-
పైత్యపు రాతలపై ఉక్కు పిడుగు
-
బతికున్నోళ్లను చంపేసిన ‘పచ్చ’పత్రిక
డోన్ (నంద్యాల): సజీవంగా ఉన్న వారిని మృతి చెందారంటూ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈనాడు పత్రిక అధిపతి రామోజీపై సంబంధిత వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డోన్ పట్టణంలోని చిగురమానుపేటకు చెందిన కొండవేగు శాంతిప్రియతో పాటు ఆమె భర్త పేర్లు ఓటరు జాబితాలో ఉండడాన్ని ఉదహరిస్తూ వీరు మృతి చెంది రెండు సంవత్సరాలు అయిందంటూ ఈనాడులో తప్పుడు కథనం ప్రచురించడంపై శాంతిప్రియ అవాక్కయ్యారు. ఎక్స్ఐవై 2122539 అనే ఓటరు కార్డుతో 17వ వార్డు 11వ సచివాలయంలో తాను నివశిస్తున్నానని.. అయితే పచ్చపత్రిక ఈనాడులో ‘ఆత్మకు ఓట్లు’ అనే శీర్షికన తన పేరును ప్రచురించడం దుర్మార్గమైన చర్య అని శాంతిప్రియ మండిపడ్డారు. ఇటీవలకొందరు వ్యక్తులు మృతి చెందారంటూ వారి ఫొటోలను ఈనాడులో ప్రచురించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
మంగంపేట బెరైటీస్ గనుల టెండర్లపై రామోజీ తప్పుడు కథనం
-
వలంటీర్లపై నానా రచ్చ.. ఈనాడు నీతిమాలిన రాతలు
ఈనాడు మీడియా రోజురోజుకు రెచ్చిపోతోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై కక్షకట్టి నిత్యం అబద్దాల వంట చేసి పాఠకులకు వడ్డిస్తోంది. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి తదితర ఎల్లోమీడియా పోటీ పడుతున్నా, ఈనాడు రామోజీరావు వారందరిని మించిపోయి నడరోడ్డులో బట్టలు ఊడదీసుకుని తిరగుతున్నట్లు రాస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్లతో సంబంధం లేకుండా ఏపీలో పేజీలు పెంచి మరీ జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కృషి చేస్తున్నారు. అంటే కోట్ల వ్యయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నమాట. ప్రభుత్వంపై బురద చల్లడానికి కోట్లు గతంలో టీడీపీ చేసిన వాదన ప్రకారం ఇదంతా టీడీపీ ఎన్నికల ఖర్చులో భాగంగా రాయాలి. గతంలో ఏదైనా ఒక చిన్న వార్త అనవసరంగా రాస్తున్నారని రామోజీరావు భావిస్తే, సెంటిమీటర్ల చొప్పున ఖరీదు లెక్కవేసి అంత సొమ్ము వృథా చేశారని జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అలాంటి రామోజీరావు ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు.. బహుశా ఇప్పటికే ఈ ఏడాదికాలంలోనే ఒక వంద కోట్ల రూపాయల విలువైన స్పేస్ను వైస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లడానికి, టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి వెచ్చించి ఉండవచ్చు. అంటే ఆ మేరకు ప్రచార ప్రకటనలు వదలుకుని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు ఇచ్చారన్నమాట. సమ్మె ఆరంభించారని తప్పుడు కథనం రామోజీకి తెలుగుదేశం పార్టీతో ఎంత ప్రయోజనం లేకపోతే ఇంతగా ఖర్చు చేస్తారు? ఏపీలోని వివిద వర్గాలను రెచ్చగొట్టడానికి ఈనాడు మీడియా ఎంత నీచంగా పనిచేస్తోందో చూడండి. ఏపీలో కొద్ది మంది వలంటీర్లు తమ గౌరవ వేతనం పెంచాలని అడిగారట. అంతే! వారు సమ్మె ఆరంభించారని తప్పుడు వార్తను ఇచ్చేసింది. దాంతో మొత్తం వలంటీర్ల వ్యవస్థ స్తంభించినట్లు కలరింగ్ ఇచ్చే యత్నం చేసింది. గతంలో నిరుద్యోగులకు నెలకు రెండువేల రూపాయల చొప్పున భృతి ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లపాటు ఇవ్వలేదు. ఆ తర్వాత ఏదో మమ అనిపించారు తప్పితే సజావుగా అమలు చేయలేదు. అయినా చంద్రబాబును విజనరీగా ఈ మీడియా ప్రచారం చేసింది. వలంటీర్లపై నానా రచ్చ అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది యువత, మద్య వయసు వారిని ఎంపిక చేసి వారికి నెలకు అయిదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వారితోటి ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. అది చూసి కన్నుకుట్టిన ఈనాడు మీడియా, తెలుగుదేశం, జనసేన అధినేతలకు వలంటీర్లపై నానా రచ్చ చేశాయి. వారికి రకరకాల అవలక్షణాలను అంటగట్టారు. వారందరూ వైఎస్సార్సీపీ కార్యకర్తలని ప్రచారం చేశారు. వలంటీర్లు పురుషులు ఇళ్లలో లేనప్పుడు వెళ్లి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని నీచమైన ఆరోపణ చేయడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదు. స్వరం మార్చిన ఈనాడు ఆయనకు తగినట్లే పవన్ కల్యాణ్ అదే రీతిలో పిచ్చి అభియోగాలు చేశారు. ఈ వలంటీర్ల ద్వారా టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారని కూడా ప్రచారం చేశారు. ఇంత చేసిన ఈనాడు మీడియా ఇప్పుడు స్వరం మార్చి వలంటీర్లను ఎలా రెచ్చగొట్టాలా అని చూస్తోంది. అందుకే ఎవరో కొందరు వలంటీర్లు మండల అధికారులకు తమ వేతనం 18 వేలు చేయాలని వినతిపత్రాలు ఇస్తే అదే బానర్ కథనం అయిన చందంగా ఈనాడు రాసిందంటే వారి దురుద్దేశం అర్ధం చేసుకోవచ్చు. వలంటీర్లపై ఈనాడు మీడియాకు ప్రేమ ఉన్నట్లు, సానుభూతి ఒలకపోస్తూ గొప్పగా నటిస్తోంది. విష ప్రచారం మొన్నటిదాకా ఎక్కడైనా వలంటీర్ చిన్న తప్పుచేస్తే గోరంతను కొండంతగా ఈనాడు మీడియా విష ప్రచారం చేసింది. ఆ సంగతి మర్చిపోకూడదు. వలంటీర్ అన్నది ఉద్యోగం కాదు. వారికి ఏదైనా మంచి అవకాశం వస్తే వలంటీర్ బాధ్యతను వదలి వెళ్లిపోవచ్చు. అయినా వారు ఏవైనా కోరికలు ఉంటే అడగడవచ్చు. కాని అవి హేతుబద్దంగా లేకపోతే వారికే నష్టం. ఏదో ఈనాడు వారో, లేక టీడీపీనో, జనసేనో, మరో పార్టీనో వారిమీద కపట ప్రేమ కనబరిస్తే వారిని నమ్ముతారా? వలంటీర్లను టీడీపీ కొనసాగిస్తుందా? వలంటీర్లు ఇక్కడ ఒక ప్రశ్న వేయాలి. తెలుగుదేశం, జనసేనలు తమ ఎన్నికల మానిఫెస్టోలో వలంటీర్లు అడుగుతున్న మేర వేతనం ఇస్తామని, వారి ఇతర డిమాండ్లు అంగీకరిస్తామని చెప్పించగలరా? అసలు వలంటీర్లను టీడీపీ కొనసాగిస్తుందా? కొనసాగించినా ఇప్పుడు ఉన్నవారిని అలాగే ఉంచుతుందా? వీటన్నిటి గురించి కూడా వలంటీర్లు ఆలోచించకపోతే వారికే నష్టం. నిజానికి వలంటీర్లు చాలా కొద్ది మాత్రమే వీరి ట్రాప్లో పడ్డారు. అందువల్ల ఇది సీరియస్ అంశం కాలేదు. కాకపోతే జరుగుతున్న కుట్రలను అంతా గమనించాలని చెప్పక తప్పదు. అంత దాకా ఎందుకు ఈనాడు రామోజీరావు తన సంస్థలలో కిందిస్థాయి ఉద్యోగులకు ఎంత వేతనం ఇస్తున్నారో తెలుసుకోండి. తప్పుదారి పట్టించే యత్నం రామోజీ పిలిం సిటీలో ఎంత చొప్పున జీతాలు ఇస్తున్నారో గమనించండి. నిజంగానే అక్కడ వలంటీర్ స్థాయి ఉద్యోగులకు కూడా ఇరవై వేలు, ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారేమో తెలుసుకోండి. కరోనా సమయంలో ఎంతమంది ఉద్యోగులకు పూర్తి నెల జీతం ఇచ్చారో అడగండి. కాని అదే ఈనాడు మీడియా, ప్రభుత్వం కరోనా సంక్షోభంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో కొంత ఆలస్యం అయితే వారికన్నా ఎక్కువ గగ్గోలు పెట్టింది. అలాగే పురపాలక సంఘాలలో పనిచేసే కార్మికులను రెచ్చగొట్టి ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కమ్యూనిస్టు నేతలు ప్రయత్నిస్తున్నారు. వారికి వాస్తవ పరిస్థితి తెలుసు. కానీ ఎన్నికల స్వార్ధం కోసం కమ్యూనిస్టు నేతలు కొందరు అమాయక కార్మికులను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారు. ఎన్నడైనా మొదటి పేజీలో ప్రచురించిందా? ఈనాడు తదితర ఎల్లో మీడియా వారికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. వారి డిమాండ్లను, వారి ఆవేదన అంటూ మొదటి పేజీలో ప్రచురించిందంటేనే ప్రజలను మోసం చేయడమే లక్ష్యమని అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు కాలంలో ఇలాంటి డిమాండ్లను ఈనాడు ఎన్నడైనా మొదటి పేజీలో ప్రచురించిందా? అలాగే అగన్ వాడీలను రెచ్చగొట్టి వారితో సమ్మె చేయిస్తున్నారు.ని జానికి జగన్ ప్రభుత్వం వచ్చాక వారికి సంబంధించిన అనేక కోర్కెలను ప్రభుత్వం తీర్చింది. వేతనాలు పెంచింది. ఇతరత్రా సదుపాయాలు ఇచ్చింది. అయినా ఇప్పుడు ఎన్నికల సమయంలో వారి వేతనం 26వేలు చేయాలంటూ ఆచరణ సాద్యం కాని డిమాండ్లను సీపీఎం అనుబంధ యూనియన్ పెట్టి, అంగన్ వాడి కార్యకర్తలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో వేతనం తెలుసుకోండి వేతనం ఒక్కసారి సీపీఎం పాలిత కేరళ రాష్ట్రంలో అంగన్ వాడీలకు కాని, పురపాలక సంఘాలలో పనిచేసే వర్కర్లకు కానీ ఎంత వేతనం ఇస్తున్నారో తెలుసుకోండి. లేదా ఇతర రాష్ట్రాలలో వీరికి ఎలా చెల్లిస్తున్నారో గమనించండి. అప్పుడు సమంజసమైన రీతిలో అడగవచ్చు. అలా కాకుండా ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతో ఉన్న రాజకీయపార్టీల ట్రాప్లో పడడం సరికాదు. దానివల్ల వారికే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ అంగన్ వాడి కార్యకర్తలు, పురపాలక సంఘాలలోని కార్మికులు, వలంటీర్లు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. వారికి వచ్చే వేతనంతో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ స్కీములలో కూడా వీరిలో చాలామంది లబ్ది పొందుతుండవచ్చు. ఎల్లో మీడియా తప్పుడు మాటలు నమ్మి మోసపోతే అంతే.. పలువురికి అమ్మ ఒడి ద్వారా పదిహేను వేల రూపాయల చొప్పున పొందుతుండవచ్చు. వారి పిల్లలు ఆంగ్ల మీడియంలో చదువుకునే అవకాశం కల్పించారు. వారికి టాబ్లు కూడా ఇస్తున్నారు. ఇలా వివిధ స్కీముల కింద వీరు కూడా లబ్ది పొందుతున్నారు. ప్రతిపక్షాలు, ఈనాడు ,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తప్పుడు మాటలు నమ్మి మోసపోతే తాము కూర్చున్న చెట్టుకొమ్మను వారే నరుకున్నవారయ్యే ప్రమాదం ఉంది.ఈ ప్రతిపక్షాలకు, ఈనాడు రామోజీరావు తదితరులందరికి ఒకటే లక్ష్యం అది పేదలను ఆదుకుంటున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం. ఈ నేపథ్యంలో పెత్తందారుల కుట్రలలో అంగన్ వాడీలు, పురపాలక సంఘాల కార్మికులు, కొద్ది మంది వలంటీర్లు పావులవుతారా? తమ కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉంటారా అన్నది వారే తేల్చుకోవాలి!. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
రైతులను మోసం చేసింది మీ బాబే రామోజీ
సాక్షి, అమరావతి: రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, వడ్డీలేని రుణాలు అందిస్తామని చంద్రబాబు చేసిన వాగ్దానాలను అప్పట్లో తుంగలో తొక్కినా రామోజీరావు తన పత్రికలో ఒక్క ముక్క కూడా రాయలేదు. కానీ ఇచ్ఛిన హామీలకంటే మిన్నగా రైతులకు ఈ ప్రభుత్వం సాయం చేస్తుంటే నిత్యం విషం చిమ్ముతూనే ఉన్నారు. దుష్ప్రచారమే లక్ష్యంగా అబద్ధాలను పోగేసి ‘సున్నా వడ్డీలో మహా మోసం’ అంటూ మరో కథనాన్ని శనివారం ఈనాడు పత్రిక అచ్చేసింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పైసా భారం పడకుండా ఉచిత పంటలబీమా, సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం, సకాలంలో సున్నా వడ్డీ రాయితీ సహా రైతులకు మేలు చేసే ఎన్నో పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నా నిజాలను వక్రీకరించి వక్రరాతలు రాసేసింది. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు సాగు వేళ తీసుకునే పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2019లో శ్రీకారం చుట్టింది. రూ. లక్ష లోపు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మరుసటి సీజన్ రాక మునుపే వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వాస్తవ సాగుదారులకు వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని అందించడం కోసం ఈ క్రాప్ డేటా ఆధారంగా ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోంది. గతంలో రైతుపైనా వడ్డీ భారం గతంలో రూ. లక్ష లోపు పంట రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే బ్యాంకులు వసూలు చేసే ఏడు శాతం వడ్డీలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తే, మిగిలిన 4 శాతం వడ్డీని రైతులు భరించేవారు. ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో బ్యాంకులకు జమ చేసేవారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసుకునేవి. గతంలో క్లయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచ్లకు మాత్రమే అధికారం ఉండేది. దీంతో ఎంత మంది అర్హత పొందారు.. వారికి ఎంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. సంబంధిత బ్యాంకు బ్రాంచ్లకు కూడా తెలిసేది కాదు. సామాజిక తనిఖీ కోసం బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ జాబితాలు ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు. పారదర్శకంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావు లేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ డేటాను ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించి అర్హులైన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ద్వారా ఎస్వీపీఆర్ (సున్నా వడ్డీ పంట రుణాలు) పోర్టల్ ((https://karshak.ap.gov.in/ysrsvpr/))లో ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఏడాదిలోగా రూ. లక్ష లోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీకి అర్హత పొంది, ఒక వేళ జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇలా అర్హత పొందిన రైతుల ఖాతాలో వారు చెల్లించిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వంప్రతీ ఏటా క్రమం తప్పకుండా జమ చేస్తోంది. రైతులలో జవాబుదారీతనాన్ని పెంచడం, సకాలంలో రుణ చెల్లింపు అలవాటు పెంపొందించే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఈ పథకం ద్వారా రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి రైతుల ఖాతాలకే జమ చేస్తోంది. బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లింపు టీడీపీ ఐదేళ్ల హయాంలో సుమారు 40.61 లక్షల మందికి కేవలం రూ. 685.46 కోట్లు చెల్లిస్తే, గడిచిన 4.5 ఏళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 73.88 లక్షల మందికి రూ. 1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో 39.08 లక్షల మంది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1,180.66 కోట్ల బకాయిలున్నాయి. కాగా రబీ 2021–22, ఖరీఫ్–2022 సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాయితీ సొమ్మును డిసెంబర్లో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వడ్డీ రాయితీని సకాలంలో అందించడమే కాదు. రైతులకు సంస్థాగత రుణాలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 2019 ఖరీఫ్ పంట కాలం నుంచి ఇప్పటి వరకు రూ. 8,24,428 కోట్ల పంట రుణాలను ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించారు. అంతేకాదు వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ కార్డుల ద్వారా 14 లక్షల మంది కౌలురైతులకు రూ. 8,054 కోట్ల వ్యవసాయ రుణాలు అందించింది. ఈ ఏడాది అత్యధికంగా 8.22 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా, వారిలో ఇప్పటికే 4.88 లక్షల మందికి రూ.1,385.25 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. అంతేకాదు.. రైతు భరోసా కింద 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ. 33,209.81 కోట్లు, రాయితీపై విత్తన సరఫరా కోసం 74.45 లక్షల మందికి రూ. 1,316.57 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.50 లక్షల మందికి రూ. 7,802.05 కోట్లు, ఇన్పుట్సబ్సిడీ కింద 22.85 లక్షల మందికి రూ.1,977 కోట్లు చెల్లించి రైతులకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. మరో వైపు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేస్తోంది. -
విత్తనాలపై 'ఈనాడు' అసత్యాలు
-
మీకు నచ్చింది రాసుకోపో...ఈనాడు, ABN రిపోర్ట్ ర్స్ పై మంత్రి అంబటి ఫైర్
-
ఈనాడుపై పరువు నష్టం దావాకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనాడు పత్రికపై ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్పై తప్పుడు రాతలు రాసినందుకు పరువు నష్టం దావా వేయాలని ఆదేశించింది. అయితే, మే 12వ తేదీన పోలవరంపై ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. ఈనాడు కథనాలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈనాడు ఎండీ, జర్నలిస్టుల క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఆఫ్ డిఫమేషన్ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక, పోలవరంపై ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ ఈనాడు తప్పుడు కథనాలు సృష్టించడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది కూడా చదవండి: పోలవరంపై కేంద్ర జలశక్తి శాఖ హైలెవల్ మీటింగ్ -
ఈనాడు పిచ్చిరాతలపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన అసలు నిజాలు
-
ఈనాడు బురద రాతలు.. వరద సహాయక చర్యలపైనా అక్కసు
సాక్షి, అమరావతి/ సాక్షి, పాడేరు: గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎంతో ముందుచూపుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పకడ్బందీగా వరద సహాయక చర్యలు చేపట్టడమే రామోజీరావు అక్కసుకు కారణమైంది. ఎలాంటి నష్టం జరగకుండా, ఏ లోటూ లేకుండా వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉండటం చూసి ఆయన తట్టుకోలేక కన్నీటి వరద కారుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ నిరంతర పర్యవేక్షణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం మొత్తం గోదావరి వరద బాధితులకు సహాయక చర్యల్లో నిమగ్నమైనా ఈనాడు మాత్రం అవి కనపడకుండా కళ్లు మూసుకొని, అధికార యంత్రాంగం మొద్దునిద్రలో ఉన్నట్లుగా భ్రమిస్తోంది. ఆ భ్రమలనే వార్తలుగా మలచి సీఎం వైఎస్ జగన్ పైన, ప్రభుత్వం పైన రకరకాల పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. వరదల సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను అప్రమత్తం చేశారు. జూలై 28వ తేదీన ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు ఆగమేఘాలపై తీసుకునేలా యంత్రాంగాన్ని నడిపించారు. చదవండి: ‘టీడీపీ కార్యాలయంలో జై జగన్ నినాదాలు’ గ్రామ వలంటీర్ నుంచి సచివాలయాల సిబ్బంది, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది వరద ప్రభావిత గ్రామాల్లోనే మకాం వేసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గత ప్రభుత్వంలోకంటె ఇప్పుడు ఎంతో మిన్నగా వరద సహాయక చర్యలు చేపట్టారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. చింతూరు పునరావాస కేంద్రంలో కూరగాయలు పంపిణీ చేస్తున్న సిబ్బంది 85 పునరావాస కేంద్రాలకు 49 వేల మంది తరలింపు వరద ప్రభావిత ఐదు జిల్లాల్లో 237 గ్రామాల్లోని 49,262 మందిని 85 పునరావాస కేంద్రాలకు తరలించారు. 10 లాంచీలు, 230 బోట్లతో బాధితుల్ని పెద్దఎత్తున తరలించే దృశ్యాలు అన్ని చోట్లా కనిపిస్తూనే ఉన్నాయి. పది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది ముంపు గ్రామాల్లో తిరుగుతూ అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించారు. తా గునీరు, నిత్యావసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. అవసరమైన వారికి వెంటనే వైద్యం అందించేందుకు వైద్య బృందాలను నియమించారు. బాధితులకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రతి క్షణం అందుబాటులో ఉంటున్నారు. బాధితులకు నిత్యావసరాలకు లోటు రాకుండా అన్ని రకాల సరకులని స్టాక్ పాయింట్లకు ముందే పంపించారు. ప్రతి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిలు ఇస్తున్నారు. ముందే రూ.12 కోట్లు విడుదల వరద సహాయక చర్యల కోసం సీఎం జగన్ 5 జిల్లాలకు తక్షణమే రూ.12 కోట్లు విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా వరదల సమయంలోనే ముందుగా నిధులు విడుదల చేయలేదు. చంద్రబాబు హయాంలో వరదలు వచ్చి, అంతా మునిగిపోయి ప్రజలు గగ్గోలు పెట్టిన తర్వాత అరకొరగా నిధులిచ్చేవారు. దీంతో జిల్లా కలెక్టర్లు రకరకాల ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సహాయక చర్యల ప్రారంభానికి ముందే నిధులిచ్చే సంప్రదాయానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వరద బాధితులకు అందించే ప్రత్యేక ఆర్తిక సాయం విషయంలోనూ సీఎం సరికొత్త రీతిలో ముందుకెళుతుండడం ఈనాడుకు మింగుడుపడడంలేదు. చంద్రబాబు హయాంలో ఈ ప్రత్యేక సాయం ఊసే ఉండేది కాదు. వరద తగ్గిన తర్వాత తెలుగు తమ్ముళ్లు బాధితులకు ఇచ్చినట్లు రాసేసుకుని ఆ సొమ్ముని మింగేసేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేకుండా వరద తగ్గిన తర్వాత బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు రూ.1,000 నుంచి రూ. 2,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు. గతంలో ఇది రూ.5 వేలు మాత్రమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవేమీ కనిపించని ఈనాడు ఈనాడు బృందం తిరిగినట్లుగా చెప్పుకొంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ చర్యలు విస్పష్టంగా కనిపిస్తున్నా, అక్కడ ఏదీ జరగనట్లే అబద్ధాలు రాసి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వరదలపై ముఖ్యమంత్రి ముందస్తుగా ఆదేశించిన వెంటనే జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ పర్యవేక్షణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టర్తో సహా అధికార యంత్రాంగం చింతూరులో మకాం వేసింది. వరదపై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. సిద్ధం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచింది. చింతూరు డివిజన్లోని నాలుగు మండలాల్లో 177 గ్రామాలు వరదలకు ప్రభావితమవగా 110 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 24,279 కుటుంబాలను తరలించింది. బాధితులకు సత్వర సాయం వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ప్రభుత్వం నాలుగు మండలాల్లో ముందుగానే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిత్యావసర సరకులను నిల్వ చేసింది. ముంపు ప్రాంతాల్లో జూలై, ఆగస్టు నెలల రేషన్ను ముందుగానే పంపిణీ చేసింది. నాలుగు మండలాల్లో సహాయక చర్యల నిమిత్తం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు సీఎం జగన్ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఎలాంటి నష్టం జరగకుండా నాలుగు మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టాం. ప్రతి మండలానికి ప్రత్యేకాధికారులను నియమించాం. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా తరలించి వారికి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశాం. గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాం. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించాం. గోదావరి, శబరి నదుల్లో వరద తగ్గడంతో ఆయా ముంపు గ్రామాల్లో సహాయక కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నాం. – సుమిత్కుమార్, కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా అన్ని విధాలుగా ఆదుకున్నారు పునరావాస కేంద్రంలో తలదాచుకున్న మాకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది. పక్కా భవనంలో విద్యుత్ సౌకర్యంతో పాటు నిత్యావసరాలు కొరత లేకుండా అందించింది. ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటూ మా బాగోగులు చూసుకున్నారు – కొండా సరోజిని, చింతూరు అన్ని సౌకర్యాలు కల్పించారు ఇంటి సమీపంలోకి వరద వస్తుండడంతో గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. తాగు నీటికి ఇబ్బంది లేదు. బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు అందించారు. – మాటూరి శ్రీనివాసరావు, చింతూరు శబరిఒడ్డు అధికారులు అప్రమత్తం చేశారు వరద సమాచారంపై అధికారులు మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించారు. అందరం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. – బొర్రా పద్మారెడ్డి, వడ్డిగూడెం, వీఆర్పురం మండలం అధికారుల స్పందన బాగుంది వరదల సమయంలో అధికారుల స్పందన బాగుంది. ప్రభుత్వం చేపట్టిన సహా యక కార్యక్రమాలతో అందరం సురక్షితంగా ఉన్నాం. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న మాకందరికీ నీరు, బియ్యం, పాలు సహా అన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. ఏ లోటూ రాకుండా చూస్తున్నారు. – యడ్ల బాయమ్మ, టేకులబోరు, కూనవరం మండలం -
ఆక్రమణలు తొలగించినా సీఎం పైనే నెపం
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదించడం ఈనాడు పత్రికకు అలవాటుగా మారింది. రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆక్రమణదారులకు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెబితే ‘సీఎం వస్తున్నారు.. దుకాణాలు తొలగించాల్సిందే’ అంటూ ఈనాడులో వార్త ప్రచురించారు. చిత్తూరు – వేలూరు రోడ్డులో విజయా డెయిరీని ఆనుకుని పది దుకాణాలు వెలిసాయి. నగర సుందరీకరణకు అడ్డుగా ఉన్నాయని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ నిర్ణయించారు. ఇదే విషయాన్ని వ్యాపారులకు చెప్పారు. ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. వ్యాపారులు కూడా ఆ దుకాణాలను స్వచ్ఛందంగా తొలగించారు. దీనిని వక్రీకరిస్తూ ఈనాడులో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. సీఎం జిల్లా పర్యటనకు వస్తుండడంతో అధికారులు బలవంతంగా దుకాణాలను తీసేయిస్తు న్నారని రాసుకొచ్చారు. రోడ్డుపై ఆక్రమణలు తొలగిస్తే సీఎం పర్యటనకు ఆపాదిస్తూ రాయడం మంచిదికాదని కమిషనర్ అరుణ అన్నారు. -
ఊహించినట్లే విషం కక్కారు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా రామోజీ?
ప్రభుత్వ నాన్ గెజెటెడ్ ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బదులు జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను ఏపీ ప్రభుత్వం తీసుకు వస్తే, దానిలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ పాయింట్లను విశ్లేషించవలసిన ఒక వర్గం మీడియా దారుణమైన రాతలకు పాల్పడింది. అసలు వార్తను కాకుండా, ఉద్యోగులకు దగా..దగా.. అంటూ పెద్ద బ్యానర్ హెడింగ్ పెట్టిన ఈనాడు మీడియాను ఏమనాలి!. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ రకంగా చండాలంగా మాట్లాడడానికి సాహసించలేదు. కాని ఈనాడు మాత్రం ఏదో విధంగా ఉద్యోగులను రెచ్చగొట్టాలని విశ్వయత్నం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా అసంతృప్తి చెంది ఉంటే ఈపాటికి ఎంత ఆదోళన వచ్చేది. అది జరగలేదనే బాధతో ఈనాడు మీడియా తనే ప్రతిపక్షం అనుకుని జర్నలిజం విలువలకు పాతరేస్తూ రాసింది. మామూలుగా అయితే ఏమి చేయాలి?. ముందుగా అసలు క్యాబినెట్ నిర్ణయం ఏమిటి? దాని పరిణామం ఏమిటి? అన్నదాని గురించి తొలుత వార్తను ఇవ్వాలి. ఆ తర్వాత నిజంగా ఎన్.జి.ఓ.లకు అన్యాయం జరిగితే దాని గురించి ఇవ్వవచ్చు. అవేమీ చేయకుండా ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు దగా చేశారని నీచంగా రాశారు. గత ఎన్నికల ముందు సీపీఎస్ను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మాట నిజమే. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై గట్టిగా పరిశీలన చేశారు. అదే సందర్భంలో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టెక్నికల్ గా ఉన్న సమస్యలు ఇంతగా ఉంటాయని ఊహించలేదని, అయినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయంగా మెరుగైన జీపీఎస్ను తీసుకు వస్తున్నామని కొంతకాలం క్రితమే ప్రకటించారు. ఇలా నిజాయితీగా ఎంతమంది చెబుతారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీకి సంబంధించి ఎన్ని విన్యాసాలు చేశారో గుర్తు లేదా!. చివరికి రుణమాఫీ చేసేశాం అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అలా అసత్యాలు చెప్పినవారేమో గొప్పవారట. ఇప్పుడు నిజాయితీగా సమస్యను వివరించినవారేమో దగా చేసినట్లట. ఇలా ఉంది ఈనాడు మీడియా సూత్రీకరణ. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జగన్ ఇచ్చిన హామీలు పదింటిలో ఎనిమిదిని నెరవేర్చితే దాని గురించి చెప్పరు. మిగిలిన రెంటిలో కొంతమేర తీర్చారు. అయినా సీపీఎస్ రద్దు చేయలేదని, దగా అని చెడరాశారు. మరి చంద్రబాబు టైమ్లో ఎందుకు దానిని రద్దు చేయలేదు?. పోనీ ఎన్.జి.ఓలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎన్ని అమలు చేశారు? వాటిపై ఎప్పుడైనా సమీక్షకు ఎల్లో మీడియా సిద్దం అవుతుందా? ఆ పని చేయరు. కేవలం బురదచల్లుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. చదవండి: జగన్ దూకుడు.. పచ్చ బ్యాచ్కి కడుపులో మంట దీని అంతటికి ఒకటే కారణం. తమకు కావల్సినవారు అధికారంలో లేరన్న దుగ్దతో పాటు , తమ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలోని ఆర్ధిక అక్రమాలన్నిటిని జగన్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతోందన్న కసి, కక్షతో ఇలాంటి నీచమైన రాతలకు పాల్పడుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినా ఈ మీడియాది ఏడుపుగానే ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు.. వారికి అన్యాయం చేశారు అని రాస్తారు. ముందుగా ఈ నిర్ణయాన్ని స్వాగతించి ఆ తర్వాత రాస్తే ఫర్వాలేదు. ఆ పని చేయరు. సీపీఎస్ బదులు వచ్చిన జిపిఎస్ లో ఉద్యోగి రిటైర్ అయ్యాక చివరి నెల బేసిక్ లో ఏభై శాతం మొత్తాన్ని పెన్షన్ తో పాటు ఏటా రెండు రెండు కరువు భృతి(డి.ఆర్.) ఇవ్వాలని సంకల్పించారు. దీనివల్ల ఉద్యోగికి నష్టం ఏమీ ఉండదు. తొలుత చివరి జీతం బేసిక్ లో 33శాతం పెన్షన్ గా ఇవ్వాలని ప్రతిపాదించినా, ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ దానిని ఏభై శాతంగా చేశారు. ఉన్నంతలో మెరుగైన స్కీమ్ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. దానికి ప్రధాన ఉద్యోగ సంఘాలు కూడా దాదాపుగా ఓకే చేశాయి. మంత్రివర్గ ఉప సంఘం భేటీలో ఈ మేరకు ఒక అవగాహన కూడా కుదిరింది. అయినా ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాలు దీనిపై భగ్గుమంటున్నట్లుగా ఈనాడు, జ్యోతి వంటి తెలుగుదేశం మీడియా శక్తి వంచన లేకుండా దుష్ప్రచారం చేశాయి. ఒక విషయాన్ని విశ్లేషించడం వేరు. విషపూరితంగా రాయడం వేరు. ఎల్లో మీడియా చేస్తున్నది విషపూరిత ప్రచారమే తప్ప ఇంకొకటి కాదు. కొంతకాలం క్రితం టీచర్లు తమ డిమాండ్ ల కోసం విజయవాడకు వచ్చారు. అప్పుడు ఈ మీడియాలు పండగ చేసుకున్నాయి. కాని ఆ తర్వాత ప్రభుత్వం ఆయా అంశాలలో తీసుకుంటున్న శ్రద్ద కారణంగా అలజడి పెద్దగా లేదు. అది ఈనాడుకు, జ్యోతికి కడుపు మంటగా ఉంటోంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా వారు ప్రభుత్వంపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన మనసులో మాట పుస్తకంలో అసలు ప్రభుత్వపరంగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను ప్రోత్సహించింది ఆయనే. తత్ఫలితంగానే ఒకే పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంది. ఇప్పుడు జగన్ దానిని తొలగించే యత్నంచేస్తే అది కూడా వెన్నుపోటే అని తప్పుడు వార్తలు రాశారు. చంద్రబాబు 2004 కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు 54 మూసివేశారు. అప్పుడు ఆయనను గొప్ప సంస్కరణవాదిగా ఈనాడు ప్రచారం చేసింది. ఇప్పుడేమో టిడిపి పూర్తిగా తిరోగమనంలో ఉన్నా ఈనాడుకు తియ్యంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటోంది. వారిని తన కుటుంబ సభ్యులని జగన్ పలుమార్లు ప్రకటించారు. అదే చంద్రబాబు టైమ్లో అయితే ఉద్యోగులను ఎన్ని రకాలుగా యాతనలకు గురి చేసేవారో అనుభవించినవారందరికి తెలుసు. కేవలం కొద్ది మంది నాయకులను మేనేజ్ చేసి చంద్రబాబు ప్రభుత్వం కధ నడిపేది. కాని జగన్ ఉద్యోగుల అవసరాలను తీర్చే క్రమంలో ముందుకు వెళుతున్నారు. ఈనాడు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇంతగా గగ్గోలు పెడుతోంది కదా! తన సంస్థలలో ఉద్యోగుల పట్ల ఇలాగే కనికరంతో ఉంటున్నదా? వారికి కూడా మంచి పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని ఎప్పుడైనా భావించిందా?ఈనాడుకు మంచి లాభాలే వస్తాయి కదా! కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల జీతాలపై అప్పుడప్పుడు ట్రిబ్యునల్లను ఏర్పాటు చేస్తుంటుంది. వారి సిఫారస్లను యాజమాన్యాలు అమలు చేయవలసి ఉంటుంది. కాని ఎప్పుడూ ఆ సిఫారస్ లను యాజమాన్యాలు ఒప్పుకునేవి కావు. ఈనాడు రామోజీరావు అయితే తన సంస్తలోని జర్నలిస్టులందరితో తమకు సగం జీతాలు ఇస్తే చాలని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడాచేయించుకున్న ఘట్టాలు ఉన్నాయి. అసలు తమ సంస్థలలో యూనియన్లనే అనుమతించని రామోజీరావు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల గురించి మాత్రం చాలా బాదపడుతున్నారు. వీరి రాతలను చూసి ఉద్యోగులు మోసపోకూడదనే ఈ విషయాలు చెప్పడం జరుగుతోంది. వారికి ఇంకేమైనా కోరికలు ఉంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పరిష్కరించుకోవచ్చు. ఈనాడు, జ్యోతి రాసే అబద్దాలు నమ్మి భిన్నమైన మార్గంలోకి వెళితే, అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వేధింపులు కాని, సమయం మించి పని కాని పెద్దగా లేవు. అదే చంద్రబాబు టైమ్ లో అయితే ఆయన సోది ఉపన్యాసం వినలేక చచ్చేవారమని పలువురు అధికారులు, ఉద్యోగులు వాపోతుండేవారు. జగన్ తాను మాట ఇచ్చిన నేపధ్యంలో దానిని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. అదే చంద్రబాబు అయితే దానిని ఎలా ఎగవేయాలా అని ఆలోచిస్తుంటారు. ఎన్నికల ప్రణాళికలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. కనుక ఉద్యోగులు వీటన్నిటిని గమనించి ప్రభుత్వంతో ఏర్పడిన సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ? -
కొప్పర్తిపై కడుపు మంట!
సాక్షి ప్రతినిధి, కడప: వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ‘ఈనాడు’ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతోంది. సీమ ప్రగతిని తట్టుకోలేక విషం కక్కుతోంది. అయితేగియితే తమ పెట్టుబడిదారుల మానసపుత్రిక అమరావతి అభివృద్ధి చెందాలి కానీ మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఏమిటనే రీతిలో శివాలెత్తిపోతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈనాడులో ఒక కథనాన్ని వండివార్చింది. అన్ని వసతులు ఉన్న అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని యధావిధిగా రామోజీ చిందులు తొక్కారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు దేశంలో 8 కొత్త నగరాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఒక నగరాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు కోరగా ప్రభుత్వం కడప సమీపాన ఉన్న కొప్పర్తిని ఎంపిక చేసింది. కొప్పర్తి ఇప్పటికే ఇండ్రస్టియల్ హబ్గా భాసిల్లుతోంది. పలు కంపెనీలు ఇక్కడ తమ తయారీ యూనిట్లను సైతం ప్రారంభించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొప్పర్తిని కొత్త నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఇది తప్పన్నట్టుగా.. రాష్ట్రంలో అమరావతి తప్ప మరేదీ ఊరు కాదన్నట్టుగా ‘ఈనాడు’ కడుపు మంట’తో చెలరేగిపోయింది. కేంద్ర ప్రభుత్వం కొత్త నగరాల ఎంపికకు అమరావతి అచ్చు గుద్దినట్టు సరిపోతుందని.. అమరావతిలో అన్ని వసతులు ఉన్నాయని యధావిధిగా తనకలవాటైన రీతిలో రామోజీ చెలరేగిపోయారు. కొప్పర్తికి అనుకూలతలు ఇవే.. ఇప్పటికే కొప్పర్తి పారిశ్రామికవాడను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది. 6,914 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తోంది. అందులో రూ.750 కోట్లుతో వైఎస్సార్ ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చర్ క్లస్టర్ను నెలకొల్సింది. ఒక్క దీని పరిధిలోనే రూ.10 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. తద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి. భవిష్యత్లో మొత్తంగా కొప్పర్తి పరిధిలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో కొప్పర్తిలో కొత్త నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. దీంతో కేంద్రానికి కొప్పర్తి పేరును సూచిస్తూ ప్రతిపాదనలు పంపింది. దీన్ని జీర్ణించుకోలేని ఈనాడు తనకలవాటైన యధేచ్ఛగా శివాలెత్తిపోయింది. రూ.1000 కోట్లతో కొత్త నగరం కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిరి్మంచాలనుకున్న ఒక్కో నగరానికి రూ.1,000 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. కొత్త నగరాలకు ఎంపిక చేసిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లు ఇస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా అధికార యంత్రాంగం కొప్పర్తిని కొత్త నగరంగా ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత, భవిష్యత్లో ప్రత్యక్షంగా లభించే ఉద్యోగాలు, చెన్నై, బెంగళూరు, బొంబాయి వంటి మహానగరాలకు ఉన్న కనెక్టివిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రానికి ప్రతిపాదించింది. వాస్తవం ఇదయితే.. సీఎం వైఎస్ జగన్ తన సొంత గడ్డ కోసం అమరావతిని విస్మరిస్తున్నారని ‘ఈనాడు’ తన కడుపు మంటను వెళ్లగక్కింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తమ పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఉన్న అమరావతిని తప్ప మరే ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్ సైతం అమరావతినే కొత్త నగరంగా ఎంపిక చేయాలని ఈనాడు పల్లవి ఎత్తుకుంది. -
నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ‘ఈనాడు’పై వివేకా పీఏ ఫైర్
సాక్షి, పులివెందుల: తాను పారిపోయానంటూ ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం చేస్తోందని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కాలేజీ పని మీద కడపకు వెళితే.. ఈనాడు పత్రిక వాళ్లు ‘కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.. పారిపోయారు’ అంటూ తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. సీబీఐ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఆ షాక్ నుంచి జేసీ బ్రదర్స్ ఇంకా తేరుకోలేదా? -
ఈనాడు రాతలు ఇంత దుర్మార్గమా!?
