మరో నలుగురికి కరోనా | Sakshi
Sakshi News home page

మరో నలుగురికి కరోనా

Published Sun, Dec 24 2023 12:58 AM

-

మహారాణిపేట: జిల్లాలో మరో నలుగురికి కరోనా సోకింది. దీంతో మొత్తం ఈ సంఖ్య ఏడుకు చేరింది. వీరి నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పుణె పంపినట్లు ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు తెలిపారు. వీరికి సోకింది ఏ వేరియంట్‌ అన్న విషయం నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. కాగా.. గడిచిన 24 గంటల్లో 24 మందికి పరీక్షలు చేయగా..నలుగురికి కరోనా నిర్ధారణ జరిగింది. కై లాసపురం ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల మహిళ ప్రభుత్వ ఊపిరితిత్తుల ఆస్పత్రిలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతోంది. కరోనా లక్షణాల కనిపించడంతో ఆమెకు పరీక్షలు చేయగా.. కరోనా నిర్ధారణ అయింది. ఆమెకు వెంటిలేటర్‌ మీద చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురు వివిధ ప్రాంతాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement