సాక్షి, అమరావతి: తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఆర్ఎం విద్యార్థులు రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించారు. పాత బైక్కు లిథియమ్ అయాన్ బ్యాటరీని అమర్చి, వెనుక చక్రానికి మోటార్ బిగించడం ద్వారా వాహనం ముందుకు నడిచేలా తయారు చేశారు. 2 నెలల పాటు శ్రమించి వాయు, శబ్ధ కాలుష్యం లేని ఎలక్ట్రిక్ బైక్ను తయారుచేసినట్టు మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు రవితేజరెడ్డి, ఎ.చైతన్య, పాబోలు మోహన్ ఆదిత్య, కె.ప్రవీణ్, కె.యశస్విని, శ్రావ్య, వాసు, ప్రియాంక తెలిపారు. రెండు దశల పరీక్షల అనంతరం గురువారం వర్సిటీలో దీనిని ప్రదర్శించారు. పోర్టబుల్ బ్యాటరీ మెకానిజమ్ డిజైన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు.
ఈ–బైక్ ప్రత్యేకతలు ఇలా..
గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిచే రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ బైక్.. పూర్తిగా చార్జింగ్ అవడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇందుకు రూ.15 మాత్రమే ఖర్చవుతుంది. ఒకసారి చార్జింగ్తో సుమారు 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తే 35 కిలోమీటర్లు మేర చార్జింగ్ వస్తుంది. రివర్స్ సదుపాయంతో పాటు ఎలక్ట్రిక్ బ్రేక్ను అమర్చారు. బైక్ను తయారుచేసిన విద్యార్థులను వైస్ చాన్సలర్ డి.నారాయణరావు, ఆచార్య వజ్జా సాంబశివరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్ నోరి అభినందించారు.
ఏపీ ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ.. 15 రూపాయలకే.. 45 కిలోమీటర్ల ప్రయాణం
Published Fri, Feb 11 2022 5:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
పోలింగ్ కేంద్రాల్లో వసతుల పరిశీలన
మూడుసార్లు.. ఆ నలుగురు
ప్రతి ఒక్కరూఓటెయ్యాలి
గాలి, వాన బీభత్సం
'లవ్ టుడే' హీరో కొత్త సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?
అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం
No Headline
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
జగన్తోనే పారదర్శక పాలన
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement