-
మాకొద్దీ పోలీసు కొలువు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ ప్రారంభమైంది. వివిధ రకాల పోస్టులకు దాదాపు 16 వేల మంది ఎంపికయ్యారు. ఈ సమయంలో 2 విషయాలు చర్చనీయాంశంగా మారాయి. మొదటిది 1,370 మంది పోలీసు ఉద్యోగానికి ఎంపికైనా చేరడానికి ఆసక్తి చూపలేదు. వీరిలో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక 500 మంది ప్రాథమిక సమాచారం ఇవ్వ లేదు. శిక్షణకు రాలేమని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. మరో 750 మంది అసలు అటెస్టేషన్ ఫామ్లనే సమర్పించలేదు. మిగిలిన 120 మంది మెడికల్ పరీక్షలకు హాజరవ్వలేదు. వీటి వెనక వ్యక్తిగతమైన అంశాలు కారణమై ఉండొచ్చని టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇక రెండో అంశం 3,800 మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) అభ్యర్థులు ఉద్యోగానికి ఎంపికైనా శిక్షణ కోసం పిలుపురాలేదు. వీరి శిక్షణ విషయంపై తెలంగాణ పోలీసుశాఖ ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, ప్రిజన్స్, ఫైర్, మెకానిక్, డ్రైవర్, ఐటీ విభాగాలు కలిపి దాదాపు 9,200 మంది ట్రైనీలకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ.. మరో 900 మందిలో 500 మంది వరకు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు రిక్రూట్మెంట్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసింది. 200 మంది వైద్య పరీక్షలో విఫలం కాగా, 200 మంది అసంపూర్తిగా వివరాలు సమర్పించారు. టీఎస్ఎస్పీ శిక్షణ జాప్యమవుతున్న విషయాన్ని ఉన్నతాధికారులు ముందే తెలియజేశారు. సీనియారిటీపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే శిక్షణకు సంబంధించిన సమాచారం తెలియజేస్తామంటున్నారు. -
డంపింగ్ యార్డుల్లా పోలీస్ శిక్షణ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు శిక్షణ కేవలం తంతులా మారిందని, దేశం, రాష్ట్రాల్లోని వివిధ పోలీసు శిక్షణ కేంద్రాలు డంపింగ్ యార్డుల్లా మారాయని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ.. ‘పోలీసు శిక్షణ ఒక తంతులా మారింది. దేశంలోని పోలీసు ట్రైనింగ్ అకాడమీలు డంపింగ్ యార్డుల్లా మారాయి. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీఎన్పీఏ) నుంచి శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న ఐపీఎస్లలో కూడా అంకితభావం కొరవడటం బాధాకరం. ప్రస్తుత శిక్షణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలకు పనికొచ్చేలా పోలీసు శిక్షణను సంస్కరించాలి. దేశంలో బ్రిటిష్ కాలం నాటి పోలీసు విధానాల్లో మార్పులు రావాలి. డబ్బులు, పరపతి ఉన్న వారితో పోలీసులు స్నేహంగా మెదులుతున్నారు. విధి నిర్వహణలో నిత్యం వందలాది మంది ప్రాణాలర్పిస్తున్నా.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకభావం కారణంగా పోలీసులపై సదభిప్రాయం కలగట్లేదు. ఈ విషయంలో మార్పురావాలి. అందుకే పోలీసు శిక్షణలో సమూల సంస్కరణలు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకు అనుకూలంగా లేదు. జైలులో ఉంటున్న ఖైదీల్లో 90 శాతం పేదవారే, 70 శాతం శరణార్థులు ఉన్నారు. వారు ఎందుకు అరెస్టయి జైల్లో ఉన్నారో తెలుసుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు. శిక్షణలో ఒకలా.. విధుల్లో మరోలా.. ‘శిక్షణలో పోలీసులు నేర్చుకున్న దానికి, విధుల్లో చేరాక చేస్తున్న దానికి సంబంధం ఉండట్లేదు. ప్రజల బాధలు తెలిసేలా.. శిక్షణ సమయంలోనే అనాథ, వృద్ధ, షెల్టర్హోమ్లు సందర్శించేలా చూస్తున్నాం. ఇంటెలిజెన్స్, ఏసీబీ ఇతర శాఖల అధికారులతో తరగతులు నిర్వహిస్తాం. అంకితభావంతో పనిచేసే పోలీసులను తయారు చేయడం మా సంకల్పం. అందుకే ప్రతి పోలీసు అ«ధికారికి శిక్షణ కాలం నుంచే అబ్జర్వేషన్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్నాం. భవిష్యత్తులో పోస్టింగులు, బదిలీల్లో ఇదే ప్రామాణికం కానుంది. దీనికి డీజీపీ కూడా సుముఖత వ్యక్తం చేశారు. పోలీసులు చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. సమాజంలో పోలీసు కావాలంటే దేహదారుఢ్యమే ముఖ్యం కాదు.. శారీరక లోపాలున్నా నిజాయతీగా పనిచేయొచ్చు. ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలంగాణ అవినీతిలో ముందు ఉండటం బాధాకరం. పోలీసులు సమర్థంగా పనిచేస్తే ఇలాంటివి జరగవు. నేషనల్ పోలీస్ అకాడమీనే కాదు.. దేశంలో ఎవరూ చేయలేని నూతన సంస్కరణలను టీఎస్పీఏలో తీసుకొస్తాం. చట్టాలు, ఆయుధ, శారీరక, ఆత్మరక్షణ శిక్షణే కాదు.. ప్రజలకు సేవలు చేసేందుకు దోహదపడేలా ప్రయోగశాలగా మారుస్తాం. వ్యవస్థను మార్చలేను.. కానీ శిక్షణ విధానాన్ని మార్చగలను. ఈ నెల 24 నుంచి ఎస్సైలకు శిక్షణ ప్రారంభమవుతుంది’అని వీకే సింగ్ వివరించారు. -
కామ్రేడ్ కొత్వాల్
కోట రక్షణకు కొత్వాల్! ఇప్పటి అర్థంలో సిటీ (రాజధాని) పోలీస్ కమిషనర్! హైదరాబాద్ స్టేట్ చరిత్రలో ‘కొత్వాల్’ పదవి పురాతనం, శక్తిమంతం అని విదేశీ యాత్రికులు తమ రచనల్లో ‘కొత్వాల్’ను ఉదహరించారు. అందరిలో అద్వితీయుడు రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి! ఆయన చివరి కొత్వాల్. తొలి హిందువు. రాష్ట్ర పోలీస్ అకాడమీ ‘రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ’గా కొత్తపేరు అలంకరించుకున్న నేపథ్యంలో ఆయన జీవన తరంగాలను తలుచుకుందాం... మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సంస్థానం, రాయనిపేట గ్రామంలో వెంకటరామిరెడ్డి 1869 ఆగస్ట్ 22న జన్మించాడు. తండ్రి 8 గ్రామాల పటేల్. వనపర్తి రాజాకు మేనల్లుని కుమారుడు. వెంక ట్రామిరెడ్డి పుట్టిన మూడు రోజులకు తల్లి, ఎనిమిదో ఏట తండ్రి చనిపోయారు. మేనమామ విలియం వాహెబ్ సంరక్షణలో పెరిగాడు. వాహెబ్ను అందరూ క్రిస్టియన్ అనుకునేవారు. వనపర్తి రాజా తన పిల్లలకు చదువు నేర్పేందుకు కేథలిక్ టీచర్ను నియమించాడు. ముస్లిం పాలకవర్గాల విద్యార్థుల పేర్లకు భిన్నంగా, పిలిచే ందుకు వీలుగా క్రిస్టియన్ పేర్లు పెట్టాడు. ఊర్లో చదువయ్యాక వెంకట్రామిరెడ్డి వనపర్తి వచ్చాడు. అక్కడ రెండో రాజా రామేశ్వరరావు సహవిద్యార్థి. తెల్ల సైనికుడిని పట్టుకున్నాడు... మేనమామ వాహెబ్ రాయచూర్లో పోలీసు అధికారి. అకస్మాత్తుగా మరణించాడు. వెంకట్రామిరెడ్డికి అప్పటికి పదహారేళ్లు. విద్యార్హతలు బొటాబొటి! నాజర్ మహమూద్ ఖాన్ అనే పఠాన్ వాహెబ్ వారసునిగా వచ్చాడు. ఆయన