ఒక్క రోజులో 59,919 మందికి పరీక్షలు | Sakshi
Sakshi News home page

ఒక్క రోజులో 59,919 మందికి పరీక్షలు

Published Sat, Sep 5 2020 6:27 AM

Coronavirus: 10776 Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శుక్రవారం ఒక్క రోజే 59,919 పరీక్షలు నిర్వహించగా, 10,776 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకూ మొత్తం 39,65,694 మందికి పరీక్షలు చేయగా, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,76,506కి చేరింది. గడిచిన 24 గంటల్లో 12,334 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకూ 3,70,163 మంది కోలుకున్నారు. తాజాగా 76 మంది మృతితో మొత్తం మరణాలు 4,276కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ శుక్రవారం బులెటిన్‌లో పేర్కొంది. యాక్టివ్‌ కేసులు 1,02,067 ఉన్నాయి. 

Advertisement
Advertisement