సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మంత్రి వెల్లంపల్లి | Sakshi
Sakshi News home page

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సీఎం జ‌గ‌న్‌కు ఆహ్వానం

Published Fri, Feb 18 2022 2:43 PM

Vellampalli Srinivas Meets CM Jagan Over Srisailam Maha Shivaratri Brahmotsavam - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి లవన్న శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ను దేవాదాయశాఖ మంత్రి, శ్రీశైలం కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. శ్రీశైలం ఈవో, ఆలయ అర్చకులు సీఎం వైఎస్‌ జగన్‌కు.. వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.

Advertisement
Advertisement