వెంకట్రామిరెడ్డికి గ్రేడ్-4 అమీన్ ఉద్యోగం ఇచ్చాడు. వెంకట్రామిరెడ్డి మరీ బక్కగా ఉండేవాడు. పై ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్తూ దుస్తుల్లోపల దూదిపొరలు పేర్చుకున్నాడు. ఇది గమనించిన ముఖ్యాధికారి నవ్వి ఊరుకున్నాడు. ఉద్యోగం ఇచ్చాడు. వేర్వేరు జిల్లాల్లో పనిచేశాడు వెంకట్రామిరెడ్డి. సైన్యం నుంచి తప్పించుకున్న ఓ ఇంగ్లిష్ వ్యక్తిని నిజామాబాద్లో పట్టుకున్నందుకు రూ.11 బహుమానం పొందాడు. ఆయన సమర్థత, కుటుంబ నేపథ్యం పదోన్నతులకు దోహదం చేశాయి. స్టేట్ పోలీస్ చీఫ్ హెమ్కిన్.. వెంకట్రామిరెడ్డిని రాజ్యంలో ఉత్తమ పోలీస్గా ఎంపిక చేశాడు. హైదరాబాద్ శివారు జిల్లా (అత్రాఫ్-ఇ-బల్దా) అధికారిగా పదోన్నతి పొందాడు. ఈ నేపథ్యంలో రాజేశ్వరరావు-2 వన పర్తి రాజా అయ్యాడు. తన ఎస్టేట్కు కార్యదర్శిగా ఉండమని వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించాడు. అదే సమయంలో హైదరాబాద్ కొత్వాల్గా బాధ్యతలు తీసుకున్న నవాబ్ ఇమాదత్ జంగ్ అసిస్టెంట్ కొత్వాల్గా వెంకట్రామిరెడ్డిని నియమించుకున్నాడు. 1920లో ఇమాదత్ జంగ్ చనిపోయే వరకు ఆరేళ్లు నగర పోలీస్ విభాగంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అచ్ఛా ఆప్ జా సక్తే... ఓ రోజు వెంకట్రామిరెడ్డికి నిజాం నుంచి పిలుపు వచ్చింది. అప్పటికి ఆయన నిజాం ప్రభువుకు ఎన్నడూ తారసపడలేదు. పోలీసుల నుంచి పౌరులకు పిలుపు వచ్చినా, పాలకుల నుంచి పోలీసులకు పిలుపు వచ్చినా తెలియని పరేషాన్! ప్రభువు ఆదేశానుసారం కింగ్కోఠిలో వెంకట్రాం నిరీక్షిస్తున్నాడు, చిరుచెమటలతో! ఆ రోజు శుక్రవారం. ప్రార్థన అనంతరం తన సమక్షానికి విచ్చేసిన వెంకట్రాంను నిజాం నాలుగైదు పర్యాయాలు ఎగాదిగా చూశాడు. ‘అచ్ఛా ఆప్ జా సక్తే’ అన్నాడు. మరుసటి రోజు వెంకట్రామిరెడ్డిని నిజాం కొత్వాల్గా నియమించాడు. ఆ రోజు నుంచి ప్రతి రోజూ అనేకసార్లు కొత్వాల్ నిజాంను పరకాయించి చూసేవాడు. ఆర్డర్లీ ఫిర్యాదు.. స్వాతంత్య్రోద్యమం పుంజుకుంటున్న వాతావరణం. అహ్మదాబాద్ బృందం స్థానిక నాయకులతో కలసిపోయి రెసిడెన్సీ కోర్ట్ భవనం కిటికీలు, తలుపులు ధ్వంసం చేసింది. కొత్వాల్ సంఘటనా స్థలానికి వెళ్లి ప్రదర్శకులను సమాధానపరచారు. గణేష్ ఉత్సవం సజావుగా సాగేందుకు నలుగురు పోలీసులతో స్వామి పల్లకీ మోయించేవారు. కొత్వాల్కు ఇంగ్లిష్ పరిజ్ఞానం లేదు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నగర పర్యటనకు ముందు ఇంగ్లిష్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పనికొచ్చే పదాలను, వాక్యాలను రాత్రిపూట తన గదిలో పెద్దగా పలికేవారు. సంగతి తెలియని ఆర్డర్లీ తన బాస్కు ఏదో అయ్యిందని పోలీస్ స్టేషన్లో తన పై అధికారికి ఫిర్యాదు చేశాడు. తర్వాత నిజం తెలిసి అంతా నవ్వుకున్నారు. ప్రిన్స్ బసచేసిన ప్యాలెస్లోకి తెల్ల సెక్యూరిటీ కొత్వాల్ను అనుమతించలేదు. దీంతో లండన్ సెక్యూరిటీని పక్కనపెట్టి మొత్తం బాధ్యతను నిజాం కొత్వాల్కు అప్పజెప్పాడు. నిజాం కుమారుల అప్పుపై విచారణ... నిజాం తన పుట్టిన రోజు సందర్భంగా కొత్వాల్ వెంకట్రామిరెడ్డికి రాజబహదూర్ బిరుదునిచ్చాడు. మరుసటి ఏడాది బ్రిటిష్ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’తో సత్కరించింది. అనేకసార్లు పదవీకాలం పొడిగించిన తర్వాత 1934లో ‘కొత్వాల్’ పదవీ విరమణ చేశాడు. జీతంలో సగం మొత్తం అనే ఆనవాయితీకి భిన్నంగా అంతకుమించి, నెలకు రూ.