కావలి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామానికి చెందిన సీహెచ్ జనార్దనరెడ్డి (42) నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించిన ఉదంతంపై ఈనాడు వక్రభాష్యం ఇస్తూ దుష్ప్రచారం చేయడంపై మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కుటుంబ, ఆరోగ్యపరమైన సమస్యలు ఈ ఘటనకు కారణమైతే ఈనాడు పత్రిక మాత్రం ప్రభుత్వం నుంచి బిల్లులు రాక అతను ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచురించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనార్దనరెడ్డి గ్రామంలో సచివాలయన్ని నిర్మించాడు. దాని తాలూకా రూ.27 లక్షలు అతనికి ప్రభుత్వం చెల్లించేసింది. ఇంకా రూ.6 లక్షలు మాత్రమే బకాయి ఉంది. అయితే, అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. భార్య దూరమైంది. పైగా అతనికి ఆరోగ్యపరమైన సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో.. తండ్రితోపాటు ఉంటున్న జనార్దనరెడ్డి ఈనెల 16వ తేదీన మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో మేడపై ఉన్న తన గదిలోకి వెళ్లి పురుగుమందు తాగి బయటకు వెళ్లాడు. అతను పురుగుమందు తాగినట్లు గ్రామస్తులు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు హుటాహుటిన కావలిలోని ఒక ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులు ఆస్పత్రిలో ఉండి ఇంటికొచ్చిన జనార్థనరెడ్డికి చాలా ఏళ్లుగా ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. దీంతో అతనిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ జనార్దనరెడ్డి శనివారం మరణించాడు. వాస్తవం ఇలాగుంటే.. ‘ఈనాడు’ మాత్రం సచివాలయం -
మరోసారి విషం చిమ్మిన ‘ఈనాడు’.. మంత్రి కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: వ్యవసాయశాఖపై ‘ఈనాడు’ మరోసారి విషం చిమ్మిందని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. విలువలు, విషయ పరిజ్ఞానం లేకుండా కథనాలు రాస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో వ్యవసాయ రంగంలో 13.18 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. గత ప్రభుత్వంలో వృద్ధి రేటు పెరగలేదని.. ఉత్పత్తి తగ్గిందని గుర్తు చేశారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందించామని.. పొలం బడి ద్వారా రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి 1,623 కరువు మండలాలను ప్రకటించారని, తమ ప్రభుత్వంలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కరువు రావాలని, రైతులు విలవిలలాడాలని రామోజీ కోరుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అయితే మహిళలను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం వైఎస్ జగన్ది’ అని స్పష్టం చేశారు. చదవండి: జగన్ అంటే అభిమానం, అంత కంటే మించి ప్రాణం ‘చంద్రబాబులాంటి పనికి మాలిన వ్యక్తులు తిడితే పట్టించుకోం. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రతి ఇంటికి వెళ్తే జనాలు చెబుతారు. అక్కడికి వెళ్ళి బాబు సెల్ఫీ తీసుకోవాలి. మా ప్రభుత్వంలో వ్యవసాయం లాభసాటిగా మారింది. మేము తీసుకున్న విధానాలు వల్ల ఉత్పత్తి పెరిగింది. రైతులకు గిట్టుబాటు వస్తుంటే చంద్రబాబు, సోమిరెడ్డి కడుపు మండుతుంది. గత ప్రభుత్వంలో సోమిరెడ్డి మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని వారిని మోసం చేశారు. పారదర్శకంగా పరిపాలన చేశానని చంద్రబాబు చెప్పలగలరా? మేము చేసిన అభివృద్దిని చూపిస్తూ చంద్రబాబు సెల్పీలు తీసుకోవడం సిగ్గు చేటు. జిల్లాలో టీడీపీ భూస్థాపిమైనదని నిన్న జరిగిన సమీక్షలో చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబుకు పాజిటివ్ ఓటు బ్యాంక్ లేదు.. ఆయన అంతంటి మోసగాడు లేడని టీడీపీ నేతలే చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనల వల్ల మా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు’ అని మంత్రి కాకాణి అన్నారు. -
'బాబుకోసం... దళిత రాగం'
చంద్రబాబు అండతో కీచకపర్వం పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టిన టీడీపీ నేతలు సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో దళితులు భయం భయంగా బతకాల్సిన దుర్భర పరిస్థితులు ఉండేవి. దళిత మహిళలకు ఏమాత్రం రక్షణ ఉండేది కాదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో జరిగిన అమానుష దుర్ఘటన. అక్కడి సర్వే నంబర్ 77లో దాదాపు 80 సెంట్ల స్థలంలో రంజా దుర్గమ్మ, దువ్వాడ అక్కమ్మ సహా 14 దళిత కుటుంబాలు సాగు చేస్తున్నాయి. కొన్ని కుటుంబాలు ఇదే స్థలంలో నివాసం కూడా ఉంటున్నాయి. ఈ విలువైన స్థలంపై టీడీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ నాయకుల కన్ను పడింది. 2017 డిసెంబర్ 19వ తేదీన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అప్పటి మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనుచరులు, టీడీపీ నాయకులు తెగబడ్డారు. వారి దుశ్చర్యను అడ్డుకునే ప్రయత్నం చేసిన దళిత మహిళ రంజా దుర్గమ్మ వస్త్రాలు చింపేసి బయటకు ఈడ్చేశారు. ఇతర దళితులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. మహిళ అనే కనికరం లేకుండా అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి అండ చూసుకుని టీడీపీ నేతలు కీచకుల్లా వ్యవహరించారు. ‘ఈనాడు’ ఓ వార్త రాస్తుంది. దానికి మరిన్ని అబద్ధాలు జోడించి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పిస్తుంది. నిజాలనుకునేలా జనాల్లోకి బలంగా తీసుకెళ్లటానికి ఆ ఆరోపణలనే పుస్తకాలుగా కూడా వేస్తుంది. మళ్లీ ఆ పుస్తకాల్లోని అంశాలను ‘ఈనాడు’ యథాతథంగా బ్యానర్ కథనాలుగా వండి వారుస్తుంది. దానిపై మళ్లీ టీడీపీ ప్రెస్మీట్లు షరా మామూలే. నిజానికిదంతా ఓ సైకిల్. మాఫియాలా మారిన ఎల్లో మీడియా నడిపించే చక్రం. ప్రత్యామ్నాయ మీడియా లేనన్నాళ్లూ ఈ చక్రమే రాష్ట్రాన్నేలింది. ఆర్థిక అరాచకాలతో రామోజీరావు వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించినా.. సింగిల్గా గెలిచే సత్తా లేకున్నా చంద్రబాబు నాయుడు ఏకంగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నా... పనికిమాలిన అనుయాయుల్ని అందలాలెక్కించి వ్యవస్థలను భ్రష్టు పట్టించినా... అదంతా ఈ మాఫియావల్లే సాధ్యమైంది. కాకపోతే ఇపుడు ప్రత్యామ్నాయ మీడియా ఉంది. సంఘటనల వెనక వాస్తవాలను క్షణాల్లో వివరించే సోషల్ మీడియా ఉంది. అయినా రామోజీ మాత్రం మారలేదు. క్షుద్ర ప్రచారం మానలేదు. ‘దళితులపై దమనకాండ’ అంటూ మంగళవారం వేసిన కథనం అలాంటిదే. దాన్లో నిజానిజాల్ని చెప్పే ప్రయత్నమిది... ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకుని వైఎస్సార్ సీపీకి ద్రోహం చేశారు ఓ ఎమ్మెల్యే. పైపెచ్చు ఆమె మీడియా ముందుకొచ్చి.. తన నియోజకవర్గానికి వెళ్లాలంటే భయంగా ఉందని, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపణలు చేసింది. ‘ఈనాడు’ దృష్టిలో అది...‘దళితులపై దమనకాండ’. ఔరా!! మరీ ఇంత దిగజారుడా రామోజీ? కడప వెటర్నరీ ఆసుపత్రిలో డిప్యూటీ డైరెక్టరుగా పనిచేస్తున్న అచ్చెన్నకు... అక్కడి అసిస్టెంట్ సర్జన్ సుభాష్ చంద్రబోస్ తో విభేదాలున్నాయి. బోస్ను సరెండర్ చేశారు అచ్చెన్న. దీంతో కక్ష పెంచుకున్న బోస్.. మరో ఇద్దరితో కలిసి అచ్చెన్నను అపహరించి, హతమార్చినట్లు పోలీసులు కనుగొన్నారు. నిందితుల్ని అరెస్టు చేశారు కూడా. అచ్చెన్న దళితుడు కాబట్టి దీన్ని దళితులపై జరిగిన దమనకాండగా రాసేశారు రామోజీ!!. అసలు ఈ సంఘటనతో ప్రభుత్వానికి గానీ, అధికార పార్టీకి గానీ ఏం సంబంధం? ఎందుకీ నీచపు రాతలు? ఈ రెండు సంఘటనలూ చాలవూ... ‘ఈనాడు’ ఏ స్థాయిలో తెలుగుదేశం ఎజెండాను మోస్తోందో చెప్పటానికి!. ఇవి చాలవూ అబద్ధాలే ఆయుధాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో రామోజీ ఏ రకమైన యుద్ధం చేస్తున్నారో తెలియటానికి? ఒక్కటైతే నిజం! తమకు న్యాయం చేస్తున్నందుకు బీసీలు, దళితులు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు అంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అండగా నిలుస్తున్నారు. ఇది నారా వారికి నిద్రను దూరం చేస్తోంది. సేమ్ టు సేమ్ ఆయన ఎజెండాను మోస్తున్న రామోజీకి కూడా. అందుకే ఈ రాతలు. విచిత్రమేంటంటే 2021లో దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 3.95 శాతం ఏపీలోనే జరిగాయంటారు రామోజీ. పైపెచ్చు దానికి ముందటేడాదితో పోలిస్తే 3.28 శాతం పెరిగాయంటారు కూడా. కానీ దేశంలో ఏపీ ఏ స్థానంలో ఉంది? చంద్రబాబు హయాంతో పోలిస్తే తగ్గాయా... పెరిగాయా... అనే విషయాలు రాయరు. ఎందుకంటే అసత్యాలు, అర్ధసత్యాలే తమకు అనుకూలంగా ఉంటాయి కనక!!. ఇది కాదూ... దమనకాండకు అర్థం! ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా?’ అనేది ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్న. ఈ ఒక్కటి చాలు... చంద్రబాబు మనసులో దళితులకున్న స్థానమేంటో చెప్పడానికి. చేతల్లోనూ బాబు హయాంలో దళితులపై ఏ స్థాయిలో దమనకాండ జరిగిందో సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ వెల్లడించే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికే చెబుతోంది. కాకపోతే... దీన్లోని వాస్తవాలను ‘ఈనాడు’ చెప్పదంతే!. అవేంటంటే... టీడీపీ హయాంలో కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో దళితులపై దాడులు తగ్గాయని, రాష్ట్రంలో ప్రస్తుతం దళితుల భద్రతకు పూర్తి భరోసా లభిస్తోందని ఎన్సీఆర్బీ గణాంకాలతో నివేదించింది. దీనిప్రకారం చూస్తే... నాడు... టీడీపీ హయాంలో... 2014– 2018 మధ్య రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై 17,091 నేరాలు జరిగాయి. అంటే... సగటున ఏడాదికి 3,418 ఘటనలు. అంతేకాదు! మొత్తం ఘటనల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగినవి ఏకంగా 31 శాతం!!. రాష్ట్రంలో దళితులపై 2014లో 4,114 దాడులు, 2015లో 4,415 దాడులు, 2016లో 2,335 దాడులు జరగడం నాటి దారుణ పరిస్థితికి నిలువుటద్దం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో... రాష్ట్రంలో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి 2021 వరకు తీసుకుంటే... ఈ మూడేళ్లలో దళితుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు.. రాష్ట్రంలో హోంశాఖ బాధ్యతలనూ దళిత మహిళకే అప్పగించారు సీఎం వైఎస్ జగన్. ఫలితం.. 2019– 21 మధ్య మూడేళ్లలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల సంఖ్య 7,046. అంటే... సగటున ఏడాదికి 2,348 ఘటనలు. టీడీపీ హయాంతో పోలిస్తే దాదాపు 32 శాతం తగ్గుదల. రాష్ట్రంలో మొత్తం నేర ఘటనల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన ఘటనల శాతం కూడా 31 నుంచి 21 శాతానికి తగ్గింది. ఈ పచ్చి నిజాన్ని రామోజీ చస్తే చెప్పరు. క్రైమ్ రేట్లో నాడు... నేడు ► టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన నేరాల శాతం రాష్ట్రంలో అత్యధికం. 2014లో దేశంలో మొత్తం నేరాల్లో దళితులపై జరిగినవి 23.4 శాతం కాగా... ఏపీలో ఇది ఏకంగా 48.7 శాతం. ఇక 2015లో దేశంలో ఇది 22.3 శాతం కాగా... ఏపీలో ఏకంగా 52.3 శాతం. బాబు హయాంలో దళితుల దుస్థితిని చెప్పటానికి ఇంతకన్నా లెక్కలు అక్కర్లేదేమో!!. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై క్రైమ్రేట్ గణనీయంగా తగ్గింది. 2020లో దేశంలో దళితులపై క్రైమ్రేట్ 25 శాతం కాగా ఏపీలో ఇది 23 శాతం. ఇక 2021లో దేశంలో ఇది 25.3 శాతం కాగా... ఏపీలో 23.8 శాతం. ఏపీలో నేరాలు తగ్గినా కనిపించవా..? ► దేశం మొత్తమ్మీద ఎస్సీ, ఎస్టీలపై జరిగిన నేరాల్లో ఏపీ వాటా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అత్యధికం. 2014లో దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 8.1 శాతం ఏపీలోనే జరిగాయి. ఇక 2015లో ఇది 9.2 శాతం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019లో ఇది 4.4శాతం, 2020లో 3.9 శాతం, 2021లో 3.95 శాతంగా ఉన్నాయి. కాకపోతే ‘ఈనాడు’ ఇవేమీ రాయదు. 2021లో దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో ఏపీలోనే 3.95 శాతం జరిగాయని, ఇది అత్యంత దారుణమని రాసేస్తారు. బాబు హయాంలో ఇది ఏకంగా 9.2 శాతం ఉందని మాత్రం చెప్పరు. మరీ ఇంత దారుణమా రామోజీ? నాడు రెండో స్థానం... నేడు పదో స్థానం టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్... దళితులపై దాడుల్లో ఏకంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉండేది. 2014లో ఏపీది మూడో స్థానం కాగా... 2015లో రెండోస్థానం. కానీ వైఎస్ జగన్ హయాంలో 2019లో ఏపీ 9 స్థానంలోను... 2020, 2021లలో పదో స్థానంలోనూ ఉంది. దీనర్థం దళితులపై దాడులు పూర్తిగా తగ్గాయని. మరి దీన్నెందుకు ‘ఈనాడు’ రాయదు? నాడు నిర్లక్ష్యం... నేడు సత్వర దర్యాప్తు ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్ని బాబు ప్రభుత్వం పట్టించుకుంటే ఒట్టు. దాడులకు తెగబడే వారి కొమ్ముకాస్తూ దర్యాప్తును ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసేది. 2014లో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల దర్యాప్తునకు సగటున 611 రోజులు పడితే... 2015లో 518రోజులు, 2016లో 453 రోజులు పట్టాయి. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇది గణనీయంగా తగ్గింది. ఈ కేసుల దర్యాప్తునకు సగటున 2019లో 259 రోజులు, 2020లో 163రోజులు, 2021లో 97 రోజులు పట్టాయంటే... ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. 2021లో ఎస్సీ, ఎస్టీలపై దాడుల ఘటన విచారణకు సగటున 83 రోజులే పట్టాయి కూడా!!. ఛార్జిషీట్లు దాఖలు చేయటంలోనూ అంతే!. కేంద్రం నిర్దేశించిన 60 రోజుల గడువులోగా... 