చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి | Sakshi
Sakshi News home page

చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి

Published Wed, Nov 15 2023 1:48 AM

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న రమణ  - Sakshi

అనకాపల్లిటౌన్‌: బీసీలకు చట్టసభల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమసంఘ వ్యవస్థాపకుడు మొల్లి రమణబాబు రాజకీయ ర్టీలను డిమాండ్‌ చేశారు. స్థానిక ఓ ప్రైవేట్‌ హోటల్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్కో పార్లమెంట్‌ పరిధిలో నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థానాలను బీసీలకు కేటాయించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తమకు అధిక ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకే బీసీల మద్దతు ఉంటుందన్నారు. సంఘం ఉత్తరాంధ్ర జిల్లా కార్యదర్శి పిల్లల శంకర్‌, ప్రధాన కార్యదర్శి కృష్ణంనాయుడు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జగ్గఅప్పారావు, జిల్లా ఉపాధ్యక్షుడు అప్పారావు, మాజీ సర్పంచ్‌ రామనాయుడు పాల్గొన్నారు.

Advertisement
Advertisement