సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను అత్యుత్తమ ప్రమాణాలతో ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్ది వారు అంతర్జాతీయ అవకాశాలను కూడా అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తుంటే.. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఒక వర్గానికి చెందిన పచ్చ మీడియా ఇష్టారాజ్యంగా తప్పుడు వార్తలు వండి వారుస్తోంది.
రాష్ట్రంలో 5.18 లక్షల మంది విద్యార్థులు, టీచర్లకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను బుధవారం సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లుచేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మంగళవారం ఒక వర్గానికి కొమ్ముకాస్తున్న పచ్చపత్రిక ‘ల్యాప్ పోయి ట్యాబ్ వచ్చే’.. అంటూ అసత్యాలతో ఓ కట్టుకథను అల్లింది. ఇందులోని అంశాలన్నీ పూర్తిగా అవాస్తవం, సత్యదూరమని విద్యాశాఖ మంగళవారం తీవ్రంగా ఖండించింది. వాస్తవాలేమిటో సవివరంగా ప్రకటించింది. ఆ వివరాలు..
తప్పుడు వార్తలోని మొదటి ఆరోపణ
రాష్ట్రంలోని 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నేడు కేవలం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు మాత్రమే అందిస్తోంది.
వాస్తవం ఇదీ: ఇది నిజం కాదు. గతంలో అమ్మఒడికి బదులు విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ప్రస్తుతం ఇస్తున్న ట్యాబ్ అమ్మఒడికి అదనం. ఈ ట్యాబ్, ఈ–కంటెంటు ఖరీదు రూ.31,899. దీనివల్ల ప్రతి విద్యార్థికీ అమ్మఒడికి అదనంగా అంతకుమించిన లబ్ధి కలుగుతోంది. విద్యార్థికి 8, 9 తరగతుల కంటెంట్ను సెక్యూర్డ్ డిజిటల్ (ఎస్డీ) కార్డు ద్వారా ప్రస్తుతం అందిస్తున్నారు.
వచ్చే ఏడాది పదో తరగతి కంటెంట్ను అప్లోడ్ చేస్తారు. దీనివల్ల 4,59,564 మంది విద్యార్థులకు అత్యుత్తమ ఈ–కంటెంట్ ఈ ట్యాబ్ల ద్వారా అందుతుంది. అంతేకాక.. 4, 5, 6, 7, 9, 10 తరగతులకు సంబంధించిన 32 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా బైజూస్ ఈ–కంటెంట్ను అందుబాటులోకి తెచ్చాం. దీని ఖరీదు బహిరంగ మార్కెట్లో రూ.15వేలు.
రెండో ఆరోపణ
అమ్మఒడికి రూ.15వేలు ఇస్తుండగా.. విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించేందుకు రూ.21వేలు ఖర్చవుతుందని ఆ ప్రాజెక్టును ప్రభుత్వం అటకెక్కించింది.
వాస్తవం ఇదీ: ఈ ఆరోపణా అవాస్తవమే. గత ఏడాది ల్యాప్టాప్ చిప్ల కొరత ఏర్పడింది. దీనివల్ల ల్యాప్టాప్ల విక్రేతలు కోట్ చేసిన ధర అంచనా విలువకన్నా 16 శాతం మేర అధికంగా ఉంది. అంతేకాక.. వారు నిర్ణీత సమయం కన్నా 200 రెట్లు ఆలస్యంగా సరఫరా చేస్తామని, ఆ మేరకు తమకు వ్యవధి ఇవ్వాలని అడిగారు.
ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీవల్ల ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావించింది. పైగా.. ల్యాప్టాప్ల కోసం 22 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు 8వ తరగతిలోని వందశాతం మంది విద్యార్థులు అమ్మఒడి కింద ఇచ్చే నిధులతో పాటు ట్యాబ్లను కూడా అందుకోనున్నారు.
ట్యాబ్లపై తప్పుడు రాతలు.. ప్రజల దృష్టి మళ్లించేందుకే..
Published Wed, Dec 21 2022 4:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement