పదో తరగతి హాల్‌టికెట్లు సిద్ధం | Sakshi
Sakshi News home page

పదో తరగతి హాల్‌టికెట్లు సిద్ధం

Published Mon, Mar 4 2024 6:04 AM

10th Class Hall Tickets Are Prepared in Andhra Pradesh - Sakshi

నేటి నుంచి డౌన్‌లోడ్‌ ప్రక్రియ ప్రారంభం 

ఈ నెల 18 నుంచి 30 వరకు పరీక్షలు

హాజరుకానున్న 7.25 లక్షల మంది విద్యార్థులు

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్‌టికెట్లను సిద్ధం చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 

పాఠ­శాలల యాజమాన్యాలు స్కూల్‌ కోడ్‌ 
నంబర్‌తోను, విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి www.bse.ap.gov.in నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌­లోడ్‌ చేసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవ­త్సరంలో 6,23,092 మంది రెగ్యులర్‌ విద్యా­ర్థులు టెన్త్‌ పరీక్షలకు హాజరుకాను­న్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు.

ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగు­స్తుండగా, మరో రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలుంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 682 సిట్టింగ్‌ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.  

Advertisement
Advertisement