2014, 2015లో 15శాతం కేసుల్లో, 2016లో 16శాతం, 2017లో 20 శాతం కేసుల్లో మాత్రమే చార్జ్షీట్లు వేయగలిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2020లో 60 శాతం కేసుల్లో , 2021లో 61 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్షీట్లు వేశారంటే పరిస్థితి అర్థంకాక మానదు. బాధితులకు పరిహారంలోనూ... దాడుల బాధితులైన ఎస్సీ, ఎస్టీలకు నష్టపరిహారం ఇవ్వటంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించలేకపోయింది. టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు బాధిత ఎస్సీ, ఎస్టీలకు రూ.52.32 కోట్ల నష్టపరిహారం అందించగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలోనే 2019–21 మధ్య పరిహారాన్ని గణనీయంగా పెంచి బాధితులకు రూ.87.70కోట్ల పరిహారం పంపిణీ చేసింది. ఇలా ఏ రకంగా చూసినా... దమనకాండ ఎవరి హయాంలో జరిగిందో, దగ్గరకు తీసుకుంటున్నదెవరో తేలిగ్గానే తెలుస్తుంది. తెలియనట్టు నటించేదల్లా ఒక్క రామోజీరావు మాత్రమే!!. దుష్ప్రచారమే ‘ఈనాడు’ అజెండా అసత్యాలు, అర్ధసత్యాలే ‘ఈనాడు’ ఎజెండా అన్నది తెలియనిదేమీ కాదు. దీన్ని కొనసాగిస్తూ ‘దళితులపై దమనకాండ’ కథనంలోనూ పలు సంఘటనలను ప్రస్తావించారు రామోజీరావు. కాకపోతే ఆ సంఘటనలన్నిట్లోనూ వాస్తవాలను తనకు నచ్చినట్లుగా వక్రీకరించారు. ప్రభుత్వానికి సంబంధం లేకున్నా... అంతా ప్రభుత్వ తప్పిదమేనన్నట్లుగా రాసి విషంగక్కారు. ఆయా సంఘటనల్లోని వాస్తవాలు ఇవీ... ► శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కాలపర్తికి చెందిన దళితుడు మురపాక మహేశ్ భార్య శ్రీదేవి కుటుంబ కలహాలతో 2022 సెప్టెంబరు 4న ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మహేశ్ను విచారించారు. భార్య ఆత్మహత్యతో మనస్తాపానికి గురైన మహేశ్ 2022 సెప్టెంబరు 6న తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రభుత్వంతో ముడి పెట్టడం ఎంత వరకు కరెక్టు? ► చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండలో దళిత దంపతులు ఆవుల నరసమ్మ, కృష్ణమూర్తి టీడీపీ కార్యకర్తలు. బీసీ వర్గానికి చెందిన పాళెం శ్రీనివాసులు, రమణమ్మ దంపతులు కూడా టీడీపీ వారే. ఆ రెండు కుటుంబాల మధ్య భూవివాదం ఉంది. ఒకరోజు పాళెం శ్రీనివాసులు దంపతులు... నరసమ్మ, కృష్ణమూర్తిలపై రోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. ఇక్కడ దాడికి గురైంది, దాడి చేసిందీ టీడీపీ వారే. కానీ వైఎస్సార్సీపీ వర్గీయులు దళితులపై దాడి చేశారనే తన మార్కు అబద్ధంతో ‘ఈనాడు’ కథనాన్ని వండేసింది. ► సామర్లకోట బలుసులపేటకు చెందిన మహిళ దువ్వా మల్లిక వార్డు వలంటీర్గా చేస్తున్నారు. 2022, జనవరి 1న ఆమె పింఛన్ల పంపిణీకి వెళుతుండగా ఆలపు గిరిశ్ బాబు అనే దళితుడు దారిలో అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. పించన్ సొమ్మును లాక్కోబోవటంతో మల్లిక ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సురేశ్బాబు జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన చేయడంతో సీఐ, ఎస్సైలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇందులో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఏమీలేదు. ఆరోపణలొచ్చిన పోలీసులు సస్పెండ్ అయ్యారు. కానీ వైఎస్సార్సీపీ నేతల ఒత్తిడితోనే గిరీశ్ను పోలీసులు వేధించారని ఈనాడు అభూతకల్పనలను ప్రచురించింది. ► ప్రకాశం జిల్లా ములగంపాడులో యువకుల మధ్య ఘర్షణను దళితులపై దాడిగా ఈనాడు వక్రీకరించింది. ఎందుకంటే దాడి చేసిన వారిలోనూ దళితులున్నారు. వెంకటేశ్వర కాలనీలో 2022, జూలైలో యువకుల మధ్య బైక్ మీద ఫీట్స్తో చెలరేగిన వివాదం తీవ్రమైంది. ఇరు వర్గాల యువకులూ పరస్పరం దాడులు చేసుకున్నారు. 14 మంది యువకులు తమ ప్రత్యర్థి యువకులపై తెల్లవారు జామున కర్రలతో దాడి చేసి 10మందిని గాయపరిచారు. దాడి చేసిన వారిలో ఐదుగురు దళితులు, ఇద్దరు ముస్లింలు, ఐదుగురు బీసీలు, ఒక బలిజ, ఒక రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది రెండు బ్యాచ్లకు చెందిన యువకుల మధ్య ఘర్షణే తప్ప...దళితులపై దాడి కాదు. ► ప్రకాశం జిల్లా సీఎస్పురం మండలం ఏకునాంపురం గ్రామానికి చెందిన దాసరి వెంకట రమణ హత్యకు పూర్తిగా వ్యక్తిగత విభేదాలే కారణం. అదే గ్రామానికి చెందిన ఆది లక్ష్మమ్మతో పొలం వివాదం ఉంది. చింతకాయలు కోసారని తరచూ గొడవ పడుతుండేవారు. ఓ సారి ఘర్షణ తీవ్రమై ఆది లక్ష్మమ్మ ముగ్గురు కొడుకులు గురువర్ధన్(18), ఏడుకొండలు(17), భాను చంద్ర(12) రమణయ్యపై దాడి చేసి కొట్టారు. తీవ్రంగా గాయపడిన రమణయ్య మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత వివాదం. అయినా సరే ఈ ఉదంతాన్ని వక్రీకరించి ఈనాడు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించింది. ► అనకాపల్లి జిల్లాలో వివాహేతర సంబంధంతో జరిగిన హత్యను కూడా ప్రభుత్వానికి ఆపాదించడం ‘ఈనాడు’ దిగజారుడుతనానికి పరాకాష్ట. పాయకరావుపేట మండలం పిఎల్ పురంలో 2022 మార్చి 28న వడ్లమూరి నాగేంద్ర అనే దళిత యువకుడు హత్యకు గురయ్యాడు. నాగేంద్ర ఒక మహిళను వేధిస్తుండటంతో ఆమెతో సన్నిహిత సంబంధం కలిగిన మరో వ్యక్తి అతన్ని హత్య చేశాడు. నిందితులను అరెస్ట్ చేశారు కూడా. ► విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని సుజాత నగర్లో నివసించే బిగ్బాస్ ఫేమ్ నూతన్నాయుడు... తన సెల్ఫోన్ దొంగతనం చేశాడనే కారణంతో డ్రైవర్గా పనిచేస్తున్న దళిత యువకుడు కర్రి శ్రీకాంత్కు శిరోముండనం చేశారు. ఫిర్యాదు రావడంతో పోలీసులు తక్షణం స్పందించి నూతన్ నాయుడిని, ఆయన భార్యను 12 గంటల్లోనే అరెస్టు చేశారు. మరి దీన్లో ప్రభుత్వ తప్పిదం ఎక్కడుంది? ► పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన దళిత ఆక్వా రైతు బూరగ నాగేశ్వరరావు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. తాహతుకు మించి అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. నాగేశ్వరరావు దగ్గర పనిచేసే దళిత యువకుడు సురేష్కు.. పిట్టలు కాల్చే తుపాకి చేతిలో పేలి గాయమైంది. అతని వైద్యం కోసం నాగేశ్వరరావు రూ.70వేలు ఖర్చు పెట్టారు. తనకు 10 లక్షలు పరిహారం ఇవ్వాలని నాగేశ్వరరావుపై సురేశ్ కేసు పెట్టారు. గ్రామ పెద్దల ద్వారా సమస్య పరిష్కారం కాకపోవటంతో అంత డబ్బు చెల్లించలేక నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిక్కూడా వక్ర భాష్యాలా? ► దళితులను టీడీపీ నేతలు హత్య చేసినా సరే వైఎస్సార్సీపీకి ఆపాదించేందుకు బరితెగించడం ఈనాడు దుర్నీతికి నిదర్శనం. గుంటూరు జిల్లా పొన్నూరులో బర్న బసు అనే దళితుడిని టీడీపీ నేతలు హత్య చేయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుర్రా వాసు, రెండో నిందితుడు తాళ్లపాలెం శ్రీను టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు. వారిద్దరిని కోర్టులో హాజరుపరిచినప్పుడు 250మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు వచ్చారు. వాస్తవం అలా ఉంటే... వైఎస్సార్సీపీ నేతలు ఈ హత్య చేశారని రాయడం ఈనాడు పన్నాగం. ► నెల్లూరు జిల్లా కావలికి చెందిన దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యపైనా ఈనాడు అవాస్తవాలే వండివార్చింది. కరుణాకర్కు అప్పులిచ్చిందీ... తరవాత అప్పు తీర్చలేదని ఆయన ఇంటిని రాయించుకుని వేధించిందీ టీడీపీ నేతలే. కావలిలోని మందాటి చెరువులో చేపలు పట్టుకునేందుకు వీలుగా నీటిని కిందకు వదలటానికి రైతులు సమ్మతించలేదు. వాస్తవానికి ఆ చేపల చెరువులో చేపల పెంపకానికి లక్ష్మీపురం గ్రామానికి చెందిన మత్స్యకారుల సొసైటీ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. సొసైటీలో కరుణాకర్ సభ్యుడు కాదు. కానీ ఆ చెరువులో చేపలు పట్టేందుకు వీలుగా నీటిని కిందకు విడిచిపెట్టాలని ఆయన రైతులను కోరారు. వారు కాదన్నారు. ఇక టీడీపీ నేతలకు అప్పు చెల్లించలేననే ఆందోళనతో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి దీన్లో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయమెక్కడుంది? ► నెల్లూరు జిల్లా కావలికి చెందిన పైడి హర్ష అనే దళితుడి రేషన్ దుకాణాన్ని తొలగించడంతో అతను ఆత్మహత్యకు యత్నించినట్టు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తిగా అబద్ధం. ఎందుకంటే అతనికి రేషన్ దుకాణమే లేదు. టీడీపీ నేతలు తమ కార్యకర్త పైడి హర్షతో ఈ డ్రామా ఆడించారు. టీడీపీ నేతల డ్రామా మేరకు... అతను వైఎస్సార్సీపీలో చేరేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డిని కలిశారు. కానీ స్థానిక నేతలు సమ్మతించలేదు. దాన్నే ఎమ్మెల్యే అతనికి చెప్పారు. అప్పటికే అతనిపై బిట్రగుంట పోలీస్ స్టేషన్లో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసు నమోదైంది. దీంతో చంద్రబాబు కావలికి రానున్నారని తెలిసి... టీడీపీ నేతల ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు డ్రామా ఆడారు. టీడీపీ నేతలు వారించినట్లు నటించారు. ఇదంతా స్క్రిప్టు ప్రకారం నడిచిన కథ. దీన్ని కూడా రాసేస్తే ఎలా రామోజీ? ► నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన దళితుడు ఉదయగిరి నారాయణ ఆత్మహత్యనూ ఈనాడు వక్రీకరించింది. ఓ దొంగతనం కేసులో నిందితుడైన నారాయణను పోలీసులు విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి పంపేశారు. మరోసారి పిలుస్తారన్న భయంతో నారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. దళిత సంఘాల ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ జి. సునీల్కుమార్ గత ఏడాది ఆగస్టులో విచారణ జరిపారు. నారాయణను పోలీసులు కొట్టలేదని విచారణలో తేలింది. దాంతో పోలీసులపై ఎలాంటి చర్యలనూ కమిషన్ సిఫార్సు చేయలేదు. ► వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో హత్యకు గురైన ఓ దళిత మహిళలపై అత్యాచారం జరిగినట్టుగా టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారు. అత్యాచారం జరగలేదని పోస్టుమార్గం నివేదికలో వెల్లడైంది. టీడీపీ నేతలు మాత్రం అత్యాచారం జరిగిందని ప్రచారం చేస్తూ ధర్నా చేయడంతో తాము తీవ్ర మనస్తాపానికి గురైనట్లు హతురాలి కుటుంబీకులు టీడీపీ నేతలపై కేసు పెట్టారు. దాంతో పోలీసులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డితోపాటు ధర్నా చేసిన 14మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ 14మందిలో ఉన్న ఇద్దరు దళితులకు ఆ సెక్షన్లు వర్తించవని కూడా పేర్కొన్నారు. ఇదేమీ చెప్పకుండా... టీడీపీకి చెందిన ఇద్దరు దళిత నేతలపైనే అట్రాసిటీ కేసు పెట్టారంటూ ‘ఈనాడు’ శివాలెత్తింది. ► దళితులు, మహిళలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై కేసు పెట్టడం కూడా తప్పన్నట్టుగా ఈనాడు వాదించడం విడ్డూరమే. 2020 అక్టోబరు 11న మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెంలో ఆ గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. మూడు రాజధానులకు మద్ధతుగా ర్యాలీ చేస్తున్న దళితులు, మహిళలపై కృష్ణాయపాలెం వద్ద మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. కులంపేరుతో దూషిస్తూ, మహిళలపై దాడి చేశారు. దళితులు, మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 18మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అందులో తప్పేముందో మరి ఈనాడుకే తెలియాలి. -
తోడు దొంగలు.. యథేచ్ఛగా అక్రమాలు, ఆర్బీఐ నిబంధనలు బేఖాతరు
సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంసీఎఫ్పీఎల్) అక్రమాల బండారం బద్దలైంది. రిజర్వ్ బ్యాంకు నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న అరాచకం ఆట కట్టింది. చిట్ఫండ్ చట్టాన్ని తుంగలో తొక్కేస్తూ రామోజీ సాగిస్తున్న అవినీతి ఆధారాలతో సహా నిరూపితమైంది. కొన్ని నెలల క్రితం స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఆ సంస్థ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాలతో అక్రమాల డొంక కదిలింది. దీనిపై ఆ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో సీఐడీ రంగంలోకి దిగడంతో రామోజీరావు అవినీతి సామ్రాజ్యం బాగోతం మొత్తం బహిర్గతమైంది. చట్టాన్ని యథేచ్చగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆ సంస్థపై సీఐడీ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ, రామోజీరావు పెద్ద కోడలు చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వారిపై సెక్షన్లు 120(బి), 409, 420, 477(ఎ) రెడ్విత్ 34 సీఆర్సీపీ కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం–1999, చిట్ ఫండ్ చట్టం–1982 కింద కూడా కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చందాదారుల హక్కులకు విఘాతం మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో రాష్ట్ర స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో సోదాలు నిర్వహించింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు, చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా ఆ సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. ఆ తనిఖీల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు ఏమాత్రం సహకరించ లేదు. దాంతో అధికారులు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో గత ఏడాది డిసెంబర్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మరిన్ని అక్రమాలు వెలుగు చూశాయి. చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల హక్కులకు విఘాతం కలిగిస్తున్నారని ఆధారాలతో సహా నిర్ధారించారు. సంస్థ యాజమాన్యం తమ స్వప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతోందని నిగ్గు తేల్చారు. దాంతో చందాదారుల హక్కుల పరిరక్షణ, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను అమలు చేయడం కోసం ఈ వ్యవహారాన్ని సీఐడీకి నివేదించారు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఈ మేరకు సీఐడీకి లిఖిత పూర్వకంగా సీఐడీ విభాగానికి ఫిర్యాదు చేశారు. దాంతో మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ అధికారులు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో శనివారం సోదాలు నిర్వహించి మేనేజర్లను ప్రశ్నించారు. సోదాలు మొదలుపెట్టగానే నరసరావుపేట, ఏలూరు బ్రాంచి మేనేజర్లు పరారవ్వడం గమనార్హం. ఈ సోదాల్లో సీఐడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కూడా సోదాలు కొనసాగించనున్నారు. ఏలూరు మార్గదర్శి కార్యాలయంలో అధికారుల తనిఖీలు మార్గదర్శి అక్రమాలు ఇవీ.. ► చందాదారులు నెలవారీ మొత్తం చెల్లించకపోయినా, వాయిదాల మొత్తం చెల్లించకపోయినా ఆ ఖాతాలను మార్గదర్శి చిట్ఫండ్స్ పేరుతో చూపించారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఆ చీటీలను ఇతర వ్యక్తుల పేరుతో మార్పు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ► చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారునికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్గా స్వీకరిస్తున్నట్టే. