మునగపాక : చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తోటాడ హైస్కూల్ హెచ్ఎం కుమార్ కోరారు. తోటాడ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న అంగులూరి లాకేష్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు అరకులోని జీటీడబ్ల్యూ ఆశ్రమంలో నిర్వహించిన అండర్–14 విభాగం అంతర్ జిల్లాల స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చూపిన లాకేష్ డిసెంబర్ 26న ఒరిస్సాలోని భువనేశ్వర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని హెచ్ఎం కుమార్ తెలిపారు. కాగా మంగళవారం లాకేష్ను ఆయన అభినందించారు. లాకేష్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంలో కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ పి.రవిశంకర్ను కూడా హెచ్ఎం అభినందించారు.