వెయ్యి నిజాం పెన్షన్గా మంజూరు చేశాడు. 1920 మార్చి 19 నుంచి 1934 జూలై 1 వరకూ 14 ఏళ్ల సుదీర్ఘకాలం కొత్వాల్గా పనిచేసిన రాజ బహదూర్ను మరుసటి రోజు నుంచే నిజాం తన ప్రైవేట్ ఎస్టేట్కు స్పెషల్ ఆఫీసర్గా నియమించాడు. తన వారసులు చేసిన అప్పులపై విచారణ జరిపేందుకు రాజ బహదూర్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేశాడు. విద్యానిధి మిగులు ధనం రూ.30 ప్రభుత్వోద్యోగం చేస్తూ సమాజ సేవ చేసిన అరుదైన వ్యక్తి వెంకట్రామిరెడ్డి. తనలా గ్రామీణ ప్రాంతాల ప్రజలు బొటాబొటి చదువుకు పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదవాలని.. అందుకు దోహదపడాలని భావించారు. అబిడ్స్లో 1918లో ‘రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించారు. రెడ్డి హాస్టల్ నెలకొల్పారు. తన కులస్తులే కాదు ఇతర బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ బి.సత్యనారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, యూజీసీ చైర్మన్ జి.రాంరెడ్డి, అనేక మంది న్యాయమూర్తులు, లాయర్లు, డాక్టర్లు ఈ హాస్టల్లో ఉండి చదువుకున్నవారే! హిందూ విద్యార్థినులు కూడా బురఖా వేసుకోవాలని నిబంధన ఉన్న రోజుల్లో ‘రెడ్డి బాలికల పాఠశాల’ స్థాపించారు. ఈ పాఠశాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం గుర్తించని నేపథ్యంలో పూణెకు చెందిన కార్వె ఇన్స్టిట్యూట్కు అనుసంధానం చేశాడు. ఈ బడి తర్వాత కళాశాల అయ్యింది. మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఆంధ్ర విద్యాలయ తదితర సంస్థలకు ఆయన సహాయం చేశారు. వేలాదిమంది ఆయన గుప్తదానాల గురించి చెబుతారు. చట్టసభలో సభ్యుడిగా బాల్య వివాహాల రద్దుకు, వితంతు వివాహాల ప్రోత్సాహానికి మద్దతునిచ్చారు. 1956లో ఆయన పరమపదించారు. అప్పటి ఆయన పెన్షన్లో మిగులు ధనం రూ.30. ఒక పోలీసు ఉన్నతాధికారికి ప్రజలు పలికిన నీరాజ నానికి ప్రతీకగా.. నారాయణగూడ సర్కిల్లో వెంకట్రామిరెడ్డి విగ్రహం దర్పంగా, సౌజన్యంగా కనిపిస్తుంది. ప్రముఖ విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి మాటల్లో.. రాజ బహదూర్ ఛాతియే కాదు- హృదయమూ విశాలమే! ఉన్నతాధికారి మాత్రమే కాదు - నిస్సహాయులను ఆదుకున్న ఉత్తముడు! వ్యక్తులకు నమ్మకమైన మిత్రుడు. అంతేనా..! జనానికి కామ్రేడ్! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు
ఫేస్బుక్, ఇన్స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
కియారాకు అరుదరైన అవకాశం
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. ముఖ్యమైన సూచనలు ఇవే..
గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!
సూపర్ మామ్స్! రికార్డుల సృష్టించిన తల్లులు
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్
ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్..
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
Advertisement