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధం. చిట్ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా “ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. ► మార్గదర్శి చిట్ఫండ్స్ తమ ఆదాయ, వ్యయాల ఖాతాలు, ఆస్తి, అప్పుల నివేదికలు, పెట్టుబడుల నివేదికలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచింది. ఇది చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 28 రెడ్విత్ 24 నిబంధనలకు విరుద్ధం. ► మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టింది. ఇది చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధం. రికార్డుల నిర్వహణలో గూడు పుఠాణి ► మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో తాము గుర్తించిన అక్రమాలపై స్టాంప్స్– రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మరింత లోతుగా పరిశీలించారు. మార్గదర్శి సంస్థ సమర్పించిన ఆర్థిక నివేదికల (ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్)పరిశీలనకు ఓ చార్టడ్ అకౌంటెంట్ను నియమించడం ద్వారా పలు అక్రమాలను గుర్తించారు. ► చిట్టీల వారీగా లాభనష్టాల ఖాతా, బ్యాలెన్స్ షీట్లను సక్రమంగా నిర్వహించడం లేదు. ► బ్యాలన్స్ షీట్లో నోట్ నంబర్ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. కానీ పరిశీలించగా ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. ► మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు మూడు అనుబంధ కంపెనీలు ఉన్నట్టుగా బ్యాలన్స్ షీట్ నోట్ నంబర్ 40లో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్లను అనుబంధ కంపెనీలుగా చూపించారు. నిధులను నిబంధనలకు విరుద్ధంగా తరలించేందుకే ఇలా చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలన్స్ షీట్లో చూపించారు. కానీ ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా.. ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్గా పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. ► చిట్ ఫండ్ కంపెనీలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం చిట్ ఫండ్ చట్టం–1982కు విరుద్ధం. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్కు ఉన్న మూడు అనుబంధ కంపెనీలు అదే తరహా వ్యాపారంలో ఉన్నట్టుగా చూపించారు. కానీ ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చిట్ఫండ్ వ్యాపారంలో లేదు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఆ కంపెనీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 88.5 శాతం వాటా ఉంది. అంటే ఆ కంపెనీలో నిర్ణయాధికారం మార్గదర్శి సంస్థదే. అక్రమ డిపాజిట్లు మార్గదర్శి చిట్ ఫండ్స్ దశాబ్దాలుగా అక్రమ డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఆ సంస్థ కార్యాలయాల్లోనే “మార్గదర్శి డిపాజిట్స్’ అనే పేరుతో భారీగా అక్రమ డిపాజిట్లను సేకరించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో దీనిపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. దాంతో తాము తప్పు చేశామని రామోజీరావు లిఖిత పూర్వకంగా అంగీకరిస్తూ డిపాజిట్దారులకు వారి డిపాజిట్ మొత్తాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇక డిపాజిట్ల సేకరణను నిలిపి వేసిందని అంతా భావించారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా “రశీదు’ల రూపంలో అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టుగా స్టాంప్స్–రిజిస్ట్రేషన్ల శాఖ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతమైంది. -
నిజాలకు మసిబొట్టు.. బాబు కోసం కనికట్టు
సాక్షి, అమరావతి: ‘మన చంద్రబాబు కాదు కదా.. వెయ్యండి బురద’ అంటూ రామోజీ మరోమారు తన ద్వంద్వ నీతి రాతలతో ప్రజల్లో విషం నింపే కార్యక్రమంలో ఇంకో అడుగు ముందుకు వేశారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గును అధిక ధరతో కొన్నారనే సాకుతో వాస్తవాలకు మసి బొట్లు పెట్టారు. బొగ్గు కొనుగోలు టెండరులో అదానీ సంస్థ ఎల్–1గా నిలిచిందని ఒప్పుకుంటూ కూడా.. అది తప్పన్నట్లు ‘బొగ్గు టెండరూ అదానీకే’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని అచ్చేయడం కేవలం చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని కాదా? ఇదే పని చంద్రబాబు చేసి ఉంటే.. బాబు గ్రేట్ విజనరీ.. బాబు ముందు చూపు.. అని డప్పు కొట్టే వారు కాదా? సీఎం వైఎస్ జగన్ చేసినందున మీ ‘పచ్చ’కళ్లకు తప్పుగా కనిపిస్తోంది. భవిష్యత్లో విద్యుత్ కొరత ఉండకూడదనే దూరదృష్టితో ఈ పని చేయడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారని మీ కథనంలోని వాక్యాలు చెప్పకనే చెబుతున్నాయి. అందుకే కదా.. ఈ ప్రభుత్వం ఈ టెండర్ను నామినేషన్పై కట్టబెట్టిందన్నట్లు మీరు తిమ్మినిబమ్మి చేసి చూపడాన్ని ఏమనాలి? తక్కువ ధరకు బొగ్గు కొనుగోలు కోసం నాలుగుసార్లు టెండర్లు నిర్వహించి రద్దు చేసిన విషయం మీకు తెలియదా? ఐదోసారి టెండర్లలో అదానీ సంస్థ ఎల్–1గా నిలిచిన తర్వాతే టెండర్ ఖరారు చేశారనేది నిజం కాదా? పచ్చి నిజాన్ని అందమైన అబద్ధంగా మార్చి.. ప్రజలంతా అదే నిజమని భ్రమ పడేలా చేయాలన్న మీ ఆరాటం వల్ల మీరు రోజురోజుకూ దిగజారి పోతున్నారనే విషయాన్ని గుర్తించండి. అబ్బే.. అలాంటివన్నీ మా ఒంటికి పట్టవు అనుకుంటే ‘టీడీపీ ఈనాడు’ అని పత్రిక పేరు మార్చుకుంటే సరి. మీ కథనంలో పేర్కొన్న నిజానిజాల్లోకి వెళితే.. 20% విదేశీ బొగ్గును వాడుకోవాలంటూ కేంద్రం ఆదేశాలు ఆరోపణ: ప్రభుత్వంపై రూ.300 కోట్లు అదనపు భారం వాస్తవం: 7.50 లక్షల టన్నుల విదేశీ బొగ్గుతో 1,776 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్ను గ్రిడ్కు ఏపీపీడీసీఎల్ ఇవ్వగలుగుతుంది. దీనికి అయ్యే వ్యయం యూనిట్కు రూ.4.44 చొప్పున రూ.788.54 కోట్లు. ఇదే 1,776 మిలియన్ యూనిట్లను పవర్ ఎక్సే్చంజి(బహిరంగ మార్కెట్)లో కొనుగోలు చేస్తే వెచ్చించాల్సిన సొమ్ము రూ.1,456.32 కోట్లు. పవర్ ఎక్స్చేంజిలో కొనాలంటే యూనిట్కు దాదాపు రూ.8.20 చెల్లించాలి. అంటే విదేశీ బొగ్గుతో ఉత్పత్తి చేయడం వల్ల రూ.668 కోట్లు డిస్కంలకు ఆదా. దేశీయ బొగ్గుతో సగటు ఉత్పత్తి వ్యయం పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్నాక, డిస్కంలకు రూ.319.78 కోట్లు నికరంగా ఆదా అవుతుంది. ఆరోపణ: 6 శాతం విదేశీ బొగ్గు చాలు.. వాస్తవం: దేశంలో తీవ్ర బొగ్గు కొరత నేపథ్యంలో బొగ్గు వినియోగంలో 20 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర ఇంధన శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల కమిటీ, సబ్ కమిటీలతో సమావేశాలు, కోల్ ఇండియా ద్వారా అన్ని జెన్కోలకు బొగ్గు సరఫరాపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. వారు చెప్పినంత విదేశీ బొగ్గును సేకరించడంలో విఫలమైతే, కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి దేశీయ బొగ్గు సరఫరాను దామాషా ప్రకారం తగ్గిస్తారు. అదీకాకుండా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 30 శాతం విదేశీ, 70 శాతం స్వదేశీ బొగ్గు వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా రూపొందించారు. దీని ప్రకారం 30 శాతం విదేశీ బొగ్గునే దీనికి వినియోగించాలి. టన్ను విదేశీ బొగ్గును ఎన్టీపీసీ రూ.18,509కి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపే డాక్యుమెంట్ ఆరోపణ: టన్ను విదేశీ బొగ్గు ధర రూ.10వేల నుంచి 11 వేలు వాస్తవం: విదేశీ బొగ్గు టన్ను ధర రూ.10 –11వేలకు లభిస్తుందని ఏ నిపుణులు చెప్పారో తెలియదు. నిజానికి దేశంలో రోజుకు 2.781 మిలియన్ టన్నుల బొగ్గు డిమాండ్ ఉన్నప్పటికీ 2.2 మిలియన్ టన్నులే అందుబాటులో ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుదల కారణంగా విదేశీ బొగ్గు ధర చాలా ఎక్కువగా ఉంది. దీనికి రవాణా ఖర్చులు, జీఎస్టీ కలిపితే అదానీ కోట్ చేసిన ధర దాటిపోతుంది. బొగ్గు ధర, రవాణా చార్జీలు అంతర్జాతీయ మార్కెట్ ఇండెక్స్ రేట్లు, డాలర్ మారకం రేట్ల ఆధారంగా అదానీకి చెల్లింపులు ఉంటాయి. ప్రస్తుతం, ఎన్టీపీసీ, ఇతర రాష్ట్ర థర్మల్ పవర్ ప్లాంట్లు కేవలం ఇండెక్స్ బేస్డ్ ప్రైసింగ్ ఆధారంగా బొగ్గును సేకరిస్తున్నాయి. అదానీ ఇప్పటికే ఐసీఐ3(ఇండోనేషియన్ కోల్ ప్రైజ్) ఇండెక్స్ ఆధారంగా ఒక నౌకలో 1,65,000 మెట్రిక్ టన్నుల విదేశీ బొగ్గును తీసుకువచ్చి కృష్ణపట్నం పోర్ట్లో ఉంచింది. ఇండెక్స్ ఆధారంగా ఈ నౌక తీసుకువచ్చిన బొగ్గు మెట్రిక్ టన్ను ధర రూ.11,733 మాత్రమే. ఆరోపణ: అదానీకి లబ్ధి చేకూర్చేందుకే.. వాస్తవం: విదేశీ బొగ్గు కొనుగోలు కోసం ఏపీపీడీసీఎల్ ఇప్పటి వరకూ 4సార్లు బహిరంగ టెండర్లు పిలిచి ధర ఎక్కువనే ఉద్దేశంతో రద్దు చేసింది. 2021 అక్టోబర్ 20న 5 లక్షల టన్నుల కొనుగోలుకు టెండర్లు పిలవగా రూ.17,480 కోట్ చేసిన అదానీ ఎల్1గా నిలిచింది. 2022 మార్చి 28న రెండవసారి టెండర్లలో రూ. 25,650 కోట్ చేసి టైడెంట్ ఛెమ్ ఫర్ ఎల్1గా నిలిచింది. 2022 మే 4న మూడవసారి టెండర్లలో రూ.23,085 ధర కోట్ చేసి అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఎల్1గా నిలిచింది. 2022 జూలై 13న నాలుగోసారి రూ.13,990 ధర కోట్ చేసి చెట్టినాడ్ లాజిస్టిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఎల్1గా నిలిచింది. ఈ టెండర్లన్నింటినీ ఎక్కువ ధర అనే ఉద్దేశంతోనే ఏపీపీడీసీఎల్ రద్దు చేసింది. ఐదవసారి టెండర్ల అనంతరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.5.10 కోట్లు ఆదా అయ్యాయి. ఐసీఐ–3 సూచిక ప్రకారమే చెల్లింపులుంటాయని తెలిపే ఒప్పందపత్రంలోని నిబంధన టెండర్ల ద్వారా బొగ్గు కొనుగోలు కొత్త కాదు ఐదోసారి టెండర్లలో 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలు కోసం టెండర్లు పిలవగా అయిదు సంస్థలు పాల్గొన్నాయి. ఎల్1గా వచ్చిన అదానీ సంస్థ టన్ను రూ.13,219తో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చి ఒప్పందం చేసుకుంది. జాతీయ థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) చేసుకున్న ఒప్పందం ప్రకారం టన్ను విదేశీ బొగ్గు సరఫరా ధర (అన్నీ కలుపుకుని)రూ.18,509 పడుతోంది. ఇదే బొగ్గును ఏపీ జెన్కో టన్ను ధర రూ.13,219తో (ప్లాంటుకు చేర్చేలా అన్నీ కలుపుకుని) కొనుగోలు చేసేందుకు బహిరంగ టెండర్ల ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. టెండర్ల ద్వారా బొగ్గు కొనుగోలు కొత్తేమీ కాదు. – బి.శ్రీధర్, ఏపీ ట్రాన్స్కో సీఎండీ, జెన్కో ఎండీ -
Fact Check: రాయితీల జాడపై రామోజీ అబద్ధాల నీడ
సాక్షి, అమరావతి: తనకు కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేరని, అతన్ని ఆ పీఠంపై తిరిగి కూర్చోబెట్టడానికి అనుకూల వాతావరణం సృష్టించేందుకు ‘ఈనాడు’ తహతహలాడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రగతిని పణంగా పెడుతూ నీచ రాజకీయాలకు తెరలేపింది. ఒక్కో రోజు ఒక్కో కట్టు కథతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొన్నటికి మొన్న టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టకపోయినా.. కొట్టారంటూ పాత ఫొటోలతో తప్పుడు ప్రచారం చేసింది. ప్రజలు గుర్తించి సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తిపోయడంతో తప్పు ఒప్పుకుంటూనే.. తిరిగి అవే తప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది. గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ.. ‘పారిశ్రామిక రాయితీ జాడేది?’ అంటూ తాజాగా మరో కథనాన్ని వండివార్చింది. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోవాలని, పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేయాలనే దుర్బుద్ధి కనిపిస్తోంది. గత ప్రభుత్వం పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వకుండా బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అంధకారంలోకి నెట్టిన విషయాన్ని ఏ రోజూ మాట మాత్రంగానైనా రామోజీ ప్రశ్నించ లేదు. ఈ ప్రభుత్వం వరుసగా రాయితీలు విడుదల చేస్తున్నా, తప్పుడు రాతలతో విషం కక్కడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమే. కోవిడ్ సమయంలో పరిశ్రమలు భారీగా ఆదాయం నష్టపోయినా, రీస్టార్ట్ ప్యాకేజీతో ఈ ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకుందన్న పచ్చి నిజాన్ని దాచడం దుర్మార్గం కాదా? భారీ సంక్షోభాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు పారిశ్రామిక వేత్తలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం న్యాయమా? ఆరోపణ: రాయితీలు ఇవ్వలేదు వాస్తవం: గత ప్రభుత్వం రూ.3,409 కోట్ల రాయితీలను పరిశ్రమలకు బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక వాతావరణాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి సకాలంలో రాయితీలను విడుదల చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.46 కోట్లు, 2020–21లో రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ.993.30 కోట్ల రాయితీలను విడుదల చేయడం ద్వారా కోవిడ్ సంక్షోభంలో 8,000 ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా అండగా నిలిచింది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంలో 2021–22లో రూ.666.86 కోట్ల రాయితీలను విడుదల చేశారు. 