పెంచారు. బస్తాకు రూ.50 వరకు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement