టమాట రైతులకు అండగా ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

టమాట రైతులకు అండగా ప్రభుత్వం

Published Sat, Sep 9 2023 4:22 AM

Government stands by tomato farmers - Sakshi

కర్నూలు (అగ్రికల్చర్‌): ధరలు తగ్గుతుండటంతో టమాట రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాపారులు సిండికేట్‌ కాకుండా చూడటం, ధర తగ్గుతున్నప్పుడు వేలం పాటలో పాల్గొని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చే­సింది. ఇటీవల వరకు టమాట ధర చుక్కలనంటిం­ది. ఆ సమయంలో జిల్లాలో టమాట పంట లే­దు. ఇప్పుడు రైతులు సాగు చేసిన పంట ఒక్కసారిగా మార్కెట్‌ను ముంచెత్తడంతో ధరలు పడిపోయా­యి. దీంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మా­ర్కె­­టింగ్‌ శాఖకు దిశానిర్దేశం చేసింది. జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమా­ట క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.

ఈ నెల 9 నుంచి మార్కెటింగ్‌ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పత్తికొండ మార్కెట్‌ యార్డులో జరిగే టమా­ట వేలం పాటలో పాల్గొంటుందని మార్కెటింగ్‌ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఎం) నారా­య­ణమూర్తి తెలిపారు. శుక్రవారం పత్తికొండ మార్కెట్‌లో టమాట ధర కిలోకు కనిష్టంగా రూ.7, గరిష్టంగా రూ.14 పలికింది. మోడల్‌ ధర రూ.10గా నమోదైంది.

కనిష్ట ధర రూ.7 కంటే తక్కువకు పడిపోతున్నప్పుడు మాత్రమే మార్కెటింగ్‌ శాఖ ఏర్పా­టు చేసిన బృందం వేలంలో పాల్గొంటుంది. మార్కెటింగ్‌ శాఖ కూడా వేలంలో పాల్గొంటున్నందున వ్యాపారుల మధ్య పోటీ పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్‌ శాఖ కొనుగోలు చేసిన టమాటను రైతుబజార్ల ద్వారా నో లాస్, నో ప్రాఫిట్‌ కింద విని­యోగదారులకు విక్రయిస్తామని ఏడీఎం తెలిపారు.

Advertisement
Advertisement