బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి

Published Sun, Nov 12 2023 1:32 AM

ప్రమాదంలో మృతి చెందిన తిర్యాదుల దావీదు  - Sakshi

పాయకరావుపేట : అతివేగంగా మోటారు బైక్‌ నడుపుతూ బైక్‌పై నుంచి పడిపోయి యువకుడు మృతి చెందినట్టు ఎస్‌ఐ బి.జోగారావు తెలిపారు. తుని అంబాజీ పేటకు చెందిన తిర్యాదుల దావీదు (22) తన స్నేహితునితో కలిసి శుక్రవారం సాయంత్రం రాజవరం గ్రామ సమీపాన గల సముద్రం ఒడ్డుకు వెళ్లి అక్కడ కొంతసేపు గడిపి తిరిగి తుని వెళ్లిపోతున్నారు. మార్గమధ్యలో శ్రీరాంపురం వద్ద వారు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్‌ అదుపుతప్పి పడిపోయింది. దీంతో తిర్యాదుల దావీదుకు బలమైన గాయాలు తగలడంతో మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బి.జోగారావు తెలిపారు.

Advertisement
Advertisement