పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో శివనందన్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) ప్రాంతంలో గోతులు పడిన ప్రదేశంలో ఇసుకతో నింపి వైబ్రో కంపాక్షన్ చేసిన పనులను ఆయన తనిఖీ చేశారు.
రానున్న వరదల కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.