2022–23కు సంబంధించి ఆగస్టులో పారిశ్రామిక రాయితీలను విడుదల చేయాల్సి ఉండగా, మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ను విశాఖలో నిర్వహిస్తున్న తరుణంలో దానికి ఒక నెల ముందు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతలో ఎంఎల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో రాయితీల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అయిపోగానే పారిశ్రామిక రాయితీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ వాస్తవాలను ఏమాత్రం ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ముందు రాష్ట్రం పరువు తీయాలని ఈనాడు లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టమవుతోంది. ఆరోపణ: విద్యుత్ డిమాండ్ చార్జీల సంగతీ అంతే.. వాస్తవం: గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఏటా క్రమం తప్పకుండా రాయితీలను విడుదల చేస్తూ, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా చేదోడుగా నిలబడటంతో సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. పూర్తిగా 100 శాతం రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రకటిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడటం అంటే రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మూడు నెలల కాలానికి విద్యుత్ రంగానికి చెందిన ఫిక్స్డ్ డిమాండ్ చార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు భారీ పరిశ్రమలకు ఎటువంటి పెనాల్టీలు లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు వైఎస్సార్ బడుగు వికాసం కింద 9,631 యూనిట్లకు రూ.661.58 కోట్ల రాయితీలు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 2,207 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు రూ.111.08 కోట్లు, 424 ఎస్టీ పారిశ్రామికవేత్తలు రూ.24.31 కోట్ల రాయితీలు అందుకున్నారు. వైఎస్సార్ నవోదయం కింద 1.08 లక్షల ఎంఎస్ఎంఈ రుణ ఖాతాలకు చెందిన రూ.3,236 కోట్ల రుణాలను ప్రభుత్వం రీ–షెడ్యూల్ చేసింది. -
కట్టుకథలు రాస్తున్న ఈనాడుపై జనాగ్రహం.. ఉవ్వెత్తున ఎగసిన నిరసనలు
సాక్షి, అమరావతి: ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘ఈనాడు’ పత్రిక అసత్య కథనాలు వండి వారుస్తోందని, వారికి అనుకూలమైన చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతో దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఎగసిపడింది. తప్పుడు వార్తలు రాసి.. ప్రజలను మోసం చేస్తున్న ఈనాడు పత్రిక ప్రతులను గురువారం వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో దహనం చేశారు. రామోజీరావు ఇంతగా దిగజారిపోవడం దారుణం అని ఛీకొట్టారు. పట్టాభినీ కొట్టారంటూ పాత ఫొటోలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఈనాడు చేసిన కుట్ర మరోసారి బట్టబయలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసనలు ఎగసిపడ్డాయి. వైఎస్సార్, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్న సెంటర్లలో ఈనాడు రామోజీ రావు విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అవి 2021లోని ఫొటోలని సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఎవరికీ కనిపించని రీతిలో రెండో పేజీలో సింగిల్ కాలంలో ‘సవరణ’ వేసి చేతులు దులుపుకుందని ఆందోళనకారులు మండిపడ్డారు. ఈనాడు పత్రిక పుట్టిందే అసత్య వార్తలు రాయడానికి అని పెద్ద ఎత్తున నినదించారు. చంద్రబాబును సీఎం చేయాలనే కుట్రతోనే ఈనాడు పత్రిక దిగజారుడు వార్తలు, కథనాలు రాస్తోందని మంత్రులు ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయాలని, సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనే దురుద్ధేశం.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి, చంద్రబాబుకు ప్రజలను చేరువ చేయాలని రాజగురువు రామోజీ కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు దుయ్యబట్టారు. ఈనాడు దినపత్రిక కాదు.. చంద్రబాబు కరపత్రిక అని పలు ప్రాంతాల్లో నినదించారు. ఇవి సోషల్ మీడియా రోజులు పట్టాభి అనే వ్యక్తి జాతీయ నేతలా ఎల్లో మీడియా జాకీలు వేసి లేపుతోందని, ఇవి ఎల్లో మీడియా రోజులు కావని.. సోషల్ మీడియా రోజులు అని ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎల్లో మీడియా అని ముద్దుగా పిలుచుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అనుబంధ సంస్థలు ప్రచురిస్తున్న, చూపుతున్న వార్తలు, కథనాలు చూస్తుంటే ఇంకా దిగజారిపోవడానికి వారికి మెట్లు ఏమీ లేవు అని నిరూపించుకున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు మాత్రమే బాగుండాలనేది రామోజీరావు సిద్ధాంతం.. రామోజీరావుకు వయసు పెరిగి.. బుద్ధి మందగించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తూర్పారబ్టారు. కుట్రల రామోజీని బట్టలూడదీసి ప్రజల ముందు నిలబెడతామని మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) హెచ్చరించారు. దుష్ప్రచారం చేసేటప్పుడు బ్యానర్ ఐటమ్స్.. సవరణకు మాత్రం సింగిల్ కాలమా? అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. రామోజీ ఆరాటమే తప్ప.. చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సంబంధం లేని ఫొటోలను ప్రచురించి ప్రజలను మోసం చేయాలని ఈనాడు యాజమాన్యం కుట్ర చేసిందని, సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిందని వైఎస్సార్సీపీ సీనియర్ శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు చంద్రబాబు మాత్రం బాగుండాలనేది రామోజీరావు సిద్ధాంతమని పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ‘ఈనాడు’ ప్రతులను తగలబెడుతున్న స్థానికులు పెల్లుబికిన ఆగ్రహం అసత్యాలను ప్రచారం చేస్తున్న ఈనాడు పత్రికను బహిష్కరించాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఎక్కడికక్కడ ఈనాడు ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్ జిల్లాలోని కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, తదితర పట్టణాల్లో ఈనాడు ప్రతులు కాల్చివేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీ–5లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ తన క్యాంపు కార్యాలయం ఎదుట ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఆధ్వర్యంలో ఈనాడు దినపత్రిక పత్రులను దహనం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఎమ్మెల్యేలతో కలిసి ఈనాడు పత్రిక ప్రతులను తగులబెట్టారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు గ్రామంలో మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రామోజీరావు దిష్టి బొమ్మ దహనం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని రీతిలో ఆంధ్రప్రదేశ్లో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్న జగన్మోహన్రెడ్డిపై, ఆయన ప్రభుత్వంపై ఈనాడు విషం చిమ్ముతుండటాన్ని ప్రజలు ఛీకొడుతున్నారని విజయవాడలో పలువురు నేతలు మండిపడ్డారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామోజీరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ మంటల్లో ఈనాడు ప్రతులను తగులబెట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ‘పచ్చ’రాతలపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. విషపు రాతలు రాస్తున్న ‘ఈనాడు’ పత్రికను వైఎస్సార్సీపీ శ్రేణులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున సాగాయి. నిరసన కార్యక్రమాలతో విశాఖపట్నం జిల్లా దద్దరిల్లింది. ఇకనైనా నీచపు రాతలు మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు.. రామోజీకి హితవు పలికారు. ప్రభుత్వంపై కక్ష కట్టి ఈనాడు రాస్తున్న అబద్ధపు రాతలను శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నేతలు ఖండిస్తూ నిరసన తెలిపారు. -
అవాస్తవాలే పరమావధిగా ఈనాడు!
సాక్షి, విజయవాడ: అవాస్తవాలు, అసత్య ప్రచారాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అక్కసు.. ఇవే ఈరోజుల్లో ఈనాడుకు పతాక శీర్షికలుగా మారాయి. తాజాగా ‘ధాన్యం కొనుగోలు నిలిపివేత!’ అనే శీర్షికతో తప్పుడు కథనం ప్రచురించింది. దీంతో ఈ కథనం ఆధారంగా ఏపీ రైతులు ఆందోళనకు గురి కావొద్దని అధికారులు వాస్తవాలను తెలియజేశారు. అవేంటంటే.. ‘‘పౌరసరఫరాల సంస్థ తమ లక్ష్యం పూర్తయిదని తేల్చేసింది. రైతుల వద్ద ఇంకా నిల్వలు ఉన్నాయి. ఎదురుచూపులు తప్పట్లేదు. బ్యాంకు గ్యారంటీలు లేక కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు, రంగు మారిన ధాన్యం సేకరణకూ మొండి చెయ్యి’’ అంటూ పూర్తిగా అంటూ అవాస్తవాలనే ప్రచురించింది ఈనాడు. అయితే.. ధాన్యం సేకరణకు సంబంధించిన ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించిన వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే.. ధాన్యం కొనుగోలు నిలిపివేత పూర్తిగా అవాస్తవం. కొనుగోలు ఏ జిల్లాలోనూ బ్రేకులు పడలేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తెలియజేసింది. ప్రతిజిల్లా లోని రైతు భరోసా కేంద్రము పరిధిలో.. రైతుల వద్ద ధాన్యము నిల్వ లేదని నిర్దారించుకొన్న తర్వాతనే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగించడం జరుగుతుంది. సదరు రైతు భరోసా కేంద్రము వద్ద.. అధికారుల తనిఖీ చేసి రెవిన్యూ, సివిల్ సప్లై, అగ్రికల్చర్ అధికారుల ద్వారా ఆమోద పత్రం పొందిన తర్వాత మాత్రమే సంబంధిత రైతు భరోసా కేంద్రము వద్ద ధాన్యము సేకరణ ప్రక్రియ మూసి వేస్తారు. అంతేకాదు సేకరణ ప్రక్రియ మూసేసే వారం రోజులు ముందు నుంచే గ్రామంలో చాటింపు వేస్తారు. లక్ష్యమంటూ ఏదీ లేదు ఏపీలో పౌరసరఫరాల సంస్థ ధాన్యం సేకరణలో ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోదు. కేవలం తాత్కాలిక అంచనా మాత్రమే ఉంటుంది. వరి పండించే ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధర కల్పించటం, ఏ ఒక్క రైతుకూ మద్దతు ధర కంటే తక్కువ ధరకంటే తక్కువకు అమ్ముకునే పరిస్థితి లేకుండా చూడటం ప్రభుత్వ ఉద్దేశాలు. అలాంటప్పుడు టార్గెట్ అనే టాపికే ఉండదు. ఇంకా నిల్వలు.. ఎదురుచూపులంటూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ.. రైతుల వద్ద ఉన్న ధాన్యము నిల్వల తనిఖీ చేసిన తర్వాతే.. సదరు ధాన్యము నిల్వలను భరోసా కేంద్రము ద్వారా కొనుగోలు చేస్తుంది. కానీ, నిల్వలు ఉన్నాయంటూ, రైతులు ఎదురుచూపులంటూ అవాస్తవాలను హైలెట్ చేస్తోంది. అది అవాస్తవం బ్యాంకు గ్యారంటీలు లేక.. కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు అని ఈనాడు కథనంలో పేర్కొన్న విషయం పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్ జిల్లాలకు బ్యాంకు గారంటీల యొక్క రేషియోను పెంచింది ఏపీ పౌర సరఫరాల శాఖ. తద్వారా ధాన్యము సేకరణ ప్రక్రియకు సంబంధించి సంబంధిత జిల్లాలకు కేటాయింపు కూడా పెంచారు. ధాన్యము సేకరణ: తేది18-01-2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారు 4,77,098 రైతుల వద్ద నుంచి.. రూ.5,373.82 కోట్ల విలువ గల 26,32,372 మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేసింది. అందుకు గాను రూ.4768.79 కోట్ల (89%)ను 4,65,967 రైతుల ఖాతాలో జమ చేయటం జరిగింది. గోనె సంచుల చార్జీలు, హమాలీ ఛార్జీలు, రవాణా చార్జీలు తాలుకు రూ.65.01 కోట్లరూపాయలను చెల్లించవలసి ఉండగా రూ. 26.28 కోట్ల రూపాయలను (40%) రైతుల ఖతాలో జమ చేయటం జరిగింది. కాబట్టి, ఈనాడు పత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అసత్యం. రైతులందరికి విజ్క్షప్తి ఏంటంటే.. దళారులను, మధ్య వర్తులను నమ్మి మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్మి మోసపోవద్దు. ధాన్యము సేకరణలో ఎటువంటి సమస్య వచ్చిన సత్వరమే పరిష్కరించేలా ప్రతి మండలంలో అధికారులను నియమించారు. ఒక వేళ రైతులకు సమస్య వస్తే సదరు సమస్య పరిష్కారం కోసం సంబంధిత మండల అధికారి దృష్టికి తీసుకువెళ్లాలి అని ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ వైఎస్ చైర్మన్ & ఎండీ వీరపాండియన్(ఐఏఎస్) ద్వారా ఒక ప్రకటన విడుదల అయ్యింది. -
‘దసపల్లా’ కథనాలపై పరువునష్టం దావా
దసపల్లా భూములపై రాసిందే పదేపదే రాస్తున్నారు రామోజీరావు. పేదలు ఏళ్ల తరబడి అడుగుతున్నా పట్టించుకోని అధికారులు... దసపల్లా భూముల్ని మాత్రం 22(ఎ) జాబితా నుంచి తొలగించడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ బుధవారం మరో బ్యానర్ కథనాన్ని వండేశారు. ఇదే కథనాన్ని అటుతిప్పి.. ఇటు తిప్పి గతంలోనే పలుమార్లు రాయగా... వాస్తవాలు వివరిస్తూ స్థానిక ప్లాట్ల యజమానులు, భూ యజమాని రాణి కమలాదేవి, ప్లాట్ల యజమానులతో డెవలప్మెంట్ ఒప్పందం చేసుకున్న కంపెనీ... అందరూ ఖండించారు. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ఈ భూములు ప్రభుత్వానివి కావని, రాణి కమలాదేవికే చెందుతాయని పదేపదే తీర్పులిచ్చాక కూడా ప్రభుత్వం వీటిని వ్యూహాత్మకంగా వారికి అప్పగించేస్తోందని ‘ఈనాడు’ రాస్తోందంటే దాని అర్థమేంటి? కోర్టు తీర్పులను అమలు చేయకూడదనా? కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాలనా? ఎందుకు రామోజీరావు గారూ ఈ రాతలు? రాసిందే పదేపదే రాయటం వెనక అర్థమేంటి? బుధవారం రాసిన కథనానికి సంబంధించి ‘ఈనాడు’పై పరువునష్టం దావా వేస్తామంటూ రాణి కమలాదేవి, ఆమె కుమారుడు నోటీసులివ్వగా... విశాఖపట్నం జిల్లా కలెక్టరు కూడా పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలియజేశారు. చట్టపరమైన చర్యలు... ‘‘దసపల్లా భూములపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ భూములకు సంబంధించి న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాలు ఈ నెల 23 నాటికి అమలు చేయాలని కోర్టులు స్పష్టంచేశాయి. లేకుంటే హైకోర్టుకు జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. అందుకే కోర్టు తీర్పులను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’’ అని పేర్కొనటంతో పాటు... ఆ భూముల చరిత్రను కూడా వివరించారు కలెక్టర్. ఇదీ... దసపల్లా భూముల కథ ► మొదటి నుంచీ రాణి కమలాదేవి కుటుంబీకుల చేతుల్లోనే ఉన్న ఈ భూములపై... సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్తో పలు వ్యాజ్యాలు నడిచినా... చివరకు డైరెక్టరు కూడా ఆ భూములు వారివేనని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. 1985లో ఈ భూములపై తహశీల్దార్ హైకోర్టులో కేసు వేయగా... వాదోపవాదాలు విన్న న్యాయస్థానం 1992లో ఆ భూములు కమలా దేవికి చెందినవి అంటూ తీర్పునిచ్చింది. ► ఇంతలో జీవో నం. 657 విడుదల చేసి... ఆ భూముల్ని ప్రభుత్వ పోరంబోకు భూమలుగా గుర్తిస్తూ సెక్షన్ 22(ఏ)లో నమోదు చేశారు. దీనిపై 2005లో హైకోర్టులో రాణి కమలాదేవి రిట్ పిటిషన్ వేశారు. దీంతో జీవో ఈ భూములకు వర్తించదని కోర్టు తీర్పునిచ్చింది. ► నాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా ప్రభుత్వ పిటిషన్లని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో 2012లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. దాన్నీ కోర్టు డిస్మిస్ చేసింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం చివరి ప్రయత్నంగా క్యూరేటివ్ పిటిషన్ను దాఖలు చేసింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ► తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం పదే పదే సుప్రీంకి వెళ్తుండటంతో రాణి కమలాదేవి 2012లో హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఇది పెండింగ్లో ఉండగానే... ఆ భూముల్ని 22(ఏ)లో పెట్టి నోటిఫై చేసింది ప్రభుత్వం. దీనిపై రాణి కమలాదేవి మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు జిల్లా గెజిట్ను రద్దుచేసి... ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని అడ్వకేట్ జనరల్కు చెప్పింది. ఏజీ ప్రభుత్వానికి అదే సూచన చేశారు. అయినా అమలు చేయకపోవడంతో మరోసారి పిటిషనర్లు్ల కోర్టుకు వెళ్లారు. దీంతో.. దసపల్లా భూములకు సంబంధించి ఈ నెల 23 నాటికి కోర్టు ఆదేశాలు అమలు చేయాలని... లేకుంటే కలెక్టర్ హైకోర్టుకు వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ► అన్ని దారులు మూసుకుపోవడంతో పాటు కోర్టు ధిక్కార పిటిషన్ పెండింగ్లో ఉన్నందున, సుప్రీం ఆదేశాలను, ఏజీ సూచనను అంగీకరిస్తూ.. న్యాయస్థానాల ఆదేశాల్ని 2022 డిసెంబర్ 31న అమలు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వాస్తులు, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ విభాగాలవిగా చెబుతున్న 18.41 ఎకరాల్ని మాత్రం 22(ఏ)లో అలాగే ఉంచినట్లు తెలిపారు. ఎవరైనా ఇంకేం చేస్తారు? ఇవీ వాస్తవాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే కదా? అన్ని స్థాయిల్లోనూ న్యాయ పోరాటం చేసి ఓడిపోయాక... కోర్టు ధిక్కార కేసులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయస్థానాలు హెచ్చరించాక ఏ ప్రభుత్వమైనా ఆ ఆదేశాలను అమలు చేయక ఇంకేం చేస్తుంది? కథనాలు రాసేముందు ఈ మాత్రం ఆలోచించకపోతే ఎలా రామోజీరావు గారూ? ఈ రాతలు... మరీ ఘోరం ‘‘విశాఖలో 2002లో ఓ అపార్ట్మెంట్ కట్టారు. అందులో పిసరంత ప్రభుత్వ భూమి ఉందని మొత్తం అపార్ట్మెంట్నే 22(ఏ)లో పెట్టేశారు. ఈ సంగతి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ఓనర్లకు ఏడెనిమిదేళ్ల కిందట తెలిసింది. అప్పటి నుంచి తిరుగుతున్నా ఇప్పటికీ 22(ఏ) నుంచి తొలగించలేదు. ఇదీ ఈ ప్రభుత్వం సామాన్యుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి’’అంటూ తన కథనంలో ‘ఈనాడు’ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. మరి ఎనిమిదేళ్ల కిందట అంటే అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడు కదా? ఐదేళ్ల పాటు ఆయనే ఉన్నారు కదా? ఐదేళ్లూ వారు 22(ఏ) నుంచి తొలగించలేదంటే ఏమని అనుకోవాలి? మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఐదేళ్లూ బాబు ప్రభుత్వంలో చేయని పనిని... ఈ ప్రభుత్వం మూడేళ్లలో చేయలేదని విమర్శించటం సబబేనా? ఎందుకీ దుర్మార్గపు రాతలు రామోజీరావు గారూ? బాబు అధికారంలో ఉంటే ప్రశ్నించాల్సిన మీ కలంలో సిరా అయిపోతుందా? లేక మీ గొంతు మూగబోతుందా? -
తప్పుడు కథనంపై ‘ఈనాడు’కు నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని దసపల్లా భూములపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు దినపత్రికకు ఆ భూముల యజమాని రాణి కమలాదేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్ చంద్ర బుధవారం పరువు నష్టం నోటీసులు జారీ చేశారు. రాణి కమలాదేవి తరపు న్యాయవాది అరుణ్దేవ్ ఈనాడు ఎడిటోరియల్ డైరెక్టర్, ఎడిటర్, ఈనాడు దినపత్రికకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల సారాంశం ఇది.. విశాఖపట్నంలోని వాల్తేరు అప్ల్యాండ్స్లో ఉన్న టీఎస్ (టౌన్ సర్వే) నం 1196, 1197, 1027, 1028లో ఉన్న భూముల్ని దసపల్లా భూములంటారు. వీటిపై మా క్లయింట్ రాణి కమలాదేవి ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ భూములు రాణి కమలాదేవికి చెందినవేనని 2009లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదే తీర్పుని సుప్రీంకోర్టు కూడా వెలువరించింది. ప్రభుత్వ భూముల పరిధి నుంచి ఈ భూముల్ని తొలగించి, సుప్రీం కోర్టు ఆదేశాల్ని పాటించాలంటూ జిల్లా కలెక్టర్కు హైకోర్టు దిశానిర్దేశం చేసింది. ఈ విషయం కూడా పత్రికల్లో ప్రచురితమైంది. అయినప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే ఈ నెల 11న ఈనాడు దినపత్రికలో ‘‘దసపల్లాపై అత్యుత్సాహం’’ పేరుతో కథనాన్ని ప్రచురించారు. ఈ కథనంలో ‘దసపల్లా భూముల విషయంలో న్యాయ పోరాటానికి అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం, వ్యూహం ప్రకారం కలెక్టర్తో లేఖ రాయించి సీసీఎల్ఏతో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇప్పించడం.. ఇవన్నీ గమనిస్తే దసపల్లా భూములపై తెరవెనుక ఎంత పెద్ద మంత్రాంగం జరిగిందో అర్థమవుతోంది’ అంటూ మా క్లయింట్ పరువుకు భంగం కలిగించేలా అసత్యపు ఆరోపణలతో కథనాన్ని ప్రచురించారు. దసపల్లా భూముల వ్యవహారంలో రాణి కమలాదేవి కుటుంబం ప్రతిష్టని దిగజార్చేలా అసత్యాల్ని ప్రచురిస్తున్నారు. ఈ కథనాన్ని ఖండిస్తూ ఈనాడు పత్రికలో సవరణ ప్రచురించాలి’ అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వెంటనే సవరణ వార్తని ప్రచురించకపోతే రూ.కోటికి పరువు నష్టం దావా వేస్తామని న్యాయవాది అరుణ్దేవ్ తెలిపారు. -
కొత్త ఇండస్ట్రీ వస్తుంటే ‘ఈనాడు’ ఏడుపు!
సాక్షి, అమరావతి: వేలాది మందికి ఉపాధి కల్పించేలా ఒక కొత్త పరిశ్రమ వస్తుంటే ‘ఈనాడు’కు ఏడుపు ముంచుకొస్తోంది. ఈ ప్రభుత్వానికి ఎక్కడ మైలేజీ ఇంకా పెరిగిపోతోందోనని ఆందోళన చెందుతోంది. ఉన్నవి లేనివి అన్నీ కలిపి.. టన్నులకొద్దీ బురదజల్లుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతోంది. ఏదైనా ఇండస్ట్రీ రాకపోతే ఏడవడం మామూలే అనుకుంటే.. ఎంతో మందికి ఉపకరించే పరిశ్రమ మన రాష్ట్రంలో వెలుస్తోందంటే ఎందుకు ఏడుస్తున్నట్లు? ఎవరి కోసం ఏడుస్తున్నట్లో ఇట్టే అర్థమవుతోంది. ఇండస్ట్రియల్ హబ్ పేరుతో షిర్డిసాయి ఎలక్ట్రికల్ అనుబంధ కంపెనీ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కు నెల్లూరు జిల్లా రావూరు, చేవూరు గ్రామాల్లోని 4,827.04 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టేస్తోందని మంగళవారం ‘ఈనాడు’ అక్కసు వెళ్లగక్కింది. షిర్డి సాయి ఏ విధంగా చిన్న సంస్థ? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ)కు అర్హత సాధించిన కంపెనీ. ఆర్థిక స్థితిగతులు, కంపెనీ పనితీరు, సామర్థ్యం చూశాకే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఇలాంటి కంపెనీని పట్టుకుని ‘ఈనాడు’ విషం కక్కడం దుర్మార్గం. కేవలం కడపకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చెందిన సంస్థ కావడమే పాపమైపోయింది. విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను ఎంవీవీఎస్ మూర్తి ఆక్రమించినప్పుడు ఏనాడైనా ఈనాడు ఇలాంటి కథనం రాసిందా? ‘షిర్డిసాయికి 4,827 ఎకరాలు’ శీర్షికన ప్రచురించిన ఈనాడు కథనంలో అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : సీఎంకు సన్నిహితుడైన వ్యక్తికి చెందినది.. వాస్తవం : ఈ కంపెనీ కోసం ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు చాలా ఆఫర్లు ఇచ్చాయి. ప్రస్తుతం పరిశ్రమల కోసం వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్న ప్రస్తుత వాతావరణంలో ఇలాంటి కంపెనీలు వస్తున్నాయంటే రెడ్ కార్పెట్ పరుస్తారు. అలాంటివేమీ అవసరం లేకుండానే వెనకబడ్డ రామాయపట్నం లాంటి ప్రాంతంలో కంపెనీ పెట్టడానికి ముందుకొచ్చింది. గతంలో కియా సంస్థకు ఇచ్చిన స్థాయిలో కూడా ఇండోసోల్కు రాయితీలు ఇవ్వలేదు. భూమి, కరెంట్, ఎస్జీఎస్టీ, మౌలిక సౌకర్యాల విషయంలోనూ కియా కంటే తక్కువ ప్రోత్సాహకాలే ఇచ్చారు. ఈ స్థాయిలో ఏ కంపెనీ వచ్చినా ఏ ప్రభుత్వమైనా సహకరిస్తుంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మాత్రమే వ్యవహరిస్తుండటం. ఆరోపణ: హైదరాబాద్లో రిజిస్టరైన కంపెనీ వాస్తవం : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోనే రిజిస్టర్ అయి ఉండక్కర్లేదు. ఉదాహరణకు కియా పరిశ్రమనే తీసుకుంటే ఆ సంస్థ మన రాష్ట్రానికి చెందిందా? కియా కోసం యూనిట్ రూ.3 చొప్పున 100 శాతం విద్యుత్ను 20 ఏళ్ల పాటు ఇస్తుంది. ఇండోసోల్కు మాత్రం 7 సంవత్సరాల పాటు యూనిట్కు రూ.4.5 చొప్పున, ఆ తర్వాత 8 సంవత్సరాలకు యూనిట్కు రూ.4.5 చొప్పున 40% విద్యుత్ను మాత్రమే కేటాయించారు. సొంత విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా విద్యుత్ యూనిట్ ఏర్పాటుకు (క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను) స్థలం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం ఇండోసాల్ తన సొంత ఖర్చుతో 7.2 గిగా వాట్స్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించింది. కియాకు ఎకరా రూ.6 లక్షలతో మాత్రమే సేకరించే అవకాశం ఇచ్చింది. పైగా భూమిని చదును చేసే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఆరోపణ: అప్పనంగా భూములు కట్టబెట్టేస్తోంది.. వాస్తవం : ఈనాడు చెబుతున్నట్టుగా 4,827 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం లేదు. పైగా అవి ప్రభుత్వ భూములు కావు. రామాయపట్నంలో ఏపీఐఐసీ, మారిటైమ్ బోర్డ్ ద్వారా భూ సేకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం అమల్లో విధానం ప్రకారం భూసేకరణ కయ్యే వ్యయాన్ని పూర్తిగా మార్కెట్ ధర ప్రకారం ఇండోసోల్ కంపెనీయే భరిస్తుంది. అంతే గానీ భూమి కొనుగోలు కోసం ఇండోసోల్కు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీ ఇవ్వలేదు. ఆరోపణ: కలెక్టర్ లేఖ ఆధారంగా భూ సేకరణ వాస్తవం : దేశంలోనే అతి పెద్ద పీవీ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ కోసం ఈ భూమిని సేకరిస్తున్నారు. ఈ యూనిట్ మొదటి దశకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అర్హత సాధించింది. దాని ప్రకారం జాతీయ ప్రాముఖ్యతను కలిగిన ప్రాజెక్టు కోసం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భూసేకరణ జరుగుతోంది. ఇంధన భద్రత, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమైన భాగాలపై ఆధార పడటాన్ని తగ్గించడం, గ్రామీణ విద్యుదీకరణ కోసం అవసరమైన విధానాలను కేంద్రం రూపొందించింది. ఇండ్రస్టియల్ కారిడార్లు, హబ్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల మేరకు అధిక జీతంతో కూడిన ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ అవసరాలను తీర్చడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో భాగం. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా, కేబినెట్ ఆమోదంతో ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు భూ సేకరణ కోసం చర్యలు చేపట్టింది. ఆరోపణ: ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగించలేదు.. వాస్తవం : రాష్ట్రంలోని ప్రముఖ విద్యుత్ ఉప కరణాల తయారీ కంపెనీ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్కు అనుబంధంగా ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇప్పటికే షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 2,500 మందికి పైగా ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఇడిఎ) ద్వారా సమీకృత సోలార్ మాడ్యూల్ తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) బిడ్డింగ్లో రిలయన్స్, అదానీలతో పోటీ పడి ఎల్–1గా నిలిచి రూ.1875 కోట్ల రాయితీలను దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్ల వ్యవధిలో దశల వారీగా ప్రత్యక్షంగా 11,500 మందికి, పరోక్షంగా దాదాపు 10,000 –11,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా 11,500 మందికి ఉపాధి కల్పిస్తుండటంతో రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు జాగ్రత్తగా పరిశీలించాకే ప్రోత్సాహకాలను వర్తింప చేసింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement